krishna vamshi
-
ఓటీటీలో 'అలనాటి రామచంద్రుడు'.. వారిద్దరికీ ఫస్ట్ సినిమానే
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ హీరోగా పరిచయం అయిన సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. మోక్ష హీరోయిన్గా నటించారు. ఈ మూవీతో వీరిద్దరూ టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మించారు.‘అలనాటి రామచంద్రుడు’ సినిమా ఆగష్టు 2 విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. సుమారు రెండు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా సడెన్గా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, కేశవ్ దీపక్, వెంకటేష్ కాకుమాను కీలక పాత్రల్లో కనిపించారు.కథేంటంటే.. సిద్ధు(కృష్ణ వంశీ) ఇంట్రోవర్ట్. చిన్నప్పటి నుంచి ఇతరులో మాట్లాడాలన్నా..స్టేజ్పై స్పీచ్ ఇవ్వాలన్నా చాలా భయం. ధరణి(మోక్ష) ఎక్స్ట్రావర్ట్. ఒంటరిగా ఉన్నా..తనచుట్టు నలుగురు పోగయ్యేలా చేసే రకం. ఇద్దరిది ఒకే కాలేజీ. తనకు పూర్తి భిన్నంగా ఉన్న ధరణి అంటే సిద్ధుకి చాలా ఇష్టం. కానీ ఆ విషయాన్ని ఆమెకు చెప్పలేక..తన మెమెరీస్ని రికార్డు చేసి క్యాసెట్ల రూపంలో దాచుకుంటాడు. దరణితో స్నేహం ఏర్పడినా తన ప్రేమ విషయాన్ని చెప్పడానికి భయపడిపోతాడు. ఓ రోజు ధైర్యం చేసి తన ప్రేమ విషయాన్ని చెప్పాలనుకుంటాడు. అంతలోనే ధరణికి బాయ్ఫ్రెండ్ ఉన్నాడని..అతని పేరు విక్రమ్(సుప్రజ్) అని తెలుస్తుంది. ఆ తర్వాత సిద్దు ఏం చేశాడు? అసలు ధరణికి విక్రమ్ ఎలా పరిచయం అయ్యాడు? విక్రమ్తో కలిసి మనాలి వెళ్లాలనుకున్న దరణి..ఒంటరిగానే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సిద్దు మనాలి ఎందుకు వెళ్లాడు? ధరణి గతం మర్చిపోవడానికి గల కారణం ఏంటి? అసలు సిద్ధు తన ప్రేమ విషయాన్ని ధరణికి చెప్పాడా?లేదా? చివరకు సిద్దు, ధరణిలు ఎలా కలిశారు? అనేదే మిగతా కథ. -
‘అలనాటి రామచంద్రుడు’ మూవీ రివ్యూ
టైటిల్: అలనాటి రామచంద్రుడునటీనటులు: కృష్ణ వంశీ, మోక్ష, బ్రహ్మాజీ, సుధ, ప్రమోదిని, కేశవ్ దీపక్ , వెంకటేష్ కాకుమాను, చైతన్య గరికిపాటి, దివ్య శ్రీ గురుగుబెల్లి, స్నేహమాధురి శర్మ తదతరులునిర్మాత: హైమావతి, శ్రీరామ్ జడపోలుదర్శకత్వం: చిలుకూరి ఆకాష్ రెడ్డిసంగీతం: శశాంక్ తిరుపతిసినిమాటోగ్రఫీ: ప్రేమ్ సాగర్ఎడిటర్: జే సి శ్రీకర్విడుదల తేది: ఆగస్ట్ 2, 2024ప్రస్తుతం సినీ ప్రేక్షకుల అభిరుచి మారింది. కంటెంట్ బాగుంటే చాలు హీరోహీరోయిన్లు ఎవరనేది పట్టించుకోవడం లేదు. అందుకే ప్రస్తుతం మన దర్శకనిర్మాతలు కంటెంట్ను నమ్ముకొని కొత్త నటీనటులతో సినిమాలు తీస్తున్నారు. అలా కొత్త నటీనటులతో తెరకెక్కిన చిత్రమే ‘అలనాటి రామచంద్రుడు’. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై బజ్ ఏర్పడింది. ఓ మంచి లవ్స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(ఆగస్ట్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. సిద్ధు(కృష్ణ వంశీ) ఇంట్రోవర్ట్. చిన్నప్పటి నుంచి ఇతరులో మాట్లాడాలన్నా..స్టేజ్పై స్పీచ్ ఇవ్వాలన్నా చాలా భయం. ధరణి(మోక్ష) ఎక్స్ట్రావర్ట్. ఒంటరిగా ఉన్నా..తనచుట్టు నలుగురు పోగయ్యేలా చేసే రకం. ఇద్దరిది ఒకే కాలేజీ. తనకు పూర్తి భిన్నంగా ఉన్న ధరణి అంటే సిద్ధుకి చాలా ఇష్టం. కానీ ఆ విషయాన్ని ఆమెకు చెప్పలేక..తన మెమెరీస్ని రికార్డు చేసి క్యాసెట్ల రూపంలో దాచుకుంటాడు. దరణితో స్నేహం ఏర్పడినా తన ప్రేమ విషయాన్ని చెప్పడానికి భయపడిపోతాడు. ఓ రోజు ధైర్యం చేసి తన ప్రేమ విషయాన్ని చెప్పాలనుకుంటాడు. అంతలోనే ధరణికి బాయ్ఫ్రెండ్ ఉన్నాడని..అతని పేరు విక్రమ్(సుప్రజ్) అని తెలుస్తుంది. ఆ తర్వాత సిద్దు ఏం చేశాడు? అసలు ధరణికి విక్రమ్ ఎలా పరిచయం అయ్యాడు? విక్రమ్తో కలిసి మనాలి వెళ్లాలనుకున్న దరణి..ఒంటరిగానే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సిద్దు మనాలి ఎందుకు వెళ్లాడు? ధరణి గతం మర్చిపోవడానికి గల కారణం ఏంటి? అసలు సిద్ధు తన ప్రేమ విషయాన్ని ధరణికి చెప్పాడా?లేదా? చివరకు సిద్దు, ధరణిలు ఎలా కలిశారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..ప్రేమ కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. అయితే లవ్స్టోరీలో కొంచెం వైవిధ్యం ఉంటే చాలు సినిమాను ఆదరిస్తారు ప్రేక్షకులు. దర్శకుడు చిలుకూరి ఆకాశ్ రెడ్డి కూడా ఓ డిఫరెంట్ లవ్స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఓ స్వచ్ఛమైన ప్రేమకథకి ఫాదర్ సెంటిమెంట్ యాడ్ చేసి అన్నివర్గాల ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా కథను రాసుకున్నాడు. అయితే అనుకున్న కథను అంతే ఆసక్తికరంగా తెరపై చూపించడంలో తడబడ్డాడు. సంభాషణల్లో ఉన్న డెప్త్.. సన్నివేశాల్లో కనిపించలేదు. డాటర్-ఫాదర్ సెంటిమెంట్ సీన్లను మాత్రం చక్కగా తీర్చిదిద్దాడు. ఆ సీన్లన్నీ అలా గుర్తుండిపోతాయి. అయితే హీరో హీరోయిన్ల లవ్స్టోరీ మాత్రం రొటీన్గానే ఉంటుంది. కాలేజీ సీన్లు, తన ప్రేమ విషయాన్ని హీరోయిన్కి చెప్పేందుకు హీరో చేసే ప్రయత్నాలు అన్నీ రొటీన్గానే ఉంటాయి. హృదయాలను హత్తుకునే పాటలు.. మంచి నేపథ్య సంగీతం కారణంగా కథనం రొటీన్గా సాగినా ఫస్టాఫ్ బోర్ కొట్టదు. కానీ సెకండాఫ్లో కథనాన్ని నెమ్మదిగా సాగిస్తూ.. బోర్ కొట్టించేలా చేశాడు. మనాలిలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్లు బాగుంటాయి. ముఖ్యంగా వాళ్ల చిన్ననాటి ప్లాష్బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. మనాలి నుంచి హీరోహీరోయిన్లు తిరిగి వచ్చిన తర్వాత కథనం సాగదీతగా అనిపిస్తుంది. ఒకనొక దశలో ఇంకా శుభం కార్డు పడట్లేదే అనిపిస్తుంది. సెకండాఫ్ని ఇంకాస్త ఆసక్తికరంగా మలిచి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో హీరోహీరోయిన్..ఇద్దరూ కొత్తవాళ్లే అయినా చక్కగా నటించారు. ఇంట్రోవర్ట్ సిద్ధు పాత్రకి కృష్ణవంశీ న్యాయం చేశాడు. మొదటి సినిమానే అయినా.. చక్కగా నటించాడు. ఇక ధరణి పాత్రలో మోక్ష ఒదిగిపోయింది. తెలుగులో తొలి సినిమాతోనే మంచి పాత్ర లభించింది. డ్యాన్స్తో పాటు ఎమోషనల్ సీన్లలో కూడా చక్కగా నటించింది. హీరోయిన్ తండ్రిగా బ్రహ్మాజీ తెరపై కనిపించేది కాసేపే అయినా.. ఆ పాత్ర గుర్తుండిపోతుంది. సుధ, ప్రమోదిని, కేశవ్ దీపక్ , వెంకటేష్ కాకుమాను, చైతన్య గరికిపాటి, దివ్య శ్రీ గురుగుబెల్లితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. శశాంక్ తిరుపతి సంగీతం సినిమాకు ప్లస్ అయింది. హృదయాలను హత్తుకునే పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతం అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సన్నివేశాన్ని తెరపై రిచ్గా కనిపించేలా చేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
సరికొత్త ప్రేమ కథ
కృష్ణవంశీ, మోక్ష జంటగా చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. హైనివా క్రియేషన్స్పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ని విడుదల చేశారు మేకర్స్. ‘‘అలనాటి రామచంద్రుడు’ సరికొత్త ప్రేమ కథా చిత్రం. కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇది. షార్ట్ ఫిల్మ్స్ తీసి అవార్డులు అందుకున్న ఆకాష్ రెడ్డి తొలిసారి దర్శకునిగా అడుగుపెడుతున్నాడు’’ అన్నారు హైమావతి, శ్రీరామ్ జడపోలు. ‘‘మా సినిమా చిరుజల్లుల్లా హాయిగా ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు చిలుకూరి ఆకాష్ రెడ్డి. ఈ చిత్రానికి అసోసియేట్ నిర్మాత: విక్రమ్ జమ్ముల, కెమెరా: ప్రేమ్ సాగర్, సంగీతం: శశాంక్ తిరుపతి, లైన్ ప్రొడ్యూసర్: అవినాష్ సామల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గద్దల అన్వేష్. -
ఆయన నటనలోని మ్యాజిక్ని చూశా: ప్రకాశ్రాజ్
ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. కృష్ణవంశీ దర్శకత్వంలో కాలిపు మధు, ఎస్. వెంకట్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రకాశ్రాజ్ మాట్లాడుతూ.. ‘‘మరాఠీ ‘నటసామ్రాట్’ సినిమా చూశాక ఒక కళాకారుడి జీవితంలో ఉన్న బరువు నాకు అర్థం అయింది. ఇలాంటి కథను నేను చూపించాలని అనుకున్నాను. ‘నటసామ్రాట్’ గురించి కృష్ణవంశీకి చెప్పగానే బాగుందన్నాడు. ఎమోషన్స్ చక్కగా ప్రెజెంట్ చేయగలడని తనని ఈ సినిమా రీమేక్ ‘రంగ మార్తాండ’కు దర్శకత్వం వహించమని కోరాను. బ్రహ్మానందంగారితో కలిసి వర్క్ చేయడం వల్ల ఆయన నటనలోని మ్యాజిక్ను చూసే అవకాశం దొరికింది’’ అన్నారు. ‘‘ప్రకాశ్రాజ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. ఎన్నో సినిమాల్లో నటించిన అనుభవం ఉన్న అద్భుత నటులు బ్రహ్మానందం ఈ సినిమా కోసం కొత్త ఆర్టిస్టులా నటించారు’’ అన్నారు కృష్ణవంశీ. ‘ఈ చిత్రం క్లయిమాక్స్లో ప్రకాశ్రాజ్ నట విశ్వరూపం చూస్తారు. ప్రతి సీన్ని కృష్ణవంశీ చక్కగా తెరకెక్కించారు’’ అన్నారు బ్రహ్మానందం. -
అప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయాను: కృష్ణ వంశీ
‘‘రంగమార్తాండ’ సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత ఒక చిన్నారి నా వద్దకు వచ్చి, ‘నేను మా అమ్మానాన్నలను బాగా చూసుకుంటాను’ అని చెప్పడం విశేషం. ప్రతిఒక్కరూ తమ తల్లితండ్రులతో కలిసి ఈ సినిమాను చూడాలి’’ అని డైరెక్టర్ కృష్ణవంశీ అన్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక జంటగా నటించిన చిత్రం ‘రంగమార్తాండ’. హౌస్ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఉగాది కానుకగా ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో చిత్ర దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ–‘‘రంగమార్తాండ’ సినిమాకి ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణల అద్భుతమైన నటన, ఇళయరాజాగారి సంగీతం, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి సాహిత్యం.. ఇలా అన్నీ అద్భుతంగా కుదిరాయి. రమ్యకృష్ణ కళ్లు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. దీంతో ఎలాంటి పెద్ద డైలాగులు లేకుండా కళ్లతోనే నటించాలని చెప్పినప్పుడు తను సరేనంది. ఈ మూవీ క్లైమాక్స్లో రమ్యకృష్ణపై సన్నివేశాలు తీసేటప్పుడు చాలా బాధపడ్డాను. దాదాపు 36 గంటల పాటు ఈ సీన్స్ తీశాను. అప్పుడు నాకు సెంటిమెంట్ అడ్డొచ్చింది.. చిత్రీకరిస్తుంటే కంట్లో నుంచి నాకు నీళ్లు వస్తూనే ఉన్నాయి’’ అన్నారు. ‘‘కృష్ణవంశీగారి దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ వంటి మంచి సినిమా చేయడం నా అదృష్టం’’ అన్నారు సింగర్, నటుడు రాహుల్ సిప్లిగంజ్. -
రమ్యకృష్ణను అలా చూసి ఏడ్చేశా.. రోజంతా నిద్రపట్టలేదు: కృష్ణ వంశీ
ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానంతం ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం రంగమార్తాండ. రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్, శివాత్మిక రాజశేఖర్ ముఖ్య పాత్రలు పోషించగా ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీ ఫిలిం నటసామ్రాట్కు రీమేక్గా రూపొందిన ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఈ నెల 22న విడుదలవుతుండటంతో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. ఈ క్రమంలో డైరెక్టర్ కృష్ణవంశీ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 'రమ్యకృష్ణ పాత్ర పవర్ఫుల్గా డిజైన్ చేశా. మా ఇంట్లో ఏ నిర్ణయమైనా నా భార్యే తీసుకుంటుంది. ఒకవేళ రమ్య లేనప్పుడు మేము నిర్ణయం తీసుకున్నా దానిలో మార్పులు చేర్పులు చేయమని సూచిస్తుంటుంది. కానీ, నేను పెద్దగా పట్టించుకోను.. అది వేరే విషయం. ఇకపోతే రమ్యకు శక్తివంతమైన కళ్లు ఉన్నాయి. అరుపులు, కేకలు కాకుండా కళ్లతోనే నటించాలనగానే ఆమె ఈ సినిమా ఒప్పుకుంది. తన మేకప్, హెయిర్ స్టైల్ తనే చేసుకుంది. తనెప్పుడూ ఒక విజన్తో ముందుకెళ్తుంది. ఈ సినిమాలో లాస్ట్ చాప్టర్లో తనను షూట్ చేయడానికి చచ్చిపోయాననుకో! దాదాపు 36 గంటలపాటు షూటింగ్ జరిగింది. తనను ఆ సీన్లో చిత్రీకరించడానికి సెంటిమెంట్ అడ్డొచ్చింది, కానీ తప్పదు కదా! షూట్ చేస్తుంటే కళ్ల వెంబడి నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆ రాత్రి నేను సరిగా నిద్రపోలేకపోయాను. ఒకరకంగా చెప్పాలంటే గుండె రాయి చేసుకుని షూటింగ్ చేశా' అని చెప్తూ కంటతడి పెట్టుకున్నాడు కృష్ణవంశీ. -
స్టార్ డాటర్తో రాహుల్ సిప్లిగంజ్.. వీడియో సాంగ్ విడుదల
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ హీరోగా నటిస్తున్న చిత్రం రంగమార్తాండ.కృష్ణవంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాహుల్కు జోడీగా శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్గా నటించింది. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసిన మూవీ టీం తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ సాంగ్ను విడుదల చేసింది. ‘పొదల పొదల గట్ల నడుమ లగోరంగ లగోరే..పొడుస్తుంటే చందమామ లగోరంగ లగోరే’ అంటూ సాగే పాటను రిలీజ్ చేసింది. ఇళయరాజా స్వరపరిచిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించాడు. రాహుల్ సిప్లి గంజ్ ఈ పాటను ఆలపించాడు. -
‘ఖడ్గం’లో ఆ సీన్ చేస్తుండగా నన్ను హేళన చేశారు: నటి సంగీత
నటి సంగీత.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకే ఒక్క చాన్స్ అంటూ ఖడ్గం చిత్రంలో ఆమె చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఈ చిత్రంతోనే సంగీత హీరోయిన్గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆకట్టుకుంది. ఆ తర్వాత పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా, సంక్రాంతి వంటి చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరైంది. చివరగా 2010లో కారా మజాకా చిత్రంలో కనిపించిన సంగీత ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చింది. దాదాపు 10ఏళ్ల విరామం అనంతరం మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల మసూద చిత్రంతో పలకరించిన ఆమె గతంలో ఖడ్గం మూవీపై ఆమె చేసిన కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె ఖడ్గం మూవీ సమంయలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. ఈ సినిమా సంగీత ఫుల్ జూవేల్లరితో సినిమా చాన్స్ల కోసం సిటీకి వచ్చిన పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సీన్లో తనకు వేసిన మేకప్ అసలు నచ్చలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కృష్ణవంశీకి పిచ్చా అన్నారు: సంగీత ‘‘ఖడ్గం’ సినిమాలో నా ఎంట్రీ సీన్ మేకప్ నాకు మైనస్ అయ్యింది. అది నాకు అసలు నచ్చలేదు. దాంట్లో నన్ను నేను చూసుకోలేకపోయా. చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. అయితే అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆ సీన్ షూటింగ్ జరిగింది. షూట్ అనంతరం చిత్ర యూనిట్ అంతా నా దగ్గరికి వచ్చి ‘మీరు బాగా చేశారు. షాట్ చాలా బాగా వచ్చింది’ అని ప్రశంసించారు. కానీ షూటింగ్ చూడటానికి వచ్చిన పబ్లిక్ మాత్రం ‘ఈమె హీరోయిన్ ఏంటీ?’ అంటూ హేళన చేశారు. ‘కృష్ణవంశీకి పిచ్చా. ఈమెను హీరోయిన్గా తీసుకున్నారేంటి’ అంటూ విమర్శించారు’’ అని సంగీత చెప్పుకొచ్చింది. ఇక పెళ్లికి ముందు సంగీతకు పెళ్లి తర్వాత సంగీతకు తేడా ఏంటి? అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ ‘నాకు నా భర్త ఎలాంటి షరతులు పెట్టలేదు’ అని చెప్పారు. ఆ తర్వాత తనకు పడుకోవడమంటే చాలా ఇష్టమని, వదిలేస్తే 24 గంటలు పడుకూనే ఉంటానంది. తన బెస్ట్ హాలిడే స్పాట్ ఏంటని అడగ్గా.. తన ఇల్లే తనకు బెస్ట్ హాలిడే స్పాట్ అంటూ ఆసక్తిగా సమాధానం ఇచ్చింది. చదవండి: 30 ఏళ్ల తర్వాత జీవిత రాజశేఖర్ రీఎంట్రీ, సూపర్ స్టార్కు చెల్లిగా.. అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. -
కృష్ణవంశీ, క్రిష్, విక్రమ్ కె. కుమార్, హను రాఘవపూడి వెబ్ సిరీస్లివే!
ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అంటే గతంలో థియేటరే.. కానీ, ప్రస్తుతం బుల్లితెర కూడా ఇంటిల్లిపాదికీ వినోదం పంచుతోంది. పైగా కరోనా లాక్డౌన్లో ప్రేక్షకులకు ఓటీటీలు మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యాయి. ఇంట్లో కూర్చునే అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్లు, షోలు చూస్తున్నారు. వెబ్ సిరీస్లకు ఆదరణ బాగా ఉండటంతో సినిమా దర్శకులు సైతం ‘ఓటీటీకి సై’ అంటూ డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే పలువురు దర్శకులు ఓటీటీలోకి ఎంటర్ కాగా తాజాగా ఈ జాబితాలోకి కృష్ణవంశీ, క్రిష్, విక్రమ్ కె. కుమార్, హను రాఘవపూడి వంటి దర్శకులు చేరారు. ఈ దర్శకుల ఓటీటీ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాక్షన్, యాక్షన్, లవ్, ఫ్యామిలీ.. ఇలా ఏ జోనర్ సినిమా అయినా తన మార్క్ చూపించారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. ఆయన దర్శకత్వం వహించిన ‘రంగ మార్తాండ’ చిత్రం రిలీజ్కు రెడీ అవుతోంది. తదుపరి ప్రాజెక్ట్గా దాదాపు రూ. 300 కోట్లతో ఓ వెబ్ సిరీస్ చేయనున్నట్లు ఈ మధ్యనే ప్రకటించారు కృష్టవంశీ. తెలంగాణ సాయుధ పోరాటాన్ని వెబ్ సిరీస్గా మలచనున్నట్లు తెలిపారాయన. ఒక్కో సీజన్కు 10 ఎపిసోడ్స్ చొప్పున 5 సీజన్స్గా ఈ సిరీస్ని రూపొందించనున్నారట. ఇక సమాజంలోని వాస్తవ అంశాలను, నవలలను, చారిత్రక అంశాలను కథలుగా మలిచి వెండితెరపైకి తీసుకురావడంలో క్రిష్ జాగర్లమూడిది ప్రత్యేక శైలి. ఇప్పటికే ‘మస్తీస్, 9 అవర్స్’ వంటి వెబ్ సిరీస్లకు షో రన్నర్గా వ్యవహరించిన ఆయన తొలిసారి ఓ వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేయనున్నారని టాక్. ఒక వేశ్య జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుందట. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా ‘హరి హర వీర మల్లు’ షూటింగ్లో బిజీగా ఉన్న క్రిష్ ఆ తర్వాత ఈ వెబ్ సిరీస్ను పట్టాలెక్కిస్తారని భోగట్టా. కాగా ‘కన్యాశుల్కం’ నవలను కూడా వెబ్ సిరీస్గా తీయాలనుకుంటున్నార ట క్రిష్. మరో దర్శకుడు విక్రమ్ కె. కుమార్ వినూత్న కథాంశాలతో ‘24’, ‘మనం’ వంటి సినిమాలు తెరకెక్కించారు. ప్రేమ కథలతో యువతని, కుటుంబ కథలతో ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసిన విక్రమ్ కె. కుమార్ బుల్లితెర ప్రేక్షకులను భయపెట్టనున్నారు. తొలిసారి ఆయన ‘దూత’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ ద్వారా హీరో నాగచైతన్య ఫస్ట్ టైమ్ డిజిటల్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ‘మనం, థ్యాంక్యూ’ చిత్రాల తర్వాత చైతన్య–విక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘దూత’ హారర్, థ్రిల్లర్ జానర్లో ఉంటుందని సమాచారం. నాగచైతన్య పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. ఇందులో హీరోయిన్లు పార్వతి, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఓ ప్రముఖ ఓటీటీలో ‘దూత’ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ‘అందాల రాక్షసి’ వంటి ప్రేమకథా చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, గత శుక్రవారం విడుదలైన ‘సీతారామం’ వరకూ ప్రేమకథా చిత్రాలను తెరకెక్కిస్తూ లవ్స్టోరీస్ స్పెషలిస్టు అనిపించు కున్నారు హను రాఘవపూడి. ప్రేమకథలకు సెంటిమెంట్, భావోద్వేగాలను జత చేసే ఆయన తొలిసారి ఓ వెబ్ సిరీస్కి పచ్చజెండా ఊపారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ త్వరలో సెట్స్పైకి వెళ్లనుంది. అయితే ఈ సిరీస్లోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివ రాలు అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఓటీటీ ప్రాజెక్ట్స్ ప్రకటించినవారిలో దర్శకుడు తేజ ఉన్నారు. హిందీలో ఓ వెబ్ సిరీస్ చేయనున్నట్లు ఆ మధ్య ప్రకటించారాయన. అయితే ఈ ప్రాజెక్ట్ వివరాలు తెలియాల్సి ఉంది. కొందరు యువదర్శకులు కూడా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ ‘పిట్ట కథలు’లో ఓ ఎపిసోడ్కి దర్శకత్వం వహించారు. తాజాగా సోనీ లివ్ కోసం ఓ వెబ్ సిరీస్ కమిట్ అయ్యారు. అలాగే ‘బెస్ట్ యాక్టర్స్, సప్తగిరి ఎక్స్ప్రెస్, వజ్ర కవచధర గోవింద’ వంటి సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు అరుణ్ పవార్ ‘బిగ్ బాస్’ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ ప్రధాన పాత్రలో ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ‘అసుర’ మూవీ డైరెక్టర్ కృష్ణ విజయ్ కూడా ‘పరంపర’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు. గోపీచంద్ హీరోగా ‘పంతం’ సినిమాని తెరకెక్కించిన కె. చక్రవర్తి రెడ్డి ‘పులి–మేక’ అనే ఓ వెబ్ సిరీస్కి దర్శకత్వం వహిస్తున్నారు. ఆది సాయికుమార్, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ సిరీస్ షూటింగ్ జరుపుకుంటోంది. వీరితో పాటు మరికొందరు దర్శకులు వెబ్ సిరీస్ల కోసం కథలు సిద్ధం చేసుకుంటున్నారు. -
హిట్టు కోసం అలా చేయడం నాకు చేతకాదు : కృష్ణవంశీ
ట్రెండ్ అనేది ఉందా? నో అంటారు కృష్ణవంశీ. ప్రేక్షకుల మైండ్సెట్ మారిందా? అస్సలు కానే కాదు అంటారు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ ఇంకా చాలా విషయాలు చెప్పారు. ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ముఖ్య తారలుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగ మార్తాండ’. మరాఠీ చిత్రం ‘నట సామ్రాట్’కి రీమేక్గా రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్లో విడుదల కానుంది. ఇక కృష్ణవంశీ ఇంటర్వ్యూలోకి వెళదాం... ► మీ కెరీర్లో ‘రంగ మార్తాండ’ రెండో రీమేక్ (నాగార్జునతో తీసిన ‘చంద్రలేఖ’ మలయాళ రీమేక్ ). మళ్లీ రీమేక్ సినిమా చేయాలని ఎందుకనుకున్నారు.. కథలు రాయలేకపోతున్నారా? కృష్ణవంశీ : (నవ్వుతూ)... కథలు రాయలేకపోవడం కాదు. ‘రంగ మార్తాండ’ నేను చేయాలనుకున్నది కాదు. మరాఠీ సినిమా ‘నట సామ్రాట్’ రీమేక్లో నటించడంతో పాటు డైరెక్ట్ చేయాలనుకున్నాడు ప్రకాశ్రాజ్. ‘ఈ సినిమాని రీమేక్ చేయా లనుకుంటున్నాను. నాకు స్క్రీన్ ప్లేలో సహాయం చెయ్’ అని అడిగాడు. ఒకరోజు రాత్రి కూర్చుని చూడటం మొదలెట్టా.. ఒకచోట కాదు ఐదార్లు చోట్ల ఏడుపొచ్చేసింది. ‘ఇది ఎక్స్ట్రార్డినరీ సినిమా. రీమేక్ చెయ్, నీకు ఎలాంటి సహాయమైనా నేను చేస్తాను’ అని ప్రకాశ్తో అన్నాను. ‘నేను డైరెక్ట్ చేసి యాక్ట్ చేయడం కంటే నువ్వెలాగూ ఎమోషన్స్ని అద్భుతంగా డీల్ చేస్తావు. నన్ను కూడా బాగా డీల్ చేస్తావు. నువ్వు డైరెక్ట్ చేస్తే బావుంటుంది. నాకోసం చెయ్’ అన్నాడు. సరే అన్నాను. అలా ‘రంగ మార్తాండ’ ప్రాజెక్ట్లోకి వచ్చాను. ► ‘నట సామ్రాట్’లో మిమ్మల్ని అంతగా కదిలించినదేంటి? ఇది మన తల్లిదండ్రుల కథ. మన తల్లిదండ్రులకు కావాల్సినంత విలువ ఇస్తున్నామా? లేదా గౌరవించి తప్పుకుంటున్నామా? అనే పాయింట్ ఉంది. సామాజిక పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ వల్ల మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మారుతోంది. సక్సెస్ సాధించాలని పరుగు తీయడంలోనో, అందరితో పొగిడించుకోవాలనే ప్రయత్నంలోనో, అందరికంటే అధికుణ్ణి అనిపించుకోవాలనే తపనలోనో మనల్ని మనం కోల్పోతున్నాం. అది ‘నట సామ్రాట్’లో నాకు కనిపించింది. ఇది ఒక స్టేజ్ యాక్టర్ కథ. అతను స్టేజ్ మీద విలువలతో బతికినవాడు.. బ్రహ్మాండమైన నటుడు. అందుకే ‘రంగ మార్తాండ’ అనే బిరుదు ఇస్తారు. ఆ బిరుదు వచ్చిన రోజునే అతను నటనకి రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు. అప్పటివరకూ నటుడిగా రంగుల ప్రపంచం, నిరంతరం చప్పట్ల మధ్య ఉండే అతను నిజ జీవితంలో తండ్రిగా, తాతగా, భర్తగా, స్నేహితుడిగా తన పాత్ర పోషించే సమయంలో లైఫ్లో ఎంతమంది నటులున్నారో తెలుస్తుంది. అతను నమ్మిన ఆదర్శాలకు, బయట నిజాలకు క్లాష్ అవుతుంది. తల్లిదండ్రులు స్వార్థపరులయిపోయారు. పిల్లలు స్వార్థపరులయిపోయారు అని నిందించకుండా ఎవరి పాయింట్లో వాళ్లే కరెక్ట్ అన్నట్టు చూపిస్తూ, వాళ్ల మధ్య క్లాష్ ఎలా వస్తుంది? అనేదే ఈ కథ. ► ‘రంగ మార్తాండ’ మళ్లీ మిమ్మల్ని హిట్ ట్రాక్లోకి తీసుకుని వస్తుందనుకుంటున్నారా? నేను ఇలా చెబితే నమ్మశక్యంగా ఉంటుందో లేదో తెలియదు కానీ హిట్ కోసం నేనెప్పుడూ సినిమా తీయలేదు. తీసిన తర్వాత జనానికి నచ్చితే హిట్ అవుతుంది అనుకునేవాణ్ణి. హిట్ కోసం తీయాలంటే అప్పటికి మార్కెట్లో ఉన్న హిట్ ఫార్ములాని వాడాలనిపిస్తుంది. అప్పుడు అది సినిమా మ్యానుఫాక్చరింగ్ అవుతుంది తప్ప మేకింగ్ అవ్వదు. అలా చేయడం నాకు చేతకాదు. ఒకవేళ హిట్ కోసమే చేసేలా అయితే మంచి థ్రిల్లర్ సబ్జెక్టో, హీరో ఓరియంటెడ్ కథలో చేస్తాను కానీ ఇదెందుకు చేస్తాను? ఒకవేళ అలాంటి సినిమాలు తీసినా హిట్ అవుతాయని గ్యారంటీ ఏంటి? నా అనుభవంలో నాకు అర్థమయిందేంటంటే ఎవ్వరూ హిట్ సినిమా తీయలేరు. తీసిన సినిమాలు హిట్ అవుతాయి... అంతే. ► ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా హవా సాగుతోంది. ఈ ట్రెండ్ని మీరెలా చూస్తారు? నా చిన్నప్పటినుంచి మా ఊర్లో హిందీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు మన సినిమా (తెలుగు) దేశం నలు మూలలకు వెళుతోంది. అన్ని ప్రాంతాల వాళ్లు ఆదరిస్తున్నారు. ఇది కేవలం సౌత్ సినిమాలా కాకుండా సౌత్ సినిమాని కూడా ఇండియన్ సినిమాగా చేయొచ్చు అనే అర్థంతో పాన్ ఇండియా సినిమా అంటున్నారని అనుకుంటున్నాను. ► మీరు పాన్ ఇండియా సినిమా ట్రై చేస్తారా? ఏమో చెప్పలేం. అది సినిమాను బట్టి ఉంటుంది. ► కరోనా వల్ల ఇండస్ట్రీలో చాలామందికి రెండేళ్లు గ్యాప్ వచ్చింది. కానీ దానికంటే ముందే మీకు రెండేళ్లు గ్యాప్ వచ్చింది.. కారణం? ఆటోమేటిక్గా వచ్చేసింది అలా. ఫ్లాప్ అయిన తర్వాత పుంజుకోవడం కష్టం. హిట్.. ఫ్లాప్ అనేది నేను తీసుకోను. కానీ ఆ ఎఫెక్ట్ నా మీదుంటుంది. హిట్ కోసమని మెట్టు దిగి, దిగజారి ప్రజల్ని మభ్యపెట్టి సినిమా తీయలేను. రాజీ పడలేను. ఎంత ఆకలేసినా సింహం గడ్డి తినదు కదా. గ్యాప్ అయితే ఫ్లాప్స్ వల్లే వచ్చింది. హిట్ ఇస్తుంటేనే ఇండస్ట్రీలో ఫాస్ట్గా ఉంటాం. ► ప్రేక్షకుల మైండ్ సెట్ మారిందని కొంత వల్గర్ కామెడీ, రేంజ్కి మించిన వయొలెన్స్ తీస్తున్నారు కొందరు... దీని గురించి మీరేం అంటారు? ప్రేక్షకుల మైండ్ సెట్ మారలేదని నా అభిప్రాయం. అయినా ఇదో ఫేజ్ అనుకుంటున్నాను. మనం ఆ తరం (పాత సినిమాలు) చూశాం కాబట్టి ఇప్పుడు సినిమాలు చూసి బాధపడతాం. కానీ ఇప్పటివాళ్లు ఇవే చూశారు కాబట్టి వారికి ఇదే కరెక్ట్ అనిపిస్తుందేమో. ► ఫార్ములా ఫాలో కాకపోతే మీరు పోటీలో ఎలా నిలబడతారు? సినిమా తీసే ఫార్మాట్ ఒక్కటే మారింది. బేసిక్ ఎమోషన్స్ అన్నీ అవే. అదే లవ్, అదే ఫ్యామిలీ, అదే విలనిజం అన్నీ అవే. మంచి మీద చెడు గెలుస్తుంది అని చివర్లో చెప్పడం. కొన్నిసార్లు రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతాయి. అలా అని ప్రయాణం మానేస్తామా? మన ప్రయాణం మనది. మనం ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టకుండా, వీలైతే మన వల్ల కొందరైనా పాజిటివ్గా ఉండగలుగుతున్నారా అనేదే మనం పట్టించుకోవాల్సింది. సో.. పోటీ గురించి భయపడటం, బాధపడటం నాకు రాదు. ► అలాగే ఒకప్పుడు ఎమోషన్ అంటే బలంగా చూపించేవారు. ఇప్పుడు కొన్ని చిత్రాల్లో లైటర్వీన్గా కనిపిస్తోంది. అదేమంటే ట్రెండ్ మారిందంటున్నారు... ఎమోషన్ని స్ట్రాంగ్గా చూపించడానికి ఇష్టపడటంలేదా? తెలియడం లేదా? చేతకావడం లేదా? దాసరిగారిలా, కేవీ రెడ్డిగారిలా, విశ్వనాథ్గారిలా సినిమాలు తీయలేం. అలా ఎవ్వరూ తీయలేరు కాబట్టి ట్రెండ్ మారింది అనుకుందామా? కరెక్ట్గా తీయగలిగితే అలా అనుకోనక్కర్లేదా? మరి.. కరెక్ట్గా తీయడం అంటే ఏంటని నన్ను అడగకండి. నాక్కూడా తెలియదు. ‘శంకరాభరణం’ సినిమాను ప్రపంచం ఆదరించింది కదా? ట్రెండ్ అంటూ ఏదీ లేదు. ట్రెండ్ అంటే నా దృష్టిలో బూతు. మనకు రామాయణం, మహాభారతం, భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నీ అందర్నీ నీతిగా నిజాయితీగా సామరస్యంగా ఉండాలనే బోధించాయి. ఏ మతమయినా ఇదే చెప్పింది. ఇప్పటికీ మనం వాటినే అనుసరిస్తున్నాం. ఇప్పుడు సినిమా కూడా ఒక మతంలా అయిపోయింది. ఏం మాట్లాడాలి? ఏం బట్టలు వేసుకోవాలి? అన్నీ సినిమా చెబుతుంది. సో... అలాంటి మీడియమ్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మనం ఏం చేసినా సోషల్ బెనిఫిట్ ఉండాలి. ఫ్యామిలీ, ఎడ్యుకేషన్.. ఇలా అన్నింటికీ ఉపయోగపడేలా తీయాలి. ► ‘రంగ మార్తాండ’కి చిరంజీవి చెప్పిన వాయిస్ ఓవర్ గురించి? ఒక నటుడు తనని తనెలా అర్థం చేసుకుంటాడు? అనేది ఓ కాన్సెప్ట్లా అనుకుని, వాయిస్ ఓవర్ చెప్పించాలని అనుకున్నాను. రచయిత లక్ష్మీ భూపాల్తో రెగ్యులర్ పాటలా.. మాటాలా వద్దు.. షాయిరీలా చెప్పిద్దాం.. అలా రాయమని అన్నాను. ఇదే మాట ఇళయరాజాగారికి చెబితే ‘నువ్వు రాయించుకుని తీసుకురా చేద్దాం’ అన్నారు. బ్రహ్మాండంగా వచ్చింది. ఈ వాయిస్ ఓవర్ని ఏదైనా పెద్ద యాక్టర్తో చెప్పిస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు నాకు తట్టినవి రెండే పేర్లు. సీనియర్ ఎన్టీఆర్గారు... చిరంజీవిగారు. చిరంజీవిగారికి ఫోన్ చేస్తే, రమ్మన్నారు. వెళ్లి, వివరించాను. షాయరీ ఐడియా విని ఆయన థ్రిల్లయ్యారు. ‘నా గురించి నేను చెప్పుకున్నట్టు ఉంది’ అన్నారు. ► అన్నం’ సినిమా అనౌన్స్ చేశారు? ‘రంగ మార్తాండ’ తర్వాత అదే చేస్తాను. ‘సింధూరం, ఖడ్గం, మహాత్మ’ ఆ జోన్ ఫిల్మ్ ఇది. ఫుడ్ మాఫియా, వ్యవసాయం, అన్నం, మనిషి తన స్వార్థం కోసం ఆవుల్ని, కోళ్లను ఎలా వాడుకుంటున్నాడు? అనేది కాన్సెప్ట్. ► ‘రంగ మార్తాండ’ సినిమాలో ఒక నటుడు తన రియల్ లైఫ్ గురించి ఏం తెలుసుకున్నాడో చూపిస్తున్నారు. మరి.. మీ లైఫ్ని విశ్లేషించుకుంటే మీకేమనిపిస్తోంది? నా అర్హతకి కొన్ని వేల రెట్లు ఎక్కువే ఇచ్చింది ఈ జీవితం. ఇప్పుడు నా మనసిక స్థితి ఎలా ఉందంటే.. ఏం చేసినా అది నేను చేయలేదు. అది (విధి) చేయించింది నాతో. ఎంత కాలం చేయించదలచుకుంటే అంత కాలం చేయిస్తుంది. నేనంటూ ఏం కోరుకోవడం లేదు. మన పుట్టుక మన కంట్రోల్లో లేదు. ఎప్పుడు పోతామో కూడా తెలియదు. మా ఊరి నుంచి మద్రాస్ తోసింది, అక్కడి నుంచి వర్మగారి దగ్గరకు తోసింది హైదరాబాద్కు. అక్కడ నుంచి దర్శకుడిని అయ్యాను. అన్నీ అలా జరుగుతూ వచ్చేశాయి.. అంతే. ► చాలామంది ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.. మీకు ఆ ఉద్దేశం లేదా? వచ్చే ఏడాది చేసే ప్లాన్ ఉంది. ఇప్పుడే చెప్పను కానీ పెద్ద బ్లాస్ట్ అది. 200–300 కోట్ల బడ్జెట్ అవుతుంది. ఓటీటీలో క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంది. స్టార్సే ఉండాలని రూల్ కూడా లేదు. సినిమాను స్వచ్ఛంగా తీయొచ్చు. ► మీ సినిమాల్లో హీరోలతో బ్రహ్మాండంగా నటింపజేశారు. మీ అబ్బాయి రిత్విక్తో సినిమా చేస్తారా? వాడేం అవ్వాలనుకుంటాడో అది వాడి ఇష్టం. కాసేపేమో ఫుట్బాల్ అంటాడు. రేసర్ అంటాడు. యాక్టర్ అంటాడు. ఇప్పుడు టీనేజ్లో ఉన్నాడు కదా. కొత్తది ఏది చూసినా దాని మీదకు ధ్యాస వెళ్లిపోతుంది. ► మీ అబ్బాయి ఏమైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనేం అనుకోవడంలేదు. వాడి అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నాకు, రమ్యకృష్ణకి బిడ్డ అయ్యాడంటేనే వాడి అదృష్టం మీకు అర్థం అవుతుంది కదా (నవ్వుతూ). – డి.జి. భవాని -
ఇదొక ఆధ్యాత్మిక అనుభవం
‘‘నా జీవితంలో నేను సంపాదించిన అతి పెద్ద అమూల్యమైన ఆస్తి (సంగీత దర్శకుడు ఇళయరాజాని ఉద్దేశించి). ఇది ఆ భగవంతుని ఆశీర్వాదం. గొప్ప విషయాలు ఏదో ఒక టైమ్లో ముగిసిపోతాయి. అలాగే,, మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎంతో సంతృప్తికరంగా, విజయవంతంగా పూర్తయింది. ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవం’’ అని దర్శకుడు కృష్ణవంశీ ట్వీట్ చేశారు. ప్రకాశ్రాజ్ ప్రధాన పాత్రలో కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతదర్శకుడు. ఆయన ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా జరిగిన నేపథ్య సంగీతం గురువారంతో పూర్తయింది. ఈ విషయాన్ని పేర్కొని, ఇళయరాజాతో దిగిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు కృష్ణవంశీ. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మికా రాజశేఖర్, అలీ రేజా తదితరులు నటించారు. -
కట్ చెప్పలేదు.. కట్టేసుకున్నారు..!
(వెబ్ స్పెషల్): ఇంటర్వ్యూల్లో చాలా మంది హీరోయిన్లు చెప్పే మాట తాము డైరెక్టర్స్ చాయిస్ అని. అంటే.. దర్శకులు చెప్పినట్లు తాము చేస్తామని అర్థం. కొన్ని కొన్ని సార్లు ఈ చెప్పే వారి మాటలు అవతలి వారి మనసును తాకుతాయి. దాంతో ఒకరి మీద ఒకరికి ఇష్టం, ప్రేమ కలుగుతాయి. అది కాస్త పెళ్లికి దారి తీస్తుంది. దాంతో కట్ చెప్పలేక వారితో జీవితాన్ని ముడి వేసుకున్నారు. హీరోయిన్లు దర్శకులను వివాహం చేసుకోవడం ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. మరి ఇంతకు ఏ హీరోయిన్ ఏ దర్శకుడిని పరిణయం ఆడిందో చూడండి.. సుహాసిని-మణిరత్నం హీరోయిన్, దర్శకుల వివాహం టాపిక్ వస్తే వెంటనే గుర్తుకు వచ్చేది సుహాసిని-మణిరత్నంల పేర్లే. ఆమె అందం, అభినయాల కలబోత అయితే.. ఆయన భారతీయ ఆత్మను ప్రతిబింబించే చిత్రాల దర్శకుడు. వీరిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి 1988లో వివాహం బంధంతో ఒక్కటయ్యారు. దివంగత దర్శకుడు కె. బాలచందర్ ఒత్తిడి మేరకే తాము వివాహం చేసుకున్నామంటారు సుహాసిని. వీరికి ఒక కుమారుడు నందన్ ఉన్నాడు. (చదవండి: పెద్దన్నయ్య) రేవతి - సురేష్ చంద్ర సురేష్ చంద్ర దర్శత్వంలో రేవతి రెండు చిత్రాల్లో నటించారు. అలా ఏర్పడ్డ పరిచయంతో ఈ జంట ప్రేమలో పడ్డారు. 1986లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు. కృష్ణవంశీ - రమ్య కృష్ణ కృష్ణవంశీ తెరకెక్కించిన చంద్రలేఖ చిత్రంలో రమ్యకృష్ణ నటించారు. అలా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఈ జంట 2003లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు రిత్విక్ ఉన్నాడు. రోజా - సెల్వమణి రోజాని తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది సెల్వమణి. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. 2002లో రోజా, సెల్వమణిలు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. బాబు, పాప ఉన్నారు. శరణ్య-పొన్నవనన్ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు శరణ్య. కానీ 1980-90ల కాలంలో ఈమె చాలా తమిళ సినిమాల్లో హీరోయిన్గా చేశారు. అప్పుడే దర్శకుడు పొన్నవనన్తో ప్రేమలో పడ్డారు. వివాహం చేసుకున్నారు.(చదవండి:ఇదే నాకు పెద్ద బర్త్డే గిఫ్ట్ ) ఖుష్బూ-సుందర్ ఇద్దరు కలిసి ఒక్క చిత్రం కూడా చేయలేదు. కన్నడ నిర్మాత అయిన సుందర్ని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఖుష్బూ. ఇక వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు. వారి పేరు అవంతిక అనందిత. సీత- పార్థిపన్ సీనియర్ నటి సీత, దర్శకుడు పార్థిపన్ని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 1990లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమర్తెలు, ఓ దత్తత తీసుకున్న కొడుకు ఉన్నారు. 2001లో ఈ జంట విడాకులతో విడిపోయారు. ఆ తర్వాత సీత మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. (చదవండి: జీవితం ఉన్నది అనుభవించడానికే..) దేవయాని- రాజ్ కుమారన్ దర్శకుడు రాజ్ కుమారన్, దేవయానిల లవ్ ఎఫైర్ అప్పట్లో ఒక సెన్సేషన్. రాజ్ కుమారన్ దర్శత్వంలో దేవయాని నీ వరువై ఏనా అనే చిత్రంలో నటించారు. వీరిద్దరూ 2001లో వివాహం చేసుకున్నారు. అమలాపాల్ - విజయ్ దర్శకుడు అమలాపాల్, విజయ్ ప్రేమ వ్యవహారం గురించి తెలిసిందే. పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు. వీరే కాక దర్శకుడు సెల్వ రాఘన్, హరి, ప్రియ దర్శన్ వంటి వారు హీరోయిన్లనే వివాహం చేసుకున్నారు. -
రాహుల్కు సినిమా చాన్స్
బంజారాహిల్స్: నిన్నామొన్నటి దాకా తన స్నేహితులతో కలిసి పాతబస్తీ వీధుల్లో తిరిగిన ఓ గల్లీబాయ్కి బిగ్స్క్రీన్పై నటించే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. తొలుత ప్లేబ్యాక్ సింగర్గా చిత్ర సీమకు పరిచయమైన ఈ కుర్రాడు బిగ్బాస్ తెలుగు సీజన్–3 విజేతగా నిలిచాడు రాహుల్ సిప్లిగంజ్. దాంతో నాలుగైదు వారాల నుంచి యూట్యూబ్ స్టార్గా రికార్డుల్లో కొనసాగుతున్నాడు. ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ప్రముఖ స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ రాహుల్ను వెండి తెరకు పరిచయం చేస్తూ సంచలనానికి కేంద్రబిందువయ్యారు. పక్కా లోకల్ బాయ్గా అభిమానులకు దగ్గరైన రాహుల్కు ఈ అవకాశం నిజంగా వరమనే చెప్పాలి. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో అగ్రనటులు ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందంతో కలిసి నటించే అరుదైన అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. నిన్నటిదాకా బుల్లితెరపై సందడి చేసిన రాహుల్ ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకుని అశేష అభిమానగణాన్ని సొంతం చేసుకున్నాడు. స్వతహాగా గాయకుడైన ఇతడు ఇప్పుడు నటుడిగా మారుతుండటంతో అటు పాతబస్తీతో పాటు ఇటు ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు ట్విట్టర్లోనూ ఇటు ఇన్స్ట్రాగామ్లోనూ ఆయన అభిమానులు ఈ ఆరందార్రి పంచుకుంటున్నారు. రెండురోజుల నుంచి రాహుల్ సోషల్ మీడియాలో మారుమోగిపోతున్నాడు. రమ్యకృష్ణ, ప్రకాష్రాజ్ లాంటి సీనియర్ నటులతో కలిసి నటించే అవకాశం రావడం తన జీవితంలో మరిచిపోలేని ఘటనగా రాహుల్ పేర్కొన్నాడు. View this post on Instagram I feel very honoured to be a part of this amazing movie with impeccable cast,A big thanks to @krishnavamsiofficial Garu I feel very lucky and super excited for the shoot. My debut as an actor,I need all your blessings chichas! 🙏🏻 #rangamarthanda A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) on Nov 30, 2019 at 9:36am PST సంతోషంగా ఉంది కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో నటించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని ఇన్స్ట్రాగామ్ వేదికగా రాహుల్ అభిమానులతో సంతోషాన్ని పంచుకున్నాడు. ఈ అవకాశం రావడం నిజం తన అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. షూటింగ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని, నటుడిగా వెండితెరకు పరిచయం అవ్వడం నిజంగానే ఆనందంగా ఉందని మీ అందరి ఆశీస్సులు కావాలంటూ కోరాడు. తన పాటలతో యువత మనసు దోచుకున్న నేను నటుడిగా మరింత సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడంటూ పేర్కొన్నాడు. ఒక్కసారిగా స్టార్డమ్.. బిగ్బాస్–3 విజేతగా నిలిచిన రాహుల్ రాత్రికిరాత్రే స్టార్గా మారిపోయాడు. గాయకుడిగా ఉన్నప్పుడు కొంతమంది అభిమానులను కలిగివున్న ఇతడు బిగ్బాస్ తర్వాత లక్షలాదిగా వ్యూవర్స్ సొంతమయ్యారు. యూట్యూబ్లో అత్యధికంగా సెర్చ్ చేస్తున్న వారిలో రాహుల్ ఇప్పటికే అందరికంటే ముందున్నాడు. నిన్నామెన్నటిదాకా ఓ సాధారణ గల్లీబాయ్గా తిరిగిన రాహుల్ ఇప్పుడు సెలబ్రిటీగా అందరి మన్ననలు పొందాడు. గత నెల 29న పీపుల్స్ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో తన పాటలతో అదరగొట్టగా ఆ కార్యక్రమానికి వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు. కృష్ణవంశీ దర్శకత్వంలో నటించే అవకాశం రావడంతో రాహుల్ భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని పలువురు సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో రాహుల్ నటుడిగా తననుతాను చూపించుకుంటే అవకాశాలు మరింత మెరుగుపడతాయని అంటున్నారు. ఇప్పటివరకు వెండితెరపై వెలిగిపోయే ఛాన్సు పక్కా హైదరాబాదీకి దక్కడం చాలా అరుదుగా లభించింది. ‘ఒక్క ఛాన్స్’ అంటూ అవకాశాల కోసం ఫిలింనగర్లో చెప్పులరిగేలా ఎంతోమంది తిరుగుతున్నారు. అలాంటిది రాహుల్కు మాత్రం ఈ అవకాశం వెతుక్కుంటూ రావడం గమనార్హం. -
ఏళ్లే వచ్చి వయసును మళ్లిస్తుంటే...
పెళ్లి తంతును ఎన్నిసార్లు వర్ణించినా ఇంకా ఏదో చెప్పడానికి మిగిలేవుంటుందా? మళ్లీ మళ్లీ విన్నదే. కానీ మళ్లీ మళ్లీ కూడా కొత్తగా అనిపిస్తుంది సిరివెన్నెల రాస్తే. మొగుడు చిత్రంలోని ‘చూస్తున్నా చూస్తువున్నా చూస్తూనేవున్నా’ పాటనోసారి చూస్తే... ‘పచ్చని మాగాణి చేలు పట్టుచీరగా కట్టి బంగరు ఉదయాల సిరులు నొసట బాసికంగా చుట్టి ముంగిట సంక్రాంతి ముగ్గులు చెక్కిట సిగ్గులుగా దిద్ది పున్నమి పదహారు కళలు సిగలో పూవులుగా పెట్టి దేవేరిగా పాదం పెడతానంటూ నాకు శ్రీవారిగా పట్టం కడతానంటూ నవనిధులు వధువై వస్తుంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నేనైనట్టు’ పద్మము, శంఖము, నీలము లాంటి కుబేరుడి నవనిధులు ఏకంగా వధువై వస్తున్నాయంట! దీనికి కొనసాగింపుగా రెండో చరణంలో– ‘నీ సౌందర్యంతో ఇంద్రపదవి నెదిరిస్తాను నీ సాన్నిధ్యంలో నేను స్వర్గమంటే ఏదంటాను ఏళ్లే వచ్చి వయసును మళ్ళిస్తుంటే నేనే నీ వొళ్ళో పాపగ చిగురిస్తుంటే... చూస్తున్న’ దాంపత్యానికి ఫలశ్రుతి ఇదే కదా, మళ్లీ చిన్నారిగా భర్త కొత్తగా జీవం పోసుకోవడం! 2011లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది కృష్ణవంశీ. యాడ్ఫిల్మ్ మేకర్ బాబు శంకర్ సంగీతం అందించారు. పాడింది కార్తీక్. తాప్సీ, గోపీచంద్ నటీనటులు. -
ఆ కామెంట్స్కి సమాధానమే నక్షత్రం
‘‘నన్ను తిట్టినా తీసుకుంటా... పొగిడినా తీసుకుంటా.. తిడితే నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారనుకుంటా. పొగిడితే నేను చేసింది నచ్చిందనుకుంటా. నాకు ఎవరి మీదా కోపం ఉండదు’’ అన్నారు కృష్ణవంశీ. గులాబి, నిన్నే పెళ్లాడతా, మురారి, ఖడ్గం... ఒకదానికి ఒకటి పోలిక పెట్టలేని సినిమాలు తీసిన క్రియేటివ్ డైరెక్టర్. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘నక్షత్రం’. కె. శ్రీనివాసులు, సజ్జు, ఎస్. వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా కృష్ణవంశీతో జరిపిన ‘స్పెషల్ టాక్’. ⇒ ‘నక్షత్రం’ ఆడియో ఫంక్షన్లో ‘ఈ సినిమా డిజప్పాయింట్ చేయదు’ అన్నారు. సినిమా మీద బాగా నమ్మకం పెట్టుకున్నారని అర్థమవుతోంది... ♦ అవును. నేను పూర్తిగా సంతృప్తి చెంది చాలా ఏళ్లైంది. షాట్ లేదా సీన్ వర్కౌట్ అయ్యిందా? లేదా? అన్నది నాకే కాదు ఏ డైరెక్టర్కి అయినా షూట్ చేస్తున్నప్పుడో, ఎడిట్ చేస్తున్నప్పుడో తెలుస్తుంది. మిక్సింగ్ చేస్తున్నప్పుడు క్లియర్గా తెలుస్తుంది. ఈ సినిమా బాగా వచ్చింది. రేసీ యాక్షన్ థ్రిల్లర్. ఇన్నేళ్ల నా అనుభవంలో చిన్న జడ్జిమెంట్ వస్తుంది కదా. ⇒ ఇంతకుముందు తీసిన ఏ సినిమాకి మీకింత నమ్మకం కలిగింది? ♦ ఖడ్గం’ తీసినప్పుడు కలిగింది. గులాబీ, సముద్రం, ఖడ్గం... ఈ మూడు ఒక జోనర్ సినిమాలు. థ్రిల్, యాక్షన్, ఒక హీటెడ్ పాయింట్, రొమాన్స్... ఇలా అన్నీ ఉంటాయి. ‘ఖడ్గం’ ఒక నేషనల్ ప్రాబ్లమ్. ‘నక్షత్రం’ నేషన్స్ ప్రాబ్లమ్. ‘ఖడ్గం’లో పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్లలేదు. ‘నక్షత్రం’ కంప్లీట్గా సోసైటీ నుంచి పోలీస్ను చూపే సినిమా. పోలీసులు సొసైటీని ఎలా చూస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి సొసైటీ ఎలా కనపడతుంది అన్నదే ‘నక్షత్రం’. మంచి సోషల్ కాన్సెప్ట్ ఉన్న కమర్షియల్ మూవీ. ⇒ ‘నక్షత్రం’లో పోలీస్ని నెగటివ్గా చూపించారా? ♦ తెలుగు సినిమాల్లో పోలీసులంటే జోకర్ లానో, విలన్లుగా పోలీసులంటే రాక్షసుల్లానో ఇంకోలానో డీల్ చేస్తున్నారు. పోలీస్ క్యారెక్టర్ని యూనిఫామ్ వేసుకున్న ఎంటర్టైనింగ్ క్యారెక్టర్గా డీల్ చేస్తున్నారు. కానీ, స్క్రీన్ మీద నిజమైన పోలీసును చూడలేకపోతున్నాం. ఇండియాలో పోలీసులను నిజంగా చూపించిన సినిమా ‘అర్థసత్య’. అసలు పోలీస్ వ్యవస్థ అంటే ఏంటి? మన కోసం మన భద్రత కోసం, మన రక్షణ కోసం మనం మన రాజ్యాంగం ద్వారా పెట్టకుని మన ట్యాక్స్లద్వారా వచ్చే డబ్బుతో పోషించుకుంటున్న ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఒక కానిస్టేబుల్ నుంచి కమీషనర్ వరకు ఎవర్ని చూసినా మనకెందుకు భయం? కోపం? చికాకు? పోలీసుల్ని చూసి మనం ఎందుకు ఇన్సెక్యూర్గా ఉంటున్నాం? ఎవరో కొందరు పోలీసులు అవినీతిని చూసి అందర్నీ అలా ఊహించుకోవడం తప్పు. లేకపోతే మనం ఏదైనా తప్పుచేస్తే ఎక్కడ పట్టుకుంటాడోనని ఫీలవుతున్నామా? ఏదేమైనా గొలుసు దొంగతనం నుంచి ఇంటర్నేషనల్ క్రైమ్ వరకు డీల్ చేసేది పోలీసులే. ఇంకో సిస్టమ్ లేదు. ఇంతా చేస్తూ కూడా ప్రజలతో తిట్లు తింటూ చేస్తున్న థ్యాంక్స్లెస్ జాబ్ అండీ పోలీసులది. ఇదే విషయాన్ని ఈ సినిమాలో కమిషనర్గా యాక్ట్ చేసిన ప్రకాశ్రాజ్గారితో చెప్పించాను. ⇒ సినిమా లేట్ అయినందుకు నిరుత్సాహం... ♦ నిరూత్సాహపడ్డ మాట వాస్తమే. నోట్ల రద్దు, ఆ తర్వాత డేట్స్ కుదరకపోవడం వంటి రకరకాల సమస్యలున్నాయి. కానీ, అలస్యం కావడం వల్ల సినిమా క్వాలిటీ బాగా వచ్చింది. ∙ఇక స్పీడ్గా సినిమాలు చేస్తారా? ♦ మన చేతుల్లో లేదది. నేను 250 ఏళ్లు బతుకుతానని, అమెరికా ప్రెసిడెంట్ అవుతా నని, దుబాయ్లోని బూర్జ్ ఖలిఫాలో నాలుగు ఫ్లోర్లు కొనుకుంటానని అనుకుంటే జరుగుతుం దా? మణిరత్నంగారిలా ఓ సినిమా తీయాలని, బాపుగారిలా ఓ పాట తీయాలని కోరికలున్నా యి. అయితే.. ‘ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందట’ అని ఓ సామెత. స్వర్గానికి ఎగిరితే కనీసం ఉట్టి అయినా దొరుకుతుంద నేది నా పాలసీ. అదే ఉట్టికి ఎగిరాం అనుకోండి కనీసం కదలను కూడా కదలం. డ్రీమ్ బిగ్! ⇒ ప్రస్తుతం రాష్ట్రాన్ని వణికిస్తున్న డ్రగ్స్ ఇష్యూ మీద సినిమా తీసే ఆలోచన ఉందా? ♦ డ్రగ్స్ అనేది చాలా డేంజరెస్ థింగ్. నా ‘డేంజర్’ సినిమాలోనే ఈ పాయింట్ని టచ్ చేశాను. ‘నక్షత్రం’ లోనూ టచ్ చేశాం. అయినా డ్రగ్స్ ప్రాబ్లమ్ ఇప్పటిది కాదు. 20 ఏళ్ల నుంచి ఉంది. కానీ, మీడియా మాత్రం వెకిలితనంగా, పరిణితి లేకుండా బిహేవ్ చేస్తోందని నా అభిప్రాయం. ఇలా ఎందుకు అంటున్నానంటే పూరీ, సుబ్బారాజ్ కారు దిగి, ‘సిట్’ కార్యాలయం లోపలికి వెళితే, దాన్ని పదే పదే చూపిస్తారు. ‘మత్తులో తూగుతున్న టాలీవుడ్’ అనే ట్యాగ్. అయినా వాళ్ల నుంచి సమాచారం తెలుసుకోవడానికి పిలిచారు కానీ, వాళ్లు నిందితులని నిర్థారణ కాలేదు కదా. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఎవరిదో ఒక ఫోన్ దొరికితే ఆ ఫోన్లో కొన్ని నంబర్లు ఉన్నాయి. అంతే. ⇒ మీడియా తన పని తాను చేయాలి కదా.. ♦ నిజమే. నోటీసులు అందుకున్న 12 మంది డ్రగ్స్ వాడుతున్నారో లేదో ఎవరికీ తెలియదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు తేల్చి చెప్పలేదు. లీకైన న్యూస్ అన్నారు.‘లీక్ న్యూస్’ అంటేనే చట్టరీత్యా కాదు. అలాంటప్పుడు ఆ న్యూస్ను టెలికాస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ⇒ మీరు, పూరి, రవితేజ... ఒకే కాంపౌండ్. మీకు నోటీసులు రాలేదెందుకని? ♦ (నవ్వుతూ) పెద్ద స్థాయిలో మ్యానేజ్ చేశా. మేమంతా ఒకే కాంపౌండ్ నుంచి వచ్చినవాళ్లం. తర్వాత సపరేట్ దుకాణాలు పెట్టుకున్నాం. నోటీసు నాకు రాలేదంటే ఏం చెప్పాలి? నా పేరు లేనందుకు డిజప్పాయింట్ చేసినట్లున్నా. ⇒ ఇప్పుడు ఎవరి గురించైనా ఎవరైనా ఈజీగా కామెంట్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది.. ఉదాహరణకు మీ సినిమా లేట్ అయినందుకు ‘కృష్ణవంశీ పని అయిపోయింది’ అంటున్నారు... ♦ నన్నెవరైనా కామెంట్ చేస్తే కోపం రాదు. ఎందుకంటే గతంలో నేను తీసిన సినిమాను అతనే మెచ్చుకొని ఉండవచ్చు. ఈరోజు అతను నన్ను విమర్శిస్తున్నాడంటే నాలో అతనికి ఏదో నచ్చడం లేదు. రియాక్షన్ అందరికీ ఒకేలా వస్తుంది. కానీ ఎక్స్ప్రెస్ చేయడంలోనే తేడా ఉంటుంది. ఎవరైనా మన మీద ఒపీనియన్ను వాడి స్థాయిని బట్టి చెబుతాడు కానీ మన స్థాయి బట్టి చెప్పడు. రోడ్డు మీద తిరిగేవాడైతే అతని భాషలో చెబుతాడు. పండితుడు పండితునిలా, పూజారి పూజారిలా చెబుతాడు. 600 కోట్ల జనాభాలో మనల్ని పట్టించుకుని, మనకు టైమ్ కేటాయిస్తున్నాడంటే మన దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడని అర్థం. సినిమా అనేది పబ్లిక్ ఫీల్డ్. ఎంటర్టైన్మెంట్ ఇవ్వనప్పుడు అంటాడు. వాటన్నింటికీ సమాధానమే ‘నక్షత్రం’. నేను మళ్లీ హిట్టిస్తే ‘బాస్ ఈజ్ బ్యాక్’ అనో, ‘లయన్ ఈజ్ బ్యాక్’ అనో అంటాడు. అందుకే తిట్టినా తీసుకుంటా. పొగిడినా తీసుకుంటా. ⇒ బ్యాలెన్డ్స్గా ఉంటారన్న మాట. మరి... సక్సెస్, ఫెయిల్యూర్ని ఇంతే బ్యాలెన్డ్స్గా తీసుకుంటారా? ♦ ఆ రెండూ అంటని స్థితిలోకి నేను వచ్చాను. ‘సింధూరం’ ఫ్లాపయినప్పుడు బాగా ఏడ్చా. ఆ తర్వాత అర్థమైంది. మరీ ఎక్కువగా ఫీల్ అవుతున్నానని. అప్పటినుంచి ఈ గోల నుంచి మనం డిస్కనెక్ట్ అయిపోతే మనకు ఏదీ అంటదని ఫిక్స్ అయ్యాను. ⇒ డిస్కనెక్ట్ కావడం అంత ఈజీయా? ♦ కాదు. సీతారామ శాస్త్రి, రాంగోపాల్ వర్మ వంటి వాళ్ల సాంగత్యం, జన్మత వచ్చిన ఒక సంస్కారం, పూర్వ జన్మ నుంచి వచ్చిన చిప్... ఇలా రకరకాలు ఉంటాయి. లైఫ్ జర్నీలో నాకు ఎదురైన మనుషులు, పరిస్థితులు, ఇప్పుడు నాకు 55 ఏళ్లు. అంటే ఎన్ని అనుభవాలను చూసి ఉంటాను. ఎన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాను. అందుకే డిస్కనెక్ట్ కాగలిగాను. ⇒ ఫైనల్లీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్? ♦ ‘నక్షత్రం’ హిట్టవుతుందని అనుకుంటున్నా. ఏడాదిగా మోస్తున్నాను కదా. ముందు ఒక వారం రోజులు హాయిగా పడుకోవాలి. ఆ తర్వాత నా నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాను. మనది గొప్ప కంట్రీ. అల్లూరి సీతారామరాజు, గాంధీగారు, సర్థార్ వల్లభాయ్పటేల్ లాంటి మహనీయులు పుట్టిన దేశం మనది. గాంధీగారి తర్వాత అలాంటి మనిషే దేశంలో పుట్టలేదు. సక్సెస్ఫుల్గా బ్రిటిష్వాళ్లని వెళ్లగొట్టిన దేశం మనది. అలాంటి గొప్ప దేశంలో ఇప్పుడు ఎలాంటి వారు ఉన్నారు? ఆ స్పార్క్ను చెప్పడానికి ప్రతి సినిమాలో ట్రై చేస్తుంటాను. అలాగే ‘నక్షత్రంలో’నూ చేశాను. అంటే.. ఈ సినిమా విడుదల తర్వాత అందరూ పోలీసులు కనపడితే కౌగిలించుకుంటారని కాదు. పోలీసులందరూ గొప్పవారు అని చెప్పడం లేదు. ప్రతి మనిషిలోనూæ 20 నుంచి 40 శాతం నీచత్వం ఉంటుంది. మన సంస్కారం వల్లో లేక మన జ్ఞానం వల్లో, పెద్దల పెంపకం వల్లో, పుట్టి పెరిగిన వాతావరణం వల్లో, మన ప్రవృత్తి వల్లో లేకపోతే మంచి సంస్కారం వల్లో దానిని అదుపులో పెట్టుకుంటాం. నా ప్రతి సినిమాలో ఆ సంస్కారానికి నీళ్లు పోయాలని ట్రై చేస్తుంటా. -
వీటీపీఎస్ కెనాల్లో విద్యార్థి మృతదేహం
విజయవాడ: నగరంలోని వీటీపీఎస్ కూలింగ్ కెనాల్లో బుధవారం ఓ విద్యార్థి మృతదేహాం లభ్యమైంది. కాలువలోనుంచి మృతదేహాన్ని వెలికితీశారు. ఆదివారం అదృశ్యమైన కృష్ణవంశీగా పోలీసులు నిర్ధారించారు. కృష్ణవంశీ మృతదేహాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. కనిపించకుండా పోయిన తమ కొడుకు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. స్నానానికి వెళ్లి కాలువలో పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కృష్ణవంశీ.. అందరివాడేలే!
-
చరణ్ టీజర్ పై తమ్ముడి కామెంట్!
రామ్ చరణ్ తేజ తాజా చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'పై టాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా 'గోవిందుడు అందరి వాడేలే' టీజర్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. చరణ్ తాజా టీజర్ పై తమ్ముడు, నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ కొణిదెల సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్ లో కామెంట్ చేశాడు 'గోవిందుడు అందరివాడేలే'తో చరణ్ అన్న మళ్లీ తెరపైకి వచ్చాడు. టీజర్ కలర్ ఫుల్ గా ఆకట్టుకుంటోంది. ఎక్సైటింగ్ గా ఉంది. అన్నయ్య చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అనే ఆతృత మొదలైంది. గోవిందుడిని చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నాను అంటూ వరుణ్ తేజ్ కామెంట్ చేశారు. మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు తెరకు వరుణ్ తేజ్ పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న వరుణ్.. అన్నయ్య టీజర్ చూసి సాదాసీదా అభిమానిగా స్పందించడం అందర్ని ఆకట్టుకుంటోంది. Charan anna is back and how! The teaser looks very colourful and engaging!..excited about the film already..can't wait!.. — Varun Tej Konidela (@IAmVarunTej) August 8, 2014 -
శృతిహాసన్కు ఝలక్ ఇచ్చిన బండ్ల గణేష్..?
-
సినిమా రివ్యూ: 'పైసా'
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ, 'ఈగ' చిత్రం విజయం తర్వాత నాని కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'పైసా'. ఆరంభంలో 'పైసా' చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే అనేక సమస్యలతో విడుదల బాగా ఆలస్యమైన ఈ చిత్రం ఎట్టకేలకూ శుక్రవారం ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనేక అడ్డంకులను ఎదుర్కొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పైసా' చిత్రం కథేంటో చూద్దాం! డబ్బులంటే విపరీతమైన పిచ్చి ఉండే ప్రకాశ్ (నాని) హైదరాబాద్ పాతబస్తీలో ఓ మోడల్. జీవితంలో కోటి రూపాయలు సంపాదించి సెటిలైపోవాలనుకుంటాడు. పాతబస్తీలో ఉండే నూర్ (కేథెరీనా థెరిసా) అంటే ప్రకాశ్ కు ఇష్టం. అలాగే ప్రకాశ్ అంటే నూర్ కు చెప్పలేనంత ప్రేమ. పైసా అంటే పడిచచ్చే ప్రకాశ్ కు అనుకోకుండా యాభై కోట్ల రూపాయలు చేతికి చిక్కుతాయి. ప్రకాశ్ కు చిక్కిన యాభై కోట్లు ఎక్కడివి? యాభై కోట్ల రూపాయలు దక్కించుకోవడానికి ప్రకాశ్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? భారీ మొత్తంలో చిక్కిన సొమ్ము చివరికి ఏమైంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే 'పైసా' చిత్రం. ప్రస్తుత తరం హీరోల్లో నాని ఈగ చిత్రంతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ వచ్చిన నానికి ఈ చిత్రంలోని ప్రకాశ్ పాత్ర టైలర్ మేడ్ క్యారెక్టర్. నటుడిగా నిరూపించుకోవడానికి లభించిన ప్రకాశ్ పాత్రను నాని చక్కగా ఉపయోగించుకున్నాడు. మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఈ పాత్రలో తనదైన స్టైల్ తో ఆకట్టుకున్నాడు. ఫైట్స్, పాటలతో ఆలరించిన నాని కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ ను చక్కగా పలికించాడు. పైసా చిత్రంలోని ప్రకాష్ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేకూర్చాడని చెప్పవచ్చు. 'ఇద్దరు అమ్మాయిలు' చిత్రం తర్వాత కేథరిన్ థెరిసాకు మంచి పాత్రే లభించింది. తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని.. పర్వాలేదనిపించింది. గ్లామర్ తో పాటు, పెర్మార్మెన్స్ తో కూడా కేథరిన్ ఆకట్టుకుంది. ఎమ్మెల్యే కూతురుగా స్వీటీ పాత్రలో కనిపించిన సిద్దికా శర్మ అందాల ఆరబోతకే పరిమితమైంది. నాని ఫ్రెండ్ గా డ్రైవర్ పాత్రలో నటించిన తాబర్ గుర్తుండిపోయే పాత్రను పోషించాడు. విలన్ పాత్రలో చరణ్ రాజ్, సిద్దార్థ్ రెడ్డి, ఆర్ కే, రాజా రవీంద్ర, దువ్వాసి మోహన్ సినిమాకు సపోర్టింగ్ గా నిలిచారు. చిలక జ్యోతిష్కుడి పాత్రలో కొద్దిసేపే కనిపించిన వేణు తన హస్యంతో ఆకట్టుకున్నాడు. విశ్లేషణ: ప్రస్తుత రాజకీయ వాతావరణంలో నెలకొన్న పరిస్థితులను సెంటర్ పాయింట్ గా చేసుకుని, దానికి ప్రేమ కథను జోడించి క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ పైసా చిత్రాన్ని రూపొందించారు. చిత్రమంతా పాతబస్తీలోని చార్మినార్ నేపథ్యంగా సాగుతుంది. పాతబస్తీలో ఉండే పరిస్థితులను కృష్ణవంశీ చక్కగా చిత్రీకరించారు. ఈ చిత్రంలో పతంగి సన్నివేశాన్ని తెరకెక్కించిన తీరు కృష్ణవంశీ క్రియేటివిటీకి అద్దం పడుతుంది. చార్నినార్ వద్ద నాని తో చేయించిన ఓ లెంగ్తీ ఎపిసోడ్, హోలీ సీన్ లు బ్రహ్మండంగా ఉన్నాయి. ఈ చిత్ర ఫస్టాఫ్ ను పర్వాలేదనిపించే రితీలో తెరకెక్కించిన కృష్ణవంశీ.. సెకండాఫ్ లో కొంత గందరగోళమే సృష్టించాడు. కథకు ఉండే పరిమితుల వల్ల కథనంలో గందరగోళం తప్పలేదు. చేజారిన డబ్బును దక్కించుకోవడానికి కొన్ని బ్యాచ్ లు, అనుకోకుండా చేజిక్కిన డబ్బును కాపాడుకోవడానికి నాని వేసే ఎత్తులతో సెకండాఫ్ చేజింగ్ కొంత రొటిన్ గా అనిపించింది. పెద్దగా పేరున్న ఆర్టిస్టులు విలన్ పాత్రల్లో కనిపించకపోవడం ఈ చిత్రానికి మైనస్. సెకండరీ గ్రేడ్ విలన్ పాత్రలు అంతగా ప్రభావం చూపలేకపోయాయి. అయితే సెకండాఫ్ చేజింగ్ కథనం ప్రేక్షకుడ్ని ఆకట్టుకుంటుందా అనేది సందేహమే. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్స్ ను పలికించడంలో తనదైన మార్క్ ను కృష్ణవంశీ చూపించాడని చెప్పవచ్చు. గత కొద్దికాలంగా టాలీవుడ్ కు దూరమయ్యారనే ఫీలింగ్ కలిగించిన కృష్ణవంశీ ప్రస్తుత ట్రెండ్ ను మిస్ అవుతున్నాడా అనే ప్రశ్నను రేకెత్తించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే.. పైసాలో చిత్రంలో టెంపోను కొనసాగించడానికి రీరికార్డింగ్ బాగా ఉపయోగపడింది. పాటల్లో 'నీతో ఏదో' పిక్చరైజేషన్ బాగుంది. 'జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందన్నటు నాకు క్యాష్ కావాలి', 'పైసా ఎవర్నైనా పాగల్ (పిచ్చి) వాణ్ని చేస్తుంది' లాంటి డైలాగ్స్ అక్కడక్కడ ఆకట్టుకున్నాయి. పాతబస్తీ పరిస్థితులను సంతోష్ రాయ్ చక్కగా తెరకెక్కించారు. ఎప్పటిమాదిరిగానే కృష్ణవంశీని ఎక్కువ ఆశించి సినిమా కెళ్లిన ప్రేక్షకుడికి నిరాశ కలిగినా.. నాని తన ఫెర్మార్మెన్స్ తో చక్కటి విందును ఇచ్చాడని చెప్పవచ్చు. పైసా కోసం వెంపర్లాడితే కష్టాలు తప్పవనే సందేశంతో క్రియెటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ అందించిన ఈ చిత్రం నిర్మాతలకు 'పైసా' వసూలు చేస్తుందో లేదో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. -
వికటించిన ‘ఐరన్ ఫోలిక్’
- 8 మంది చిన్నారులకు అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు జంగంరెడ్డిపల్లి (అమ్రాబాద్), న్యూస్లైన్: ఓ అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చిన ఐరన్ఫోలిక్ ద్రావణం వికటించి ఎనిమిది మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి. ఇమ్యునైజేషన్లో భాగంగా బుధవారం ఉదయం అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రంలోని 30 మంది చిన్నారులకు ఏఎన్ఎంలు ఐరన్ ఫోలిక్ ద్రావణమిచ్చారు. వీరిలో సాయంత్రం అంజలి, జానకి, పండు, కృష్ణవంశీ, రంజిత్, జశ్వం త్తో పాటు మరో ఇద్దరు చిన్నారులు వాంతులు చేసుకున్నారు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే అంగన్వాడీ కార్యకర్త పద్మారాణితో కలిసి వాహనంలో బాధితులను అమ్రాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చా రు. అనంతరం అక్కడి వైద్యుల సూచన మేరకు అచ్చంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఏఎన్ఎం భాగ్యమ్మను వివరణ కోరగా వారికి పడకపోవడం వల్లే వాంతులు చేసుకున్నారని, ఎలాంటి అపాయం లేదన్నారు.