Dera Clashes
-
స్పెషల్ సెల్, మినరల్ వాటర్, అసిస్టెంట్
సాక్షి, రోహతక్: అత్యాచార కేసులో దోషిగా తేలి, ప్రస్తుతం రోహతక్ సునారియా జైల్లో ఉన్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్కు తాగేందుకు మినరల్ వాటర్తో పాటు, ఓ సహాయకుడు సేవలు అందించేందుకు అధికారులు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే జైల్లో గుర్మీత్కు సకల మర్యాదలు అందనున్నట్లు వార్తలొచ్చాయి. అధికారులు ఆయనను ఓ ప్రత్యేక సెల్లో ఉంచిన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు మహిళా సాధ్వీలపై అత్యాచారం కేసులో గుర్మిత్కు సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. శాంతి భద్రతల నేపథ్యంలో ఆయనను తీర్పు అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో రోహతక్ తరలించారు. అనంతరం గుర్మిత్ను ఓ గెస్ట్హౌస్లో ఉంచి, శుక్రవారం సాయంత్రం జైలుకు తరలించారు. కాగా కోర్టు ప్రాంగణంలో గుర్మీత్తో పాటు పలు బ్యాగులు, లగేజీ ఉన్నట్లు కొన్ని వీడియోల్లో కనిపించాయి. ఆ వార్తల్లో నిజం లేదు: జైళ్ల డీజీ అయితే జైలులో గుర్మిత్కు ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు వస్తున్న వార్తలను హరియాణా జైళ్ల డీజీ కేపీ సింగ్ తోసిపుచ్చారు. ఆయనకు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు కొన్ని టీవీ చానల్స్, పేపర్లు పేర్కొన్నాయని, అదంతా అవాస్తవమన్నారు. కేసు తీర్పు అనంతరం గుర్మిత్ను సునారియా జైలుకు తరలించామే కానీ, గెస్ట్హౌస్కు కాదన్నారు. అలాగే ఆయనకు జైల్లో సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నట్లు చెప్పారు. గుర్మిత్కు సహాయకుడి కానీ, జైలు సెల్లో ఏసీ సదుపాయం కూడా లేదని జైళ్ల డీజీ స్పష్టం చేశారు. సిర్సాలో భయానక పరిస్థితులు కాగా హరియాణాలోని సిర్సాలో భయానక పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. తీర్పు అనంతరం చెలరేగిన హింస ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. రోడ్లపై ఎటు చూసినా తగలబడిన వాహనాలు, ధ్వంసమైన షాపులు ఇళ్లు, కత్తులు, రాడ్లు, కర్రలు కన్పిస్తున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళన అందరిలోనూ నెలకొంది. గుర్మీత్ ఆందోళనకారుల దాడులు నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు. మరోవైపు గుర్మిత్ కేసులో తీర్పునిచ్చిన న్యాయమూర్తుల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. -
గుర్మీత్ అనుచరులు చంపేస్తారేమో!
ఛండీగఢ్: పదిహేనేళ్ల రేప్ కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు డేరా అనుచరుల్లో ఆగ్రహ జ్వాలలు రగల్చింది. ఓవైపు మృతుల సంఖ్య పెరిగిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వ్యాపిస్తుండటంతో ఉత్తర భారతావనిలో ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో అత్యాచార బాధితురాళ్ల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ అత్యాచారానికి పాల్పడ్డారంటు చెబుతున్న ఇద్దరు సాధ్వీలు ప్రస్తుతం ఉన్నారన్నది ఎవరికీ తెలీదు. ఈ విషయంపై నోరు మెదిపేందుకు వాళ్ల తరపు న్యాయవాది కూడా సుముఖంగా లేదు. తాజా పరిస్థితుల్లో వారి ప్రాణాలకు ముప్పు ఉండటంతో ఎలాంటి సమాచారం బయటకు పొక్కనీయటం లేదు. ‘గత కొద్దిరోజులుగా వాళ్లలో భయాందోళనలు కనిపిస్తున్నాయి. ప్రాణ భయంలో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఒకవేళ కేసులో ఆయన్ను(గుర్మిత్) నిర్దోషిగా ప్రకటిస్తే తాము వేరే రాష్ట్రానికి వెళ్లిపోతామని వాళ్లు తనతో మొరపెట్టుకున్నట్లు‘ న్యాయవాది తెలిపారు. మరోవైపు ఈ కేసులో పారదర్శకత కోసం హర్యానాలో కాకుండా వేరే రాష్ట్రంలో వాదనలు వినిపించాలని ఆయన వాదనల సందర్భంగా కోరినట్లు తెలుస్తోంది. ఇక తీర్పు వెలువడే ముందే బాధితురాల్లో ఒకరు ఓ జాతీయ మీడియాతో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. తాను పెను పెద్ద ప్రమాదంలో ఉన్నానని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. తాను స్వేచ్ఛగా తిరగలేకపోతున్నానని, నిజాయితీ పరులైన అధికారుల వల్లే తమకు న్యాయం చేకూరుతుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపిందంట. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల మధ్య వాళ్లు సురక్షితంగా ఉంటారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 2002లో ఓ లేఖ ద్వారా ఈ వ్యవహారం మొదలైంది. మూడు పేజీల ఆ లేఖ అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్, కేంద్ర హోం మత్రి మరియు హైకోర్టు, ఇతరుల పేర్లను ప్రస్తావిస్తూ తనపై గుర్మీత్ అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. తనని గుఫాగా అభివర్ణిస్తూ గుర్మిత్ తన డెన్లో పక్కనే గన్ పెట్టుకుని బెదిరిస్తూ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు లేఖలో ఉంది. ఆ లేఖ ఆధారంగా సీబీఐ దర్యాప్తునకు ఛండీగఢ్ హైకోర్టు ఆదేశించింది. సీబీఐ విచారణలో మరో సాధ్వీపై కూడా అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక ఈ లెటర్ వెలుగులోకి రావటానికి కారణమైన వ్యక్తి హత్యకు గురయ్యాడు కూడా. 2008లో సీబీఐ కోర్టు రామ్ రహీమ్ మీద అత్యాచార ఆరోపణలను నమోదు చేసింది. 15 ఏళ్ల తర్వాత చివరకు గుర్మీత్ ను దోషిగా పేర్కొంటూ తీర్పు వెలువరించింది. -
'డేరా' దమనకాండ.. ఉత్తరాది విలవిల
-
డేరా సచ్చా సౌదా విధ్వంసం... టెన్షన్