export price
-
ఉల్లి ఎగుమతులకు చెక్
సాక్షి,న్యూఢిల్లీ: రోజురోజుకూ భారమవుతున్న ఉల్లి ధరలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఉల్లి ఎగుమతులను నియంత్రించాలని నిర్ణయించింది. ఉల్లి ఎగుమతులకు టన్నుకు రూ 800 డాలర్ల కనిష్ట ఎగుమతి ధరను (ఎంఈపీ) నిర్ణయించేందుకు కసరత్తు చేస్తోంది. ఎంఈపీ కన్నా తక్కువ ధరకు ఎగుమతులను అనుమతించరు. 2015లో ఉల్లికి ఎంఈపీని తొలగించిన విషయం తెలిసిందే. వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉల్లి ధరల నియంత్రణ, ఎంఈపీపై వినియోగదారుల మంత్రిత్వ శాఖ అధికారులు, పరిశ్రమ వర్గాలతో విస్తృతంగా చర్చించింది. ఉల్లి ఎగుమతులను నియంత్రించేందుకు, స్ధానిక మార్కెట్లలో ఉల్లి ధరలకు చెక్ పెట్టేందుకు ఎంఈపీ విధించాలని ఈ భేటీలో నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. ఈ దిశగా త్వరలోనే తుది నోటిఫికేషన్ వెలువడుతుందని చెప్పారు. -
ఉల్లి ఎగుమతి ధరల పెంపు
ఉల్లి ఎగుమతి ధరలను ప్రభుత్వం భారీగా పెంచింది. టన్నుకు 500 డాలర్లు కనీస ఎగుమతి ధర ఉండాలంటూ.. 67 శాతం మేర పెంచింది. స్వదేశీ మార్కెట్లలో ఉల్లి ధరలు మండిపోతుండటంతో.. ఎగుమతులను నిరోధించేందుకు ఈ చర్య తీసుకుంది. పెంచిన ధరల ప్రకారం, కిలో ఉల్లిపాయల ఎగుమతి ధర కనీసం 30 రూపాయలు ఉండాలి. ప్రస్తుతం స్వదేశీ మార్కెట్లలో ఉల్లిధరలు కిలోకు రూ. 20-30 వరకు ఉన్నాయి. ఉల్లి ఎగుమతి ధరలను పెంచాలన్న నిర్ణయాన్ని మంత్రుల కమిటీలో ఏకగ్రీవంగా తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇంతకుముందు టన్ను ఉల్లిపాయలకు కనీస ఎగుమతి ధర 300 డాలర్లుగా ఉండేది.