krishna dist
-
కాలుష్య కాసారంతో నిండిపోతున్న కృష్ణ కెనాల్ కాలువ...
-
కృష్ణా జిల్లాలో దొంగల బీభత్సం
-
137వ రోజు ముగిసిన వైఎస్ జగన్ పాదయాత్ర
సాక్షి, కృష్ణా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 137వరోజు ప్రజాసంకల్పయాత్రను ముగించారు. ప్రజలు సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసా ఇస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. ఆదివారం ఉదయం వైఎస్ఆర్ కాలనీ నుంచి జననేత పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం అంబాపురం, జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొత్తూరు, వెలగలేరు మీదుగా ముత్యాలంపాడు క్రాస్ చేరుకుని రాజన్న బిడ్డ పాదయాత్రను ముగించారు. రాత్రికి ఆయన అక్కడే బసచేస్తారు. నేడు వైఎస్ జగన్ 14.4 కిలోమీటర్లు నడిచారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు, నాయకులు బంద్లో పాల్గొనేందుకు వీలుగా రేపు పాదయాత్రకు వైఎస్ జగన్ విరామం ప్రకటించారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఏప్రిల్ 17న ఉదయం యథాప్రకారం ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమవుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
నందిగామలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు
-
జనపథం - దివిసీమ గ్రామాలు
-
గన్నవరంలో భూప్రకంపనలు
-
చదువు రాదని బాబా చెప్పాడంటూ..
► సూసైడ్ నోట్ రాసి విద్యార్థి ఆత్మహత్య ► కృష్ణా జిల్లా కోడూరులో ఘటన సాక్షి, అవనిగడ్డ: తనకు చదువు రాదని ‘బాబా’ చెప్పాడంటూ ఓ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా కోడూరులో జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. మందపాకల గ్రామానికి చెందిన అద్దేపల్లి శేష వెంకటరామకృష్ణ కుమారుడు శివసాయి మణికంఠ(17) కోడూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాగా, తనకు చదువు ఇష్టం లేదంటూ మణికంఠ గత నెల 12న ఇంట్లో నుంచి పారిపోయాడు. దీనిపై అతని తండ్రి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై వై.సుధాకర్ విజయవాడలో మణికంఠ ఆచూకీ కనుగొని.. తల్లిదండ్రులకు అప్పగించారు. ఎంపీసీ గ్రూప్ చదవలేనని చెప్పడంతో.. తల్లిదండ్రులు అతన్ని సీఈసీకి మార్చారు. ఈనేపథ్యంలో మణికంఠ రెండు రోజుల నుంచి కాలేజీకి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో మణికంఠ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, మణికంఠ వద్ద కుటుంబసభ్యులకు ఓ సూసైడ్నోట్ లభించింది. ‘అమ్మనాన్న చదువుకోమని చెబుతున్నారు. కానీ నాకు చదువు రాదని ఓ బాబా చెప్పాడు. దీంతో ఇటు చదువుకు, అటు పనికి దూరమవుతున్నానన్న మనస్తాపంతో చనిపోతున్నాను..’ అంటూ మణికంఠ సూసైడ్ నోట్లో రాశాడు. -
కృష్ణా జిల్లాలో టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
► రాజీనామాకు సిద్దమంటున్న ముద్రబోయిన వర్గం నూజివీడు: కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా తెలుగుదేశం రాజకీయాల్లో కీలకంగా ఉంటూ వస్తున్న కాపా శ్రీనివాసరావుకు, ముద్రబోయిన వెంకటేశ్వరరావు వర్గాల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొని ఉంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి కోసం గత కొంతకాలంగా రెండు గ్రూపుల మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. తాజాగా కాపా శ్రీనివాసరావుకు నూజివీడు ఏఎంసీ పదవి ఇవ్వాలని పార్టీ అథినేత నిర్ణయించినట్లు సమాచారం. అయితే కాపాకు పదవి ఇవ్వడాన్ని ముద్రబోయిన వర్గం వ్యతిరేకిస్తోంది. దీంతో ప్రస్తుతం పరిస్థతి రసవత్తరంగా మారింది. పదవిని దక్కించుకుకోవడానికి ఇరువర్గాలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకున్నాయి. అందులో ముద్రబోయిన వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. కాపా శ్రీనివాసరావుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పదవి ఇస్తే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని ముద్రబోయిన వర్గం నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
కృష్ణా జిల్లాలో వర్షం
విజయవాడ: రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. కాగా తాజాగా కృష్ణా జిల్లాలో పలు చోట్ల వర్షం కురిసింది. విజయవాడ, గొల్లపూడి, గన్నవరం, గుడ్లవల్లేరు, హనుమాన్ జంక్షన్, నందివాడ, గుడివాడల్లో వర్షం కురిసింది. పలు రోడ్లు జలమయం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వేసవి ప్రారంభంలోనే విపరీత ఎండలతో సతమతమవుతున్న జిల్లా వాసులకు కొంత చల్లదనం పలకరించనట్లు ఉపశమనం పొందారు. -
కృష్ణా జిల్లాలో వేధింపులకు కేరాఫ్గా మారిన బాస్
-
కృష్ణా జిల్లాలో రెచ్చి పోతున్న మట్టి మాఫియా
-
వర్దా’ ఎఫెక్ట్
దక్షిణ కోస్తాకు భారీ వర్షసూచన ఆకాశం మేఘావృతం కావటంతో రైతుల్లో ఆందోళన తీరంలో పెరిగిన అలల ఉధృతి చేపల వేటకు విరామం అప్రమత్తమైన అధికార యంత్రాంగం సకాలంలో సాగునీరు అందలేదు. పాలకులు పట్టించుకోలేదు. వరుణుడు కరుణించడంతో నారుపోశారు. ఆ తర్వాత కూడా కాలువలకు నీరు విడుదల చేయలేదు. నారు ముదిరిపోతుండడంతో పుడమితల్లిని నమ్ముకుని నాట్లు వేశారు. నానా పాట్లు పడి ఇంజిన్ల ద్వారా నీరు పెట్టారు. పంట చేతికొచ్చింది. ఆనందంగా కోతలకు సిద్ధమవుతున్న వేళ అన్నదాతల గుండెల్లో ‘తుఫాన్’ మొదలైంది. మచిలీపట్నం/కోడూరు : ఆకాశంలో కమ్ముకొస్తున్న కారుమేఘాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సముద్రంలో ఉధృతంగా ఎగసిపడుతున్న అలలు తీర ప్రాంతావాసులను వణికిస్తున్నాయి. ఒక్కసారిగా పెరిగిన చల్లగాలులకు జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. ‘వర్దా’ పెను తుఫాన్ ప్రభావం వల్ల జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండడంతో వర్షం కురుస్తుందేమోనని రైతులు అల్లాడిపోయారు. వర్షం కురిస్తే చేతికందే దశలో ఉన్న వరిపంట నీట మునుగుతుందనే భయంతో రైతులు ఉరుకులు, పరుగులు పెట్టారు. ఇప్పటికే వరికోత కోసి ఉన్న పైరును కుప్పలు వేయటం, నూర్పిడి చేసే పనులను హడావుడిగా చేపట్టారు. కుప్పల నూర్పిడి అనంతరం ధాన్యాన్ని త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేర్చుకున్నారు. వరికోతలను వాయిదా వేశారు. మరికొందరు భారీ వర్షం కురిస్తే పంట దెబ్బతింటుందనే భయంతో యంత్రాల ద్వారా కోతలు పూర్తిచేస్తున్నారు. జిల్లాపై సోమవారం తుఫాన్ ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత మండలాల్లో అధికారులు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు తుఫాన్ ప్రభావంతో పాలకాయతిప్ప వద్ద సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఆదివారం ఉదయం వరకు సముద్రంలో సాధారణ పరిస్థితులే ఉన్నప్పటికీ మధ్యాహ్నానికి పూర్తిగా మారిపోయింది. అలలు ఉధృతి పెరగడంతోపాటు సముద్రం కొంతమేర ముందుకు చొచ్చుకువచ్చింది. తుఫాన్ ప్రభావంతో మత్స్యకారులు చేపల వేటకు విరామం ప్రకటించారు. ఫైబర్ బోట్లు, వలలను భద్రపరుచుకున్నారు. రేపటి వరకు ప్రభావం ‘వర్దా’ పెను తుఫాన్ సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు చెన్నైకి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని ప్రకటించిన వాతావరణ శాఖ... ఈ నెల 13 వరకు తుపాను ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని 7 నుంచి 19 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే తుఫాన్ గమనం చెన్నై వైపు ఉన్నప్పటికీ జిల్లాలో కొద్దిపాటి వర్షం కురిసినా వరి దెబ్బతినే ప్రమాదం ఉంది. -
కృష్ణాజిల్లా హాకీ జట్ల ఎంపిక
విజయవాడ స్పోర్ట్స్: అనంతపురంలో ఈ నెల 29 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు జరిగే ఏడవ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల హాకీ చాంపియన్షిప్, అక్టోబరు 7 నుంచి 10వ తేదీ వరకు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగే సబ్ జూనియర్ రాష్ట్ర బాలుర హాకీ చాంపియన్షిప్లో పాల్గొనే జిల్లా జట్లను స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం ఎంపిక చేశారు. జట్టు సభ్యుల వివరాలను హాకీ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి ఎస్.రామకృష్ణ విడుదల చేశారు. ఎంపికైన జట్టు సభ్యులను శాప్ ఓఎస్డీ పి.రామకృష్ణ అభినందించారు. ఆయన మాట్లాడుతూ, జాతీయ క్రీడ హాకీ అభివృద్ధికి సహకారం అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాప్ మోనిటరింగ్ అధికారి పి.అజయ్కుమార్, అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి కె.రాజశేఖర్, హాకీ కోచ్ ఎస్.హరికృష్ణ, సీనియర్ క్రీడాకారుడు అబ్దుల్ కరీం పాల్గొన్నారు. బాలికల జూనియర్ జట్టు : ఎస్.కె.సుమియా, ఎల్.విషితా, ఎ.నందిని, పి.ఆశ్రిత, జి.దివ్యశ్రీ, ఎన్.నిఖిత, ఎస్.డి.చాందిని, ఎం.డి.∙హజరా, ఎస్.అపర్ణ, యు.రూప, జి.స్నేహ, ఎం.డి.అసి ఫా, ఎస్.అదిద్యుతి, శ్రీపదలావణ్య, ఇ.యామి ని, పి.రమ్య, ఉమా సుప్రియాంక, ఎస్.సరస్వ తి ఎంపిక కాగా, స్టాండ్బైగా ఎం.జోత్సS్న, ఎం.శ్రావణి, బి.పండు, ఎం.మానస ఎంపికయ్యారు. బాలుర స»Œ æజూనియర్ జట్టు: సీహెచ్.అర్యవర్థన్, డి.రవికుమార్, డి.సందీప్, జి.వేణుగోపాల్, కె.నరసింహ, పి.రాఘవేంద్రరావు, జి.శివప్రమోద్, ఎన్.యశ్వంత్చౌదరి, ఎస్.డి.మహ్మద్బాషా, వి.సాయి, టి.మల్లేష్, జి.వెంకటసాయి, పి.అఖిల్బాబు, జి.నిఖిల్కుమార్, బి.టి.భరత్, వై.వెంకటేశ్వరరావు, బి.చక్రధర్సాయి ఆదిత్య, పవన్ వెంకటసాయితేజ, ఎంపిక కాగా, స్టాంyŠ బైగా టి.శ్రీను, ఎం.సాయిధీరజ్, పి.బాలశివసాయి, బి.శివచైతన్య ఎంపికయ్యారు. -
ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
మచిలీపట్నం :జిల్లాలో స్థానిక సంస్థలకు వివిధ కారణాలతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను జారీ చేసింది. పెడన మండల పరిషత్ అధ్యక్షులు, పమిడిముక్కల, ఆగిరిపల్లి మండలాల్లో కో–ఆప్టెడ్ మెంబర్ల ఎన్నిక 29వ తేదీన జరగనుంది. మండవల్లి జెడ్పీటీసీ సభ్యురాలు మరణించటంతో పాటు వివిధ కారణాలతో జిల్లాలో 15 ఎంపీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నట్లు జెడ్పీ ఇన్చార్జి సీఈవో టి దామోదరనాయుడు సోమవారం తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అక్టోబరు 20వ తేదీ నాటికి ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఎన్నికల కమీషన్ ఆదేశించినట్లు ఆయన చెప్పారు. మండవల్లి జెడ్పీటీసీతో పాటు ఖాళీగా ఉన్న ఎంపీటీసీ స్థానాలు నందిగామ (పెడన మండలం), వెంట్రప్రగడ –1, దోసపాడు, వానపాముల (పెదపారుపూడి మండలం), కొండపల్లి–8 (ఇబ్రహీంపట్నం), మెరకనపల్లి (మోపిదేవి), రంగన్నగూడెం (బాపులపాడు), పోలాటితిప్ప (మచిలీపట్నం), వేదాద్రి (జగ్గయ్యపేట), పెనుగొలను–2 (గంపలగూడెం), గొల్లమంద (ఎ.కొండూరు), రమణక్కపేట (ముసునూరు), కనసానపల్లి (ఆగిరిపల్లి), చందర్లపాడు –1 (చందర్లపాడు), గూడవల్లి –2 (విజయవాడ రూరల్) స్థానాలకు ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. -
మద్యం అలవాటును ప్రోత్సహిస్తున్న సర్కారు
-
సమైక్యాంధ్రకు మద్దతుగా ముస్లిం మైనార్టీల ర్యాలీ