Gyandev Ahuja
-
గంగాజలం ఎఫెక్ట్.. బీజేపీ నేతపై సస్పెన్షన్ వేటు
రాజస్థాన్లో వివాదాస్పద నేత జ్ఞానదేవ్ అహూజాపై ఎట్టకేలకు అక్కడి బీజేపీ విభాగం చర్యలు తీసుకుంది. క్రమశిక్షణా చర్యల ఉల్లంఘనకుగానూ షోకాజ్ నోటీసు జారీ చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆలయంలో గంగా జలంతో శుద్ధి చేయడమే ఇందుకు కారణం!!.ఆల్వాల్లో శ్రీరామ నవమి సందర్భంగా ఓ ఆలయంలో జరిగిన ప్రాణ ప్రతిష్టకు కాంగ్రెస్ నేత తికారాం జల్లీ హాజరయ్యారు. అయితే దళిత నేత అడుగుపెట్టి ఆలయం అపవిత్రం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహూజా గంగా జలంతో ఆ ఆలయాన్ని శుద్ధి చేశారు. ఈ పరిణామం దళిత సంఘాలకు ఆగ్రహావేశాలు తెప్పించింది.ఈ చర్య పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేదిగా ఉందని పేర్కొంటూ బీజేపీ ఎంపీ దామోదర్ అగర్వాల్ , అహుజాకు నోటీసులు పంపించారు. మూడు రోజుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ రాథోడ్కు వివరణ ఇవ్వాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.జ్ఞానదేవ్ అహూజా.. 2013-18 మధ్య రామ్ఘడ్ ఎమ్మెల్యేగా పని చేశారు. వివాదాల్లో నిలవడం ఈయనకు కొత్తేం కాదు. 2016లో.. జేఎన్యూలో జాతీ వ్యతిరేక నినాదాల వ్యవహారంపై స్పందిస్తూ జ్ఞానదేవ్ తీవ్రవ్యాఖ్యలే చేశారు. జేఎన్యూలో నిత్యం 3 వేల కండోమ్స్, 2 వేల లిక్కర్ బాటిల్స్ దొరుకుతాయంటూ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. 2017లో గోవుల అక్రమ రవాణా చేస్తున్నాడని పెహ్లూ ఖాన్ అనే పాడి రైతును మూక దాడిలో చంపడాన్ని కూడా అహూజా సమర్థించారు. -
‘ఆ మూక హత్యలు మావాళ్లు చేసినవే’
జైపూర్: తన మద్దతుదారుల మూకదాడిలో ఆవుల స్మగ్లర్లు ఐదుగురు హతమయ్యారని చెప్పుకున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ అహూజాపై ఆల్వార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ దొంగతనం ఆరోపణలపై శుక్రవారం మేవాట్కు చెందిన ముస్లింలు చిరంజీలాల్ సైనీ అనే వ్యక్తిని కొట్టి చంపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంలో అహూజా ‘లావాండి ప్రాంతంలో మా వాళ్ల మూకదాడిలో ఐదుగురు హతమయ్యారు. ఇలాంటిది జరగడం మాత్రం ఇదే మొదటిసారి. ఆవుల దొంగలపై మూకదాడులకు పాల్పడిన మా వాళ్లకు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకువచ్చే పూచీ నాది’అని అంటున్నట్లుగా ఉన్న ఓ వీడియో వైరల్ అవుతోంది. -
మరోసారి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహుజ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జేఎన్ యూ విద్యార్థులు క్యాంపస్ లో విచ్చలవిడిగా వ్యవహరిస్తారని అంతకుముందు వ్యాఖ్యానించిన ఆయన మళ్లీ తన నోటికి పదును పెట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో 50 శాతం అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసులకు జేఎన్ యూ విద్యార్థులే కారణమంటూ నోరు పారేసుకున్నారు. అంతకుముందుకు జేఎన్ యూ విద్యార్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వివరణ ఇవ్వాలని ఆయనను పార్టీ అధిష్టానం ఆదేశించింది. జేఎన్ యూ క్యాంపస్ లో ప్రతిరోజు 3 వేల కండోమ్ లు, గర్భనిరోధక ఇంజక్షన్లు వాడతారని అహుజ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. -
ట్రెండ్ అవుతున్న 'బీజేపీ కౌంట్స్ కండోమ్స్'!
న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యూ)పై బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ అహూజ చేసిన వ్యాఖ్యలు ఆన్లైన్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. జెఎన్యూ వ్యవహారంలో బాధ్యతారహితమైన వ్యాఖ్యలను చేసిన ఆయన పట్ల బీజేపీ అధినాయకత్వం కన్నెర్ర జేసింది. వెంటనే ఢిల్లీకి వచ్చి ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని సదరు ఎమ్మెల్యేను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశించినట్టు తెలుస్తోంది. 'జెఎన్యూలో మూడు వేల బీర్ బాటిళ్లు, రెండువేల భారత మద్యం బాటిళ్లు, 10వేల సిగరెట్ పీకలు, నాలుగు వేల బీడీలు, 50వేల మాంసం ఎముకలు, రెండువేల చిప్ కవర్లు, మూడువేల వాడిన కండోమ్లు, 500 అబార్షన్ ఇంజెక్షన్లు ప్రతిరోజూ లభిస్తాయి' అని రాజస్థాన్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో బీజేపీ ఒక్కసారిగా ఆన్లైన్లో ట్రెండింగ్ అంశమైపోయింది. బీజేపీ కౌంట్స్ కండోమ్స్ (#BJPCountsCondoms) హ్యాష్ ట్యాగ్తో ఈ వ్యాఖ్యలపై విమర్శలు, సెటైర్లు ఆన్లైన్లో వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే అహూజా (63) గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి వివాదాలు రేపారు. కాలేజీ చదువులు చదవని ఆయన ప్రతి ఏడాది జరిగే 'రామ్లీలా' నాటకంలో రావణ పాత్ర పోషించడం ద్వారా కూడా ప్రముఖుడయ్యారు.