jedcherla
-
ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ దండుకున్నాడు: రాహుల్ గాంధీ
సాక్షి, మహబూబ్ నగర్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర తెలంగాణలో నాల్గవ రోజు ముగిసింది. ముగింపు సందర్భంలో శనివారం జడ్చర్ల సెంటర్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ-టీఆర్ఎస్లపై విమర్శనాస్త్రాలు సంధించారాయన. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే. కలిసే పని చేస్తున్నాయని రాహుల్ విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ పార్లమెంట్లో నల్లచట్టాలు తీసుకొస్తే.. టీఆర్ఎస్ మద్ధతు ఇస్తూ వచ్చింది. తెలంగాణలో బీజేపీపై యుద్ధం చేప్తూ.. ఢిల్లీలో మాత్రం ఇద్దరూ కలిసే నడుస్తున్నారు. బీజేపీ,టీఆర్ఎస్ పార్టీలు రాజకీయపార్టీల్లా కాకుండా కార్పోరేటు పార్టీలుగా పనిచేస్తున్నాయి అని మండిపడ్డారాయన. పాదయాత్రలో తెలంగాణ ప్రజల గొంతు వింటున్నాం. అన్ని వర్గాల వాళ్లను కలుస్తున్నాం. ముఖ్యంగా రైతులు, విద్యార్థులను కలుస్తున్నాం. తెలంగాణలో రైతులకు గిట్టుబాటు ధరలు దక్కక ఆగం అవుతున్నారు. రైతులతో పాటు చేనేత కార్మికులకు మేం అండగా నిలబడతాం. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ తరపున పరిహారం చెల్లిస్తాం. మన డబ్బు మనకు చేరడం లేదు..దేశంలో ముగ్గురు వ్యాపారుల దగ్గరే డబ్బు చేరుతుంది. మూడు,నాలుగు కార్పోరేటు శక్తుల కోసం ప్రధాని మోదీ పని చేస్తున్నారు. బీజేపీ విద్వేషాలు,హింసను ప్రేరేపిస్తోంది. తెలంగాణలో ప్రభుత్వం అన్ని రంగాలను నిర్లక్ష్యం చేస్తోంది. నీటిపారుదల ప్రాజెక్టుపై పేరుచెప్పి కేసీఆర్ దండుకుంటున్నారు. నిరుద్యోగుల సంఖ్య పెరిగి ఇంజనీరింగ్ పట్టభద్రులు జొమాటోలో పని చేస్తున్నారు. తెలంగాణలో విద్యా వ్యవస్దను ప్రైవేటు పరం చేస్తున్నారు. నిరుపేదలకు తీవ్ర నష్టం జరుగుతోంది. రాష్ట్రంలో విద్యపై బడ్జెట్ తక్కువ పెడుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. నిధులు పెంచి నిరుపేద విద్యార్దుల కలను సాకారం చేస్తాం. విద్యతో పాటు వైద్యంపైనా అధిక నిధులు కేటాయిస్తాం. దళితులు,గిరిజనుల వద్ద లాక్కున్న భూములను.. తిరిగి వారికి ఇస్తాం అని ప్రకటించారాయన. -
ప్రేమించి పెళ్లి చేసుకొని.. సర్టిఫికెట్లు తీసుకెళ్లిపోయిన భర్త
రాజాపూర్ (జడ్చర్ల): మూడేళ్లుగా ప్రేమించుకుని గతనెల క్రితం ఓ ఆలయంలో పెళ్లి చేసుకుని కాపురం పెట్టాకా వారంరోజుల నుంచి భర్త ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోవడంతో ప్రియురాలు ఆందోళనకు దిగింది. ఈ ఘటన గురువారం మండలంలోని ముదిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన స్వప్న అదే గ్రామానికి చెందిన మహేష్గౌడ్ మూడేళ్లుగా ప్రేమించుకుని పెద్దలను ఎదిరించి వట్టెం ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. గ్రామంలో పెద్దలు అభ్యంతరం చెప్పడంతో నెలరోజుల క్రితం జడ్చర్లలో ఓ రూం అధ్దెకు తీసుకుని ఉన్నారు. ఈ క్రమంలో స్వప్న అనారోగ్యంగా ఉండటంతో తండ్రి ఆంజనేయులుకు సమాచారం ఇచ్చి వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చేసరికి భర్త మహేష్గౌడ్ తన సరి్టఫికెట్స్ తీసుకుని చెప్పకుండా వెళ్లిపోయాడు. రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో జర్చర్ల పోలీసులకు తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే తన భర్తను అతని తల్లిదండ్రులే ఎక్కడో దాచారని ఆరోపిస్తూ గురువారం ముదిరెడ్డిపల్లిలోని మహేష్గౌడ్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ కుటుంబ సభ్యులను పిలిచి కౌల్సిలింగ్ నిర్వహించారు. -
14నెలల్లో రోడ్డు పనులు పూర్తి : మంత్రి
పాలమూరు: మహబూబ్నగర్– జడ్చర్ల రోడ్డు వెడల్పు పనులు 14నెలల్లో పూర్తి చేసి జిల్లా ప్రజలకు కానుకగా ఇస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం ఈ రోడ్డు పనులను సంబంధిత అధికారులతో క లిసి మంత్రి పరిశీలించారు. అనంతరం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన మా ట్లాడుతూ.. జడ్చర్ల నుంచి మహబూబ్నగర్ వ రకు ఉన్న రోడ్డు మార్గంలో కొన్ని ఏళ్లుగా దాదా పు వందలామంది ప్రాణాలు కోల్పోయినా గత ప్రభుత్వాలకు రోడ్డు వెడల్పు చేయాలన్నా సోయి లేకుండాపోయిందన్నారు. తెలంగాణ రా ష్ట్రం ఏర్పాటైన తర్వాత జిల్లా కేంద్రాలకు, మం డల కేంద్రాలకు, గ్రామీణా ప్రాంతాలకు రోడ్లు వేసి ప్రయాణికులకు సులభతరం చేయడం జ రిగిందన్నారు. ఎన్నో రోజుల నుంచి కలలు కం టున్న జడ్చర్ల–మహబూబ్నగర్ రోడ్డును ము ఖ్యమంత్రి చొరవతో పనులు ప్రారంభించుకున్నామన్నారు. అందరు అధికారుల సహకారంతో రోడుడ పనులు వేగంగా పూర్తిచేస్తామన్నా రు. భవిష్యత్లో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తక్కువ సమయంలో గమ్యం చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. విస్తరణ పనులకు ప్రజలు సహకరించాలి మహబూబ్నగర్ పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డు విస్తరణ పనులకు సహకరించాలని మంత్రి కోరారు. దీని ద్వారా పనులు త్వరగా పూర్తి అయ్యి అన్ని రకాలుగా లాభాలు ఉంటాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా చర్చించి 167జాతీయ రహదారికి ఈ రోడ్డును అనుసంధానం చేసినట్లు తెలిపారు. మహబూబ్నగర్ పట్టణంలో ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు ఉండే ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేశామని తెలిపారు. కొందరు వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు విస్తరణ పనులకు సహకారం అందిస్తున్నారని మిగతా వారు కూడా ఇద్దే పద్ధతిలో సహకరించాలని కోరారు. పాలమూరు పట్టణం హైదరాబాద్ నగరానికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని ఈ అభివృద్ధిలో అందరూ బాగస్వామ్యం కావాలన్నారు. ఇప్పటికే ఐటీ కారిడార్ తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫేస్బుక్ మర్డర్
జడ్చర్ల: ఫేస్బుక్ కపట ప్రేమ మరోసారి పడగవిప్పింది. గుర్తు తెలియని వ్యక్తితో చేసిన చాటింగ్ ముదిరి.. జస్ట్ కలుద్దామని పిలవగానే వెళ్లడం ఓ అమ్మాయిని నిర్జీవంగా మార్చేసింది. పాలమూరు జిల్లా జడ్చర్ల శివారులో రెండ్రోజుల క్రితం జరిగిన దారుణ సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. జడ్చర్ల వాసులను దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న రవిశంకర్, సురేఖ దంపతులకు ఇద్దరు కూతుళ్లు శ్రీ హర్షిణి, శ్రీమాన్విత. జిల్లా కేంద్రం సమీపంలోని కేంద్రీయ విద్యాలయంలో శ్రీహర్షిణి (15) పదో తరగతి, శ్రీమాన్విత ఆరోతరగతి చదువుతున్నారు. తండ్రి రవిశంకర్ జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. షాద్నగర్కు చెందిన రవిశంకర్ కుటుంబం 25 ఏళ్ల క్రితమే జడ్చర్ల హౌసింగ్ బోర్డు కాలనీలో స్థిరపడింది. దుకాణానికి వెళ్లి హౌసింగ్బోర్డు కాలనీలోని తమ నివాసం నుంచి శ్రీహర్షిణి మంగళవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పెన్ను, పెన్సిల్ కొనేందుకు జడ్చర్ల–మహబూబ్నగర్ ప్రధాన రహదారిపైకి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన శ్రీహర్షిణి.. వెంటనే మళ్లీ ఏదో కొనాలని చెప్పి రోడ్డుపైకి వచ్చింది. ఆ తర్వాత ఆమె ఇంటికి తిరిగి వెళ్లలేదు. దాదాపు గంటపాటు ఎదురుచూసిన తల్లి సురేఖ.. కూతురు ఇంటికి రాలేదంటూ భర్త రవిశంకర్కు ఫోన్ చేసింది. రవిశంకర్ వెంటనే ఇంటికొచ్చి చుట్టుపక్కల వారిని శ్రీహర్షిణి గురించి అడిగారు. ఆమెకు ఫోన్ చేస్తే రింగ్ అయింది కానీ ఎత్తలేదు. రాత్రి 7గంటల తరువాత ఫోన్ కూడా స్విచాఫ్ అయింది. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనతో జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి వెంటనే దర్యాప్తు చేపట్టారు. కారులో ఎక్కి వెళ్లిందన్న సమాచారంతో.. హౌసింగ్బోర్టు సమీపంలో ఓ కారులో శ్రీహర్షిణి ఎక్కి వెళ్లిందని.. తెలిసిన వారైనందునే ఆ కారులో వెళ్లి ఉంటుందని భావించినట్లు కొందరు స్థానికులు పోలీసులకు చెప్పారు. ఆ కారు గుర్తులు అడిగి తెలుసుకుని సీసీ కెమెరాల పుటేజీలని పరిశీలించారు. బాలానగర్ సమీపంలోని టోల్ప్లాజా దగ్గర జడ్చర్ల వైపు వచ్చి కేవలం అరగంటలోపే మళ్లీ హైదరాబాద్ వైపు ఆ కారు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కారు నంబరును సేకరించి రవాణా శాఖ అధికారుల సహకారంతో కారు యజమాని చిరునామాను సేకరించి దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుడి పట్టివేత ఈ మేరకు కారు యజమాని తన కారును తీసుకెళ్లిన యువకుడి సమాచారం పోలీసులకు ఇవ్వడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శివారులోని హయత్నగర్ మండలం కోహెడకి చెందిన ఏనుగు నవీన్రెడ్డి (28)ని పోలీసులు అరెస్ట్ చేసి జడ్చర్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుడు హైదరాబాద్లోని వీల్ అలైన్మెంట్ దుకాణంలో మెకానిక్గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు నవీన్రెడ్డి పోలీసులకు ఇచ్చిన సమాచారంతోనే శ్రీహర్షిణి హత్య వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి నవీన్రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ స్టైల్లో విచారించగా.. గురువారం తెల్లవారుజామున శ్రీహర్షిణిని చంపేసినట్లు చెప్పాడు. ఈ సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, బంధువులు శ్రీహర్షిణి మృతదేహాన్ని గుర్తించారు. జడ్చర్ల శివారులోని శంకరాయపల్లితండాకు వెళ్లే రహదారికి కొద్దిదూరంలో ఉన్న గుట్ట పక్కన గడ్డిపొదల మాటున మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అసలేం జరిగిందంటే! పెద్దగా చదువుకోని నవీన్రెడ్డి ఫేస్బుక్లో జడ్చర్లకు చెందిన శ్రీహర్షిణితో మూడు నెలలుగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. వీరిస్నేహం కాస్త ముదరడంతో తరచూ వాట్సప్, ఫేస్బుక్ ద్వారా చాటింగ్ చేసుకునేవారని సమాచారం. కొంతచనువు ఏర్పడడంతో నవీన్రెడ్డి మంగళవారం కారులో జడ్చర్లకు వచ్చి శ్రీహర్షిణి కలిశాడు. హౌసింగ్బోర్డు కాలనీ సమీపంలోనే ప్రధాన రహదారిపైకి వచ్చిన శ్రీ హర్షిణిని నవీన్రెడ్డి కారులో ఎక్కించుకుని శంకరయాపల్లి తండా రహదారి వైపు వెళ్లారు. అక్కడ నిర్జన ప్రదేశంలో వారు కాసేపు మాట్లాడిన తరువాత శారీరకంగా తనతో కలవాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో తనకు ఇష్టంలేదని, తనను వదిలేయాలని శ్రీ హర్షిణి చెప్పింది. వెంటనే అక్కడి నుంచి పరుగెత్తే క్రమంలో నవీన్రెడ్డి శ్రీహర్షిణి డ్రెస్సును పట్టి లాగడంతో దుస్తులు చిరిగిపోయాయి. ఈ క్రమంలో శ్రీహర్షిణిని గట్టిగా వెనక్కి నెట్టడంతో ఆమె కింద పడిపోయింది. వెంటనే పక్కనే ఉన్న బండరాయిని తలపై పడేసిన నవీన్రెడ్డి వెంటనే కారులో హైదరాబాద్కి వెళ్లిపోయాడు. ఉరిశిక్ష విధించాలి విద్యార్థినిని దారుణంగా హత్యచేసిన నిందితుడికి ఉరిశిక్ష విధించాలని విద్యార్థి, మహిళా సంఘాలు, యువకులు, రాజకీయ నాయకులు ఆందోళనకు దిగారు. జడ్చర్లలోని నేతాజీ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, హౌసింగ్ బోర్డు ఎదుట జడ్చర్ల–మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వరంగల్లో ఇలాంటి ఘటన చోటుచేసుకున్న నేపథ్యంలో ఆ కేసులో నిందితుడికి ఎలాంటి శిక్ష అమలు చేశారో అదే ఉరిశిక్షను ఇక్కడి హంతకుడు నవీన్రెడ్డికి విధించాలని డిమాండ్ చేశారు. -
మరణించిన వారు వచ్చి రిజిస్ట్రేషన్!
జడ్చర్ల: వారు మరిణించి దశాబ్దాంన్నరకు పైగానే గడిచింది. కానీ వారి పేరున ఉన్న వ్యవసాయ భూములు మాత్రం వారే వచ్చి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారు. ఇది నమ్మలేకున్నా జడ్చర్ల సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. చివరకు పోలీసుల దర్యాప్తులో ఈ విషయం తేటతెల్లం కావడంతో ఇలాంటి మోసాలకు పాల్పడిన నిందితులు కటకటాలపాలయ్యారు. జడ్చర్ల రూరల్ సీఐ శివకుమార్ కథనం మేరకు.. రాజాపూర్ మండలం తిరుమలిగిరికి చెందిన పాత్లావత్ ఘాన్సీబాయికి సర్వే నంబర్లు 189, 208, 211, 212, 200లో 5.18 ఎకరాల భూమి ఉంది. అదేవిదంగా పాత్లావత్ కేశవులుకు సర్వే నంబర్లు 200/1యు, 212/ఆర్యు, 211/1యులలో 4.04 ఎకరాల భూమి ఉంది. అయితే వీరు దాదాపు 15సంవత్సరాల క్రితమే మరణించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన పాత్లావత్ దీప్లా, పాత్లావత్ రమేశ్, పాతాల్వత్ అంబ్రి, సీత్యాలు తప్పుడు ఆధార్ కార్డులు, తదితర పత్రాలు సృష్టించి 2010లో ఇతరులు పేరున వారి భూమిని జడ్చర్ల సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. ఆధార్ కార్డుల్లో ఫొటోలు మార్చి రిజిస్ట్రేషన్కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 2018లో ఘాన్సీబాయి కూతురు జమున, తదితరులు బాలానగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం గురువారం వారిని రిమాండ్కు తరలించారు. కాగా నిందితులకు సహకరించిన అప్పటి వీఆర్ఓ, సర్పంచ్, తదితరులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఈసందర్భంగా సీఐ వెల్లడించారు. -
క్యాన్సర్ సోకిందని కన్న తండ్రిని..
జడ్చర్ల: చిన్నప్పటి నుంచి ఆలనా పాలనా చూసిన తండ్రికి క్యాన్సర్ సోకితే వెన్నంటి ఉండి వైద్యం చేయించాల్సింది పోయి.. అవగాహన లేక ఇంటికి తమకూ ఆ వ్యాధి సోకుతుందంటూ ఇంటికి దూరంగా వదిలిపెట్టారు. ఓ వైపు జబ్బు.. మరో వైపు కుటుంబసభ్యులు ఎవరూ పక్కన లేరనే క్షోభతో చివరికి ఓ తండ్రి తనువు చాలించిన అమానవీయమైన సంఘటన మంగళవారం బాదేపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. స్థానిక శ్రీరాంనగర్ కాలనీకి చెందిన వెంకటయ్య(65) క్యాన్సర్ వ్యాధికి గురయ్యాడు. ఇతని భార్య కొన్నేళ్ల క్రితమే మృతిచెందగా కుమారుడు రాజు, కోడలు పద్మ ఉన్నారు. వీరు మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. కాగా వెంకటయ్య మెడపై గల క్యాన్సర్ గడ్డ ఇటీవల పగలడంతో 15 రోజుల క్రితం ఇంటికి దూరంగా అతనిని స్థానిక ప్రభుత్వ గోదాముల దగ్గర గల పాడుబడిన కార్యాలయ గదిలో అతని కుమారుడు విడిచి వెళ్లాడు. నిత్యం చుట్టుపక్కల వారు లేదా కుమారుడు అతనికి కావాల్సిన ఆహారం, బీడీలు ఇచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఆయన మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా తన తండ్రి క్యాన్సర్కు గురికావడంతో ఆ వ్యాధి తమకు సోకుతుందని చుట్టుపక్కల వారు అభ్యంతరం చెప్పడంతో ఇంటి నుంచి దూరంగా తీసుకెళ్లానని కుమారుడు రాజు ఈసందర్భంగా పేర్కొనగా.. కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకు అతనే తన తండ్రిని దూరంగా పెట్టాడని కాలనీవాసులు తెలిపారు. ఏదిఏమైనా వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం, చివరి సమయంలో కన్న తండ్రిని దూరంగా పెట్టడం అమానవీయమని పలువురు పేర్కొన్నారు. ఆర్థిక సహాయం అందజేత మృతుడు వెంకటయ్య కుటుంబానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సహకారంతో రూ.5వేలు ఆర్థిక సహాయాన్ని యార్డు చైర్మెన్ మురళి, నాయకులు పరమటయ్య, శేఖర్, చైతన్య, హరి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై కారు దగ్ధం
సాక్షి,జడ్చర్ల: జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారు బుధవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా దగ్ధమైంది. బాధితుల కథనం ప్రకారం.. హైదరాబాద్లోని బడంగ్పేటకు చెందిన భరత్, దివ్య భార్యాభర్తలు కలిసి ఓ అద్దె కారులో మంత్రాలయం వెళ్లి స్వామి వారిని దర్శించుకుని బుధవారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే మండలంలోని మల్లెబోయిన్పల్లి స్టేజీ సమీపంలో కారు డ్రైవర్ శ్రీకాంత్ మూత్ర విసర్జన కోసం ఇంజన్ ఆఫ్ చేయగా.. ముందుభాగం నుంచి పొగలు వచ్చాయి. దీంతో ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ శ్రీకాంత్ వెంటనే కారులో ఉన్న భార్యాభర్తలను వారి లగేజీని కిందకు దింపగానే మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారు మొత్తం కాలిపోయింది. వెంటనే డ్రైవర్ శ్రీకాంత్ 100 నంబర్కు డయల్ చేసి పోలీసులు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలను ఆర్పారు. షార్ట్సర్క్యూట్ కారణంగా కారులో మంటలు చెలరేగి ఉండవచ్చని డ్రైవర్ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలరాజుయాదవ్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగొచ్చాడు!
సాక్షి, జడ్చర్ల టౌన్: ఇంటినుంచి వెళ్లిపోయిన వ్యక్తి చనిపోయాడకుని కుటుంబ సభ్యులు అతడిపై ఆశలు వదులుకున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత బతికే ఉన్నాడని తెలిసిన ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జడ్చర్ల సీఐ బాలరాజు సమక్షంలో సత్యేశ్వర ఆశ్రమ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాలిలా.. గద్వాలకు చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి ఎనిమిదేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అతడు చనిపోయాడని భావించి ఆశలు వదులుకున్నారు. అయితే బాదేపల్లి పాతబజార్లో మహాలక్ష్మి సేవాట్రస్టు నిర్వాహకులు ఈశ్వర్, రామకృష్ణ ఏడాదిక్రితం ప్రారంభించిన సత్యేశ్వర ఆశ్రమంలో మతిస్థిమితం తప్పిన వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇదే క్రమంలో గతేడాది ఏప్రిల్లో జాతీయ రహదారిపై మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న ఇబ్రహీం ఆశ్రమ నిర్వాహకుల కంటపడటంతో చేరదీశారు. ఆశ్రమంలో చేసిన సేవలు, సఫర్యలు, చికిత్సల కారణంగా ఇబ్రహీం కోలుకున్నాడు. తన కుటుంబ సభ్యుల వివరాలను ఆశ్రమ నిర్వాహకులకు తెలియజేయడంతో జడ్చర్ల పోలీసుల సహకారంతో గద్వాలలోని అతడి కుటుంబ సభ్యుల సమాచారం సేకరించారు. వారిని పిలిపించి ఆదివారం జడ్చర్ల పోలీస్స్టేషన్లో ఇబ్రహింను అప్పగించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సీఐ బాలరాజు ఆశ్రమ నిర్వాహకుల సేవలను ప్రత్యేకంగా అభినందించారు. -
శాంతిభద్రతల కోసమే కార్డెన్సెర్చ్
జడ్చర్ల టౌన్: బాదేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మబావిగడ్డ, ఫజల్బండ, నిమ్మబావిగడ్డతండాలో గురువారం తెల్లవారుజామున మహబూబ్నగర్ డీఎస్పీ భాస్కర్గౌడ్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున ఉన్నట్టుండి పోలీసులు తలుపుతట్టి పోలీస్.. అనడంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తర్వాత కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారని తెలుసుకుని కుదుటపడ్డారు. ఉదయం 5గంటల నుంచి పోలీసులు ఇంటింటిని సోదాచేశారు. సెర్చ్లో డీఎస్పీతోపాటు నలుగురు సీఐలు, 10మంది ఎస్ఐలు, స్పెషల్పార్టీకి చెందిన 100మంది పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి ఇంటింటిని తనిఖీ చేశారు. సోదాల్లో సరైన పత్రాలు లేని 39 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 9ఆటోలు, 5 కార్లు, 3ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటి పత్రాలను చూసి కొన్నింటిని వదిలిపెట్టారు. ఇదిలాఉండగా అదే ప్రాంతంలో ఉన్న ఇద్దరు పాత నేరస్తులైన లక్ష్మయ్య, మహమూద్లను విచారించారు. తనిఖీల్లో భాగంగా ఓ ఇంట్లో గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. ప్రజల రక్షణకే.. ప్రజల రక్షణ కోసమే ఎస్పీ ఆదేశాల మేరకు కార్డెన్సెర్చ్ నిర్వహించామని డీఎస్పీ భాస్కర్గౌడ్ తెలిపారు. భద్రత విషయంలో పూర్తిహామీ ఇచ్చేందుకు ఇలాంటి కార్డెన్ సెర్చ్లు ఉపయోగపడతాయని, ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకే సోదాలు నిర్వహించామని చెప్పారు. సోదాల్లో సరైన పత్రాలు లేని 39 ద్విచక్రవాహనాలు, 9 ఆటోలు, 5కార్లు, 3ట్రాక్టర్లను స్వాధీనపర్చుకున్నామన్నారు. కార్డెన్సెర్చ్లో సీఐలు బాల్రాజ్యాదవ్, రవీందర్రెడ్డి, పాండురంగారెడ్డి, ఎస్ఐలు కృష్ణయ్య, మధుసూదన్గౌడ్, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు. జమ్మిచేడులో గద్వాల రూరల్: మండలంలోని జమ్మిచేడులో గు రువారం ఉదయం ఏఎస్పీ కృష్ణ ఆధ్వర్యంలో పో లీసులు కార్డెన్సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భం గా పలు వార్డుల్లో పొద్దున్నే పోలీసులు సంచరిస్తూ అనుమానితుల కోసం నిఘా పెట్టారు. అనుమ తులు లేని 36 బైకులు, ఒక ఆటోను స్వాధీనం చే సుకున్నారు. అనంతరం కాలనీవాసులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో జీవించాలనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టామని ఏఎస్పీ తెలిపారు. ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ఎలాంటి గొడవలు జరిగినా ప్రజలు నిర్భయంగా పోలీసులకు సమాచారం చేరవేయాలని కోరారు. కార్డెన్సెర్చ్లో ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలు, 60 మంది పోలీసులు పాల్గొన్నారు. -
దేశానికి పట్టిన శని.. కాంగ్రెస్
సాక్షి, జడ్చర్ల : దేశంతో పాటు రాష్ట్రానికి పట్టిన శని అని... ఆ పార్టీ తరిమికొట్టడం ద్వారా తమిళనాడు, కేరళ, తదితర రాష్ట్రాలు బాగుపడిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కూడా అదే తరహాలో ముందుకు సాగి టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. జడ్చర్ల మండలంలోని పల్గుగడ్డ తండాలో శుక్రవారం ఆయన టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ అరవై ఏళ్ల పాటు కాంగ్రెస్, టీడీపీలు రాష్టాన్ని పాలించగా ప్రజలు దగా పడ్డారని.. కేవలం నాలుగేళ్ల కాలంలో తాము అనేక అభివృద్ధి కార్యఖ్రమాలు చేపట్టామని తెలిపారు. ఇక్కడ చేపడుతున్న పథకాలతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని పేర్కొన్నారు. నాటి శ్రీరాముడి పాలన మాదిరిగా రాష్ట్రంలో పాలన సాగుతోందని వెల్లడించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, వైస్ ఎంపీపీ రాములు, ఎంపీటీసీ సభ్యురాలు మణెమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడ్గల్ యాదయ్య, కోఆప్షన్ సభ్యుడు ఇమ్ము, మార్కెట్ డైరెక్టర్ గోవర్దన్రెడ్డితో పాటు కొంగళి జంగయ్య, తావుర్యానాయక్, శ్రీకాంత్, ప్రణీల్ పాల్గొన్నారు. జాతీయ రహదారి పనుల్లో నాణ్యత పాటించాలి జడ్చర్ల–కోదాడ జాతీయరహదారి విస్తరణ పనుల్లో నాణ్యత పాటించాలని మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ఆదేశించారు. జడ్చర్ల – మిడ్జిల్ మద్యలో జరుగుతున్న పనులను శనివారం ఆయన పరిశీలించి పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలపై కాంట్రాక్టర్, ఉద్యోగులతో చర్చించారు. రాకపోకలకు అంతరాయం కలుగకుండా, ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా పనులు చేపడుతూ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రహదారి విస్తరణ పనులు పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ఆయన వెంట మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యురాలు హైమావతి, తదితరులు ఉన్నారు. -
ఇటు పరిహారం.. అటు రికవరీ!
సాక్షి, జడ్చర్ల టౌన్ : వారందరూ ముంపు గ్రామాల రైతులు.. ఉన్న పొలం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కోల్పోతున్నారు.. అంతకుముందే ఆ భూములపై బ్యాంకులో రుణం తీసుకున్నారు... ఇప్పుడు పరిహారం వస్తున్నందున రుణం చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు ఒత్తిడి తీసుకొస్తుండడం ఆరోపణలకు తావిస్తోంది.. ఇది మొదటి దశేనని, రెండో దశ పరిహారం రాగానే రుణం చెల్లిస్తామని రైతులు చెబుతుండగా.. మొత్తం భూములే కోల్పోతున్నందున రుణం రికవరీ చేసుకునేందుకు తమకు మరో మార్గం లేదని బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిహారం చెక్కులను కళ్లతోనైనా చూసుకోకుండానే లాక్కోవడం ఎంతవరకు సబబంటూ జడ్చర్ల తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. 273 ఎకరాలకు పరిహారం జడ్చర్ల మండలం ఖానాపూర్ గ్రామంలో వ్యవసాయ పొలాలు మొత్తం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉదండాపూర్ రిజర్వాయర్లో 800 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. నిందులో 273 ఎకరాలకు సంబంధించి రూ.1,49,09,375 పరిహారం విడుదలైంది. ఈ డబ్బుకు సంబంధించి రైతులకు చెక్కులను తహసీల్దార్ కార్యాలయంలో అందజేస్తున్నారు. ఈ మేరకు గురువారం 75మంది రైతులకు జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో చెక్కులు ఇవ్వగా.. అక్కడకు కారుకొండ కెనరాబ్యాంక్ ఇన్చార్జి రాజేష్ చేరుకుని 12 మంది రైతుల నుంచి చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. ఆ చెక్కులను రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని.. వారం తర్వాత రుణం పోను మిగతా నగదు తీసుకోవచ్చని తెలిపారు. తహసీల్ వద్ద ఆందోళన ముంపు రైతులు సోమవారం జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో చెక్కులు తీసుకునేందుకు వచ్చారు. అయితే బ్యాంక్ ఇన్చార్జి రాజేష్ వచ్చే వరకు అధికారులు చెక్కులు ఇవ్వలేదు. సదరు అధికారి వచ్చాక చెక్కులు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధం కాగానే.. తనకు అందజేయాలని బ్యాంకు అధికారి కోరాడు. దీంతో రైతులు చెక్కులు తీసుకోకుండా ఆందోళనకు దిగారు. ఇవి మొదటి విడతే అయినందున రెండో విడత చెక్కులు వచ్చాక రుణం చెల్లిస్తామని బదులిచ్చారు. ఇలా ఇరువర్గాల వాదనలతో చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. 1,200ఖాతాలు.. రూ.12కోట్ల రుణం నవాబుపేట మండలం కారుకొండ గ్రామంలో కెనరాబ్యాంక్ ఏర్పాటు చేశారు. బ్యాంకు పరిధి లో ఖానాపూర్, కారుకొండ గ్రామాలు ఉన్నా యి. రెండు గ్రామాల్లో 1,200ఖాతాలు రైతులకు సంబంధించి ఉండగా ప్రస్తుతం రూ. 12కోట్ల వ్యవసాయ రుణాలు రికవరీ కావాల్సి ఉంది. వీటిలో సగభాగం ఖానాపూర్ గ్రామ రైతులవే. ప్రభుత్వం ఇటీవల కొత్త పాస్పుస్తకా లు పంపిణీ చేసినప్పటికీ ఖానాపూర్ ముంపుకు గురవుతుండటంతో ఇక్కడ రైతుల కు రాలేదు. ప్రస్తుతం పరిహారం చెక్కులు వస్తుం డడంతో బ్యాంక్ అధికారులు తహసీల్కు చేరుకున్నారు. అయితే, కలెక్టర్తో సంప్రదించి లీడ్బ్యాంక్ మేనేజర్కు ముందుస్తుగా సమాచారం ఇచ్చాకే రికవరీ చేస్తున్నామని చెబుతున్నారు. బలవంతంగా చెక్ తీసుకున్నారు నాకు మొత్తం రూ.18లక్షల చెక్ వచ్చింది. క్రాప్లోన్ రూ.10వేలు మాత్రమే ఉంది. దీనికోసం నా చెక్ మొత్తం తీసుకుని ఖాతాలో జమ చేస్తామంటూ తీసుకున్నారు. నా ఇష్టంతో చెక్ ఇవ్వలేదు. ఓ వైపు పొలాలు పోయి బాధలో ఉంటే బ్యాంక్ అధికారులు చెక్కులు లాక్కోవటం సబబు కాదు. – చాకలి చిన్న రాములు, ఖానాపూర్ కొద్ది మొత్తమే వచ్చింది.. నా భూమి మొత్తం 8ఎకరాలు పోతుంది. అంత భూమికి డబ్బులు రాలే. సగం డబ్బులు అంటే రూ.16.38 లక్షలే వచ్చాయ్. నా క్రాప్ లోన్ రూ.1.10లక్షలే ఉంది. రెండో విడత డబ్బు వచ్చాక రుణం చెల్లిస్తానన్నా వినకుండా చెక్ లాగేసుకున్నారు. – ఊశన్న, ఖానాపూర్ మేం ఎన్ఓసీ ఇస్తేనే పాస్ అవుతుంది.. ఖానాపూర్ రైతుల క్రాప్ లో న్ బకాయిలు ఇప్పుడు వ సూలు చేసుకోవాల్సిందే. భూములు ముంపునకు గురవుతున్నందున ఆ త ర్వాత వారు రుణం చెల్లించలేరు. ఇన్నాళ్లు సేవలందించిన మా బ్యాంకును కాదని కొందరు రైతులు పరిహారం చెక్కులను ఇతర బ్యాంకుల్లో వేసుకుని డ్రా చేసుకుంటున్నారు. అందుకోసం లీడ్బ్యాంక్ మేనేజర్తో సంప్రదించి ఇకపై మా బ్యాంకు ఎన్ఓసీ ఇస్తేనే ఏ బ్యాంకులోనైనా పాస్ అయ్యేలా చర్యలు తీసుకోనున్నాం. – రాజేష్, కెనరా బ్యాంక్ ఇన్చార్జి, కారుకొండ -
సెల్ఫోన్ దొంగల ముఠా అరెస్ట్
జడ్చర్ల : నాలుగేళ్లుగా సెల్ఫోన్లు దొంగిలిస్తూ.. ఎవరికీ చిక్కకుండా తప్పించుకుంటూ.. యథేచ్ఛగా తమ దొంగతనాలను కొనసాగిస్తున్న దొంగల ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి బుధవారం జడ్చర్ల పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబ్నగర్ డీఎస్పీ భాస్కర్ వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లాకు చెందిన బేతంపల్లి ఎల్లప్ప, వడ్డె గౌరీ, బేతంపల్లి ప్రభు, వడ్డె సంధ్య, వడ్డె ప్రశాంత్లు భూత్పూర్ మండలం అమిస్తాపూర్, దేవరకద్రలో ఆటో డ్రైవర్లుగా చెలామని అవుతూ అద్దె ఇళ్లలో ఉంటూ వివిధ ప్రాంతాలు తిరుగుతూ సెల్ఫోన్లను చోరీ చేసేవారు. ప్రధానంగా సంతలు, బస్టాండ్లు, జాతరలు తదితర జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని సెల్ఫోన్లను చాకచక్యంగా అపహరించేవారు. ఇలా అపహరించిన సెల్ఫోన్లను హైదరాబాద్లో తక్కువ ధరలకు విక్రయించేవారు. పట్టుబడ్డారు ఇలా.. ఈ నెల 23న కృష్ణారావు అనే వ్యక్తి కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా తన సెల్ఫోన్ను జడ్చర్ల కొత్త బస్టాండ్లో దొంగలు కొట్టేశారని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కొత్త బస్టాండ్లో నిఘా వేయగా నిందితులు తాము దొంగిలించిన ఫోన్లను హైదరాబాద్లో అమ్మేందుకు వెళ్తూ తమకు చిక్కినట్లు డీఎస్పీ తెలిపారు. వీరిలో వడ్డె గౌరీ, వడ్డే ప్రశాంత్లు తప్పించుకుని పారిపోగా.. మిగతా నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి శ్యాంసంగ్, ఐ ఫోన్లు తదితర కంపెనీలకు చెందిన మొత్తం 72 ఫోన్లను స్వాధీనపర్చుకున్నామని, వీటి విలువ దాదాపు రూ.5 లక్షలు ఉంటుందన్నారు. -
సాగునీటి కోసం ఉద్యమించాలి
భూత్పూర్ (దేవరకద్ర) : తెలంగాణ ప్రజలు సాగు, తాగునీటి కోసం ఉద్యమించాలని సామాజికవేత్త, సీనియర్ జర్నలిస్టు పొన్నాల గౌరీశంకర్ అన్నారు. కృష్ణా– సావిత్రి నదుల పరిక్రమ సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తిచేసి భూత్పూర్ వచ్చిన సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. కృష్ణానది నీళ్లు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల జన్మహక్కు అన్నారు. దక్షిణ భారతదేశ రాష్ట్రాల పరిపాలన సౌలభ్యం కోసం రెండో రాజధానితోపాటు ఉప పార్లమెంట్, ఉప రాజ్యసభ, ఇతర కేంద్ర కార్యాలయాలు హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని కోరుతూ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 6 వేల కి.మీ. సైకిల్యాత్ర చేపట్టానన్నారు. కృష్ణానది పుష్కరాల సందర్భంగా సైకిల్యాత్ర ప్రారంభించానని గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల్లో మాతృభాషలో పరిపాలన జరగాలని, ప్రాంతీయ విభేదాలతో రెండు రాష్ట్రాలుగా విడిపోయిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, నియామకాలు, నీళ్లు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. తాను కర్ణాటక, మహారాష్ట్రలో సైకిల్యాత్ర చేపడితే సైకిల్పై ఉన్న తెలుగు భాషతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర భాషల్లో బోర్డు రాసే వరకు తనను ఆయా రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర చేపట్టనీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ చేపట్టిన సంకల్పన యాత్ర యావత్ ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా జరుగుతుందని, ప్రత్యేక హోదాపై చేస్తున్న పోరాటాలు చేయడం సరైందేనన్నారు. అనంతరం ఆయన శ్రీశైలానికి సైకిల్పై బయలుదేరి వెళ్లారు. జడ్చర్లలో ఘన స్వాగతం.. జడ్చర్ల టౌన్ : పైరుపచ్చని తెలంగాణ సాధన, తెలుగును పరిపాలన భాషగా అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన జర్నలిస్టు గౌరీశంకర్ చేపట్టిన సైకిల్ యాత్ర శుక్రవారం జడ్చర్లకు చేరుకుంది. జడ్చర్ల ఫ్లైఓవర్ వద్ద సీఐ బాలరాజు ఆయనకు స్వాగతం పలికారు. పైరు పచ్చని తెలంగాణ రాష్ట్ర సాధననే తన యాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. నదుల అనుసంధానం ద్వారానే పైరుపచ్చని తెలంగాణ సాధ్యమని ప్రభుత్వం గుర్తించాలన్నారు. అందుకోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాటుపడాలన్నారు. అలాగే హైదరాబాద్ను దేశ రెండో రాజధానిగా చేయాలని, తద్వారా దక్షిణ భారతదేశానికి ప్రతిష్ట పెరుగుతుందన్నారు. దేశంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, జర్నలిస్టులకు జీతభత్యాలను ప్రభుత్వాలే ఇవ్వాలని, హెల్త్కార్డులు, అక్రిడిటేషన్ కార్డులను అందరికీ ఇవ్వాలని, పత్రికా రంగం విడిచిన వారికి పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. తన లక్ష్యాలు పూర్తయ్యే వరకు సైకిల్ యాత్ర కొనసాగిస్తానన్నారు. జడ్చర్ల నుంచి కర్నూలు, ఆత్మకూర్, శ్రీశైలం మీదుగా కల్వకుర్తి, హైదరాబాద్ వరకు ప్రస్తుత యాత్ర ముగిస్తానని ఆయన పేర్కొనన్నారు. -
చదవాలంటే.. నడవాల్సిందే!
రాజాపూర్ : ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి బాటలో పయనింపజేసేందుకు రూ.కోట్లు వెచ్చించి బీటీ రోడ్లు, అన్ని సౌకర్యాలు కల్పిస్తుండగా.. మరోవైపు బీటీ రోడ్డు సౌకర్యం ఉన్నా కూడా ఆర్టీసీ బస్సు సర్వీస్లు గ్రామాలకు కొనసాగకపోవడంతో ప్రజలు నిత్యం అవస్థలు ఎదుర్కొంటున్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు ఇటీవల బీటీ రోడ్లు వేయించారు. అయినా కూడా బస్సులు నడవకపోవడంతో విద్యార్థులు ఉన్నత చదవులు నిమిత్తం ఎండనకా.. వాననకా రోజూ కిలోమీటర్ల పొడవునా కాలినడకన నడవాల్సి వస్తుంది. ఉన్నత చదువులకు నడవాల్సిందే.. ఒకప్పుడు గ్రామాలకు రోడ్డు సౌకర్యం సరిగా లేదనే ఆరోపణతో ఆర్టీసీ అధికారులు గ్రామాలకు బస్సులను నడిపేవారు కాదు. కానీ, ప్రస్తుతం అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు ఉన్నా నేటికీ ఆర్టీసీ బస్సు సర్వీస్లు మాత్రం కొనసాగడంలేదు. దీంతో రవాణా సౌకర్యం లేక రైతులు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని తిర్మలాపూర్,కల్లేపల్లి, ఈద్గాన్పల్లి, రాయపల్లి, నందిగామ, చెన్నవెల్లి, కుచ్చర్కల్, దోండ్లపల్లి, కుత్నేపల్లి, చొక్కంపేట్ తదితర గ్రామాలకు చక్కటి బీటీ రోడ్లు ఉన్నా ఇక్కడ ప్రాథమిక విద్య మాత్రమే అందుబాటులో ఉంది. పై చదువుల కోసం రాజాపూర్, రంగారెడ్డిగూడ, తిర్మలాపూర్లలోని ఉన్నత పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ విద్య కోసం షాద్నగర్, జడ్చర్ల పట్టణాలకు వెళ్లాల్సి వస్తుంది. అయితే, బస్సు సౌకర్యం లేకపోవడంతో నిత్యం గ్రామం నుంచి జాతీయ రహదారి వరకు నాలుగైదు కిలోమీటర్లు విద్యార్థులు నడవాల్సి వస్తుంది. అటు నుంచి ప్రైవేట్ వాహనాల్లో పాఠశాలలు, కళాశాలలకు చేరుకుంటున్నారు. బస్సులే లేవు.. ఇక పాసులెందుకు? ఇదిలాఉండగా, విద్యార్థులకు ఆర్టీసి సంస్థ బస్సుల్లో ప్రయాణించేందుకు ఉచిత బస్సు పాసులు ఇస్తుంది.కానీ, బస్సులు లేకపోతే బస్సు పాసులెందుకని వారు ప్రశ్నిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఆటోలలో తమ పిల్లలను పక్క గ్రామాలకు చదువుకునేందుకు తప్పని పరీస్థితుల్లో పంపిస్తున్నారు. అంతేకాకుండ ప్రయివేటు వాహనాలను ఆశ్రయించడంతో ఒక్కోసారి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతి పల్లెకు ఆర్టీసీ బస్సు సర్వీస్ నడిపించాలని విద్యార్థులు, ప్రజలు కోరుతున్నారు. 6 కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది ప్రతి రోజు పై చదువుల కోసం గ్రామం నుంచి జాతీయ రహదారి వరకు ఉదయం, సాయంత్రం నడుచుకుంటూ వెళ్లి వస్తాం. రోజూ 6 కిలోమీటర్లు నడక తప్పదు. ఎండాకాలం అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఆర్టీసీ వారు విద్యార్థులకు బస్సుపాసులు ఇస్తున్నారు. బస్సులే లేనప్పుడు ఇక పాసులెందుకు. తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నాం. -
జడ్చర్ల– కోదాడ హైవే విస్తరణకు సర్వే
జడ్చర్ల: జడ్చర్ల– కోదాడ రహదారి విస్తరణ పనులకు ప్రాథమికస్థాయిలో సోమవారం సర్వే ప్రారంభమైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ రహదారి డీపీఆర్(డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) తయారుచేయాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే జడ్చర్ల వద్ద జాతీయ రహదారి నుంచి నల్గొండ జిల్లా మల్లేపల్లి వరకు సిబ్బంది సర్వే పనులు చేపట్టారు. రోడ్డు మధ్య నుంచి ఒక్కోవైపునకు 75అడుగుల మేర స్థలాన్ని సేకరించేందుకు కొలతలు తీసుకున్నట్లు తెలిసింది. జడ్చర్ల– కోదాడ రహదారి రెండు వరుసలా లేక నాలుగు వరుసలా అన్న సందిగ్ధంలో ఉన్న పరిస్థితుల్లో ఇటీవల సంబంధిత రాష్ట్రస్థాయి ఇంజనీరింగ్ అధికారులు నాలుగు వరుసల రహదారిగా మారనుందని అధికారులు ప్రకటించారు. -
సర్పంచ్ అభ్యర్థి భర్త కాల్చివేత