dc
-
RCB vs DC: మరో కీలక మ్యాచ్
-
రాయల్స్పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో ఢిల్లీ!
-
Batman: ఆ స్వరం మూగబోయింది
హాలీవుడ్ న్యూస్: డీసీ కామిక్స్లో బ్యాట్మన్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ క్యారెక్టర్ని ఆడియొన్స్కి అంతలా కనెక్ట్ చేసిన వ్యక్తి మాత్రం కెవిన్ కాన్రాయ్. గంభీరమైన స్వరంతో ‘ఐ యామ్ వెన్జెన్స్.. ఐ యామ్ ది నైట్.. ఐ యామ్ బ్యాట్మన్’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్.. చరిత్రలో నిలిచిపోయింది. అయితే.. దురదృష్టవశాత్తూ ఆయన ఇక లేరు. బ్యాట్మన్ యానిమేటెడ్ సిరీస్లో బ్యాట్మన్ క్యారెక్టర్కు వాయిస్ ఓవర్ అందించిన కెవిన్ కాన్రాయ్ Kevin Conroy గురువారం కన్నుమూశారు. ప్రేగు క్యాన్సర్ బాధపడుతున్న ఆయన.. 66 ఏళ్ల వయసులో న్యూయార్క్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు శుక్రవారం వార్నర్ బ్రదర్స్ సంస్థ ప్రకటించింది. మరోవైపు ఆయనకు నివాళిగా సోషల్ మీడియాలో RIP Legend హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ నడుస్తోంది. Thank you. 🦇❤️ pic.twitter.com/hB4XUy8Gw1 — Batman (@Batman) November 11, 2022 కామిక్స్ పోర్షన్ తర్వాత.. 1992-96 మధ్య బ్యాట్మన్ యానిమేటెడ్ సిరీస్లు విపరీతంగా జనాదరణను సంపాదించుకున్నాయి. అందులో 15 చిత్రాలు, 400 టీవీ ఎపిసోడ్స్, 20కిపైగా వీడియోగేమ్స్, బ్యాట్మన్:ఆర్ఖామ్ అండ్ ఇన్జస్టిస్ ఫ్రాంచైజీలకు వాయిస్ ఓవర్ అందించారు కాన్రాయ్. తద్వారా బ్యాట్మన్ క్యారెక్టర్కు జనాల్లో విపరీతమైన ఆదరణ తీసుకొచ్చారాయన. RIP LEGEND @RealKevinConroy 🦇 Thank you for bringing Batman to life with your Iconic voice 🙏#KevinConroy #Batman pic.twitter.com/dMUgnBteqL — DC World Telugu (@DCWorldTelugu) November 11, 2022 న్యూయార్క్ వెస్ట్బ్యూరీలో జన్మించిన కెవిన్ కాన్రాయ్.. థియేటర్ ఆర్టిస్ట్గా కెరీర్ను ప్రారంభించారు. 1980 నుంచి టీవీ యాడ్స్ ద్వారా నటనలోకి అడుగుపెట్టి.. చాలాకాలం బుల్లితెర ప్రజలను అలరించారు. ఆపై కొన్ని చిత్రాలు, టీవీ సిరీస్ల్లోనూ మెరిశారు. 1991లో క్యాస్టింగ్ డైరెక్టర్ ఆండ్రియా రొమానో ద్వారా బ్యాట్మన్ సిరీస్కు వాయిస్ ఓవర్ అందించడం ప్రారంభించారు. కామిక్స్పై ఏమాత్రం అవగాహన లేని కాన్రాయ్.. బ్రూస్ వేన్(బ్యాట్మన్) పాత్రకు తన గాత్రంతో జీవం పోశారు. హాలీవుడ్లో ‘గే’ సెలెబ్రిటీగా ఈయనకు పేరుంది. చివరిరోజుల్లో ఆయన వాన్ సి. విలియమ్స్ అనే వ్యక్తిని వివాహం చేసుకోవడం గమనార్హం. Kevin Conroy was an idol to me. I looked up to him growing up. I watched the animated series, watched the animated movies, shorts and played all the Arkham games. I'm glad I was even able to meet him this year. He was an awesome guy. RIP legend. You will be missed Batman 🦇❤ pic.twitter.com/noGLyWVLvn — Dan 🦇 (@Sandwich_Rock_) November 11, 2022 ఇదీ చదవండి: ఇది.. మనిషిని మొత్తం కరిగిపోయేలా చేసిన సినిమా! -
ఆ డైరెక్టర్ నన్ను బెదిరించాడు: నటి
డీసీ సినిమాటిక్ యూనివర్స్ మూవీ ‘వండర్ వుమెన్’తో హాలీవుడ్ నటి గాల్ గాడెట్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. అయితే ఆ సినిమా సమయంలో ఈ బ్యూటీకి ఎదురైన చేదు అనుభవాలన తాజాగా ఓ ఇంటర్వూలో వెల్లడించింది. డీసీ సూపర్ హీరో మూవీ ‘జస్టిస్ లీగ్’కి మొదట హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జాక్ స్నైడర్ దర్శకత్వం వహించాడు. అనంతరం వివిధ కారణాలతో ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆయన ప్లేస్లో ఫిల్మ్ మేకర్ జాస్ వెడాన్ దర్శకత్వ బాధ్యత తీసుకున్నాడు. కొత్తగా వచ్చిన ఈ దర్శకుడు సినిమా షూటింగ్లో ఉండగా తన కెరీర్ గురించి బెదిరించాడని నటి గాల్ గాడెట్ తెలిపింది. ఆ సమయంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదని, అయితే మూవీ ప్రొడ్యూసర్స్ అయితే వార్నర్ బ్రదర్స్ నాకు అభయం ఇచ్చారని చెప్పింది. గాల్ గాడెట్ డైరెక్టర్ వెడాన్పై ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. అతను ఎంతో మందితో డిఫరెంట్గా బిహేవ్ చేసేవాడని.. గతంలో సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలుపుతూ పోస్టులు పెట్టింది. కాగా ఈ బ్యూటీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్, జస్టిస్ లీగ్, క్రిమినల్, కీపింగ్ అప్ విత్ ది జోన్స్, బాట్మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్: డాన్ ఆఫ్ జస్టిస్ వంటి చిత్రాల్లో నటించింది. చదవండి: పిక్ని పోస్ట్ చేసిన ‘స్పైడర్ మ్యాన్’.. ఎమోషనల్ అయిన ప్రియురాలు Joss Wheadon’s on-set treatment of the cast and crew of Justice League was gross, abusive, unprofessional, and completely unacceptable. He was enabled, in many ways, by Geoff Johns and Jon Berg. Accountability>Entertainment — Ray Fisher (@ray8fisher) July 1, 2020 -
అదిరిపోయే యాక్షన్ సీన్స్తో కొత్త ‘బ్యాట్మ్యాన్’
హాలీవుడ్ మూవీస్లో బ్యాట్మ్యాన్ సిరీస్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. ఈ సిరీస్లో వచ్చిన మూవీస్ అభిమానులను ఎంతో అలరించాయి. అయితే ఎప్పటి నుంచో ఈ సిరీస్ మరో సినిమా కోసం వేచి చూస్తున్న ఫ్యాన్స్ని ట్రైలర్తో సర్ఫ్రైజ్ చేశారు మేకర్స్. డీసీ నిర్వహించిన ఫ్యాన్డమ్ ఈవెంట్లో భాగంగా ట్రైలర్ని రిలీజ్ చేశారు. వార్నర్ బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో రాబర్ట్ ప్యాటిన్సన్ కొత్త బ్యాట్మ్యాన్గా నటిస్తున్నాడు. ఈ ట్రైలర్లో అన్ని మూవీస్లాగే యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రాన్ని మొదట జూన్ 21న విడుల చేయాలని భావించారు. కోవిడ్ కారణంగా చిత్రీకరణ ఆలస్యమవుతూ కావడంతో అనంతరం అక్టోబర్ 1న రిలీజ్ చేయాలనుకున్నారు. కాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడగా.. మార్చి 4, 2022న సినిమా థియేటర్లలో విడుదల చేయనున్నారు. చదవండి: సరికొత్తగా రాబోతున్న సూపర్మ్యాన్.. షాక్లో ఫ్యాన్స్ -
350 కోట్ల నష్టం!.. ఆ ప్రొడక్షన్ హౌజ్కు నటి గుడ్బై?
హాలీవుడ్ నటి స్కార్లెట్ జొహాన్సన్-డిస్నీల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ‘బ్లాక్ విడో’ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ కాకుండా.. ఓటీటీ(డిస్నీ ఫ్లస్ హాట్స్టార్)లో రిలీజ్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో ఒప్పంద ఉల్లంఘన ద్వారా డిస్నీ తనకు భారీ ఆర్థిక నష్టం కలిగించిందంటూ ఆమె కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. సుమారు 50 మిలియన్ల డాలర్లు(సుమారు 350 కోట్ల రూపాయల)నష్టం వాటిల్లిందంటూ లాస్ ఏంజెల్స్ కోర్టులో దావా వేసింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో స్కార్లెట్ ‘నటాషా రోమనాఫ్’(బ్లాక్ విడో) క్యారెక్టర్ పోషించిన విషయం తెలిసిందే. అవెంజర్స్ ఎండ్గేమ్లో ముగిసిన ఈ పాత్రను.. ‘బ్లాక్ విడో’ సిరీస్ పేరుతో ప్రత్యేకంగా కొనసాగించాలని మార్వెల్ నిర్ణయించుకుంది. అయితే ఈ సిరీస్లో మొదటి సినిమా ‘బ్లాక్ విడో’ను ఓటీటీలో రిలీజ్ చేయడాన్ని డిస్నీ సమర్థించుకుంటోంది. ప్రస్తుతం ఈ కేసు నడుస్తుండగా.. భవిష్యత్తులో మార్వెల్ సినిమాల్లో స్కార్లెట్ నటించడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. సూపర్ హీరో చిత్రాల విషయంలో మార్వెల్కు, డీసీ(డిటెక్టివ్ కామిక్స్)కు మధ్య ఎప్పటి నుంచో పోటీ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కార్లెట్ను తమ వైపు లాగాలని డీసీ ప్రయత్నాలు ప్రారంభించింది. సాధారణంగా మార్వెల్ నుంచి బయటకు వచ్చిన నటులకు డీసీ గాలం వేయడం ఎప్పటి నుంచో నడుస్తున్నదే. దర్శకుడు జేమ్స్ గన్ను ఇలాగే దొరకబుచ్చుకుంది డీసీ. ఇక ప్రస్తుతం హాలీవుడ్ ఆగ్రతార అయిన స్కార్లెట్తో డీల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది డిటెక్టివ్ కామిక్స్. అయితే ఏ రోల్ కోసం డీసీ సంప్రదించింది? ఏం ఆఫర్ చేసింది? అందుకు స్కార్లెట్ అంగీకరించిందా? లేదా? అనే విషయాలపై స్పష్టత రావడానికి కొంత సమయం పట్టొచ్చు. చదవండి: హీరో నిఖిల్కు సజ్జనార్ సన్మానం -
ఫైనల్ చేరిన చెన్నై సూపర్కింగ్స్
-
సూపర్కింగ్స్తో తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్
-
రైనాను అడ్డుకున్న పంత్.. వైరల్!
-
కోల్కతా పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం
-
రెండో మ్యాచ్లో ధోని సేన గెలుపు
-
మార్వెల్కు మాట సాయం
మార్వెల్, డీసీ సంస్థల నుంచి వచ్చే సూపర్ హీరోల చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. మనదేశం కూడా మినహాయింపు కాదు. ఇటీవల అది డబులైంది. ఆ క్రేజ్ని డబ్బులు చేసుకోవడానికి మన హీరోలతో డబ్బింగ్ చెప్పించడం చేస్తున్నాయి ఆయా సంస్థలు. లేటెస్ట్గా ‘అవెంజర్స్: ఎండ్గేమ్’ తమిళ అనువాద చిత్రానికి దర్శకుడు మురుగదాస్తో డైలాగ్స్ రాయించారట. ‘‘మార్వెల్ సంస్థ నుంచి వచ్చే సినిమాల స్కేల్, స్టోరీ చెప్పే విధానం నాకెప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తుంది. సూపర్ హీరోల సినిమాకు మా అబ్బాయి ఆదిత్య చాలా పెద్ద ఫ్యాన్స్. దాంతో నాకు ఇంకా ఎగై్జటింగ్గా ఉంది. డైలాగ్స్ కథకు తగ్గట్టుగా ఉండటంతో పాటు తమిళ ఫ్లేవర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాను’’ అని దర్శకుడు మురుగదాస్ పేర్కొన్నారు. -
ఆ ఆరుగురిదే హవా
- డీసీ కార్యాలయంలో కొన్నేళ్లుగా వారే - దేవాదాయం...వారికే... - ఏళ్లతరబడి తిష్ట వేసినా బదిలీలుండవు - పై స్థాయిలో వాటాలతో కొనసాగింపు సాక్షి ప్రతినిధి, కాకినాడ : అది దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం. కాకినాడ కేంద్రంగా ఆ శాఖ పని చేస్తుంటుంది. డీసీ కార్యాలయం మూడు జిల్లాలను పర్యవేక్షిస్తుంటుంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో సుమారు మూడువేల ఆలయాలు, సత్రాలను ఈ కార్యాలయమే అజమాయిషీ చేస్తుంటుంది. ఈ కార్యాలయానికి డిప్యూటీ కమిషనర్ సుప్రీం. చాలా కాలంగా ఈ కార్యాలయం అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి డిప్యూటీ కమిషనర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. పైసలిస్తే పని కానిదంటూ ఏదీ ఉండదనే ఆరోపణ ఈ కార్యాలయంలో కొందరు ఉద్యోగులపై ఉంది. అందుకే ఇక్కడి డీసీ కార్యాలయంలో పని చేయడమంటే ఎగిరి గంతేస్తారు. డీసీ కార్యాలయంలో ఒకసారి జాయినైతే ఇక కార్యాలయాన్ని అంటిపెట్టుకునే ఉంటారంటే అతిశయోక్తి కాదు. జిల్లాలో ఏ శాఖలో అయినా చివరకు దేవాదాయశాఖ పరిధిలో ఇతర కార్యాలయాల్లోనైనా నిబంధనల ప్రకారం ఉద్యోగులకు బదిలీలు జరుగుతుంటాయి. కానీ ఈ కార్యాలయంలో ఏళ్లతరబడి పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు బదిలీలు అంటే ఏమిటో తెలియదు. బదిలీలు జరిగే ప్రతి సందర్భంలో ఉన్నతాధికారులకు ‘ఆమ్యామ్యా’లు ఇచ్చేసి ఆ సీట్లలోనే కొనసాగుతున్నారంటే ఎంత పలుకుబడి ఉందో ఊహించుకోవచ్చు. డిప్యూటీలు ఎవరైనా సరే వీరిదే స్టీరింగ్... డిప్యూటీ కమిషనర్గా ఎవరు వచ్చినా చక్రం తిప్పేది మాత్రం ఆ ఆరుగురే. ఈ కార్యాలయంలో అన్ని క్యాడర్ల ఉద్యోగులు కలిపి 20 మంది ఉంటారు. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా మూడేళ్లు పైబడితే బదిలీలు తప్పవు. పాతికేళ్లవుతున్నా బదిలీ కాని ఉద్యోగులు కూడా ఇక్కడ ఉన్నారు. - కార్యాలయంలో అటెండర్గా జాయినైన ఒక ఉద్యోగి ఇక్కడే రికార్డు అసిస్టెంట్ స్థాయికి ఎదిగాడు. ఆ ఉద్యోగి ఇక్కడ 27 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. - 2004లో టైíపిస్టుగా జాయినైన ఒక ఉద్యోగి అప్పటి నుంచి ఇప్పటి వరకు టైపిస్టుగా ఇక్కడే పనిచేస్తున్నాడు. - మహిళా జూనియర్ అసిస్టెంట్æ 11 ఏళ్లుగా ఇక్కడ పని చేస్తున్నారు. - 1999లో జూనియర్ అసిస్టెంట్గా జాయినైన ఒక మహిళా ఉద్యోగిని ఇదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది ఇప్పుడు అంతకంటే పై స్థాయిలో సూపరింటెండెంట్గా పదోన్నతి పొందినప్పటికీ ఇదే కార్యాలయంలో పనిచేస్తున్నారు. - 2009లో ఈ కార్యాలయానికి జూనియర్ అసిస్టెంట్లుగా వచ్చిన ఇద్దరిలో ఒకరికి సీనియర్ అసిస్టెంట్ రాగా, మరొకరు జూనియర్ అసిస్టెంట్గా ఇక్కడే తిష్ట వేశారు. డీసీ కార్యాలయమే శాశ్వత నివాసం... బదిలీలకు నోచుకోని ఈ ఆరుగురు ఉద్యోగులు డీసీ కార్యాలయమే శాశ్వత కార్యాలయంగా మార్చేసుకున్నారు. ఏటేటా ఈ కార్యాలయంలో పలువురికి బదిలీలు జరుగుతున్నా వీరి సీటుకు మాత్రం ఢోకా ఉండటం లేదు. బదిలీల ప్రక్రియ మొదలవుతుందనగానే అధికారులకు ‘సంభావనలు’ సమర్పించుకొని బదిలీ జాబితాలో తమ పేరు లేకుండా చేసుకుంటున్నారు. డీసీగా ఎవరు వచ్చినా కార్యాలయంలో అన్ని వ్యవహారాలు చక్కబెట్టేది ఆ అరడజను మంది ఉద్యోగులేనని కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. పదోన్నతులు పొందుతున్నా సీటు మారుతారే తప్ప బయటకు పోయే ప్రసక్తే లేదు. మూడు జిల్లాలు పరిధిలో ఉన్న దేవాదాయశాఖ ఆలయాలు, సత్రాలకు సంబంధించిన ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఫైళ్లు, సత్రాల భూముల లీజులు పెంపు, షాపింగ్ కాంప్లెక్సుల్లో దుకాణాల రెన్యూవల్స్ ఫైళ్లు... ఇలా ప్రతి నెలా వచ్చే 20, 30 ఫైళ్లు కార్యాలయ ఉన్నతాధికారి టేబుల్పైకి వెళ్లాలంటే ముందు వీరందరి చేతులు తడపాల్సిందే. ఒక్కో ఫైల్కు ఒక్కో రేటు నిర్ణయించి దండుకోవడం ఇక్కడ రివాజుగా మారిపోయింది. వీరి నుంచే పక్కాగా ఎవరి వాటా వారికి వెళ్తుండడంతో పై అధికారులు కూడా చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఇలా చేయొచ్చు..అయినా... ఈ కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కలిగిన ఉద్యోగులను నిబంధనల ప్రకారం జిల్లా పరిధిలోనే బదిలీ చేయాలి. వీరిని జిల్లాలో ఉన్న ఏసీ, జెవీవో (జ్యువెలరీ వెర్ఫికేషన్ ఆఫీసర్) కార్యాలయానికి బదిలీ చేయవచ్చు. సీనియర్ అసిస్టెంట్లను ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాతోపాటు రాజమహేంద్రవరం ప్రాంతీయ సంయుక్త కమిషనర్ (ఆర్జేసీ) కార్యాలయం సహా జిల్లాలో పలు ప్రాంతాలకు ఇన్స్పెక్టర్లుగా బదిలీ చేయవచ్చు. అయినా సరే దశాబ్దాలుగా కార్యాలయానికే అతుక్కుపోయిన ఈ ఉద్యోగులను మాత్రం కొనసాగిస్తున్న తీరు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా పట్టించుకోవడం లేదని ఆ కార్యాలయంలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ కమిషనర్గా రాజమహేంద్రవరం అసిస్టెంట్ కమిషనర్ రమేష్బాబు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న క్రమంలో ఈ ఉద్యోగుల వ్యవహారాలు మరింత మితిమీరిపోయాయంటున్నారు. ఆయన కార్యాలయానికి అప్పుడప్పుడు వచ్చిపోతుండటంతో వీరి ఆడింది ఆట, పాడింది పాటగా సాగిపోతోందని మండిపడుతున్నారు. తాజాగా బదిలీల ప్రక్రియకు తెరలేవడంతో ఈసారైనా వీరికి స్థాన చలనం ఉంటుందో లేదో వేచి చూడాల్సిందే. -
మెచ్చిన వారికి.. నచ్చిన చోట
డీసీ నియామకంపై పైరవీలు రూ. కోట్లలో పలుకుతున్న పీఠం అధికార నేతల హస్తలాఘవం నిబంధనలన్నీ బుట్టదాఖలు ప్రజలంటే భయం లేదు. ఎందుకంటే ఓట్ల సమయంలో నోట్లు ఇచ్చి కొనుక్కోవచ్చుననే ధీమా. మళ్లీ ఎలాగోలా అధికారంలోకి వస్తామనే ధైర్యం. పోనీ దేవుడంటే భక్తి ఉందా అంటే... ఆ భగవంతుడికి భక్తితో భక్తులు ఇచ్చే కానుకల్లోనే వాటాలు పంచుకునే నీచ సంస్కృతి జిల్లాలో నడుస్తోంది. ఇదే అవకాశంగా నిబంధనలు బుట్టదాఖలు చేస్తూ పైరవీలకు పెద్దపీట వేసి పీఠాలను కొంతమంది చేజిక్కించుకుంటున్నారు.. సాక్షి ప్రతినిధి, కాకినాడ : అమాత్యుల అండదండలుంటే సీనియార్టీతో పనేముంది. ఉన్నతాధికారుల ఆశీస్సులుంటే కోరుకున్న పోస్టు కోరుకున్నచోటే వచ్చేస్తుంది. నిబంధనలకు పాతరేసి నచ్చిన వారికి మెచ్చిన పోస్టులు కట్టబెట్టడం పలు శాఖల్లో కొత్తేమీ కాదు. అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికేసిన అమలాపురం డీఎల్పీఓ శర్మను జిల్లా పంచాయతీ అధికారిగా నియమించి ప్రజాప్రతినిధులు చేతులు కాల్చుకున్నారు. ఏసీబీ కోర్టులో అతనిపై కేసు పెండింగ్లో ఉన్నా ముడుపులు మెక్కేసిన నేతలు అడ్డగోలుగా పోస్టింగ్ ఇప్పించేశారు. చివరకు అతని పనితీరు సక్రమంగా లేక కలెక్టర్ ఆగ్రహానికి గురై డీఎల్పీఓగా తిప్పి పంపించేశారు. అప్పుడు డీఎల్పీఓ శర్మ విషయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు తప్పుచేస్తే ఇప్పుడు కూడా అదే తప్పు దేవాదాయశాఖ డీసీ నియామకం విషయంలో చేశారంటున్నారు. కోట్ల ఆదాయం... అందకే... కాకినాడ కేంద్రంగా డిప్యుటీ కమిషనర్ పోస్టుకు దేవాదాయ శాఖలో ఎప్పుడూ మంచి గిరాకీ ఉంటుంది. వెయ్యికి పైబడి దేవాలయాలతో పాటు కోట్లాది రూపాయలు విలువైన సత్రాలు ఈ డీసీ పరిధిలో ఉన్నాయి. ఈ పోస్టు కోసం గతంలో జిల్లాలోనే కోటి రూపాయలు చేతులు మారిన సందర్భాలు కూడా లేకపోలేదు. అటువంటి డీసీ పోస్టు రెండు నెలల క్రితం చందు హనుమంతురావు పదవీ విరమణతో ఖాళీ అయింది. ఈ పోస్టులో డీసీని నియమించాలంటే ఆ క్యాడర్ ఉన్న ఆలయాలు జిల్లాలో లేవు. అలాగని డీసీ పోస్టును ఖాళీగా ఉంచడం కూడా కుదరదు. అందుకేనేమో రాజమహేంద్రవరం అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న రమేష్బాబును డీసీగా పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్ఎసీ) నియమించారు. సీనియర్లున్నా... డీసీ పరిధిలో ఉన్న ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సీనియర్లయిన అసిస్టెంట్ కమిషనర్లు డజనకు పైబడే ఉన్నారు. వీరిలో ఎవరి పేరును పరిగణనలోకి తీసుకోకుండా సంబంధిత శాఖా మంత్రి, ఉన్నతాధికారుల అండదండలుండటంతోనే రమేష్బాబును అడ్డగోలుగా నియమించేశారనే విమర్శలున్నాయి. ఉదాహరణకు జిల్లాలో ఉన్న అసిస్టెంట్ కమిషనర్లను పరిశీలిస్తే...పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి ఆలయ ఈఓ ఆర్.పుష్పనాధం, మందపల్లి శనీశ్వరాలయ ఘో దేవుళ్లు, రాజమహేంద్రవరం హితకారిణి సమాజం ఈఓ పి.సుబ్రహ్మణ్యం, తలుపులమ్మ లోవ దేవస్థానం ఈఓ చంద్రశేఖర్...వీరు నలుగురు రమేష్బాబు కంటే సీనియర్లుగా ఉన్నారని దేవాదాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన రెండు జిల్లాలను కూడా చూసుకుంటే మరో పాతిక మందివరకు సీనియర్లున్నారు.అటువంటప్పుడు సీనియర్లను పక్కనపెట్టేసి రమేష్బాబును నియమించడంలో ఔచిత్యమేమిటో అర్థం కాక సంబంధిత శాఖలో తలలుపట్టుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 339 ప్రకారం చూసుకుంటే అసిస్టెంట్ కమిషనర్ నుంచి డిప్యుటీ కమిషనర్గా పదోన్నతి ఇవ్వాలంటే 13 జిల్లాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనర్ల సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలి. నిబంధనలూ బుట్టదాఖలే... సీనియారిటీ పక్కనబెట్టేయడం మాట అటుంచి గెజిటెడ్ పోస్టుల భర్తీలో సొంత జిల్లాల వారిని నియమించకూడదనే నిబంధనను కూడా బుట్టదాఖలు చేశారు. ఆమాత్యుని అండదండలుంటే చాలు నిబంధనలు వర్తించవా అని ఆ శాఖ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇదే డిప్యుటీ కమిషనర్ పోస్టు కోసం కోటి రూపాయలకుపైనే డీల్ కుదిరి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచనలమైంది. అప్పట్లో లోవ దేవస్థానం ఈఓ గాది సూరిబాబు రాజు ఈ పోస్టింగ్ కోసం ఒక మంత్రి సోదరుడు ద్వారా కోటికి బేరం కుదుర్చుకుని అరకోటి అడ్వాన్సుగా సమర్పించుకున్నాడు. అడ్వాన్సు తీసుకున్న ఆ అమాత్యుని ’తమ్ముడు’ ప్రయత్నించినా చివరకు విశాఖ కనక మహాలక్ష్మి ఈఓగా పనిచేస్తున్న భ్రమరాంబ (ప్రస్తుతం శ్రీకాళహస్తి ఈఓ)కు సీనియార్టీ ప్రాతిపదికన నియమించారు. అనంతరం ఆ తెలుగు తమ్ముడు తీసుకున్న అరకోటి అడ్వాన్సు తిరిగి ఇవ్వకపోవడం, అనారోగ్యం, మానసిక ఆందోళనతో ఈఓ సూరిబాబు రాజు మృతి చెందారు. అంతటి డిమాండ్ ఉన్న ఈ పోస్టుకు నిబంధనలు తుంగలోకి తొక్కి ఎఫ్ఏసీగా నియమించారంటే అసలు ఏమి జరగకుండా ఉండి ఉంటుందా అని ఆ శాఖలోనే పలువురు ప్రశ్నిస్తున్నారు. అమాత్యుడి ఆశీర్వాదం... ఈ పోస్టు భర్తీ చేసేటప్పుడు ఆ శాఖలో ఏసీలుగా పనిచేస్తున్న వారిలో సీనియర్లను పరిగణనలోకి తీసుకోవాలనేది నిబంధన. ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా దేవాదాయశాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అండదండలు దండిగా ఉండటంతో సీనియార్టీని బుట్టదాఖలుచేసి రమేష్బాబును అడ్డగోలుగా అందలమెక్కించారనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇది జరిగి నెల రోజులు దాటిపోయింది. ఇన్ని రోజులుగా ఆ శాఖలో పెద్దగా చర్చకు రాని డీసీ నియామకంపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దేవాలయాల హుండీల్లో పెద్ద నోట్ల మార్పిడి వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఈ అంశం కూడా తెర మీదకు వచ్చింది. -
‘న్యాయశాస్త్రం వైపు ఆకర్షితులవడం శుభపరిణామం’
* న్యాయశాస్త్ర అధ్యయనం వైపు భారతీయ యువత ఆకర్షణ ముదావహం * వాషింగ్టన్ డీసీ సభలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఒకప్పుడు ఇంజినీరింగ్, వైద్య విద్యల వైపు ఉరకలేసిన భారతీయ యువత ప్రస్తుత తరుణంలో న్యాయవాద వృత్తి, న్యాయశాస్త్ర అధ్యయనాల పట్ల ఆకర్షితులవడం దేశ భవితకు శుభ పరిణామం అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం నాడు వర్జీనియా రాష్ట్ర యాష్బర్న్ నగరంలోని సితార సమావేశ మందిరంలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)లు సంయుక్తంగా స్థానిక ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నవరక్తం నిండిన యువతరం న్యాయవాద వృత్తి వైపు ఆకర్షితులు కావడం, మౌలిక వసతులు, జవాబుదారీతనం వృద్ధిలోకి రావడం తీర్పులను త్వరితరగతిన అందించేందుకు ఆరోగ్యకర ఆచ్ఛాదనను కల్పిస్తుందని జాస్తి పేర్కొన్నారు. ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం కలిగించినప్పుడే అసాంఘిక కార్యకలాపాలకు శాశ్వత అడ్డుకట్ట వేయగలిగి తద్వారా దేశ సురుచిర లక్ష్యాలను అందుకునేందుకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. ప్రవాసులు మాతృదేశానికి చేస్తున్న సేవలను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. భారత పార్లమెంట్ ప్రజాస్వామ్యబద్ధమైన శాసనాల ద్వారా కక్షిదారులకు న్యాయం మరింత సత్వరంగా, సమర్థంగా సాంత్వన చేకూర్చేలా చర్యలు చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ఎంపిక ఆ దేశ అధ్యక్షుడి ద్వారా పారదర్శకంగా నిర్వహింపబడుతున్నట్లే భారత రాజ్యాంగ వ్యవస్థ కూడా ఆ పద్ధతిని ఆకళింపు చేసుకోవాలని ఆయన సూచించారు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత, మాజీ రాజ్యసభ సభ్యులు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రసంగిస్తూ ఒబామా వంటి అగ్రరాజ్య అధ్యక్షుడికి కూడా జాతిపిత మహాత్ముడే ఆదర్శమని అటువంటి దేశంలో పుట్టిన మనమంతా దానికి ఎల్లవేళలా సేవ చేస్తూ ఋణపడి ఉండాలని కోరారు. ప్రవాస తెలుగు చిన్నారులకు తెలుగు నేర్పించడం వరకు బాగానే ఉన్నా "అభ్యాసం కూసు విద్య" అనే సామెతను ప్రవాసులు మరవకూడదని అన్నారు. పిల్లలు నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టేందుకు తల్లిదండృలు వారిని మాతృభాషలోనే రాయడం, పలకడం, మాట్లాడటం వంటి వాటి వైపు ప్రోత్సహించవల్సిందిగా సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో సైతం ఆంగ్ల భాష వ్యాప్తి మర్రిచెట్టును తలిపిస్తుండంపై ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు వేమన సతీష్, బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు దంగేటి కిషోర్, ఉపాధ్యక్షుడు మన్నే సత్యనారాయణ, ప్రవాస ప్రముఖులు డాక్టర్ యడ్ల హేమప్రసాద్, కాట్రగడ్డ కృష్ణప్రసాద్, డాక్టర్.నరేన్ కొడాలి, ఏపీ ఎన్.ఆర్.టీ ప్రతినిధి కలపటపు బుచ్చిరాంప్రసాద్, ప్రముఖ పాత్రికేయులు డా.నరిశెట్టి ఇన్నయ్య, కోయా రమాకాంత్, కుక్కట్ల శ్రీనివాస్, ఉప్పుటూరి రాంచౌదరి, మేరీల్యాండ్ తెలుగు సంఘం, తెలంగాణా అభివృద్ధి మండలి(టీడీఎఫ్) ప్రతినిధులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
కార్మిక శాఖ డీసీగా మల్లేశ్వరకుమార్
కర్నూలు(రాజ్విహార్): కార్మిక శాఖ కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్(డీసీఎల్)గా యు.మల్లేశ్వర కుమార్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు డీసీఎల్గా పదోన్నతి కల్పించి ఇక్కడికి బదిలీ చేస్తూ కార్మిక శాఖ కమిషనర్ వరప్రసాద్ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ డీసీఎల్గా విధులు నిర్వహించిన సయ్యద్ సర్దార్ సాహెబ్ అఖిల్ గత రెండు నెలల కిత్రం పదవీ విరమణ పొందడంతో జేసీఎల్గా పనిచేస్తున్న శ్రీనివాస్ అప్పటి నుంచి ఇన్చార్జీ బాధ్యతలు నిర్వహించారు. గుంటూరుకు చెందిన మల్లేశరకుమార్ 1997లో గ్రూప్–2 ద్వారా ఏఎల్ఓగా ఎంపికై కార్మిక శాఖలో చేరి కంభం, పిడుగురాళ్ల, ఒంగోలు, గుంటూరు, చిలకలూరిపేటలో పనిచేశారు. 2008లో పదోన్నతి రావడంతో గుంటూరు ఏసీఎల్గా పనిచేస్తూనే ముడు నెలల పాటు కడప డీసీఎల్గా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించారు. కార్మికుల సంక్షేమానికి కషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన డీసీఎల్కు ఏసీఎల్లు శేషగిరిరావు, శ్రీనివాసులు, రఘురాములు, ఆత్మకూరు ఏఎల్ఓ హేమాచారి తదితరులు అభినందలు తెలిపారు. -
కొవ్వలిలో ఏసీబీ సోదాలు
కొవ్వలి (దెందులూరు) : కొవ్వలి గ్రామంలోని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కంచర్ల విజయసాగరబాబు సోదరి ఇంట్లో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రెండు గంటలపాటు తనిఖీలు చేపట్టారు. విజయసాగరబాబు ప్రస్తుతం హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన అక్రమాస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో గ్రామంలోని సాగరబాబు సోదరి ఎస్.సుధారణి ఇంట్లో ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. సోదాల్లో ఏసీబీ డీఎస్పీ సుధాకర్, సీఐ జోసఫ్ విల్సన్, సిబ్బంది పాల్గొన్నారు. -
8 మంది డీసీలకు త్వరలో పోస్టింగ్లు
సీఎం ఆఫీస్లో ఫైల్ పెండింగ్ సాక్షి, హైదరాబాద్: వాణిజ్యపన్నుల శాఖలో ఉన్నతస్థాయి పోస్టులను భర్తీ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ శాఖలో రాష్ట్రస్థాయి కేడర్లో పనిచేస్తున్న అధికారుల విభజన ప్రక్రియ ఇటీవల దాదాపుగా పూర్తయింది. ఏపీకి చెందిన 35 మంది అధికారులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత గల అధికారులు ఇక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, సీటీవోల భర్తీ ప్రక్రియ వేగం అందుకుంది. ఎనిమిది మంది డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులను వివిధ డివిజన్లలో భర్తీ చేసేందుకు కమిషనర్ వి. అనిల్ కుమార్ ఫైలు తయారు చేసి ఇటీవలే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపించారు. ఈ మేరకు ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. ఒకటి రెండు రోజుల్లో సీఎం ఫైలుపై సంతకాలు చేస్తే ఎనిమిది మంది డిప్యూటీ కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం డిప్యూటీ కమిషనర్లుగా ఆదిలాబాద్కు ఆనంద్ రావు, కరీంనగర్ కు ద్వారకానాథ్ రెడ్డి, హైదరాబాద్ రూరల్- కాశీ విశ్వనాథ్ రెడ్డి, పంజాగుట్ట- లక్ష్మీనారాయణ, సికింద్రాబాద్- కె. హరిత, బేగంపేట- సాయి కిషోర్, వరంగల్ - లావణ్య, నల్లగొండ- గీతలను నియమించనున్నారు. వీరి భర్తీ ప్రక్రియ పూర్తయిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అసిస్టెంట్ కమిషనర్ల ఖాళీలను భర్తీ చేస్తారు. వీటితో సీటీవోల భర్తీకి డీపీసీని ఏర్పాటు చేయాల్సి ఉంది. పదోన్నతుల కోసం ఏర్పాటు చేసే ఈ కమిటీ సీనియారిటీ ఆధారంగా సీటీవోలకు అసిస్టెంట్ కమిషనర్లుగా పదోన్నతి కల్పిస్తుంది. అలాగే డీసీటీవోలు సీనియారిటీ ఆధారంగా సీటీవోలు కానున్నారు. దీనికి సంబంధించి కమిషనర్ స్థాయిలో కసర త్తు సాగుతున్నా, వివిధ కారణాల వల్ల ఓ కొలిక్కి రాలేదు. డీసీల నియామకం పూర్తయిన వెంటనే ఈ ఫైలు కూడా కదులుతుందని ఓ అధికారి తెలిపారు. -
‘డీసీ’ నిందితులకు బెయిల్ నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: తప్పుడు పత్రాలతో కెనరా బ్యాంకు నుంచి రుణం పొంది మోసానికి పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, వైస్ చైర్మన్ వినాయక రవిరెడ్డిలకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. వీరిద్దరూ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను శుక్రవారం న్యాయమూర్తి వై.వీర్రాజు కొట్టివేశారు. అనేక బ్యాంకుల నుంచి తప్పుడు పద్ధతుల్లో వీరు రుణాలు పొందారని, బెయిల్ ఇస్తే దర్యాప్తునకు ఆటంకం ఏర్పడుతుందన్న సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించి బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. -
రాష్ట్ర సమస్యలను పరిష్కరించగల ఏకైక నాయకుడు జగన్ అంటున్న ఎన్ఆర్ఐలు