Hygiene practices
-
ముంచుకొస్తున్న హెచ్ఎంపీవీ..నఖ శిఖం పరిశుభ్రంగా ఉందామిలా..!
చాలామంది రోజూ ఉదయం బ్రష్ చేసుకోవడం తర్వాత స్నానం మొదలు దేహ పరిశుభ్రతను చకచకా చేస్తుంటారు. ఈ క్రమంలో దేహమంతా శుభ్రమవుతుందో లేదో చూడరు.ఉదాహరణకు స్నానం సమయంలో చెవుల వెనక భాగంలో... చెవి వెనక భాగం తలతో కనెక్ట్ అయ్యే ప్రాంతంలో, మెడ వెనక, చెవుల ముడతల్లో ఇలాంటి చోట్ల శుభ్రమవుతోందా, కావడం లేదా అన్నది చూడరు. రోజువారీ హైజీన్ పాటించకపోతే అది మరికొన్ని ఆరోగ్య సమస్యలకూ, దేహ / చర్మ సమస్యలకు దారితీయవచ్చు. అందులోనూ మరో మహమ్మారి హెచ్ఎంపీవీ(HMPV) వైరస్ చైనా(China)లో కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఆ వైరస్ కేసులు మనదేశంలో కూడా నమోదవ్వుతున్నాయి. ఈ తరుణంలో చక్కటి జాగ్రత్తలతో మన శరీర పరిశుభ్రత పాటించడం ఎలాగో తెలుసుకోవడం కోసమే ఈ కథనం.దేహ పరిశుభ్రత కోసం పళ్లు తోముకోవడం మొదలుకొని, కాళ్లూ, పాదాల శుభ్రత వరకు ఎలాంటి హైజీన్ పాటించాలో చూద్దాం. పైగా ఇప్పుడు కొత్త కొత్త వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయన్న పుకార్లు వ్యాపిస్తున్న తరుణంలో ఆపాదమస్తకం శుభ్రత పాటించడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత జాగ్రత్తలతో మరింత మెరుగైన ఆరోగ్యాన్ని పొందడమే కాకుండా, మరెన్నో వ్యాధులను నివారించుకోవచ్చు కూడా.ప్రతిరోజూ మనందరమూ పొద్దున్నే పళ్లను బ్రష్ చేసుకుంటాం. ఇలా బ్రష్ చేసుకునే టైమ్లో ముందువైపునకే ప్రాధాన్యమిస్తాం. కానీ పలువరసలో అన్నివైపులా శుభ్రమయ్యేలా బ్రష్ ఉపయోగించాలి. అలాగే ఆహారం తీసుకున్న ప్రతిసారీ పళ్లను కొద్దిగా నీళ్లతో నోరు పుక్కిలించాలి. నోరు అనేక సూక్ష్మజీవులకు నిలయం. ఆహారం తీసుకున్న ప్రతిసారీ బ్రషింగ్ చేసుకోవడం కుదరదు కాబట్టి... కొద్దిగా నీటిని నోట్లోకి తీసుకుని పుక్కిలిస్తూ నోరంతా శుభ్రం చేసుకోవడం అవసరం. ఆహారం తీసుకున్న తర్వాత నోట్లో బ్యాక్టీరియా పెరిగేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి ఈ పుక్కిలింతల వల్ల అది నోరు శుభ్రమవుతుంది. ఇక ప్రతిరోజూ ఉదయం, రాత్రి నిద్రపోబోయే ముందు బ్రషింగ్ చేసుకోవడం అవసరమన్నది మనందరికీ తెలిసినప్పటికీ చాలా మంది ఈ నియమం పాటించరన్నది తెలిసిందే. బ్రషింగ్ తర్వాత పళ్లపైనా, చిగుర్లపైనా వేలి చివరలతో గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేసుకుంటున్నట్లుగా రాయాలి. దీనివల్ల చిగుర్లకు రక్తప్రసరణ పెరిగి చిగుర్ల వ్యాధులు నివారితమవుతాయి. పొగాకు వంటివి నమలడం, జర్దాపాన్ వంటివి తినడం, ఖైనీ, గుట్కా, పాన్మసాలాల వంటి దురలవాట్లు నోటి దుర్వాసనతో పాటు శారీరకంగా కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నోటి క్యాన్సర్లు మొదలుకొని ఇతరత్రా అనేక ఆరోగ్య సమస్యలకు తావిస్తాయి. అంతేకాదు... నలుగురిలో మాట్లాడటానికి ఇబ్బందిగా ఉండే వాతావరణాన్ని కలిగిస్తాయి. అలాంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి. మార్కెట్లో దొరికే మౌత్వాష్లతో తరచూ నోరు కడుక్కుంటూ ఉండటం కూడా మంచిదే. ముఖ్యంగా నోటి దుర్వాసనతో బాధపడేవారు తరచూ మౌత్వాష్తో శుభ్రం చేసుకోవడం ఇంకా మంచిది.స్నానం..ప్రతి రోజూ ప్రతివారూ స్నానం చేస్తారు. అయితే చాలామంది దేహం శుభ్రమవుతోందా లేదా అన్నది చూసుకోకుండా యాంత్రికంగా ఈ పని చేస్తుంటారు. ముఖ్యంగా చిన్నారుల్లో (కొందరు పెద్దవాళ్లలనూ) ఈ ధోరణి కనిపిస్తుంది. చాలామంది తమ చెవుల వెనక భాగాలనూ, శరీరంలో మడతపడే చోట్లను శుభ్రం చేసుకునే విషయాన్ని అంతగా పట్టించుకోరు. వాస్తవానికి చర్మం ముడతలు పడే ప్రాంతాలైన కీళ్లు, బాహుమూలాలు, మోకాలి వెనక భాగాలతో పాటు ప్రైవేట్ పార్ట్స్పై కొద్దిగా ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరముంటుంది. తలస్నానం ఎలాగంటే...: తలస్నానం వారంలో రెండుసార్లు చేయడం మంచిది. తలలో చుండ్రు వంటి సమస్యలు ఉన్నవారు రోజు విడిచి రోజు తలస్నానం చేయడమూ మంచిదే. తలస్నానం చేసే ముందర కొందరు తలకు నూనె రాస్తారు. అందరూ తలకు నూనె రాయాల్సిన అవసరం లేదు. కేవలం పొడిబారినట్లు ఉండే చర్మమూ, వెంట్రుకలు ఉన్నవారు మాత్రమే తలస్నానానికి ముందర నూనెతో మృదువుగా మసాజ్ చేసుకోవాలి. జిడ్డుచర్మం ఉండేవారు తలకు నూనె రాయక΄ోయినా పర్వాలేదు. ఆ తర్వాత అదంతా శుభ్రమయ్యేలా మంచి షాంపూతో స్నానం చేయాలి. మైల్డ్ షాంపూ వాడటమే మేలు. కొందరు మెడికేటెడ్ షాంపూలు వాడతారు. అలాంటివి కేవలం డాక్టర్ సలహా మీద మాత్రమే వాడాలి. మరికొన్ని జాగ్రత్తలు... ఆహ్లాదం కలిగించి అనేక ఆరోగ్య సమస్యలను దూరంపెట్టే స్నానం చేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలివి... స్నానానికి ఉపయోగించే నీళ్లు మరీ చల్లగా లేదా మరీ బాగా వేడిగా ఉండకూడదు. చన్నీటి స్నానం మంచిదనేది కేవలం అపోహ. చల్లటి స్నానం వల్ల సైనస్, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారికి చల్లటినీళ్ల స్నానం దాన్ని ట్రిగర్ చేసే అవకాశాలెక్కువ. ఇక మరీ బలహీనంగా ఉన్నవాళ్లుగానీ లేదా వృద్ధులుగానీ మరీ ఎక్కువగా చల్లగా ఉండే నీళ్లతో స్నానం కాని, మరీ ఎక్కువ వేడిగా ఉండే నీళ్లతో స్నానం గానీ చేయడం సరికాదు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో చల్లటి నీళ్లతో స్నానం చేయాల్సి వస్తే... ఆ స్నానం వ్యవధిని వీలైనంతగా తగ్గించడం మంచిది ఒకవేళ చల్లటి నీళ్లతో స్నానం చేయాల్సి వస్తే... దానికి ముందర వార్మప్గా కాస్తంత వ్యాయామం మంచిది కడుపు నిండా తిన్నవెంటనే స్నానం చేయకూడదు. భోజనం తర్వాత రెండు మూడు గంట తర్వాతే స్నానం చేయడం మంచిది. చన్నీళ్లు లేదా వేణ్ణీళ్లతో గానీ స్నానం తర్వాత తలనొప్పి, జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే అది మీ ఆరోగ్యానికి అంతగా సరిపడదని గుర్తుంచుకుని, ఇలాంటివాళ్లు కేవలం గోరువెచ్చటి నీళ్లతో మాత్రమే స్నానం చేయాలి. చెవులసంరక్షణచెవులను చాలా జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. చాలామంది చెవుల వెనక భాగాన్ని శుభ్రం చేసుకోవడం మరచిపోతుంటారు. కానీ స్నానం సమయంలో చెవుల వెనకభాగంతో పాటు... బయటి చెవి (ఎక్స్టర్నల్ ఇయర్ పిన్నా)ను చెవిలోపలివరకూ శుభ్రం చేసుకోవాలి. మన చెవుల్లో వచ్చే గులివి / గుమిలి చెవికి రక్షణ కల్పించడం కోసమే పుడుతుంది. కాబట్టి దాన్ని శుభ్రం చేసుకోడానికి పిన్నీసులు, ఇయర్బడ్స్ లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. చెవి లోపల గువిలి మరీ ఎక్కువగా ఉంటే ‘డీ–వ్యాక్స్’ అనే చుక్కల మందును వేసుకోవాలి. మరీ చెవులు మూసుకుపోయినంతగా గువిలి ఉత్పన్నమవుతుంటే ఈఎన్టీ డాక్టర్(ENT Doctor)ను సంప్రదిస్తే వారే సురక్షితమైన రీతిలో చెవులను శుభ్రం చేస్తారు.ఇయర్బడ్స్ వద్దు : కొందరు ఇయర్ బడ్స్తో తమ చెవులను తరచూ శుభ్రపరుస్తుంటారు. ఏమీ తోచనప్పుడు, ఏ పనీ లేనప్పుడు కూడా చెవుల్లో ఇయర్బడ్ పెట్టుకుని తిప్పేస్తుంటారు. నిజానికి చెవులు తమంతట తామే శుభ్రపరచుకుంటాయి. ప్రకృతి వాటినలా డిజైన్ చేసింది. వాస్తవానికి ఇయర్బడ్స్ వాడినప్పుడు కొన్నిసార్లు గువిలి చెవి లోపలికి ఇంకా లోతుగా వెళ్తుంది. చెవిలోకి ఏదైనా బయటి వస్తువు / పురుగు ప్రవేశించినప్పుడు అడ్డుకుని, చెవిని రక్షించడం కోసమే ఈ గువిలి స్రవిస్తుంటుంది.ఇయర్బడ్స్తో లేదా అగ్గిపుల్లలతో శుభ్రం చేయడం మొదలుపెట్టగానే చెవిలోని గ్రంథులు మరింత ఎక్కువగా గువిలిని స్రవిస్తాయి. దాంతో సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే చెవులను తరచూ శుభ్రపరచుకునే వారిలోనే గువిలి లేదా వ్యాక్స్ ఎక్కువగా స్రవిస్తుంది. కాబట్టి ఇయర్బడ్స్, అగ్గిపుల్లలు, పుల్లలు, పెన్నులు, పిన్నీసులు వంటి వాటితో చెవులను శుభ్రం చేసుకోకూడదు. పిల్లలూ... పదునైన వస్తువులు : కొంతమంది పిల్లలు తమ తెలిసీ తెలియనిదనంతో గుచ్చుకు΄ోయేలా ఉండే వాడిౖయెన / పదునునైన వస్తువులు చెవుల్లో పెట్టుకుంటారు. ఉదాహరణకు పెన్సిళ్లు, పుల్లలు, పెన్నులు, పిన్నులు వంటివి. వాటితో కర్ణభేరి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు కూడా ఉంటుంది. దాంతో భవిష్యత్తులో వినికిడి సమస్యలు రావచ్చు. అందుకే అలాంటి వస్తువుల నుంచి చిన్నారులను దూరగా ఉంచాలి. నూనె పోయకూడదు : చెవులను శుభ్రం చేయడానికి కొందరు కొబ్బరి నూనె, ఆముదం లాంటివి చెవుల్లో పోస్తుంటారు. అలా ఎంతమాత్రమూ చేయకూడదు. అలా చేయడం వల్ల చెవి ఇన్ఫెక్షన్తో పాటు మరెన్నో సమస్యలు రావచ్చు. ఏవైనా సమస్యలుంటే ఈఎన్టీ వైద్యులతో సరైన చికిత్స తీసుకోవాలి.చర్మ సంరక్షణకోసం... కొంతమందిలో చర్మం పొడిబారడం ఓ సమస్యగా మారుతుంది. ఇలాంటివారు తరచూ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ రాసుకోవాలి. వేసవికాలంలో ఈ సమస్య పెద్దగా లేక΄ోయినా చలికాలంలో వారిని మరింతగా బాధపెడుతుంటుంది. అందుకే ఆ సీజన్లో తప్పనిసరిగా రాసుకోవాలి. లేకపోతే చర్మం మీద మంట, దురద వస్తాయి. పొడిచర్మం ఉన్నవారి పైచర్మం దోక్కుపోయినప్పుడు... కిందిచర్మం తేలిగ్గా ఇన్ఫెక్షన్(Infection)కు దారితీయవచ్చు. ఎండలోకి వెళ్లేటప్పుడు అది సీజన్ అయినా సరైన ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ రాసుకోవాలి. దీన్ని ప్రతి మూడు గంటలకోమారు రాసుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు శరీరమంతా కప్పేలా ఫుల్ స్లీవ్స్ వేసుకోవడం మంచిది. ముఖం మీది చర్మం కూడా కవర్ అయ్యేలా స్కార్ఫ్ ధరించడం మేలు ఇక శరీరంప్లై చర్మం ముడుతలు పడి ఉండే మెడ, భుజాలు, బాహుమూలాల వద్ద, తొడలు, గజ్జల వంటి చోట్ల శుభ్రంగా, పొడిగా ఉంచుకోకపోతే అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే స్నానం తర్వాత చర్మం ముడుతలు ఉన్నచోట్ల ప్రత్యేకంగా పూర్తిగా పొడిగా అయ్యేలా టవల్తో తుడుచుకోవాలి.డయాబెటిస్ ఉన్నవారి పాదసంరక్షణకు...ఇవి డయాబెటిస్ ఉన్నవారికే కాకుండా, ఆరోగ్యవంతులు కూడా పాటించడానికి అనువైన నియమాలని గుర్తుంచుకోండి. కాకపోతే డయాబెటిస్ ఉన్నవారికి మరింత మేలు చేస్తాయి. తరచూ తామే స్వయంగా కాలిని పరీక్షించుకుంటూ ఉండాలి. ఇలా చేసే సమయంలో కాలి పైభాగాన్నీ నిశితంగా పరీక్షించుకోవడం వీలవుతుంది. కానీ కిందనుండే పాదం భాగం కనిపించదు కాబట్టి దాన్ని పరిశీలించడానికి పాదాల కింద అద్దం పెట్టి చూసుకోవాలి. అలాగే కాలి వేళ్ల మధ్య భాగాలనూ అంతే నిశితంగా పరీక్షించుకుంటూ ఉండాలి. మొత్తం కాలిభాగంలో ఏ చిన్న పొక్కులాంటిది ఉన్నా దాన్ని విస్మరించకూడదు. భవిష్యత్తులో అది పుండుగా మారే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారిలో పుండ్లు పడటం వల్ల గ్యాంగ్రీన్ ఏర్పడితే ఒక్కోసారి పూర్తి పాదాన్ని, కాలిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పాదాలను ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. రోజూ కాళ్లు కడుక్కున్న తర్వాత వెంటనే పూర్తిగా పొడిగా అయ్యేలా తుడుచుకోవాలి. కాలి వేళ్ల మధ్య కూడా పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా పొడిబారడం కోసం కాలివేళ్ల మధ్య పౌడర్ రాసుకోవడం మంచిది. మరీ వేడి వస్తువులూ, పదార్థాల నుంచి కాళ్లను దూరంగా ఉంచుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు హాట్ వాటర్ బ్యాగ్తో కాళ్లకు కాపడం పెట్టుకోక΄ోవడమే మంచిది. పాదాలను మృదువుగా ఉంచుకోవాలి. ఇందుకోసం కాళ్లు కడుక్కున్న తర్వాత పొడిగా తుడుచుకొని, ఆ తర్వాత వాజిలైన్ను కాలికీ, వేళ్లకూ మధ్య రుద్దుతూ, ఆ వాజిలైన్ తడిదనం, జిడ్డుదనం పోయేలా పూర్తిగా పొడిబారేంతవరకు మృదువుగా రుద్దాలి. అలా ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. కాళ్ల మీద పులిపిరి కాయలూ, కాలి కింద ఆనెకాయల్లాంటివి ఏవైనా ఏర్పడితే వెంటనే డాక్టర్కు చూపించుకోవాలి. కాలిగోళ్లను క్రమం తప్పకుండా తొలగించుకోవాలి. ఇలా చేసేటప్పుడు గోళ్లను మరీ లోపలికి కట్ చేసుకోకూడదు. అలాంటప్పుడు ఒక్కోసారి గోరు మూలల్లో రక్తం వచ్చేంతగా గోరు కట్ కావచ్చు. అలా జరిగిన కొందరిలో గోరు లోపలి వైపునకు పెరగవచ్చు. ఇది డయాబెటిస్ రోగుల్లో చాలా ప్రమాదం. కాలికి చెప్పులు, బూట్లు వంటి పాదరక్షలు లేకుండా నడవకూడదు. ఇవి కూడా కాలికి చాలా సౌకర్యంగా ఉండాలి. ఏమాత్రం అసౌకర్యం ఉన్నా ఆ పాదరక్షలు వాడకూడదు. ఎందుకంటే మన సొంత పాదరక్షల వల్ల ఏదైనా చిన్నపాటి గాయం అయినా మళ్లీ అదే గాయం రేగి ఎప్పటికీ మానక΄ోతే అది గ్యాంగ్రీన్గా మారే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్ బాధితుల్లో దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇంట్లో కూడా పాదరక్షలు లేకుండా నడవకండి. ప్రత్యేకంగా తడి, తేమలో పనిచేసే మహిళలు (ఆమాటకొస్తే పురుషులు కూడా) స్లిప్పర్స్ వంటివి తొడుక్కునే తమ రోజువారీ ఇంటి పనులు చేసుకోవడం మంచిది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులైతే కనీసం ఏడాదికోసారి ఆర్థోపెడిక్ లేదా మెడికల్ స్పెషలిస్ట్ వంటి కాలి వైద్య నిపుణులకు చూపించుకుంటూ ఉండాలి.చేతుల పరిరక్షణఆహారం తీసుకునే ముందర చేతుల్ని తప్పనిసరిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇక మూత్ర, మల విసర్జన తర్వాత (అంటే వాష్రూమ్కు వెళ్లి వచ్చాక) రెండు చేతులనూ తప్పనిసరిగా శుభ్రంగా కడుక్కోవాలి. దీనికో కారణముంది. వాష్రూమ్ తలుపు తెరిచే సమయంలో ‘నాబ్’ను చాలామంది ముట్టుకుంటారు. వాళ్ల చేతుల్లో ఏవైనా బ్యాక్టీరియల్, వైరల్, ఏకకణజీవుల వంటి పరాన్నజీవులు ఉంటే... వారు ముట్టుకున్న చోటిని మళ్లీ మనం ముట్టుకోవడం వల్ల మనకూ ఆ వైరస్, బ్యాక్టీరియా, ఏకకణజీవులు సంక్రమించవచ్చు. ఇలా జబ్బు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడాన్ని ‘ఫోమైట్ ట్రాన్స్మిషన్’గా చెబుతారు. ఇలా ఈ మార్గంలో వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున వాష్రూమ్కు వెళ్లివచ్చాక తప్పక చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కాళ్లు / పాదాల శుభ్రత...కాళ్లు లేదా పాదాలకు సమస్య వచ్చినప్పుడు తప్ప వాటి ఉనికినే మనమెవరమూ గుర్తించం. ప్రతిరోజూ పాదాలను పరీక్షించుకుంటూ ఉండటం అవసరం. మరీ ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడేవారైతే... రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పాదాలు, మడమలు శుభ్రంగా ఉన్నాయా లేక ఏవైనా పగుళ్లు ఉన్నాయా అన్నది పరీక్షించుకోవాలి. పాదాలపై పుండ్లుగానీ, ఇన్ఫెక్షన్లుగానీ, పగుళ్లుగానీ ఏర్పడకుండా సంరక్షింకుంటూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాదాలు కడుక్కున్న తర్వాత అవి పూర్తిగా ΄÷డిగా మారేలా తుడుచుకోవాలి. కాలివేళ్ల గోళ్లు తీసుకుంటూ ఉండాలి.గోళ్లను..గోళ్లను క్రమం తప్పకుండా ట్రిమ్ చేసుకోవాలి. అంటే గోరు చివరకంటా కత్తిరించకుండా, కొద్దిపాటి గోరంచు ఉండేలా ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గోళ్లలో మట్టి చేరదు. ఇలా మట్టిచేరకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవడం వల్ల మనం భోజనం చేసే సమయంలో గోళ్ల ద్వారా ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది. (చదవండి: నిజమైన ప్రేమ అంటే ఇది కదా..!) -
ఈ బాధలు ఎప్పటికీ తీరేను.. పాలకులు పట్టించుకోరా?
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 2013 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ‘ప్రపంచ టాయిలెట్ దినోత్సవం’ జరుపుకుంటున్నా నేటికీ ప్రపంచంలో 350 కోట్ల ప్రజలకు టాయిలెట్ (మరుగుదొడ్డి) సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. టాయిలెట్ సౌకర్యలేమి కారణంగా ముఖ్యంగా మహిళలు, పిల్లలు, బాలికలు... తీవ్రమైన మానసిక, ఆరోగ్య, సామాజిక సమస్యలకు గురవుతున్నారు. అనేక పాఠశాలలు, పరిశ్రమలు, ఇతర పని ప్రదేశాల్లో సరైన టాయిలెట్ సదుపాయాలు, మంచినీటి సౌకర్యం వంటివి లేకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా 41.9 కోట్లమంది బహిరంగ మలవిసర్జన చేస్తున్నారనీ, సుమారు 220 కోట్లమంది ప్రజలకు మంచినీటి సౌకర్యం లేదనీ, 11.5 కోట్లమంది కుంటలూ, చెరువులు, బావులు వంటి వాటిలోని సురక్షితం కాని నీరు తాగుతున్నారనీ గణాంకాలు చెబుతున్నాయి. సరైన మంచినీరు, శానిటేషన్, ఆరోగ్య సదుపాయాలు లేకపోవడంతో ప్రతిరోజూ వెయ్యి మంది ఐదేళ్ల లోపు పిల్లలు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక మన భారతదేశంలో 2019–21లో విడుదలైన ఒక నివేదిక ప్రకారం 69.3 శాతం మంది మాత్రమే మరుగుదొడ్ల సౌకర్యాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నేటికీ 19.4 శాతం మంది మనదేశంలో బహిరంగ మలవిసర్జన చేస్తున్నారు. 2014 అక్టోబర్ 2వ తేదీన దేశ వ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్ మిషన్‘ ప్రారంభించినా నేటికీ అందరికీ టాయిలెట్ సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు.చదవండి: మలబద్ధకంతో మహాబాధ... నివారణకు ఇలా చేయండి!మనదేశం త్వరలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా ఆవిర్భవించాలనే లక్ష్యాలను నిర్దేశించుకుంది. కనీసం ప్రజలందరికీ టాయిలెట్ సౌకర్యం కల్పించకుండా ఇది సాధ్యంకాదు. అందుకే ప్రభుత్వాలు ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలి.– ఐ. ప్రసాదరావు; ఉపాధ్యాయుడు, కాకినాడ (నవంబర్ 19న ప్రపంచ టాయిలెట్ దినోత్సవం) -
ఆహార శుభ్రతకు ‘స్విగ్గీ సీల్’
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ తన వినియోగదారులకు కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. నిత్యం డెలివరీ చేసే ఆహారం పరిశుభ్రత, నాణ్యతను ధ్రువపరిచేలా ‘స్విగ్గీ సీల్’ పేరిట కొత్త సేవలు ప్రారంభించింది. ప్రస్తుతం పుణెలో ఈ సర్వీసు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలను 650 నగరాలకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.రెస్టారెంట్లలో తయారు చేస్తున్న ఆహారం శుభ్రత పట్ల అనుమానాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు పరిశుభ్రత పట్ల హామీ ఇచ్చేలా ‘స్విగ్గీ సీల్’ ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు. ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, మెరుగైన ప్యాకింగ్ ప్రమాణాలు అనుసరించే రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్కోర్టులకు ఈ స్విగ్గీసీల్ బ్యాడ్జ్ను జారీ చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా కస్టమర్ల ఫీడ్బ్యాక్ను పరిగణలోకి తీసుకుంటామన్నారు. పరిశుభ్రతకు సంబంధించి రెస్టారెంట్లో ఆడిట్ నిర్వహించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) గుర్తింపు పొందిన ఏజెన్సీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని చెప్పారు. రెస్టారెంట్లకు అందుబాటు ధరలోనే ఈ ఆడిట్ సేవలు ఉంటాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: దేశంలో మరో ‘యాపిల్’ తయారీదారు!వివిధ రెస్టారెంట్లలో పరిశుభ్రతకు సంబంధించి 70 లక్షల మంది యూజర్ల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఈ సేవలు ప్రారంభించినట్లు స్విగ్గీ తెలిపింది. ఈ సీల్ గుర్తింపు తీసుకున్న ఫుడ్ తయారీదారులు నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ఒకవేళ భవిష్యత్తులో కస్టమర్ల నుంచి సదరు రెస్టారెంట్ సేవలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులు వస్తే బ్యాడ్జ్ను తొలగిస్తామని కంపెనీ తెలిపింది. ఈ సేవల వల్ల వినియోగదారులకు, రెస్టారెంట్లకు మేలు జరుగుతుందని వివరించింది. -
‘కరోనా’ అలవాట్లకు గుడ్బై.. భారీ దెబ్బే!
Hygiene Products Business Fall After Vaccination In India: కరోనా టైంలో అలవర్చుకున్న ఆరోగ్య సూత్రాలకు, శుభ్రతా అలవాట్లకు జనాలు గుడ్బై చెప్పేస్తున్నారా?!. కొవిడ్ పూర్వ అలవాట్లకు మళ్లుతున్నారు. తగ్గుతున్న హైజీన్, రోగ నిరోధక ఉత్పత్తుల అమ్మకాలు, ఆయా సెగ్మెంట్స్ నుంచి కంపెనీలు తప్పుకుంటున్న వైనం పరిస్థితి అదేనని చెప్తోంది. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ప్రజల్లో పరిశుభ్రత, ఆరోగ్య సూత్రాలు పాటించడం, రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రాధాన్యమివ్వడం పెరిగింది. మాస్క్ల మొదలు.. శానిటైజర్లు, ఫ్లోర్ క్లీనర్లు, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారోత్పత్తులు.. తదితర అమ్మకాలు భారీగా జరిగాయి. పాత తరం ఫుడ్డు, అలవాట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ప్రజలు కొత్త(పాత) జీవన విధానానికి క్రమంగా అలవాటు పడిపోతున్నారని, రానున్న రోజుల్లో ఇదే కొనసాగిస్తారనే అభిప్రాయం ఏర్పడింది. కానీ.. కొన్నాళ్లుగా టీకాల ప్రక్రియ వేగవంతమవుతుండటం, ఎకానమీలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి జోరందుకుంటూ ఉండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలు కోవిడ్ పూర్వ అలవాట్లకు క్రమంగా మళ్లుతున్నారు. హైజీన్ (పరిశుభ్రత), ఆరోగ్య సంరక్షణ, ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ ప్రొడక్టుల ఉత్పత్తుల అమ్మకాలు మార్కెట్లో తగ్గుతుండటమే ఇందుకు నిదర్శనం. దీనితో గంపెడు ఆశలు పెట్టుకున్న కంపెనీలు..ఈ విభాగాల నుంచి శాశ్వతంగా తప్పుకోవడమో లేదా ఆయా ఉత్పత్తుల తయారీని తగ్గించుకోవడమో చేస్తున్నాయి. ఈ–కామర్స్ వంటి అత్యధిక వృద్ధి అవకాశాలు ఉండే మాధ్యమాల్లో కూడా అమ్మకాలు దాదాపు సున్నా స్థాయికి తగ్గిపోవడం మరో విశేషం. కంపెనీలు వెనక్కి.. శానిటైజర్లు, క్లీనర్ల ఉత్పత్తులకు సంబంధించి కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. డాబర్, పార్లే ప్రోడక్ట్స్, ఇమామి వంటి కంపెనీలు ఇప్పటికే హ్యాండ్ శానిటైజర్ విభాగం నుంచి తప్పుకున్నాయి. ఇమామీ నెమ్మదిగా డిస్ఇన్ఫెక్టెంట్ ఫ్లోర్ క్లీనర్లు, సర్ఫేస్ శానిటైజర్లు, డిష్ వాష్ జెల్ లాంటి సెగ్మెంట్ల నుంచి కూడా తప్పుకుంటోంది. ‘మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా ఈ ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగానే ఉంటాయన్న అంచనాలు అన్నీ తప్పుతున్నాయి. వినియోగదారులు నెమ్మదిగా మల్లీ కోవిడ్ పూర్వ జీవన విధానాలకు మళ్లుతున్నారు. వీటి వినియోగం దారుణంగా తగ్గిపోయింది’ అని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇక చ్యవన్ప్రాశ్ మినహా మిగతా ఉత్పత్తుల తయారీని గణనీయంగా తగ్గించుకున్నట్లు ఇమామి సంస్థ వర్గాలు వెల్లడించాయి. హెచ్యూఎల్ ఆశాభావం.. ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ కూడా హ్యాండ్ శానిటైజర్లు, హ్యాండ్ వాష్ల విక్రయాలు గణనీయంగా తగ్గినట్లు వెల్లడించింది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు కొత్త అలవాట్లను కొనసాగించగలరని ఆశాభావం వ్యక్తం చేసింది. చిరువ్యాపారులకు తప్పట్లేదు బడా కంపెనీల విషయంలోనే కాదు.. చిరువ్యాపారులకు సైతం ఈ ఇబ్బందులు తప్పట్లేదు. పండ్లు, డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసుల దుకాణాలు కరోనా టైంలో చేసిన భారీ బిజినెస్లో ఇప్పుడు సగం కూడా చేయట్లేదు. దీంతో చాలా వరకు దుకాణాలు మూతపడుతున్నాయి. రోడ్ సైడ్ వెండర్లదీ ఇంతకన్నా దీనస్థితి. మరోవైపు మాంసం అమ్మకాలు సైతం కిందటి ఏడాదితో పోలిస్తే 30 శాతానికి పడిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. చదవండి: దేశంలో భారీగా పెరిగిన ఆదాయ అసమానతలు -
OCD Wife: నావల్లకాదు మహప్రభో.. దయచేసి విడాకులిప్పించండి!
A software professional in Bengaluru wants divorce from his wife over her obsession with cleanliness: ఈ ఇల్లాలు శుభ్రతకు బ్రాండ్ అంబాసిడరయ్యి ఉంటుంది. భర్త ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్ను చక్కగా వాషింగ్ పౌడర్ వేసిమరీ శుభ్రంగా కడిగింది. పాపం సాఫ్ట్వేర్ భర్త విసిగి వేసారిపోయి ఇక నా వళ్లకాదని విడాకులిప్పించమని పోలీసులను ప్రాధేయపడిన సంఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే.. బెంగుళూరులోని ఆర్టీ నగర్ కాలనీకి చెందిన రాహుల్, సుమనా (పేర్లు మార్చాం) 2009లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. వివాహానంతరం వృత్తిరిత్యా ఇంగ్లాండ్, యూకేకు వెళ్లాడు. తిరిగొచ్చేనాటికి వాళ్లు కాపురముంటున్న ఇల్లు అద్దంలా మెరిసిపోతుంది. రాహుల్ చూసి చాలా సంతోషించాడు కూడా! సరదాగా సాగిపోతున్నవీరి కాపురంలో రెండేళ్ల తర్వాత మొదటి సంతానం కలిగింది. ఇక అప్పటి నుంచి కాపురంలో కలతలు మొదలయ్యాయి. అప్పుడే ఆమెలో ఉన్న అబ్సెసీవ్ కంపల్సీవ్ డిజార్డర్ (ఓసీడీ) భయటపడింది. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన సుమనా అతిశుభ్రత అలవాట్లు భర్తను విపరీతంగా విసిగించాయి. ప్రతిరోజూ ఆఫీస్ నుంచి రాగానే బూట్లు, దుస్తులు, మొబైల్ ఫోన్లను శుభ్రం చేయమని భర్తను బలవంతం చేసేది. ఈ జంట తరచూ ఫామిలీ కౌన్సెలింగ్ తీసుకుంటూ ఉండేవారు. రెండో సంతానం కలిగాక పరిస్థితికాస్త మెరుగుపడినా కోవిడ్ లాక్డౌన్ కాలంలో ఆమె ఓసీడి సమస్య వారికాపురంలో మరోమారూ కలతలు రేపింది. ఇంట్లో ప్రతివస్తువును శానిటైజ్ చేయడం మొదలు పెట్టింది. లాక్డౌన్లో భర్త వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న సమయంలో అతని ల్యాప్టాప్, సెల్ఫోన్లను డిజర్జెంట్తో శుభ్రం చేసింది. అంతేకాదు రోజుకు ఆరు కంటే ఎక్కువ సార్లు స్నానంచేసేదట, స్నానం సబ్బును శుభ్రం చేసేందుకు మరో మరో ప్రత్యేకమైన సబ్బును కూడా వాడేదని రిపోర్టులో భర్త పేర్కొన్నాడు. చదవండి: కల్లుచెదిరే వజ్రాల గొడుగు.. 12 వేల డైమండ్లు.. ధరెంతో తెలుసా? ఆశ్యర్యమేమంటే.. భర్త తల్లి (అత్తగారు) మరణిస్తే భర్త, పిల్లలను ఏకంగా 30 రోజులపాటు ఇంటిబయటే ఉంచి, ప్రతిరోజూ ఇంటిని శుభ్రంచేస్తూ ఉండేది. ఐతే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పిల్లల్ని కూడా యూనీఫాం, బూట్లు, బ్యాక్ ప్రతిరోజూ శుభ్రం చేయవల్సిందిగా పోరు పెట్టడంతో తాజాగా ఈ విషయం వెలుగుచూసిందని కౌన్సిలర్ బీఎస్ సరస్వతి చెప్పారు. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన టెక్కీ తన పిల్లలతో పాటు తల్లిదండ్రుల ఇంటికి మారాడు. అతని భార్య పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయాన్ని పరిహార్కు బదిలీ చేశారు. నవంబర్లో మూడు సార్లు కౌన్సెలింగ్లు నిర్వహించినా ఫలితంలేకపోయింది. సుమనాకు ఓసీడీ ఉందని, తన ప్రవర్తనను సరిచేసుకోమని కౌన్సెలర్ ఆమెకు తెల్పగా.. ‘ఇది చాలా సాధారణం నాకు అలాంటిదేమీ లేదని' కొట్టిపారేసింది. అంతేకాదు భర్త తనను వదిలించుకొని మరో వివాహం చేసుకోవలనుకుంటున్నట్లు, అతనిపై వేధింపుల ఫిర్యాదును కూడా నమోదు చేసినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. చదవండి: వామ్మో! మామూలోడు కాదుగా.. 24 నిముషాల్లో అన్ని బర్గర్లు తిన్నాడా? -
వరల్డ్ టాయిలెట్ డే: ఇలాంటి రోజు ఒకటుందా అనుకుంటున్నారా?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం..వినడానికి వింతగా ఉన్నా ఇలాంటి ఒక రోజు ఉంది. శానిటైజేషన్ ప్రాముఖ్యతపై అవగాహనే దీని ఉద్దేశం.2001 నవంబర్ 19న సింగపూర్కు చెందిన జాక్ సిమ్ నేతృత్వంలోని వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ దీన్ని ప్రారంభించింది. తదనంతరం నవంబర్ 19న వరల్డ్ టాయిలెట్ డే ప్రకటించారు ఆయన. తరువాత నవంబర్ 19న వరల్డ్ టాయిలెట్ డే జరపాలని అధికారికంగా ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఈ మేకు 2013, జూలై 24న యూఎన్ జనరల్ అసెంబ్లీ 67వ సెషన్లో 122 దేశాలు ఈ తీర్మానాన్ని ఆమోదించాయి ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం 2021 థీమ్ “టాయిలెట్లకు విలువ ఇవ్వడం”. ఈ సందర్భంగా ఆసక్తికర వీడియో మీ కోసం.. -
ఆలయాల్లో... అందుకే... జ్వాలాతోరణం
సన్నిధి అద్వైతసిద్ధికి, అమరత్వ లబ్ధికి అసలైన విలాసం కార్తికం. చాంద్రమానం ప్రకారం సంవత్సరంలోని ఎనిమిదో మాసంగా కార్తికం మానవాళికి కొంగుబంగారం. సకల చరాచర జగత్తును వృద్ధి చేసే లక్ష్మీపతి, లయం చేసే శంకరుడు - ఏకోన్ముఖులై జీవజాలాన్ని ఆదుకునే గొప్ప సమయమిది. శివకేశవులు అభేదమనే నినాదం... పర్యావరణమే ప్రపంచానికి రక్ష అనే విధానం... ఆరోగ్య సూత్రాలు పంచివ్వగల దివ్యసందేశం.. కార్తికం నిండుగా అల్లుకున్నాయి. అందుకే ఏ మాసానికీలేని ప్రత్యేకత దీనికే సొంతం. శివకేశవులిద్దరినీ ఏకకాలంలో ఆరాధించి ముక్తిని పొందేందుకు కార్తికం గొప్పవరం. పున్నమి చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపాన సంచరిస్తాడు గనుకే దీనికి కార్తికమాసం అని పేరొచ్చింది. కార్తికంలో శివుడు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్య ముఖాలుగా ఉదయసంధ్య నుంచి ప్రదోష కాలం వరకూ 5 రూపాలతో భక్తుల్ని అనుగ్ర హిస్తాడు - బోళాశంకరుడు. పున్నమినాడు జ్వాలాతోరణం కార్తికమాసంలో పున్నమినాడు శివాలయాలలో జ్వాలా తోరణోత్సవాన్ని నిర్వహించడం ఆచారం. ఇలా మండుతున్న జ్వాలాతోరణం కింది నుంచి భక్తులు ఆనందోత్సాహాలతో పరుగు పెడతారు. ఇలా చేయడం వల్ల సకల పాపాలూ నివారణ అవుతాయని విశ్వాసం. జ్వాలాతోరణం ఎందుకు నిర్వహిస్తారో తెలుసుకుందాం. క్షీరసాగరమథన సమయంలో ముందుగా హాలాహలం వెలువడుతుంది. లోకాలనన్నింటినీ కబళించేలా ఆ హాలాహలం శరవేగంతో దూసుకుపోతుండడంతో దానిని ఉండగా చేసుకుని శివుడు మింగబోతాడు. అయితే దాన్ని తాను మింగితే ఉదరంలో ఉన్న లోకాలన్నీ నశిస్తాయి కాబట్టి కంఠంలోనే ఉంచుకుంటాడు. అందుకే ఆయన నీలకంఠుడు, గరళకంఠుడు అయ్యాడు. అయితే పతి ఎంత శక్తిమంతుడైనప్పటికీ, సతికి తన భర్తకు ఏమైనా హాని కలుగుతుందేమోననే బాధే కాబట్టి పార్వతీ దేవి ఆ విషం తాలూకు వేడిబాధలను చల్లార్చమని అగ్నిదేవుణ్ణి ఆరాధించింది. తన జ్వాలలు పరమేశ్వరుడికి ఏ మాత్రం బాధ కలిగించకుండా అగ్నిదేవుడు చల్లారిపోయాడు. అందుకు ప్రతీకగా పార్వతీదేవి అగ్ని స్వభావం గల కృత్తికా నక్షత్రానికి సంకేతమైన కార్తిక మాసంలో పౌర్ణమినాడు జ్వాలాతోరణం ఏర్పాటు చేసి, దాన్ని భర్తతో కలిసి తాను దాటింది. ఆ మంటల నుంచి ఉపశమనం కలిగించడానికే శివుణ్ణి మనం నీటితోనూ, పంచామృతాలతోనూ అభిషేకిస్తుంటాం. మరో కథనం మేరకు శివుడి రేతస్సును అగ్నిదేవుడు భరించలేక, గంగానదిలో పడవేస్తాడు. దాన్ని గంగ కూడా భరించలేక, ఒడ్డున ఉన్న రెల్లు గడ్డిలో వదిలింది. ఆ రేతస్సు నుంచి కుమారస్వామి జన్మించి, శరవణ భవుడయ్యాడు. శివుడికి పుట్టిన కుమారుడి చేతిలో తప్ప ఇతరులెవరి చేతిలోనూ మరణం సంభవించకుండా వరం పొందిన తారకాసురుడు ఇది తెలుసుకుని, ముందు జాగ్రత్తగా ఆ రెల్లు వనాన్ని అంతా తగులబెట్టించాడు. అయితే కుమారస్వామికి ఏ హానీ జరగలేదు. కారణజన్ముడైన కుమారస్వామిని అగ్ని ఏమీ చేయకుండా సురక్షితంగా ఉంచాడు. దానికి గుర్తుగా శివాలయాలలో కుమారస్వామి జన్మనక్షత్రమైన కృత్తికా నక్షత్రం వస్తుంది కాబట్టి కార్తిక పున్నమినాడు జ్వాలాతోరణం జరుపుతారు. జ్వాలాతోరణం నుంచి మూడుసార్లు వెళితే మహాపాపాలు హరిస్తాయనీ, గ్రహాల అననుకూలతలు తొలగి, భగవంతుని అనుగ్రహం లభిస్తుందనీ భక్తుల విశ్వాసం. గౌరీశంకరుల పల్లకి జ్వాలా తోరణం కింది నుంచి మూడుసార్లు వెళ్లిన తరువాత ఆ తోరణానికి మిగిలిన ఎండుగడ్డిని, సగం కాలిన గడ్డిని కూడా రైతులు గడ్డివాములలో కలుపుతారు. ఆ వాములలోని గడ్డిని మేసిన పశుసంతతి బాగా అభివృద్ధి చెందుతుందనీ, ధాన్యానికి లోటుండదనీ నమ్మకం. శివకేశవుల చిత్తాన్ని గెలిచే ఉపాయం కార్తికదీపం పేరిట ఈ మాసంలో వెలిగించే ప్రతీ జ్యోతీ అజ్ఞాన తిమిరాలను ఆవలకు నెట్టి, విజ్ఞాన రేఖలను విరబూయిస్తుంది. ఈమాసంలో ప్రతిరోజూ దీపం వెలిగించడం మోక్షప్రదం. ముత్తయిదువలంతా కార్తిక దీపాలతో తమ కుటుంబాల్లో వెలుగు నింపే పుణ్యకాలమిది. ఈ దీపాల్ని కృత్తికా నక్షత్రానికి ప్రతీకలుగా భక్తులు తలుస్తారు. శివాలయాల్లో ఆకాశదీపాలు, కార్తిక శుక్లపక్ష పున్నమి నాటి జ్వాలాతోరణాలు దర్శిస్తే జన్మజన్మల పాపాలు పటాపంచలవుతాయని ‘కార్తిక పురాణం’ చెబుతోంది. కార్తికమాసంలో తమిళనాడులోని అరుణాచలంలో కొన్ని వందల టన్నుల ఆవునేతిలో, లేదంటే నువ్వులనూనెలో కొన్ని వందల బేళ్ల పత్తిని, నూలు వస్త్రాలను తడిపి అరుణగిరిపై వెలిగించే దీపానికే కార్తీక జ్యోతి అని పేరు. ఈ జ్యోతి కొన్ని రోజులపాటు వెలుగుతూ గిరిప్రదక్షిణ చేసేవారికి దారి చూపుతుంది. ఈ కమనీయ దృశ్యం చూడడం కోసమే చాలామంది కార్తికపున్నమికి అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేస్తుంటారు. కార్తిక పున్నమి నాడు ఏం చేయాలి? చాంద్రమానాన్ని అనుసరించి, ఏ మాసంలోనైనా ఆ మాసపు సంపూర్ణ శక్తి, మహత్తు పున్నమి నాడు ఉంటాయి. కాబట్టి, ఆ మాసమంతా చేయలేకపోయినా, కనీసం పున్నమినాడు సదాచారాన్ని పాటిస్తే మాసమంతా చేసిన ఫలం లభిస్తుందని పెద్దలు చెబుతారు. కార్తీకమాసంలో పౌర్ణమినాడు ప్రాతఃకాలానే లేచి, సముద్రం, నది, కాలువ, మడుగు, ఏరు, బావి, లేదా అందుబాటులో ఉన్న కుళాయి నీటిలో అయినా సూర్యోదయానికి ముందే స్నానం చేసి, దీపారాధన చేసి, పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శివాలయానికి వెళ్లి, 365 వత్తులతో దీపారాధన చేసి, రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. స్నాన, దాన, దీప, అర్చన, ఉపవాస, ఆరాధన, అభిషేక విధులనేవి దేనికది ఫలప్రదం కాబట్టి కనీసం మనం చేయగలిగే కొన్నింటినైనా ఎంచుకుని, వాటిని నిష్ఠగా ఆచరించడం వల్ల కూడా పరమేశ్వరానుగ్రహానికి నోచుకోవచ్చు. - పూర్ణిమా భాస్కర్