Lady oriented
-
మరో లేడీ ఓరియంటెడ్ మూవీలో...
విజయ్ సేతుపతి కెరీర్లోని 50వ సినిమా ‘మహారాజ’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. ‘మహారాజ’కు బాక్సాఫీస్ పరంగా మంచి వసూళ్లు, సినీ విమర్శకుల పరంగా అభినందనలు రావడంతో నితిలన్కు అవకా శాలు క్యూ కడుతున్నాయి.ఈ క్రమంలోనే నయనతారకు నితిలన్ ఓ లేడీ ఓరియంటెడ్ స్టోరీ చెప్పారని, బేసిక్ ప్లాట్ నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు ఆమె సానుకూలంగా ఉన్నారని టాక్. దీంతో స్క్రిప్ట్కు తుది మెరుగులు దిద్దుతున్నారట నితిలన్. సో.. నయనతార మరో లేడీ ఓరియంటెడ్ మూవీలో కనిపిస్తారన్న మాట. -
రేణూ రీ ఎంట్రీ
‘బద్రి, జానీ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రేణూ దేశాయ్ ‘ఆద్య’ అనే ఒక పవర్ఫుల్ లేడీ ఓరియంటెడ్ ప్యాన్ ఇండియా చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్కి శ్రీకారం చుడుతున్నారు. ఈ సినిమాతో ఎం.ఆర్. కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డి.ఎస్.కె. స్క్రీన్–సాయికృష్ణ ప్రొడక్ష¯Œ ్స బ్యానర్స్పై రావ్. డి.ఎస్–రజనీకాంత్. ఎస్ నిర్మించనున్నారు. ‘హుషారు’ ఫేమ్ తేజ కురపాటì,, గీతికా రతన్ జంటగా నటించనున్న ఈ చిత్రంలో ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక, నందినీ రాయ్ ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ .ఎస్ మాట్లాడుతూ– ‘‘విజయదశమి రోజున మా ‘ఆద్య’ సినిమా ప్రారంభిస్తాం. రేణూ దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అన్నారు. బాలీవుడ్ హీరో వైభవ్ తత్వవాడి ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర దాశరధి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ చైతన్యరెడ్డి .ఎస్. -
లేడీ పోలీస్
ఈ ఏడాది కొరియన్ కథతో ‘ఓ బేబి’ (కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’కి తెలుగు రీమేక్) వంటి బ్లాక్బస్టర్ హిట్ సాధించారు సమంత. లేడీ ఓరియంటెడ్ సినిమాగా సమంత కెరీర్లో పెద్ద హిట్ సినిమా అనిపించుకుంది ‘ఓ బేబి’. ఇప్పుడు నయనతార కూడా ఓ కొరియన్ కథలో నటించడానికి అంగీకరించారని తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ లేడీ ఓరియంటెడ్ సినిమా తెరకెక్కనుందట. ఈ చిత్రాన్ని హీరో రానా నిర్మిస్తారట. ఇందులో నయనతార పోలీస్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
యాసిడ్ బాధితురాలిగా..
అదుగో ఇదిగో అంటూ సమయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కానీ తన తాజా సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై మాత్రం దీపికా పదుకోన్ స్పష్టత ఇవ్వడం లేదు. అయితే ‘తల్వార్, రాజీ’ చిత్రాల ఫేమ్ మేఘనా గుల్జార్ దర్శకత్వంలో దీపిక ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటించబోతున్నారని బీటౌన్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన లక్ష్మీ అగర్వాల్ అనే యాసిడ్ బాధితురాలి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని, షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలవుతుందని బాలీవుడ్లో ఓ వార్త షికారు చేస్తోంది. పదిహేనేళ్ల వయసులో యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ ఆ తర్వాత యాసిడ్ దాడులను ఆపేందుకు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. జీవితంలో జరిగిన చేదు ఘటనకు కుమిలిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతోన్న లక్ష్మీ అగర్వాల్ చాలామందికి స్ఫూర్తినిస్తుందని దీపిక భావిస్తున్నారు. అందుకే ఆమె జీవితకథలో నటించబోయే ఈ సినిమాకు సహ–నిర్మాతగా కూడా వ్యవహరిస్తారట. ఆల్రెడీ ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ నిర్మాణ సంస్థలు ప్రారంభించారు. ఇప్పుడు దీపికా. -
ఇది ఆట కాదు ఖో ఖో!
చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ‘ఖో ఖో’ ఆట గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు నయనతార లీడ్ రోల్ చేయనున్న ఓ సినిమాకి ఇదే టైటిల్ పెట్టారు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమా కాదిది. మరి.. ‘ఖో ఖో’ అని టైటిల్ ఎందుకు పెట్టినట్లు? అంటే... టైటిల్ వెనక అసలు కారణం తెలియడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. ఎందుకంటే, నయనతారతో ఈ సినిమా తీయనున్న లైకా ప్రొడక్షన్స్ ప్రస్తుతానికి పెద్దగా వివరాలేం బయటపెట్టలేదు. ‘డార్క్ కామెడీ’ నేపథ్యంలో సినిమా ఉంటుందని మాత్రం పేర్కొన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దాదాపు 400 కోట్ల బడ్జెట్తో 2.0’ నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ ‘ఖో ఖో’ని కూడా భారీ బడ్జెట్తో నిర్మించనుందట. అఫ్కోర్స్ ‘2.0’ అంత భారీ బడ్జెట్ కాకపోయినా, లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఎక్కువ బడ్జెట్తో రూపొందే సినిమా అవుతుందట. -
1818కు ఓకే చెప్పిన చెన్నై చిన్నది
చేతి నిండా చిత్రాలతో నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు చెన్నై చిన్నది త్రిష. కోలీవుడ్లో నయనతార తరువాత హీరోయిన్ఓరియంటెడ్ చిత్రాలు ఈ బ్యూటీనే వరిస్తున్నాయి. ఇప్పటికే నాయకి అనే కథానాయకికి ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించిన త్రిష మోహిని అనే మరో చిత్రంలో హీరోయిన్ సెంట్రిక్ పాత్రను పోషిస్తున్నారు. త్వరలో విజయ్సేతుపతికి జంటగా 96 అనే చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్న త్రిషకు మరో లేడీ ఓరియంటెడ్ కథా చిత్రంలో నటించే అవకాశం వరించింది.1818 అనే చిత్రంలో నాయకిగా నటించడానికి ఈ బ్యూటీ పచ్చజెండా ఊపారు. మైండ్ డ్రామా పతాకంపై రితున్ సాగర్ దర్శక, నిర్మాతగా తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఇది 2008లో ముంబైలో జరిగిన తీవ్రవాదుల మారణకాండ ఇతివృత్తంగా రూపొందించనున్న చిత్రం అని చెప్పారు. చిత్రం ఆధ్యంతం ఆసక్తిగా జెట్ స్పీడ్లో సాగుతుందన్నా రు. త్వరలో చిత్ర షూటింగ్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందులో త్రిషతో పాటు సుమన్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానం దం, సూదుకవ్వుం చిత్రం ఫేమ్ రమేశ్, తిలక్, రాజారాణి చిత్రం ఫేమ్ మీరా ఘోషల్ ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ 1818 చిత్రానికి ఎస్ఎస్.తమన్ సంగీతాన్ని, మదన్ కార్గీ పాటలను అందిస్తున్నారు. -
మలయాళ చిత్ర రీమేక్లో త్రిష
మలయాళ చిత్ర రీమేక్లో నటించే లక్కీచాన్స్ సంచల నటి త్రిషను వరించిందన్నది తాజా సమాచారం. ఇంతకు ముందు కమర్శియల్ కథా చిత్రాలను చేసిన ఈ చెన్నై చిన్నది ఇటీవల లేడీ ఓరియెంటెడ్ చిత్రాలనే వరుసగా చేస్తున్నారు. నాయకి చిత్రం తరువాత ప్రస్తుతం మోహిని చిత్రం చేస్తున్నారు. విదేశాల్లో చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ హారర్ కథా చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా మరో చిత్రానికి త్రిష పచ్చజెండా ఊపారు. రెండేళ్ల క్రితం విడుదలై మంచి విజయాన్ని సాధించిన మలయాళ చిత్రం 100 డిగ్రీ సెల్సియస్ను తమిళంలోకి రీమేక్ చేయనున్నారు. అక్కడ రోషన్ గొప్పన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందించారు. నటి శ్వేతామీనన్, భామ, మేఘ్నారాజ్, అనన్య, హరిత ఐదుగురు నటీమణులు నటించిన ఈ మహిళా ఇతివృత్తంతో కూడిన కథా చిత్రాన్ని రీమేక్ దర్శక కింగ్గా పేరు పొందిన మిత్రన్ జవహర్ తమిళంలో దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు తెలుగులో హిట్ అయిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, రెడీ చిత్రాలను యారడీ నీ మోహినీ, ఉత్తమ పుత్రన్ పేర్లతో తమిళంలో దర్శకత్వం వహించారు. అదే విధంగా ఇటీవల మలయాళ చిత్రం తల్లయన్ మరయత్తు చిత్రాన్ని తమిళంలో మీండుం ఒరు కాదల్ కథై పేరుతో దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. తాజాగా 100 డిగ్రీ సెల్సియస్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో ప్రస్తుతానికి త్రిష, రాయ్లక్ష్మీ నాయకిలుగా ఎంపికయ్యారని సమాచారం. ఇతర నటీమణుల ఎంపిక పూర్తి కాగానే షూటింగ్కు సిద్ధం కానున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. -
ఆమె పారితోషికంతో చిన్న చిత్రం చేయొచ్చు
నయనతార పారితోషికం అంతా అని సహ నటీమణులు విస్మయం చెందేంతగా వెలిగిపోతోంది ఆ కేరళ భామ. అదృష్టం అన్న విషయాన్ని పక్కన పెడితే పట్టుదల+నిరంతర కృషి+శ్రమ=విజయం ఒక మనిషి ఎదుగుదలకు సూత్రం ఇదే.నటి నయనతారకు ఇది కరెక్ట్గా వర్తిస్తుంది. ఒకానొక టైమ్లో నటనకు గుడ్బై చెప్పిన ఈ బ్యూటీ తన జీవితంలో జరిగిన అనూహ్య పరిణామాల కారణంగా మళ్లీ నటనను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ కారణం ఎమిటన్నది చాలా మందికి తెలిసిందే కాబట్టి అది ఇప్పుడు అప్రస్తుతం. సాధారణంగా సెకెండ్ ఇన్నింగ్స్లో పూర్వవైభవాన్ని సాధించడం అన్నది అసాధ్యం కాకపోయినా అంత సులభం మాత్రం కాదు.అయితే ఈ విషయంలో నయనతార సాధించారు. ఇంకా చెప్పాలంటే తొలి ఇన్నింగ్స్ క్రేజ్ను అధిగమించారని చెప్పాలి. రెండో ఇన్నింగ్లోనూ నంబర్వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న రేర్ నాయకి నయనతార. వరుస విజయాలే ఆమె క్రేజ్కు కారణం అని చెప్పవచ్చు. హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలతో పాటు,వర్ధమాన హీరోలతో నటించిన చిత్రాలను తన పాపులారిటీతో సక్సెస్ బాట పట్టించడంతో నయనతార హవా నిర్విఘ్నంగా కొనసాగుతోంది.ఆ క్రేజ్ను నయనతార బాగా ఉపయోగించుకుంటున్నారు. పెద్ద మొత్తంలో పారితోషికాన్ని రాబట్టుకుంటున్నారు. ఇప్పటి ఆమె పారితోషకం సహ నటీమణులకు గుండెల్లో గుబులు పుట్టిస్తోందని చెప్పవచ్చు. గత ఏడాది వరకూ కోటి రూపాయలు డిమాండ్ చేసిన ఈ కేరళ కుట్టి తాజాగా ఏకంగా మూడు కోట్లకు పెంచేశారని సమాచారం. దర్శకుడు సర్గుణం తన శిష్యుడు దాస్ రామసామిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రంలో నయనతారనే నాయకి. ఈ లేడీఓరియెంటెడ్ కథా చిత్రంలో నటించడానికి ఆమె అందుకుంటున్న పారితోషికం అక్షరాలా మూడు కోట్లని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇదే నిజమైతే తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ నయనతారనే అవుతారు. అంతేకాదు ఒక స్థాయి హీరోలకు కూడా ఇంత పారితోషికం పొందడం లేదన్నది నిజం. ఇంకా చెప్పాలంటే ఒక్క నయనతార పారితోషికంతో చిన్న బడ్జెట్ చిత్రం రూపొందించవచ్చు అనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. -
సెల్యులాయిడ్ శక్తి స్వరూపిణి
తెలుగు సినిమా పుట్టి 83 ఏళ్లు. వేల సినిమాలొచ్చాయి. కానీ, వాటిల్లో స్త్రీ శక్తి ప్రధానమైన చిత్రాలు తక్కువే. గడచిన పాతికేళ్లలో అయితే అది మరీ పలచబడి పోయింది. రాశి తక్కువైనా వాసిలో గొప్పవైన అలాంటి తొమ్మిది సినిమాల గురించి... ఈ నవరాత్రుల్లో... కర్తవ్యం (1990) - స్త్రీ పాత్రలన్నీ ప్రేమ, పెళ్ళి లాంటి అంశాల చుట్టే తిరుగుతున్న టైమ్లో తెలుగు తెరపై లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కొత్త ఊపు తెచ్చిన చిత్రం. సమకాలీన సమాజంలోని కిరణ్ బేడీ జీవితం స్ఫూర్తితో అల్లుకున్న ఈ లేడీ ఐ.పి.ఎస్. ఆఫీసర్ కథ ఉత్తేజపూరిత అనుభవం. తెలుగు, తమిళం, హిందీ - ఇలా ఎక్కడకు వెళ్ళినా హిట్టే. ఈ కథతో ‘షీ మ్యాన్’ పాత్రలకు విజయశాంతి కేరాఫ్ అడ్రసయ్యారు. ‘లేడీ అమితాబ్’ పట్టంతో పాటు, కోటి పారితోషికం తీసుకున్న తొలి తెలుగు హీరోయిన్ అయ్యారు. అశ్వని (1991) - ఇటీవల హిందీలో వస్తున్న అనేకానేక జీవితకథా చిత్రాలకూ, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమాలకూ చాలా ముందే పాతికేళ్ళ క్రితం తెలుగులో చేసిన ప్రయత్నం. జాతీయ చాంపియన్ అయిన భారతీయ అథ్లెట్ అశ్వినీ నాచప్ప జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ఇది. అశ్వినితోనే ఆ పాత్రను పోషింపజేయడం అప్పట్లో మరో సంచలనం. ప్రతిభను పసిగట్టి సానపెట్టేవాళ్ళుంటే స్త్రీలేమీ తక్కువకారని చాటిచెప్పిన స్ఫూర్తిదాయక చిత్రం. అమ్మోరు (1995) - మామూలు మనుషుల్ని తట్టుకోవడమే కష్టం. అలాంటిది ఆమె దుష్టశక్తితోనే తలపడాల్సి వచ్చింది. భర్త ఎక్కడో దూరంగా ఉన్నాడు. ఉన్నదల్లా అమ్మోరు తల్లి అండ. ఆ నమ్మకంతోనే కష్టాలన్నీ భరించింది. ఇలాంటి కథలు చాలా వచ్చి ఉండొచ్చు. గ్రాఫిక్స్తో డీల్ చేయడమే వండర్. సౌందర్య యాక్టింగ్ లేడీస్ ఫాలోయింగ్ తెచ్చింది. ఒసేయ్... రాములమ్మా! (1997) - తెలంగాణలోని మహిళా విప్లవాన్ని తెరపై చూపెట్టిన ‘ఎర్ర’ సినిమా. దొరల సంస్కృతిపై ఎక్కుపెట్టిన సెల్యులా యిడ్ గన్. మాదాల రంగారావు, ఆర్. నారాయణమూర్తి తరహా సినిమాలకు దాసరి నారాయణరావు ఇచ్చిన పర్ఫెక్ట్ బాక్సాఫీస్ క్లైమాక్స్ - ఈ సూపర్ హిట్ సినిమా. ‘ప్రజా యుద్ధ నౌక’లుగా నిలిచిన విప్లవ గాయకుల జీవిత స్ఫూర్తి, మహిళా ఉద్యమకారుల చైతన్యదీప్తి కలగలిసి, ‘వందేమాతరం’ శ్రీనివాస్ స్వరం, సుద్దాల అశోక్తేజ కలం పదును రుచిచూపెట్టాయి. విజయశాంతి రాజకీయజీవిత ఆకాంక్షలకు ఊపిరిలూదిన పాస్పోర్ట్ ఈ ఫిల్మ్. అంతఃపురం (1999) - ప్రేమ తప్ప ఇంకేమీ తెలియని, కుటుంబం తప్ప ఇంకేం వద్దనుకునే అమ్మాయి. ఆమె జీవితంలో ఊహించని పరిణామం. కుట్రలూ కుతంత్రాలూ రక్తపాతాలూ మారణహోమాలు నిండిన లోకంలోకి వచ్చి పడింది. కుందేలు పిల్ల కాస్తా శివంగిలా మారింది. కృష్ణవంశీ తీసిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్. సౌందర్య నటించలేదు. జీవించిందంతే. 9 నెలలు (2001) - ‘సరోగసీ’ (అద్దె గర్భం) ఇప్పుడు హాట్ టాపిక్. దీని గురించి క్రాంతికుమార్ 14 ఏళ్ల క్రితమే వెండితెరపై చర్చించారు. అప్పుడ ప్పుడే కెరీర్లో కుదురుకుంటున్న సౌందర్యకు పర్సనల్ శాటిస్ఫేక్షన్ ఇచ్చిన సినిమా. ముందే కూసిన ఈ కోయిల నిజానికి ఇప్పుడు రావాల్సింది.మిస్సమ్మ (2003) - కుటుంబాన్ని నొప్పి లేకుండా సుతిమెత్తగా డీల్ చేయగల స్త్రీ, ఒక కంపెనీని డీల్ చేయడం కష్టం కాదు. తన తర్వాత సంస్థకు వారసుణ్ణి ఎంపిక చేయడం కోసం ఓ స్త్రీ చేసిన అన్వేషణ, తపనే ఈ ‘మిస్సమ్మ’ సినిమా. భూమికకు ‘ఖుషీ’తో పేరొచ్చిందేమో కానీ, ఈ ‘మిస్సమ్మ’ మాత్రం ఆమెకు గ్రేట్ మెమరీగా నిలిచిపోతుంది. అరుంధతి (2009) - ఈ ఆధునిక సాంకేతిక యుగంలో విజువల్ ఎఫెక్ట్స్ పరిజ్ఞానాన్ని వినియోగించుకొని పాతకాలపు అంధ విశ్వాసాలను తెరపై ఆవిష్కరించిన హార్రర్ - ఫ్యాంటసీ ఫిల్మ్. తెలుగుతెరపై గ్రాఫిక్స్ శకానికి మొదటి నుంచి నారుపోసి నీరు పెడుతూ వచ్చిన నిర్మాత ఎం. శ్యామ్ప్రసాద్రెడ్డి కలల పంట. కోడి రామకృష్ణ మార్కు దర్శకత్వ ప్రతిభ, అనుష్కలోని అపూర్వ అభినయ పార్శ్వం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులతో ‘వదల బొమ్మాళీ! వదల!’ అనిపించాయి. కోట్ల ఖర్చుకు పదుల కోట్ల వసూళ్ళు తెచ్చి, బాక్సాఫీస్ వద్దా మహిళలు మహారాణులేనని చూపింది. రుద్రమదేవి (2015) - మూడు దశాబ్దాల తరువాత తెలుగులో వచ్చిన భారీ హిస్టారికల్ ఫిల్మ్. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో అత్యంత భారీ ఖర్చు (రూ. 80 కోట్లు)తో తయారైన సినిమా. భారతదేశంలో గద్దెనెక్కి, రాజ్యమేలిన తొలి మహిళ రాణీ రుద్రమదేవి జీవిత కథ. దర్శక - నిర్మాత గుణశేఖర్ దాదాపు మూడేళ్ళు చేసిన భారీ 3డీ యజ్ఞం. లేడీ ఓరియెంటెడ్ కథలకు, క్లిష్టమైన పాత్రపోషణకు కొత్త చిరునామా అనుష్క కెరీర్లో కొత్త శిఖి పింఛం! -
మీనాకుమారిగా మనీషా!
-
స్త్రీ గొప్పతనం తెలిపే కథ
నేటి సమాజంలో పురుషుల కంటే స్త్రీలు అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు. ప్రేమ, త్యాగం, ధైర్యం, సహనం, సాహసం ఇవన్నీ మగవారి కంటే ఆడవారిలోనే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంతో రూపొందుతోన్న చిత్రం ‘లాక్’. సంతోష్, సారిక జంటగా నటిస్తున్నారు. పార్గవన్ దర్శకత్వంలో కె.లక్ష్మణమూర్తి నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి తమిళ నిర్మాత శ్రీమతి సెల్వి కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు చంద్రసిద్ధార్థ్ క్లాప్ ఇచ్చారు. వినోదంతో కూడిన చక్కని లేడీ ఓరియెంటెడ్ చిత్రమిదని నిర్మాత అన్నారు. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేస్తామనీ, వైజాగ్, అరకు, హైదరాబాద్ల్లో చిత్రీకరణ జరుపుతామనీ, తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాను విడుదల చేస్తామనీ దర్శకుడు తెలిపారు. చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కథ: రాజ్దొరై, మాటలు: కేశవ్ పప్పుల, సంగీతం: విజయ్ కూరాకుల, కెమెరా: శ్రవణ్కుమార్.