head office
-
ఎస్పీ ఆఫీసు ఎదుట రాజ్యాంగ స్తూపం
లక్నో: లక్నోలోని సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) ప్రధాన కార్యాలయం ఎదుట రాజ్యాంగ స్తూపం(సంవిధాన్ మాన్స్తంభ్) ఏర్పాటైంది. శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఎస్పీ నేతల సమక్షంలో ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఒక స్తూపంపై రాజ్యాంగ ప్రతిని ఉంచడం ద్వారా రాజ్యాంగ స్తూపాన్ని ఆవిష్కరించారు. ‘ఒకప్పటి కొల్హాపూర్ మహారాజు చత్రపతి సాహూ తన సంస్థానంలో మహాత్మా జ్యోతిబా ఫూలే కలలుగన్న రిజర్వేషన్ల అమలును సరిగ్గా ఇదే రోజున ప్రారంభించారు. అందుకే జూలై 26వ తేదీన రాజ్యాంగ స్తూపాన్ని ఏర్పాటు చేసినట్లు అనంతరం అఖిలేశ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
సాక్షి ప్రధాన కార్యాలయంలో వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు (ఫోటోలు)
-
మంగళగిరి టీడీపీ కార్యాలయం వద్ద ఆందోళన
గుంటూరు, సాక్షి: మంగళగిరిలోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. తాడికొండ అసెంబ్లీ సీట్లు మాదిగలకే కేటాయించాలంటూ నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఒకవేళ తాడికొండ(గుంటూరు) సీటును మాదిగలకు ఇవ్వకపోతే తగిన బుద్ధి చెప్తామని మాదిగ నాయకులు టీడీపీ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెనాలి శ్రావణ్ కుమార్ను టీడీపీ అధిష్టానం ఈ మధ్యే నిర్ణయించింది. అయితే అది ఏకపక్షంగా జరిగిన ప్రకటన అంటూ మాదిగ నేతలు రంగంలోకి దిగారు. ఆ సీటు తమ సామాజిక వర్గానికే ఇవ్వాలంటూ నిరసనకు దిగడం చంద్రబాబుకు ఊహించని షాక్ అనే చెప్పాలి. సీనియర్ నేత టీడీ జనార్ధన్ ప్రస్తుతం వాళ్లను బుజ్జగించే యత్నం చేస్తున్నారు. -
బీజేపీ కార్యాలయం వద్ద ప్రధానికి ఘన స్వాగతం
న్యూఢిల్లీ: ఇటీవల భారత్ సారథ్యంలో జీ20 శిఖరాగ్ర భేటీని విజయవంతంగా నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఘన స్వాగతం లభించింది. బుధవారం సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశానికి హాజరైన సందర్భంగా ప్రధానికి కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తోపాటు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తదితరులు స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో హాజరైన పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ప్రధానిపై పూల వర్షం కురిపిస్తూ కార్యాలయంలోకి ఆహా్వనించారు. జీ20 విజయవంతంగా ముగియడం, ప్రపంచ నేతలు మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించడం తెలిసిందే. ఈ భేటీ తర్వాత బీజేపీ ప్రధాన కార్యాలయంలోకి ప్రధాని రావడం ఇదే మొదటిసారి. -
మార్గదర్శి హెడ్ ఆఫీసులో కొనసాగుతున్న ఏపీ సీఐడీ సోదాలు
-
‘చెక్కు’తో చిక్కారు!.. మార్గదర్శి హెడ్ ఆఫీస్లో సీఐడీ విస్తృత సోదాలు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమ వ్యవహారాల కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతమైంది. మనీ లాండరింగ్కు పాల్పడిన మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలను ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) దృష్టికి సీఐడీ తీసుకొచ్చింది. చట్టాలను ఉల్లంఘించి రామోజీరావు, ఆయన కుటుంబం పాల్పడుతున్న ఆర్థిక మోసాలను ఆధారాలతో సహా వివరించింది. మరోవైపు సీఐడీ అధికారులు హైదరాబాద్లోని మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రధాన కార్యాలయంలో బుధవారం విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అర్ధరాత్రి వరకు కొనసాగిన సోదాల్లో అక్రమ పెట్టుబడులు, చందాదారులు సొమ్ము నిబంధనలకు విరుద్ధంగా బదిలీకి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. ప్రధానంగా మార్గదర్శి చిట్ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజ కిరణ్, సంస్థ డైరెక్టర్ల పాత్రకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంస్థ బ్యాలన్స్ షీట్లు, నగదు–చెక్కు వ్యవహారాలకు సంబంధించిన రికార్డులు, నిధుల మళ్లింపునకు సంబంధించిన రికార్డులను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మార్గదర్శి బ్రాంచి కార్యాలయాల్లో వెలుగు చూసిస ఆర్థిక అక్రమాలకు మూలం అంతా హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయమేనని వెల్లడైంది. బెడిసికొట్టిన ఏ–1 రామోజీ, ఏ–2 శైలజ పన్నాగం ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు, ఏ–2గా ఉన్న చెరుకూరి శైలజ కిరణ్ ఈ కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు చేసిన ప్రయత్నాలను సీఐడీ తాజా సోదాలతో అడ్డుకుంది. ఈ నెల 3న రామోజీరావును, శైలజను ఈ నెల 6న సీఐడీ అధికారులు విచారించిన విషయం విదితమే. మార్గదర్శి చిట్ఫండ్స్ నుంచి నిధులు మళ్లించామని అంగీకరిస్తూనే ఆ వ్యవహారాలతో తనకు సంబంధం లేదని, అంతా బ్రాంచి మేనేజర్లు (ఫోర్మెన్) చూసుకుంటారని ఈ సందర్భంగా రామోజీరావు అడ్డగోలుగా వాదించారు. మరోవైపు శైలజా కిరణ్ కూడా అదే రీతిలో విచారణకు సహకరించకుండా సహాయ నిరాకరణ చేశారు. అక్రమంగా బదిలీ చేసింది వారిద్దరే మార్గదర్శి చిట్ఫండ్స్లో చందాదారుల సొమ్మును అక్రమంగా మళ్లించింది సంస్థ చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజా కిరణేనని సీఐడీ సోదాల్లో వెల్లడైంది. ఆ నిధులను రామోజీరావు కుటుంబానికి చెందిన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, మార్గదర్శి చిట్ఫండ్స్(కర్ణాటక)– బెంగళూరు, మార్గదర్శి(తమిళనాడు)–చెన్నై సంస్థల్లోకి మళ్లించారు. కంపెనీ చైర్మన్ హోదాలో రామోజీరావు, ఎండీ హోదాలో శైలజతోపాటు డైరెక్టర్ల ఆమోదంతోనే ఆ నిధులు మళ్లించారనేందుకు కీలక ఆధారాలు సీఐడీకి లభ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు కేసు దర్యాప్తులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని విశ్వసనీయ సమాచారం. ఆ చెక్కులు ఎక్కడ..? ఏటా సరిగ్గా.. మార్చి 31న రూ.వందల కోట్ల విలువైన చెక్కులు వస్తున్నట్లు మార్గదర్శి చిట్ఫండ్స్ తన బ్యాలన్స్ షీట్లో చూపిస్తోంది. 2022 మార్చి 31న కూడా రూ.550 కోట్ల విలువైన చెక్కులు వచ్చినట్లు చూపించారు. కానీ నిర్ణీత 90 రోజుల్లోగా ఆ చెక్కులను నగదుగా మార్చడం లేదని సీఐడీ అధికారుల సోదాల్లో వెలుగులోకి వచ్చింది. చెక్కుల్లో చూపిస్తున్న నిధులను రామోజీ తన కుటుంబ ప్రయోజనాల కోసం అక్రమంగా తరలిస్తున్నారు. దీనిపైనే సీఐడీ అధికారులు ప్రశ్నించడంతో శైలజా కిరణ్ షాక్కు గురయ్యారు. ఆ చెక్కులు నగదుగా మారాయో లేదో రికార్డులు తమ వద్ద లేవని చెప్పడంతో ప్రధాన కార్యాలయానికి వెళ్లి పరిశీలిద్దామని సీఐడీ అధికారులు సూచించారు. అందుకు ఆమె అంగీకరించకపోగా సీఐడీ అధికారులు అక్కడకు వెళ్లేందుకు కూడా సమ్మతించలేదు. ప్రధాన కార్యాలయంలోని కీలక రికార్డులను సీఐడీ పరిశీలించేందుకు శైలజా కిరణ్ ఒప్పుకోకపోవడం ఈ కేసులో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు బుధవారం నిర్వహించిన సోదాల్లో ఏటా బ్యాలన్స్ షీట్లో చూపిస్తున్న చెక్కులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అసలు చెక్కులు రావడంగానీ, వాటిని నగదుగా మార్చడం గానీ జరగడం లేదని గుర్తించారు. నగదు రూపంలో ఏటా రూ.500 కోట్లు మార్గదర్శి చిట్ఫండ్స్ నిబంధనలకు విరుద్ధంగా ఏటా రూ.500 కోట్లను నగదు రూపంలో వసూలు చేస్తున్నట్లు బ్రాంచి కార్యాలయాల్లో గతంలో నిర్వహించిన సోదాల్లో వెలుగు చూసింది. కానీ ఆ నిధులను బ్రాంచి కార్యాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంలేదు. ఆ నగదు నిల్వలేవీ ప్రధాన కార్యాలయంలోని రికార్డుల్లో కూడా లేనట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. అంటే ఆ డబ్బులను నల్లధనం రూపంలో అక్రమంగా తరలిస్తున్నట్లు రూఢీ అయింది. అందుకు సంబంధించిన కీలక ఆధారాలు కూడా సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రామోజీ బెంబేలు మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలను సీఐడీ ఆధారాలతో సహా జాతీయ దర్యాప్తు సంస్థల దృష్టికి తేవడంతో ఈ కేసులో ఏ–1గా ఉన్న రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. సీఐడీ దర్యాప్తుపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన ఆయన తొలిసారిగా మార్గదర్శి చిట్ఫండ్స్ పేరిట తాజాగా పత్రికా ప్రకటన జారీ చేశారు. ఈడీ, సీబీడీటీ దర్యాప్తు తప్పదేమోనన్న ఆందోళన అందులో వ్యక్తమైంది. రాష్ట్రంలో మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యకలాపాలు నిలిచిపోయాయని ఆ ప్రకటనలో అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో మార్గదర్శి చిట్ఫండ్స్ కొత్త చిట్టీలు ఏవీ ప్రారంభించడం లేదని పేర్కొనడం గమనార్హం. చదవండి: అడ్డంగా దొరికినా అడ్డదారిలోనే! -
South Coast Railway Zone: కలల జోన్కు సొంతగూడు
సాక్షి, విశాఖపట్నం: కలల జోన్ పనులు ప్రారంభమయ్యేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ పనులకు త్వరలో టెండర్లు పిలిచేందుకు రైల్వే బోర్డు సన్నద్ధమవుతోంది. ప్రస్తుత డీఆర్ఎం కార్యాలయానికి, రైల్వే స్టేషన్ మధ్యలో ఉన్న వైర్లెస్ కాలనీలో రూ.106 కోట్ల వ్యయంతో ప్రధాన కార్యాలయం నిర్మించనున్నారు. వందేళ్లు పటిష్టంగా ఉండేలా చారిత్రక నిర్మాణంగా ఈ కార్యాలయం రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే తయారు చేసిన డిజైన్లకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. పనులు ప్రారంభించిన 36 నెలల్లో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. ఈలోగా జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని బోర్డు నిర్ణయిస్తే.. డీఆర్ఎం కార్యాలయం నుంచి తాత్కాలికంగా జోనల్ మేనేజర్ బాధ్యతలు నిర్వర్తించేలా కూడా సన్నాహాలు చేస్తున్నారు. టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు రైల్వే జోన్ హెడ్క్వార్టర్స్ భవన నిర్మాణానికి ఈ నెలాఖరులోగా వర్చువల్గా ప్రధాని మోదీ చేతుల మీదుగానే శంకుస్థాపన నిర్వహించే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. శంకుస్థాపన జరిగిన వెంటనే టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వైర్లెస్ కాలనీలో ఉన్న 13 ఎకరాల్లో 8 ఎకరాల విస్తీర్ణంలో హెడ్క్వార్టర్స్ రానుంది. రూ.106 కోట్ల వ్యయంతో జోన్ ప్రధాన కార్యాలయానికి టెండర్లు పిలవనున్నారు. మొత్తం ఏడు ఫ్లోర్లలో హెడ్క్వార్టర్స్ బిల్డింగ్ ఉండనుంది. ప్రతి భవనానికి 2 యాక్సెస్ పాయింట్స్, రెండు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో బీటీరోడ్స్ కోసం రూ.2.64 కోట్లు, సీసీ రోడ్లకు రూ.1.66 కోట్లు, ఫుట్పాత్ ఏరియాకు రూ.32 లక్షలు, పార్కింగ్ పావ్డ్ ఏరియా కోసం రూ.1.08 కోట్లు, ప్లాంటేషన్కు రూ.2.16కోట్లు, బిల్డ్అప్ ఏరియాకు రూ.71.64 కోట్లు, బేస్మెంట్, స్టిల్ట్లో పార్కింగ్ కోసం రూ.21 కోట్లు ఖర్చు చేయనున్నారు. టెండర్లు ఖరారు చేసిన తర్వాత అగ్రిమెంట్ జరిపి.. 36 నెలల్లో భవనాన్ని పూర్తి చేయాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. తాత్కాలిక సేవలు మొదలయ్యేనా.? 2019 ఫిబ్రవరి 28న కేబినెట్ ఆమోద ముద్రవేస్తూ విశాఖ కేంద్రంగా కొత్త జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తాజా పరిణామాలతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ను సమర్థంగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త భవన నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా జోన్ కార్యకలాపాలు కూడా ప్రారంభించాలనే ఆదేశాలు కూడా ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో రైల్వే బోర్డు ఉంది. ఒకవేళ బిల్డింగ్ నిర్మాణంతో పనిలేకుండా జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే తాత్కాలిక కార్యాలయంగా ప్రస్తుతం ఉన్న వాల్తేరు డీఆర్ఎం కార్యాలయాన్ని వినియోగించాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే సౌత్ కోస్ట్ జోన్ ఓఎస్డీ, తను సమర్పించిన జోన్ డీపీఆర్లోనూ పొందుపరిచారు. జోనల్ కార్యాలయానికి సరిపడా నిర్మాణాలు ఉండటంతో జీఎం కార్యాలయాన్ని ఇక్కడ నుంచి మొదలు పెట్టే అవకాశాలున్నాయి. శభాష్.. సత్పతి ఇటీవల విశాఖపట్నంలో పర్యటించిన రైలేమంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వే బోర్డు చైర్మన్ త్రిపాఠీ.. వాల్తేరు స్టేషన్ పరిసరాలను చూసి ఆశ్చర్యపోయారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ అతి సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ఎక్కడా లేని విధంగా అతి తక్కువ సమయంలోనే వాల్తేరు డివిజన్ నుంచి అత్యధికంగా ఎల్హెచ్బీ కోచ్లు తిరిగేలా శ్రమించిన డీఆర్ఎం అనూప్కుమార్ సత్పతిని అభినందించారు. వినూత్న విధానాలతో డివిజన్ను లాభాల బాటలో తీసుకెళ్తున్నారంటూ ప్రశంసించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఫిర్యాదుని, సలహాలను స్వీకరించి దానికనుగుణంగా వ్యవహరించడం నిజంగా అరుదని కితాబిచ్చారు. జోన్ హెడ్ క్వార్టర్స్, విశాఖపట్నం రీ డెవలప్మెంట్ ప్రాజెక్టు విషయంలోనూ ఇదే తరహాలో పర్యవేక్షించి అద్భుత ఫలితాలు తీసుకురావాలని డీఆర్ఎంకు రైల్వే మంత్రి స్వయంగా బాధ్యతలు అప్పగించడం విశేషం. ప్రపంచ స్థాయి భవనం దక్షిణ కోస్తా రైల్వే జోన్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ మొదలు పెడుతున్నాం. వైర్లెస్ కాలనీలో అత్యద్భుతంగా ప్రపంచస్థాయి భవనాన్ని నిర్మించనున్నాం. వందేళ్లు పటిష్టంగా ఉండేలా చారిత్రక కట్టడంగా హెడ్క్వార్టర్స్ ఉండాలని రైల్వే మంత్రి సూచించారు. పాత వైర్లెస్ కాలనీలోని 13 ఎకరాల్లో భూమిని జోన్ కోసం సమీకరించాం. ఇందులో తొలి దశలో 8 ఎకరాల్లో మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ రానున్నాయి. కచ్చితంగా విశాఖ కేంద్రంగా రాబోతున్న సౌత్ కోస్టల్ రైల్వే జోన్ బిల్డింగ్ ప్రపంచ స్థాయి భవనంగా రూపుదిద్దుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. – అనూప్కుమార్ సత్పతి, వాల్తేరు డీఆర్ఎం -
యస్ బ్యాంకు స్వాధీనంలోకి అనిల్ అంబానీ కార్యాలయం
ముంబై: అనిల్ అంబానీ గ్రూప్నకు చెందిన ముంబైలోని శాంతాక్రజ్లో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని యస్ బ్యాంకు స్వాధీనం చేసుకుంది. బ్యాంకుకు రూ.2,892 కోట్లు బాకీ పడడమే ఇందుకు కారణం. అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్లోని (అడాగ్) దాదాపు అన్ని ప్రధాన కంపెనీల కార్యకలాపాలు ఈ రిలయన్స్ సెంటర్ నుంచే సాగుతున్నాయి. బాకీలను చెల్లించేందుకై 21,432 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని ఈ ఆఫీసును లీజుకు ఇవ్వాలని కంపెనీ గతేడాది ప్రయత్నించింది. రిలయన్స్ ఇన్ఫ్రాకు చెందిన రెండు ఫ్లాట్స్ను సైతం యస్ బ్యాంకు స్వాధీనం చేసుకుంది. -
గుర్మీత్ డేరాలు: షాకింగ్ నిజాలు!
-
డేరా సచ్ఛా సౌదాలో సెర్చ్ ఆపరేషన్
-
గుర్మీత్ డేరాలు: షాకింగ్ నిజాలు!
సాక్షి, సిర్సా: అత్యాచారాల కేసులో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నిర్వహిస్తున్న డేరా ఆశ్రమాలకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. సిర్సాలోని డేరాలో అస్తి పంజరాలు వెలుగుచూడటం వివాదాస్పదం కాగా, దానిపై డేరా అధికార ప్రతినిధి విపాసన ఇన్సాన్ స్పందించారు. తాము గుర్మీత్ ఏర్పాటు చేసిన నియమాలను ఎప్పుడూ ఉల్లంఘించలేదని, అందులో భాగంగానే కొందరు నేరుగా ఇక్కడికి వచ్చి తమ మరణానంతరం ఇక్కడే పూడ్చిపెట్టాలని స్వచ్ఛందంగా కోరినట్లు డేరా మీడియా సచ్ కహూన్ కూడా బహిర్గతం చేసింది. డేరా ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలను ప్రశ్నిస్తే గుర్మీత్ అనుచరులైనా సరే వారిని హ్యతచేసయినా, లేక సజీవంగానైనా 600 ఎకరాలు, 100 ఎకరాలకు పైగా ఉన్న ఏదైనా ఓ డేరాలో పాతిపెట్టేవారని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. గుర్మీత్ అనుచరులకు ఎదురుచెబితే ఎవరికైనా ఇక్కడ ఇలాంటి గతే పడుతుందన్న భయంతో నోరు మెదిపేవాళ్లం కాదని చెబుతున్నారు. ఛండీగఢ్ హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని సోదాలకు ఆదేశించిన నేపథ్యంలో విపాసన మాట్లాడుతూ.. చట్టాలను డేరా ఎప్పుడూ అతిక్రమించలేదని, గుర్మీత్ అనుచరులు, మద్ధతుదారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడవద్దని సూచించారు. కొందరు వ్యక్తులు తమ కుటుంబసభ్యుల అస్థికలు తమకివ్వగా డేరాలో పూడ్చిపెట్టి, నదులు, పర్యావరణం కలుషితం కాకుండా చూసేవాళ్లమని చెప్పారు. డేరా సోదాలకు తమకు ఎలాంటి అభ్యంతర లేదని అధికార ప్రతినిధి విపాసన చెప్పగా.. మరోవైపు గురువారం రాత్రి సిర్సాకు చేరుకున్న పారా మిలిటరీ, ఆర్మీ బృందం, నాలుగు జిల్లాల పోలీసులు శుక్రవారం ఉదయం నుంచి గుర్మీత్ నిర్వహిస్తున్న డేరాలను అణువణువు గాలిస్తున్నారు. ఈ తనిఖీల నేపథ్యంలో సిర్సాలో కర్ఫ్యూ విధించినట్లు అధికారులు తెలిపారు. అత్యాచారాల కేసులో దోషిగా తేలిన గుర్మీత్ కు కోర్టు 20 ఏళ్ల (ఒక్కో కేసులో పదేళ్లు) జైలు విధించిన విషయం తెలిసిందే. -
డేరా సచ్ఛా సౌదాలో సెర్చ్ ఆపరేషన్
సాక్షి, సిర్సా: గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తుండగా, అతని అక్రమాలకు సంబంధించి రోజుకు కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారిందంటూ ఓ పిటిషన్ దాఖలు కావటంతో ఛండీగఢ్ హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని సోదాలకు ఆదేశించింది. దీంతో శుక్రవారం సిర్సాలోని డేరా సచ్ఛా సౌదా ప్రధాన కార్యాలయంలో భద్రతా దళాలు సోదాలు చేపడుతున్నాయి. ఉదయం నుంచి సెర్చ్ ఆపరేషన్ మొదలుకాగా సుమారు 41 పారామిలిటరీ కంపెనీలు, నాలుగు ఆర్మీ దళాలు, నాలుగు జిల్లాల పోలీసులు, ఒక స్వాట్ టీం, ఒక డాగ స్క్వాడ్ పాల్గొంటున్నాయి. ఉన్నతాధికారులు నేతృత్వంలో ఓవైపు డేరాను మొత్తం జల్లెడ పడుతున్నారు. ఎక్కడిక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కర్ఫ్యూ కొనసాగుతుండగా.. నేటి సోదాలతో చుట్టుపక్కల జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డేరా అనుచరులు అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అస్తి పంజరాలు బయటపడ్డాయన్న విషయాన్ని డేరా వర్గాలు కూడా ధృవీకరించటంతో ఎలాంటి విషయాలు బయటపడతాయోనని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
విజేత జీహెచ్ఎంసీ నార్త్జోన్
జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ మీట్ జింఖానా, న్యూస్లైన్: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ మీట్లో భాగంగా జరిగిన క్రికెట్ మ్యాచ్లో నార్త్ జోన్ జట్టు 4 వికెట్ల తేడాతో హెడ్ఆఫీస్పై నెగ్గింది. అంబర్పేట మైదానంలో శుక్రవారం మొదట బ్యాటింగ్ చేసిన హెడ్ ఆఫీస్ 15 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. రాజారామ్ 23, న ర్సింగ్ రావు 22 పరుగులు చేశారు. ఆదిల్ 3, కార్తీక్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన నార్త్ జోన్ 14.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. కార్తీక్ (35), కిరణ్ కుమార్ (26), గోవర్ధన్ రెడ్డి (18 నాటౌట్) మెరుగ్గా ఆడారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ బౌలర్లు దయానంద్, రఘు చెరో రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు.