Indian culture and traditions
-
మహా కుంభమేళాలో తెలుగు కీర్తి
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక కుంభమేళా. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాకు సర్వం సన్నద్దమైంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో ఈనెల 13 నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు అంటే 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగరాజ్ వేదికగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమయ్యాయి. ఇందులో భాగంగా భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మణిపూరి, సిత్రియా తదితర నాట్యాలతో పాటు సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు దేశవ్యాప్తంగా 160 మంది నృత్యకాళాకారులను ఎంపిక చేశారు. వీరిలో హైదరాబాద్కు చెందిన నలుగురు ఉండటం విశేషం. పద్మశ్రీ, ఎస్ఎన్ఏ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి, పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఆనంద శంకర్ జయంత్, కేంద్ర సంగీత నాటక అకాడెమీ పురస్కార గ్రహీత దీపికా రెడ్డి, ఎస్ఎన్ఏ అవార్డు గ్రహీత కళాకృష్ణ మహా కుంభమేళాలో నృత్య ప్రదర్శన చేయనున్నారు. ‘శివోహం’తో ఆనంద ‘శివోహం’ ఇతివృత్తంతో లక్షలాది మంది భక్తులను అలరించనున్నారు పద్మశ్రీ గ్రహీత ఆనంద శంకర్ జయంత్. దశబ్థాలుగా భరతనాట్యంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న ఆనంద శంకర్ జయంత్ 144 ఏళ్ల మహా కుంభమేళాలో తెలుగు వారిలో తొలి ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘గణేశ తాళనం, స్కంధ మయుర, దేవీ ఉపాసకం, శివోహం’లపై 45 నిమిషాల పాటు 17మంది నృత్య కళాకారులతో కలిసి ఆమె నాట్యమాడనున్నారు. ఇటువంటి మహోత్సవాల్లో ప్రదర్శన ఇవ్వడం అనేది జన్మధన్యంగా భావిస్తున్నారు భారతనాట్య నృత్య కళాకారిణి ఆనంద శంకర్ జయంత్. ‘శివసతాయం’తో దీపికా రెడ్డి ‘కూచిపూడి కళ కోసం జీవితాన్ని అంకితం చేశా’అనే మాట ముమ్మాటికీ నిజం అంటారు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్ పర్సన్’దీపికా రెడ్డి. నాట్యమే ఊపిరిగా అనేక ప్రదర్శనలు ఇచ్చిన దీపికా రెడ్డి మహా కుంభమేళాలో ఆమె తన ప్రదర్శనను ఇవ్వనున్నారు. ‘శివ సతాయం’అనే థీంతో దాదాపు 50 నిమిషాల పాటు 12మంది నృత్య కళాకారులతో కలిసి ప్రదర్శన చేయనున్నారు. ఈ నృత్యం ద్వారా గంగ అవతరణ, గంగ ద్వారా అందరికీ మంచి జరగాలనే కాన్సెప్ట్తో ఈనెల 26వ తేదీన దీపికా రెడ్డి మహా కుంభమేళాలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘శివపల్లవి’తో కళాకృష్ణ తెలుగు సాంప్రదాయ నృత్యాలైన ఆంధ్ర నాట్యం, పేరిణి వంటి వాటిలో ప్రపంచస్థాయిలో విశేష ఆదరణ సొంతం చేసుకున్న కళాకారుడు కళాకృష్ణ. ఎస్ఎన్ఏ అవార్డుతో పాటు, రాష్ట్రప్రభుత్వం పలు అవార్డులతో ఆయనను సత్కరించింది. 24.02.2025 న మహా కుంభమేళాలో ‘శివపల్లవి’థీంతో ఐదుగురుతో కలిసి ప్రదర్శన చేయనున్నారు. గంగ, పంచముఖస్త్రోత్రాలు, నీలకంఠ మహాదేవ కీర్తన ఈ మూడు అంశాలను 30 నిమిషాల్లో కళ్లకు కట్టినట్లుగా తన అపారమైన అనుభవంతో కుంభమేళాలో భక్తులను అలరించనున్నారు. ‘నమామి గంగే’తో పద్మజా రెడ్డి కూచిపూడి నృత్యంతో కళాప్రపంచంలో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి ఈ మహాకుంభా మేళాలో నృత్యప్రదర్శన చేయనున్నారు. దాదాపు 3వేలకు పైగా ప్రదర్శనలు ఇచి్చన పద్మజా రెడ్డి ‘ప్రణవ్’ఇన్స్టిట్యూట్ ద్వారా అనేక మందికి నృత్యాన్ని పరిచయం చేస్తున్నారు. 10.02.2025న 30 నృత్యకళాకారులతో కుంభమేళాలో ‘నమామి గంగే’అనే థీంతో ప్రదర్శన చేయనున్నారు. ఇటీవల కాలంలో గంగానది కలుíÙతానికి గురైంది, గంగను ఎలా పరిరక్షించుకోవాలి, భావితరాలకు గంగ ప్రాముఖ్యతను వివరించాలనే అంశాలపై సుమారు గంట పాటు ‘నమామి గంగే’అనే ఇతివృత్తంతో అక్కడ ప్రదర్శన ఇవ్వనున్నారు. -
India with Jessica: ఎక్కడో పుట్టి... ఎక్కడో పెరిగి
మన దేశంలో పుట్టిన చాలామందికి హిందీ మాట్లాడటం రాదు. కొంతమందికి అర్థమైనప్పటికీ మాట్లాడలేరు. అమెరికా నుంచి వచ్చిన జెస్సికా మాత్రం హిందీలో అనర్గళంగా మాట్లాడేస్తుంది. ఇలా పలకాలి అని హిందీ పాఠాలు కూడా చెబుతోంది. మనదేశానికి వచ్చే విదేశీయులకు హిందీతోపాటు సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేస్తూ నెటిజనుల మన్ననలను అందుకుంటోంది ఈ ‘బిహారీ బహూ’. పదిహేడేళ్లుగా ఇండియాతో చక్కని బంధాన్ని కొనసాగిస్తోన్న జెస్సికా గురించి ఆమె మాటల్లోనే... ‘‘నేను చికాగోలో పుట్టాను. అమ్మానాన్న ఇరు కుటుంబాలకు చెందిన తాత, బామ్మలతో కలిసి ఉండే ఉమ్మడి కుటుంబం మాది. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములతో కలిసి స్కూలుకు వెళ్లి చదువుకునేదాన్ని. ఆదివారం వచ్చిందంటే... కుటుంబమంతా కలిసి గడుపుతాం. నాన్న అంతర్జాతీయ వ్యాపారి కావడంతో తరచూ చైనా, కొరియాలు వెళ్తుండేవారు. ఆయన్ని చూసి నేను కూడా అలా తిరగాలని అనుకునేదాన్ని. కాలేజీ చదువుకోసం 18 ఏళ్ల వయసులో చికాగో నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లాను. నాలుగేళ్లపాటు హాస్టల్లో ఉన్నాను. ‘చైనా, ఇండియాలలో ఆర్థికమాంద్యం వస్తుంది’ అని కాలేజీలో ఎక్కువమంది విద్యార్థులు మాట్లాడుకునేవారు. అది విన్న నాకు ఇండియా వెళ్లి అక్కడి పరిస్థితులు చూడాలనిపించేది. ఏడాదిలో తిరిగి వచ్చేస్తాను అనుకున్నా.. కాలేజీ చదువు పూర్తయిన తరువాత తెలిసిన వాళ్ల ఐటీ కంపెనీ హరిద్వార్లో ఉంటే.. అక్కడ ఇంటర్న్షిప్ చేయడానికి ఇండియా వచ్చాను. ఇంటర్న్షిప్తోపాటు భారతీయులు, వారి భాషల గురించి తెలుసుకోవచ్చని అనుకున్నాను. అనుకున్నట్టుగానే ఇరుగు పొరుగు నుంచి కూరగాయలు విక్రయించేవాళ్ల వరకు అందరితో పరిచయం ఏర్పడింది. అందరూ చక్కగా కలిసి పోయేవారు. ఏడాదిలో ఇంటర్న్షిప్ పూర్తయిన తరువాత అదే కంపెనీలో ఉద్యోగంలో చేరాను. అలా ఏడాదిలో తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. కొంతమంది స్నేహితుల ద్వారా అభిషేక్ పరిచయం అయ్యాడు. నేను ఇక్కడ ఉంటే.. అభిషేక్ అమెరికాలో చదువుకుంటున్నాడు. ఇద్దరం మంచి స్నేహితులుగా మారాం. నేను మా ఇంటికి వెళ్లినప్పుడల్లా అభిషేక్ను కలిసేదాన్ని. అలా మా ఇద్దరి స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చి బిహార్ కోడలిని అయ్యాను. అత్తమామల అనురాగం చూసి... హరిద్వార్లో ఉండే రోజుల్లో ఇక్కడి అత్తమామలు కుటుంబ పెద్దలుగా కోడళ్లు, మనవళ్లను చూసే విధానం నాకు బాగా నచ్చింది. అభిషేక్ను పెళ్లిచేసుకోవడానికి అది కూడా ఒక కారణం. మేము పెళ్లి చేసుకుంటామని మా నాన్నని అడిగాం. ‘చదువుకున్నాడు, సంపాదిస్తున్నాడు. నిన్ను బాగా చూసుకుంటాడు కాబట్టి పెళ్లిచేసుకో’ అని నాన్న చెప్పారు. అభిషేక్ కుటుంబ సభ్యుల్లో సగం మంది అమెరికాలో నివసిస్తుండడంతో వారి గురించి బాగా అర్థం చేసుకోవడం కూడా నాన్న ఒప్పుకోవడానికి ఒక కారణం. అభిషేక్ తల్లిదండ్రులు విదేశీ అమ్మాయిని కోడలుగా ఒప్పుకోవడానికి మొదట్లో భయపడ్డారు. ఎలాంటి అమ్మాయో అని సందేహించినప్పటికీ మా కుటుంబం గురించి తెలుసుకుని పెళ్లికి సమ్మతించడంతో 2010లో మా వివాహం జరిగింది. జీవితాంతం ఆధారపడాల్సిందే... పెళ్లి అయిన తరువాత అమెరికాలో కొన్నిరోజులు, ఇండియాలో కొన్ని రోజులు ఉండేవాళ్లం. ఆరేళ్ల తరువాత బిహార్కి వచ్చి స్థిరపడ్డాం. మాకు ఇద్దరు పిల్లలు బాబు, పాప. ప్రపంచంలో కూతురికంటే కొడుకులనే మరింత ప్రేమగా చూసుకుంటారు. ఇండియాలో ఇది కాసింత ఎక్కువే. అమ్మాయిలకు ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేలా అన్నీ నేర్పిస్తారు. అబ్బాయిలకు మాత్రం ఏమీ నేర్పించరు. కొంతమంది తల్లులు అయితే ‘మా అబ్బాయికి కప్పు టీ పెట్టడం కూడా రాదు’ అని గర్వంగా చెబుతుంటారు. ఇలా అయితే వాళ్లు స్వయంసమృద్ధిని సాధించలేరు. జీవితాంతం ఇతరుల మీద ఆధారపడి జీవించాల్సిందే. అందుకే నేను నా పిల్లలకు లింగభేదం లేకుండా అన్నీ నేర్పిస్తున్నాను. నేర్చుకుని నేర్పిస్తున్నా... హరిద్వార్లో ఉన్నప్పుడే హిందీ నేర్చుకున్నాను. కోర్సు కూడా చేశాను. బిహార్కి వచ్చిన తరువాత నా హిందీ బాగా మెరుగుపడింది. బిహారీలు మాట్లాడే హిందీ సరిగాలేదని, వారి మాటలు విని నవ్వుతుంటారు చాలామంది. కానీ ఇక్కడ మాట్లాడే హిందీలో సంస్కృతం, భోజ్పూరి, మైథిలి, ఆంగిక వంటి భాషలు కూడా కలుస్తాయి. అందుకే బిహారీలు మాట్లాడే హిందీ కొంచెం విభిన్నంగా ఉంటుంది. బిహారీలు మాట్లాడే హిందీపై చాలామందికి ఉండే చిన్నచూపు, వివక్ష పోవాలని నా వీడియోల్లో.. బిహారీ స్టైల్ హిందీనే మాట్లాడుతున్నాను. ఇండియా విత్ జెస్సికా ఇక్కడ ఉండే భారతీయులకు, విదేశాల్లో ఉండే ఇండియన్స్కు హిందీ నేర్పిస్తున్నాను. అమెరికా, కెనడాలలో స్థిరపడిన ఎంతోమంది భారతీయుల పిల్లలకు హిందీలో మాట్లాడడం తెలీదు. ఇది వాళ్లకు పెద్ద సమస్య. అందుకే నేను హిందీ నేర్పిస్తున్నాను. నాలుగున్నరేళ్ల క్రితం ‘ఇండియా విత్ జెస్సికా’ పేరిట యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచాను. వీటిద్వారా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేస్తున్నాను. కొన్నిసార్లు వివిధ రకాల అంశాలపై మాట్లాడడానికి అతిథిగా కూడా వెళ్తున్నాను. అమెరికా అమ్మాయి ఇండియా గురించి మాట్లాడడం, అందులో హిందీలో అనర్గళంగా మాట్లాడుతుంది అని తెలిసిన వాళ్లంతా ఆశ్చర్యంగా నా క్లాసులు వినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది డబ్బుల కోసం లిప్సింక్ వీడియోలు పోస్టు చేస్తుంటారు. నేను అవేమీ చేయడం లేదు. కేవలం తెలియని సమాచారం ఇవ్వడమే నా లక్ష్యం. అందుకే ఫాలోవర్స్ గురించి కూడా పట్టించుకోను. కొంతమంది మెసేజులకు జవాబులు చెప్పడం లేదని తిడుతుంటారు. నన్ను సెలెబ్రిటీలా చూస్తున్నారు. కానీ నేను సెలబ్రిటీని కాదు. ఇద్దరు పిల్లలకు తల్లిని, వాళ్లకు నేర్పించాలి. వంట చేయాలి, ఇంటిని చూసుకోవాలి. నాకంటూ వ్యక్తిగత జీవితం ఉంది. నేను అందరిలానే సామాన్యమైన వ్యక్తిని’’ అని ఎంతో నిరాడంబరంగా చెబుతోంది జెస్సికా. -
జోస్ ఆలుక్కాస్ శుభ మాంగళ్యం బ్రైడల్ కలెక్షన్స్–2023
చెన్నై: పెళ్లిళ్ల సీజన్కు మరింత శోభను చేకూర్చేందుకు జోస్ ఆలుక్కాస్ ‘‘శుభ మాంగళ్యం బ్రైడల్ కలెక్షన్ – 2023 ఫెస్టివ్ ఎడిషన్’’ ను ఆవిష్కరించింది. చెన్నైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆభరణాల కలెక్షన్ను సినీ నటులు కీర్తి సురేశ్, అనార్కలి మారికర్లు ప్రారంభించారు. ఇందులోని ప్రతి ఆభరణాన్ని భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించామని సంస్థ చైర్మన్ జోస్ ఆలుక్కాస్ తెలిపారు. స్వచ్ఛమైన బంగారు ఆభరణాలపై 4.99% తరుగు చార్జీలు ఆఫర్ చేస్తుంది. వజ్రాభరణాలపై 20%, ప్లాటినం వస్తువులపై 7% డిస్కౌంట్ అందిస్తుంది. ఎస్బీఐ కార్డు, పెళ్లి కోసం బంగారం కొనుగోలుపై 5% ప్రత్యేక క్యాష్బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఇప్పటికే ఆభరణాల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కలెక్షన్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు వర్గీస్ ఆలుక్కా, పాల్ జె ఆలుక్కా, జాన్ ఆలుక్కాలు పాల్గొన్నారు -
ఓటీటీలో అలాంటివి అనుమతించం: కేంద్రం
ఢిల్లీ: సెన్సార్ కట్టింగుల బాధలేని ‘ఓటీటీ కంటెంట్’ విషయంలో కేంద్రం మరోసారి సీరియస్గా స్పందించింది. భారత సమాజాన్ని.. మత సంప్రదాయాలను కించపరిచేలా ఉన్న కంటెంట్ను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓటీటీ ప్లాట్ఫారమ్కు సీరియస్గానే వార్నింగ్ ఇచ్చింది. ఓటీటీ ప్లాట్ఫారమ్స్ ప్రతినిధితులతో మంగళవారం కేంద్ర సమాచార & ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో భేటీ అయ్యారు. సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో భారతీయ సంస్కృతిని, సమాజాన్ని కించపరిచేలా ఉండే కంటెంట్ను ప్రభుత్వం అనుమతించబోదని వాళ్లకు స్పష్టం చేశారాయన. పాశ్చాత్య ప్రభావం, మన మతాలు.. సంప్రదాయాలను తప్పుగా స్మార్ట్ తెరపై చూపించే విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారాయన. ఇలాంటి వ్యవహారాలకు శిక్షలు కఠినంగా ఉండాలనే తాము యోచిస్తున్నట్లు తెలిపారాయన. దుర్మార్గపు ప్రచారంతో పాటు సైద్ధాంతిక పక్షపాతాల సాధనంగా ఓటీటీ ప్లాట్ఫారమ్లను ఉపయోగించవద్దని మంత్రి ఈ సందర్భంగా ఓటీటీ ప్రతినిధులకు సూచించారు. ఓటీటీ ఉల్లంఘనలకు శిక్షాస్పద నిబంధనలను ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేయడం, మరియు డిజిటల్ పైరసీని ఎదుర్కోవడంపై కూడా ఈ భేటీలో చర్చించారు. వీలైనంత త్వరగా సంబంధిత ప్రతిపాదనలతో తిరిగి కేంద్రం ముందుకు రావాలని వాళ్లను ఆయన కోరినట్లు తెలుస్తోంది. అయితే.. ఓటీటీకి సెన్సార్ ఉండాలనే అంశం గురించి మీడియా నుంచి మంత్రికి ప్రశ్న తలెత్తగా.. పరిశీలిస్తామంటూ ఆయన దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఇదీ చదవండి: కళ్ల ముందు కనిపిస్తున్నా.. కలిసి ఉండేది కష్టమేనా? -
దివ్యమైన ఐడియా సుమీ!
అమెరికాలో నివసిస్తున్న దివ్య మయ్యా చీరె ధరించి స్కీయింగ్ చేస్తూ ఇంటర్నెట్ మినీ సెలబ్రిటీగా మారింది. ‘స్కీయింగ్కు చీర ధరించడమే కరెక్ట్ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అది భారతీయతను ప్రతిఫలించే ప్రతీక మాత్రమే’ అంటుంది దివ్య. దివ్య వీడియోల పుణ్యమా అని ఎంతోమంది మహిళలు చీరె ధరించి స్కీయింగ్ చేస్తూ, భారతీయతను చాటుకుంటూ ‘భేష్’ అనిపించుకున్నారు. చీరె ధరించి స్కీయింగ్ చేయడానికి సంబంధించిన సలహాలు దివ్యను అడుగుతుంటారు. తన ఛాయిస్ మాట ఎలా ఉన్నా... హెల్మెట్, గ్లోవ్స్లాంటి సేఫ్టీలను ధరించడం మాత్రం దివ్య మరవదు. చీర ధరించే కాదు లెహెంగా ధరించి కూడా స్కీయింగ్ చేయగలను అంటూ చేసిన వీడియో వైరల్ అయింది. -
రాందేవ్ బాబా సేవలు ప్రశంసనీయం: అమిత్ షా
హరిద్వార్: భారతీయ వేద విద్య, సంస్కృతి, సంప్రదాయాలు, కళలను భావితరాలకు అందించేందుకు రాందేవ్ బాబా చేస్తున్న కృషి ప్రశంసనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్షా కొనియాడారు. హరిద్వార్లోని యోగా గురు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో చేపట్టిన 2వ సన్యాస్ దీక్షా మహోత్సవం సందర్భంగా ఆయన పతంజలి యూనివర్సిటీ కొత్త భవనాన్ని ప్రారంభించారు. ‘‘గడిచిన పాతికేళ్లలో యోగ, ఆయుర్వేద, స్వదేశీ పరిశ్రమకు రాందేవ్ బాబా గణనీయమైన సేవలు అందించారు. ఇప్పుడు అదే స్పూర్తితో విద్యా రంగంపై దృష్టి సారించారు. రానున్న రోజుల్లో పతంజలి గ్రూప్ దేశాభివృద్ధికి ఎంతోగానూ తోడ్పడుతుంది’’ అని అన్నారు. పతంజలి యూనివర్సిటీ, భారతీయ శిక్షా బోర్డు ద్వారా ప్రాచీన విద్యను నేటి తరానికి అందించి ఉత్తమ సమాజ స్థాపనకు తమ వంతు కృషి చేస్తామని రాందేవ్ బాబా తెలిపారు. -
ప్రేమించడమే నేరమా?
వికృత కలాపం ప్రపంచానికి సంస్కృతీ సంప్రదాయాలు, విలువలను నేర్పిన భారతదేశం నేడు కొన్ని వికృత చేష్టలకు బానిసగా మారుతోంది. ప్రపంచీకరణ ముసుగులో విదేశీ కల్తీ సంస్కృతికి వేదికగా మారుతోంది. కిస్ ఆఫ్ ది డే.. హగ్గింగ్ డే.. డార్లింగ్ నైట్.. హస్బెండ్ నైట్.. కాండిల్ లైట్.. వాలం టైన్స్ డే.. పేరెంట్స్ డే.. మదర్స్ డే.. ఫాదర్స్ డే.. చిల్డ్రన్స్ డే ఇలా రోజుకు ఒక డే పేరుతో విదేశీ సంస్కృతినీ భారతీయతపై బలవంతంగా రుద్దుతున్నారు. అనేక సంవత్సరాలు పరాయి పాలనలో మగ్గినా కూడా... మన భారతదేశం సంస్కృతి సంప్రదాయాలను వీడలేదు. ఈ క్రమంలో నేడు విదేశీ భావజాలాన్ని భారతీయ జీవన శైలితో కలుషితం చేసేందుకు మల్టీ నేషనల్ కంపెనీలు ధనార్జనే ధ్యేయంగా పబ్బులు, మాల్స్, రిసార్ట్స్, స్టార్ హోటల్లో ఆఫర్లు ప్రకటించి దోపిడీకి గురి చేస్తున్నాయి. అందులో భాగంగానే రోజుకు ఒక్క డే పేరుతో యువతను పెడదోవ పట్టిస్తున్నారు పాశ్చాత్య కంపెనీల పెద్దలు. ఫలితంగా నవ యువత నిర్వీర్యమై పోతోంది. భవిష్యత్తు చీకటి కమ్ముతోంది. దేశ ఔన్నత్యం దెబ్బతింటోంది. దీంతో వచ్చేతరం మన సంప్రదాయాలకు దూరమయ్యే ప్రమాదం నెలకొంది. అందుకే బజరంగ్ దళ్ విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు ముందుకు వచ్చాయి. ధర్మాన్ని కాపాడేందుకు దేశ సంస్కృతిని రక్షిం చేందుకు తమకు తాము బాధ్యత తీసుకుంటున్నాయి. ప్రేమ పేరుతో వికృత కార్యకలాపాలకు పాల్పడే యువతకు భారతీయ విలువలను తెలియజేసేందుకు కంకణం కట్టాయి. ప్రేమ అంటే ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే మాత్రమే కాదు అది వ్యామోహానికి సంబంధించిన రోజు కాబట్టి అలాంటి డే పేరుతో భారత పరువును బజారు పాలు చేయొద్దు అని వివరించేందుకు ముందుకు కదిలారు. ప్రేమంటే శ్రీకృష్ణుడు, శ్రీరాముడు చూపించారని వివరిస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే లంక నుంచి వారధి కట్టి సీతమ్మను కాపాడుకున్న చరిత్ర శ్రీరామచంద్రుడు. అదే నిజమైన ప్రేమ. అలాంటి చరిత్రను మరుగున పడేసి పాశ్చాత్య వికృత చేష్టలకు దాసోహం కావడం సరికాదని తెలియజేసేందుకు హిందూ సంస్థలు కృషి చేయడం హర్షణీయం. దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే భారతీయ విలువలను విశ్వానికి ఎత్తి చూపాలి తప్ప.. ప్రపంచం ముందు తలదించుకునేలా చేయరాదు. సంప్రదాయాలకు విఘాతం కలిగించే విడ్డూరమైన దినోత్సవాలు దూరంగా ఉండాలి. కోర్టులు కూడా విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించడం భావ్యం కాదు. పెళ్ళయిన స్త్రీ తనకు నచ్చిన వ్యక్తితో లైంగికంగా కలిసి ఉండటం నేరం కాదు అని తీర్పు ఇవ్వడం ఎంత మాత్రం సరికాదు. ఇలాంటి తీర్పులను కూడా ప్రతిఘటించి విలువలను కాపాడేందుకు కొన్ని సంస్థలు ముందుకు రావడం అభినందనీయం. -పగుడాకుల బాలస్వామి, విశ్వహిందూ పరిషత్ సహ ప్రచార ప్రముఖ్ ప్రకృతి సహజం నేడు ప్రేమికుల దినం. ఆహ్లాదం కంటే వివాదానికి తెర తీస్తున్న కొన్ని ప్రత్యేక దినాల్లో ప్రేమికుల రోజు ముందు పీఠిలో ఉంటోంది. ప్రేమ జంటలు రోడ్లపైకి రావద్దని, ప్రేమికులదినం ఒక వికృత కార్యకలాపాల సంస్కృతి అనీ, మన సంస్కృతి పరువును బజారుపాలు చేసే చర్య అని అంటున్నారు. భారతీయ విలువలను ధ్వంసం చేస్తున్న రోజుగా ప్రేమికుల దినాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు పెళ్లి కాని యువతీయువకులు ప్రేమజంటలై బయట తిరిగితే వారిని పట్టుకుని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామంటున్నారు. వాలంటైన్స్ డే నిర్వహించే పబ్లు, రిసార్టులు, హోటళ్లు, మాల్స్పై దాడులకు కూడా వెనుకాడబోమని బజరంగ్ దళ్, వీహెచ్పీ వంటి హిందూ మత సంస్థల నేతలు హెచ్చరిస్తున్నారు. యువతీయువకులు బహిరంగ స్థలాల్లో తిరిగితే వారికి బలవంతంగా తాళి కట్టించి ఊరేగించే తరహా సంస్కృతిలో ఏ ఆచార సంప్రదాయాలు దాగి ఉన్నాయో ఎవరు చెప్పాలి? ప్రేమను బహిరంగంగా వ్యక్తపరిచే సంస్కృతి విదేశీయమైనది, మన సంస్కృతికి భిన్నమైంది అనే దృక్పథం ప్రజాస్వామికమైనదేనా? తన ఇష్టాఇష్టాలను, అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తపరచడం ఆధునిక నాగరికత మనిషికి అందించిన అతి గొప్ప అవకాశం. సంస్కృతిని మడికట్టు ఆచారంగా, మార్చడానికి వీలులేని జడపదార్థంగా భావిస్తే అలాంటి సంస్కృతి చరిత్రలో అంతర్ధానం కాక తప్పదు. సంస్కృతిని నిత్యం మార్పు చెందుతూ, కొత్తను స్వీకరిస్తూ, పరిణామం చెందుతూ ఉండే జీవన విధానంగా గుర్తించినప్పడు ఒకరికి ఇవ్వడం, ఒకరినుంచి తీసుకోవడం ప్రకృతి నియమంలాగా సాగిపోతూనే ఉంటుంది. గుండుసూది నుంచి విమానాల వరకు ప్రతిదీ విదేశాలనుంచి అరువు తెచ్చుకుంటూ, పబ్బం గడుపుకుంటూ, మరోవైపున మా సంస్కృతి చెక్కుచెదరదనీ, వెయ్యేళ్ల క్రితం ఎలా ఉండేవారిమో ఇప్పుడూ అలాగే బతుకుతాం అంటే ఇలాంటి సంస్కృతి చరిత్రలో నిలబడేది కాదు. నా అభిప్రాయాలకు, నేను విశ్వసిస్తున్న ఆలోచనలకు భిన్నమైన ప్రతి దాన్నీ వ్యతిరేకిస్తాననీ, బలవంతంగానైనా సరే నిలిపివేసే చర్యలు చేపడతానని భావించడమే హిట్లర్ నాజీ సిద్ధాంతాలు ఆధునిక రూపంలో దేశంలో చెలామణీ అవుతున్నాయనడానికి నిదర్శనం. యాసిడ్ దాడులు, వరకట్నహత్యలు, గృహ చిత్ర హింసలు, ఫ్యూడల్ అహంకారాలు రాజ్యమేలుతున్న దేశంలో ప్రేమను స్వచ్ఛంగా వ్యక్తపరిచే ఏ అలవాట్లనైనా, ఆచారాలనైనా ఆహ్వానిం చాలి. ‘మా జాతికి ప్రేమించడం నేర్పినందుకు కృతజ్ఞతలు’ అంటూ ఒక చిన్న దేశం ఒక మహాకవి ప్లాబో నెరూడాకు నీరాజనాలు పలికింది. అందుకే ప్రేమించడాన్ని, ప్రేమను పంచి పెట్టడాన్ని నేర్చుకుందాం. -ప్రత్యూష, ప్రేమ్నగర్, హైదరాబాద్ -
శతాబ్దాల బాంధవ్యం
ఆగ్నేయాసియాతో భారతదేశం సుదీర్ఘకాలంగా సాంస్కృతిక, రాజకీయ, వాణిజ్య సంబంధాలను కలిగి ఉంది. ఈ ప్రాంతమంతటా భారతీయ ప్రభావాన్ని మనం చూడవచ్చు. కానీ ప్రస్తుత తరం ఆగ్నేయాసియా ప్రజలకు భారతీయుల గురించి, ప్రస్తుత తరం భారతీయులకు ఆగ్నేయాసియా ప్రజల గురించి చాలా తక్కువగానే తెలిసి ఉండటం దురదృష్టకరమైంది. అమెరికా, యూరప్ చరిత్ర గురించి మనకు బాగానే తెలుసు. పైగా గులాబీ యుద్ధం జరిగిన చోటు, బ్రిటిష్ రాజుల సమాధి స్థలాలు వంటి పాశ్చాత్య దేశాల్లోని అప్రాధాన్య ప్రాంతాలను సందర్శించడానికే ఎక్కువ ఆసక్తి చూపుతుంటాం కానీ, భారతదేశం నుంచి ఆగ్నేయాసియా వారసత్వంగా స్వీకరించిన హిందూ, బౌద్ధ చారిత్రక నిర్మాణాల గురించి మర్చిపోయాం. ఇండోనేషియాలోకి ఇస్లాం మతం కత్తితో కాకుండా వ్యాపారంతో విస్తరించింది. మతాన్ని తమతో పాటు ఇక్కడికి తీసుకొచ్చిన వ్యాపారులు అప్పటికే ఉన్న హిందూ, బౌద్ధ సంస్కృతి నుంచి ఇస్లాం మతానికి శాంతియుతంగా పరివర్తన చేశారు. అందుకే సీతా అనే అమ్మాయి ఇస్లాం మతాన్ని ఆచరించే అరుదైన దృశ్యం ఇండోనేషియాలోనే కనిపిస్తుంది. హిందూ మతంతో ముడిపడిన అనేక పౌరాణిక గాథలు వీరికి తెలుసు. నా పర్యటనలో నేను పాల్గొన్న శిక్షణా కార్యక్రమానికి పలు ఆగ్నేయాసియా దేశాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ చర్చలో పాల్గొన్న వివిధ దేశాల ప్రతినిధులు తమ భాషలోని అక్షరాలు భారతీయ అక్షరమాలనే పోలి ఉంటాయని, వలసపాలనలోనే రోమన్ అక్షరాలు తమ అక్షరమాల స్థానంలో వచ్చి చేరాయన్నారు. నా పర్యటనలో భాగంగా యోగ్యకర్త పట్టణం (సౌభాగ్యనగరం అని అర్థం) సందర్శించాను. ఇది కూడా సంస్కృతపదమే. ఇక్కడే బోరోబుదుర్ అనే అద్భుతమైన ఆలయం ఉంది. ఇది 9వ శతాబ్దానికి చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ దేవాలయం. యోగ్యకర్త పట్టణంలో దక్షిణభారత శిల్పశైలిని ప్రతి బింబించే అద్భుతమైన ఆలయాలను చూడవచ్చు. ఇండోనేషియాలో బౌద్ధం నిర్వహించిన ముఖ్య పాత్రకు బోరోబుదుర్ నిర్మాణాలు నిదర్శనాలు. అలాగే ఆ దేశ సాంస్కృతిక వారసత్వంలో రామాయణ జానపద గా«థలు ఓ అంతర్భాగం. ఆగ్నేయాసియాతో భారత్కున్న సన్నిహిత సాంస్కృతిక బాంధవ్యాలకు మరో చక్కటి నిదర్శనం కాంబోడియాలోని అంగ్కోర్ వాట్ ఆలయం. బోరోబుదుర్లో శిలలపై బుద్ధుడి జీవిత విశేషాలను చిత్రించినట్లుగానే, అంగ్కోర్ వాట్ ఆలయ శిలలపై వాటితోపాటు భీష్ముడి అంపశయ్య వివరాలను అత్యద్భుతంగా చిత్రించారు. ఈ ప్రాంతంలోని అనేక దేశాలు తమ ప్రాచీన రాజులు భారతీయ రాజరికపు కుదురు నుంచి వచ్చారని చెబుతుంటాయి. క్రీస్తుశకం తొలి శతాబ్దంలోనే అయోధ్యకు చెందిన కొందరు రాజకుమారిలు తమ దేశ చక్రవర్తిని పెళ్లాడారని కొరియన్ల విశ్వాసం. కొరియా పురాణాలు దీన్ని బలపరుస్తున్నాయి. ఈ కాలంలోనే కాంబోడియాలో నెలకొన్న ఒక సామ్రాజ్యానికి భారతీయ మూలాలున్నట్లు అక్కడి పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో బౌద్ధమతం వ్యాప్తిద్వారా భారత్తో మతపరమైన సంబంధాలు మరింతగా బలపడ్డాయి. దక్షిణ భారతంతోపాటు కళింగ రాజులు కూడా ఈ ప్రాంతంతో వాణిజ్య సంబంధాలు పెంపొందించుకున్నారు. బొరోబుదుర్ మహా శిల్ప నిర్మాణం ముందు, అంగ్కోర్ వాట్ అద్భుత దేవాలయం ముందు నిలబడినప్పుడు కలిగేటంత అనుభూతిని ఏ ఇతర దేశాన్ని కానీ లేక యూరప్ చారిత్రక నిర్మాణాలను, అమెరికా సహజ సౌందర్యాన్ని చూస్తున్నప్పుడు పొందలేం. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఈ దేశాలకు తక్కువ ఖర్చుతోనే మనం పర్యటించవచ్చు. వాణిజ్య అవసరాల ప్రాతిపదిక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లుక్ ఈస్ట్ పాలసీని భారత ప్రజలకు ఆ ప్రాంతంతో ఉన్న చారిత్రక, సాంస్కృతిక అనుసంధాలను మరింత బలపర్చేవిధంగా మెరుగుపర్చాలి. అలాగే ఇరుప్రాంతాల ప్రజల మధ్య సంబంధాలను పెంచేవిధంగా పర్యాటక సంస్కృతిని మరింతగా పెంపొం దించాలి. భారతీయ ఉపఖండంతో ఈ ప్రాంతానికి ఉన్న సుదీర్ఘ చారిత్రక బాంధవ్యాన్ని ప్రజలు మరిం తగా తెలుసుకునేలా తగు చర్యలు తీసుకోవాలి. ఐవైఆర్ కృష్ణారావు : వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి -
శిల్పారామం సకల కళాధామం