Last Day
-
కశ్మీర్ అసెంబ్లీలో ఆఖరి రోజూ ఆగని ఆందోళనలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఆఖరి రోజైన శుక్రవారం కూడా ఆందోళనల మధ్యే కొనసాగింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చకు బీజేపీ సభ్యులు అడ్డుపడ్డారు. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలంటూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు. గొడవకు దిగిన ఎమ్మెల్యేలను స్పీకర్ ఆదేశాలతో మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ శుక్రవారం సీఎం ఒమర్ అబ్దుల్లా.. జమ్మూకశ్మీర్కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను కేంద్రం త్వరలోనే ప్రారంభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర పాలిత ప్రాంత హోదాతో పరిమిత అధికారాలతో అభివృద్ధిని, శాంతిభద్రతలను సాధించలేమని చెప్పారు. సమావేశాల సందర్భంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ శాసనసభా పక్షం నేత సునీల్ శర్మతోపాటు ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ఎన్సీ ఎమ్మెల్యే సజ్జాద్ షహీన్, మరొకరు హక్కుల తీర్మానం ప్రవేశపెట్టారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకుంటానని స్పీకర్ రథేర్ చెప్పారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
లక్ష్యం కివీస్107 పరుగులు... భారత్ 10 వికెట్లు!
మూడు రోజులుగా మలుపులతో టెస్టు క్రికెట్ మజాను చూపించిన బెంగళూరు మ్యాచ్ ఆసక్తికర ముగింపునకు చేరింది... తప్పులు సరిదిద్దుకొని రెండో ఇన్నింగ్స్లో చెలరేగిన భారత్కు తొలి ఇన్నింగ్స్ ప్రదర్శన వెంటాడింది... ఫలితంగా న్యూజిలాండ్ ముందు 107 పరుగుల అతి స్వల్ప లక్ష్యం... కాపాడుకోవాల్సిన పరుగులు తక్కువే కానీ ప్రత్యర్థి బౌలర్లు చెలరేగిన చోట మన బౌలర్లు నిలువరించలేరా, కుప్పకూల్చలేరా... బుమ్రా వేసిన తొలి నాలుగు బంతులు ఇదేనమ్మకాన్ని కలిగించాయి... అయితే చివరి రోజు బౌలింగ్తో పాటు వాతావరణం, పిచ్ కూడా మనకు కలిసి రావాలి! 35.1 ఓవర్లలో 177 పరుగులు...సర్ఫరాజ్, పంత్ భాగస్వామ్యం శనివారం భారత అభిమానులను అలరించింది...ఈ జోడీ మెరుపు బ్యాటింగ్తో భారీ లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా జట్టు సాగుతున్నట్లు అనిపించింది... సర్ఫరాజ్ ఖాన్ కెరీర్లో తొలి సెంచరీతో మ్యాచ్ను చిరస్మరణీయం చేసుకోగా, శతకం చేజారినా...పంత్ చేసిన 99 పరుగులు ప్రత్యేకంగా నిలిచాయి. అయితే న్యూజిలాండ్ తీసుకున్న కొత్త బంతి భారత్ రాత మార్చింది. 408/3తో పటిష్టంగా కనిపించిన టీమ్ 54 పరుగులకే తర్వాతి 7 వికెట్లు కోల్పోయింది. దాంతో మ్యాచ్ మళ్లీ కివీస్ వైపు మొగ్గింది. బెంగళూరు: భారత్ గడ్డపై 36 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ నెగ్గేందుకు న్యూజిలాండ్ రంగం సిద్ధం చేసుకుంది. ప్రత్యర్థి ముందు భారత్ కేవలం 107 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 బంతులే ఎదుర్కొన్న కివీస్ పరుగులేమీ చేయలేదు. వెలుతురులేమి, ఆపై వాన కారణంగా అంపైర్లు ముందుగానే ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. శనివారం 51.1 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. అంతకు ముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 99.3 ఓవర్లలో 462 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్ (195 బంతుల్లో 150; 18 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా...రిషభ్ పంత్ (105 బంతుల్లో 99; 9 ఫోర్లు, 5 సిక్స్లు) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. రూర్కే, హెన్రీ చెరో 3 వికెట్లతో భారత్ను దెబ్బ తీశారు. భారీ భాగస్వామ్యం... ఓవర్నైట్ స్కోరు 231/3 వద్ద సర్ఫరాజ్, పంత్ నాలుగో రోజు ఉదయం జత కలిశారు. అక్కడినుంచి కివీస్ బౌలర్లపై వీరిద్దరి ఆధిపత్యం కొనసాగింది. ఒకరితో మరొకరు పోటీ పడుతూ పరుగులు సాధించగా...కివీస్ బౌలర్లంతా చేతులెత్తేశారు. లేట్ కట్, ర్యాంప్ షాట్లతో సర్ఫరాజ్ పరుగులు రాబట్టగా, స్లాగ్ స్వీప్లతో పంత్ విరుచుకుపడ్డాడు. ఒక దశలో 16 బంతుల వ్యవధిలో సర్ఫరాజ్ 5 ఫోర్లు బాదాడు. ఆ తర్వాత సౌతీ బౌలింగ్లో డీప్ కవర్ దిశగా కొట్టిన ఫోర్తో అతని సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత పంత్ తన జోరును ప్రదర్శించారు. సౌతీ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన అతను... పటేల్ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్తో చెలరేగాడు. ఆ తర్వాత 55 బంతుల్లో అతను హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అయితే నిర్ణీత లంచ్ సమయానికి కాస్త ముందే ఆరంభమైన వర్షం...ఆ తర్వాతా కొనసాగడంతో ఆటకు అంతరాయం కలిగింది. ఆ తర్వాత ఆట మొదలయ్యాక వీరిని నిలువరించడంతో కివీస్ బౌలర్ల వల్ల కాలేదు. ఎట్టకేలకు కొత్త బంతి ఆ జట్టుకు కలిసొచ్చింది. అదే వైఫల్యం... 150 పరుగులు పూర్తి చేసుకున్న వెంటనే సర్ఫరాజ్ను అవుట్ చేసి సౌతీ భారత్ పతనానికి శ్రీకారం చుట్టాడు. సౌతీ తర్వాతి ఓవర్లో సిక్స్తో పంత్ 96కు చేరుకున్నాడు. అయితే దురదృష్టం అతడిని వెంటాడింది. 99 పరుగుల వద్ద రూర్కే వేసిన బంతిని డ్రైవ్ చేయబోగా...అతని బ్యాట్ను తగిలి బంతి స్టంప్స్పై పడింది. చిన్నస్వామి స్టేడియంలో నిశ్శబ్దం ఆవరించగా, పంత్ నిరాశగా వెనుదిరిగాడు. ఆ తర్వాత భారత అభిమానులు మరింత నిరాశ చెందే సమయం వచ్చింది. తొలి ఇన్నింగ్స్లాగే అదే వరుసలో రాహుల్ (12), జడేజా (5), అశ్విన్ (15) విఫలమయ్యారు. ఆ తర్వాత ఒకే ఓవర్లో హెన్రీ రెండు వికెట్లు తీసి భారత్ కథ ముగించాడు. పంత్ రనౌట్ అయి ఉంటే... సర్ఫరాజ్, పంత్ భాగస్వామ్యంలో ఒకే ఒక్క సారి కివీస్కు మంచి అవకాశం వచ్చింది. పంత్ 6 పరుగుల వద్ద ఉన్నప్పుడు సునాయాసంగా రనౌట్ చేసే అవకాశాన్ని జట్టు చేజార్చుకుంది. హెన్రీ వేసిన బంతిని పంత్ గల్లీ దిశగా ఆడగా సింగిల్ పూర్తి కాగా, రెండో పరుగు కోసం పంత్ బాగా ముందుకొచ్చేశాడు. సర్ఫరాజ్ వారించడంతో అతను వెనక్కి వెళ్ళాడు కానీ క్రీజ్కు చాలా దూరంగా ఉన్నాడు. అయితే బంతిని అందుకునేందుకు తన స్థానం నుంచి చాలా దూరం జరిగిన కీపర్ బ్లన్డెల్ తన వెనక ఉన్న పరిస్థితిని గుర్తించలేకపోయాడు. అతను సరైన చోట ఉంటే పంత్ అక్కడే వెనుదిరిగేవాడు! 107 గతంలో 107 లేదా అంతకంటే తక్కువ ల„ ్యాన్ని సొంతగడ్డపై భారత్ ఒకే ఒక సారి కాపాడుకుంది. 2004లో స్పిన్కు బాగా అనుకూలించిన ముంబై టెస్టులో 107 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 93 పరుగులకే కుప్పకూలింది. 7 టెస్టుల్లో పంత్ 90ల్లో అవుట్ కావడం ఇది ఏడో సారి. అతని ఖాతాలో 6 సెంచరీలు ఉన్నాయి. 7 భారత్ తరఫున ఈ టెస్టు రెండు ఇన్నింగ్స్లలో కలిపి అత్యధికంగా ఏడుగురు డకౌట్ అయ్యారు. గతంలో ఇలాంటి ప్రదర్శన 1952లో (ఇంగ్లండ్పై) నమోదైంది. స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్ 46; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 402; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (స్టంప్డ్) బ్లన్డెల్ (బి) పటేల్ 35; రోహిత్ (బి) పటేల్ 52; కోహ్లి (సి) బ్లన్డెల్ (బి) ఫిలిప్స్ 70; సర్ఫరాజ్ (సి) పటేల్ (బి) సౌతీ 150; పంత్ (బి) రూర్కే 99; రాహుల్ (సి) బ్లన్డెల్ (బి) రూర్కే 12; జడేజా (సి) యంగ్ (బి) రూర్కే 5; అశ్విన్ (ఎల్బీ) (బి) హెన్రీ 15; కుల్దీప్ (నాటౌట్) 6; బుమ్రా (సి) బ్లన్డెల్ (బి) హెన్రీ 0; సిరాజ్ (సి) సౌతీ (బి) హెన్రీ 0; ఎక్స్ట్రాలు 18; మొత్తం (99.3 ఓవర్లలో ఆలౌట్) 462. వికెట్ల పతనం: 1–72, 2–95, 3–231, 4–408, 5–433, 6–438, 7–441, 8–458, 9–462, 10–462. బౌలింగ్: సౌతీ 15–2–53–1, హెన్రీ 24.3–3–102–3, విలియమ్ రూర్కే 21–4–92–3, ఎజాజ్ పటేల్ 18–3–100–2, ఫిలిప్స్ 15–2–69–1, రచిన్ 6–0–30–0. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (బ్యాటింగ్) 0; కాన్వే (బ్యాటింగ్) 0; ఎక్స్ట్రాలు 0; మొత్తం (0.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 0. బౌలింగ్: బుమ్రా 0.4–0–0–0. -
Gangamma Jatara Photos: విశ్వరూపంతో ముగిసిన తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
-
కమలంలో కొత్త లొల్లి
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల దాఖలు చివరిరోజు అభ్యర్థుల జాబితాలో కొన్ని మార్పులు చేసి, ఇదివరకే ప్రకటించిన వారికి బీఫాంలు ఇవ్వకపోవడం బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. టికెట్లు దక్కని వారితో పాటు జాబితాలో ప్రకటించినా బీఫామ్స్ దక్కని వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. శుక్రవారం ప్రకటించిన 14 మంది అభ్యర్థుల జాబితా అంతా వివాదాస్పదం కావడంతో సమస్య మరింత ముదిరింది. వేములవాడలో తుల ఉమకు బదులు వికాస్రావుకు, సంగారెడ్డిలో రాజేశ్వర్ దేశ్పాండేకు బదులు పులిమామిడి రాజుకు బీఫామ్లు ఇవ్వడంతో తుల ఉమ, దేశ్పాండే కన్నీటి పర్యంతం అయ్యారు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలవనున్నట్లు ప్రకటించడంతో పార్టీ నాయకులు వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. చివరి క్షణంలో పలువురికి చెయ్యి బీసీ మహిళ (కురుమ) ఉమకు టికెట్ కోసం ఈటల రాజేందర్ గట్టిగా పట్టుబట్టారు. ఆమెకు సీటు కేటాయించకపోతే తాను ఎన్నికల్లో పోటీ చేయనని అల్టిమేటమ్ కూడా ఇచ్చారు. దీంతో నాయకత్వం దిగివచ్చినట్టు ప్రచారం జరిగింది. కానీ చివరకు బీఫామ్ ఇవ్వలేదు. సంగారెడ్డిలో పులిమామిడి రాజుకు కూడా సీటు కేటాయించాలని ఈటల కోరారు. దీంతో ఏదో ఒక సీటు ఎంపిక చేసుకోవాలని అధిష్టానం సూచించిందని, గెలిచే అవకాశాలున్న సంగారెడ్డి వైపు ఈటల మొగ్గుచూపినట్టుగా తెలుస్తోంది. కాగా తనను నామినేషన్ వేసుకోమని చెప్పి బీఫామ్ ఇవ్వకపోవడంపై తీవ్ర మనస్థాపానికి గురైన దేశ్పాండే.. కిషన్రెడ్డికి ఫోన్చేసి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జాబితాలో బెల్లంపల్లి స్థానానికి ఏమాజీ పేరుంటే శ్రీదేవిని, ఆలంపూర్లో మారెమ్మ ప్లేస్లో రాజగోపాల్ను బీజేపీ ఖరారు చేయడం కూడా వివాదానికి తెరతీసింది. అనూహ్యంగా కంటోన్మెంట్ సీటు... సికింద్రాబాద్ కంటోన్మెంట్ను చివరి నిమిషం వరకు కాంగ్రెస్లోనే ఉండి ఇంకా బీజేపీలో చేరని సాయి గణే‹Ùకు కేటాయించడంపై కూడా పారీ్టవర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక్కడ మాజీ డీజీపీ కృష్ణప్రసాద్కు నామినేషన్ వేసేందుకు సిద్ధం కావాలంటూ చెప్పిన బీజేపీ.. ఆయనకు మొండిచేయి చూపి సాయి గణే‹Ùకు టికెట్ కేటాయించడం పారీ్టలో తీవ్ర చర్చనీయాంశమైంది. అదేవిధంగా తుది జాబితాలో పోటీకి సుముఖంగా లేని మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావుకు మల్కాజిగిరి సీటును కేటాయించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. మల్కాజిగిరి టికెట్ కోసం ఆకుల రాజేందర్, బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో నాయకత్వం మధ్యే మార్గంగా రామచంద్రరావుకు అవకాశం ఇచ్చినట్టు సమాచారం. దీంతో భానుప్రకాష్ పారీ్టకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. శేరిలింగంపల్లి టికెట్ను రవికుమార్ యాదవ్కు కేటాయించడంతో గత కొంతకాలంగా ఇక్కడ పనిచేస్తూ ఈ సీటును గట్టిగా కోరుకున్న గజ్జెల యోగానంద్ ఎలాంటి కార్యచరణకు దిగుతారనేదది చర్చనీయాంశమైంది. బీసీలకు 36 సీట్లు బీజేపీ ప్రకటించిన మొత్తం 111 సీట్లలో (జనసేనకు 8 సీట్లు) బీసీలు–36, ఓసీ–44 (రెడ్డి–29, వెలమ–8, కమ్మ–3, బ్రాహ్మణ–2, వైశ్య–1, నార్త్ ఇండియన్అగర్వాల్–1) ఎస్సీ 19+2 (రిజర్వ్డ్తో పాటు అదనంగా 2 జనరల్ సీట్లు (నాంపల్లి, చాంద్రాయణగుట్ట), ఎస్టీలకు 10 కేటాయించారు. బీసీలకు ఇతర పారీ్టల కంటే అధిక సీట్లనే కేటాయించినా.. 40కి పైగా సీట్లు కేటాయిస్తామనే హామీని నేతలు నిలబెట్టుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా మాదిగలకు ఎక్కువ ప్రాధా న్యం దక్కింది. 21 స్థానాలను ఎస్సీలకు కేటాయించగా, అందులో మాదిగ సామాజిక వర్గానికి 14, మాల సామాజిక వర్గానికి 7 ఇచ్చారు. బీసీలకు కేటాయించిన 36 సీట్లలో ముదిరాజ్ 9, మున్నూరు కాపు 7, యాదవ 5, గౌడ 5, పెరిక 2 లోధ్ 2 పద్మశాలి, ఆరే కటిక, లింగాయత్, వాలీ్మకి బోయ, ఆరే క్షత్రియ, విశ్వకర్మలకు ఒక్కో సీటు కేటాయించారు. -
ఈ రోజే లాస్ట్.. ఆధార్ - పాన్ లింక్ చేయలేదా!
PAN-Aadhaar Linking: పాన్ - ఆధార్ లింక్ గురించి గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ లింకింగ్ గడువు ఈ రోజు కొన్ని గంటలలో ముగియనుంది. రేపటి నుంచి (జులై 01) ఆధార్తో అనుసంధానం చేయని పాన్ ఖాతాలు పనిచేయవని ఇప్పటికే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. గతంలో దీని కోసం అనేక మార్లు గడువు పెంచడం కూడా జరిగింది. మరో సారి పొడిగిస్తుందో.. లేదో ప్రస్తుతానికి తెలియదు. నిజానికి పాన్ - ఆధార్ లింక్ గడువు ఎప్పుడో ముగిసింది. అయితే 2023 మార్చి 31 వరకు రూ. 1000 ఫైన్తో అదనపు గడువు కల్పించారు. ఆ కూడా జూన్ 30 వరకు పొడిగించారు. ఆ గడువు కాస్త ఈ రోజుతో ముగియనుంది. ఇంకో సారి పెంచే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నా.. దీనిపైనా ఎటువంటి స్పష్టత లేదు. ఆధార్ - పాన్ లింక్ చేయకపోతే ఏమవుతుంది.. ఆధార్ - పాన్ గడువు లోపలు చేయకుండా ఉంటే వారి బ్యాంకింగ్ సర్వీసులు, డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకం మాత్రమే కాకుండా.. ఆన్లైన్ చెల్లింపులు, యూపీఐ చెల్లింపులు, మొబైల్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు వీలుండదు, పెండింగ్ రిటర్నుల ప్రాసెస్ కూడా నిలిచిపోతుంది. (ఇదీ చదవండి: మీ పాన్ నెంబర్తో ఆధార్ లింక్ అయిందా? ఈ సింపుల్ టెక్నిక్స్తో తెలుసుకోండి) ఆధార్ - పాన్ లింక్ అనేది కొన్ని కేటగిరీకు సంబంధించిన వ్యక్తులకు తప్పనిసరి కాదని సీబీడీటీ (CBDT) తెలిపింది. ఇందులో 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం భారత నివాసి కాని వారు & భారత పౌరులు కాని వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి వ్యక్తులకు ఆధార్ - పాన్ లింక్ అవసరం లేదు. -
Ind Vs Eng: విజయానికి 291 పరుగుల దూరం.. పది పడాలి!
ఓవల్ టెస్టు రసకందాయంలో పడింది. భారత్, ఇంగ్లండ్ జట్లను విజయం ఊరిస్తోంది. టీమిండియా గెలవాలంటే మన బౌలర్లు చివరి రోజు పది వికెట్లు తీయాల్సిందే. ఇంగ్లండ్ విజయానికి మరో 291 పరుగుల దూరంలో ఉంది. టెస్టులో చివరి రోజు 250కు పైగా పరుగులు చేయాలంటే ఏ జట్టుకైనా కష్ట సాధ్యమే. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు ఆఖరి రోజు ఆట ఎన్ని మలుపులు తిరుగుతుందో, విజయం ఎవరివైపు మొగ్గుతుందో ఆసక్తికరంగా మారింది. లండన్: తమ ఖాతాలో మరో విజయం వేసుకొని ఇంగ్లండ్తో సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లాలంటే భారత బౌలర్లు నాలుగో టెస్టులో చివరి రోజు సత్తా చాటుకోవాలి. ఆఖరి రోజు మొత్తం 10 వికెట్లు పడగొడితేనే భారత్కు విజయం దక్కుతుంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు కూడా విజయంపై కన్నేసింది. 368 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు), హసీబ్ (43 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 148.2 ఓవర్లలో 466 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శార్దుల్ ఠాకూర్ (72 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్) వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడగా... వికెట్ కీపర్ రిషభ్ పంత్ (106 బంతుల్లో 50; 4 ఫోర్లు) రాణించాడు. క్రిస్ వోక్స్ 3 వికెట్లు తీశాడు. శార్దుల్ మళ్లీ మెరిశాడు 270/3తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన భారత్ను ఇంగ్లండ్ బౌలింగ్ ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ దెబ్బతీశాడు. ఓవర్నైట్ స్కోరుకు 26 పరుగులు జతయ్యాక... జడేజా (17; 3 ఫోర్లు), రహానే (0)లను తన వరుస ఓవర్లలో వోక్స్ అవుట్ చేశాడు. కాసేపటికే కెప్టెన్ కోహ్లి (44; 7 ఫోర్లు) మొయిన్ అలీ బౌలింగ్లో ఒవర్టన్కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి భారత స్కోరు 312/6 కాగా... ఆధిక్యం 213 పరుగులు. ఈ దశలో క్రీజులోకి వచ్చి న యువ ప్లేయర్లు రిషభ్ పంత్, శార్దుల్ ఠాకూర్ భారత్ను సురక్షిత స్థితిలో ఉంచే బాధ్యతను తీసుకున్నారు. వీరిద్దరూ మొదట ఆచితూచిగా ఆడటంతో పరుగుల వేగం మందగించింది. లంచ్ విరామానికి భారత్ స్కోరు 329/6గా ఉంది. లంచ్ తర్వాత శార్దుల్ తన బ్యాట్కు పని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్లో ఆడినంత ధాటిగా కాకపోయినా... ఇక్కడ కూడా స్కోరు బోర్డును పరిగెత్తించాడు. అతడికి పంత్ కూడా తోడవ్వడంతో భారత్ ఆధిక్యం 300 పరుగులు చేరుకుంది. ఈ క్రమంలో శార్దుల్ 65 బంతుల్లో మ్యాచ్లో రెండో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. çఎనిమిదో బ్యాట్స్మన్గా వచ్చి ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లోనూ 50కిపైగా పరుగులు సాధించిన మూడో భారత క్రికెటర్గా శార్దుల్ ఘనతకెక్కాడు. అనంతరం పంత్ కూడా హాఫ్ సెంచరీని అందుకున్నాడు. వీరిద్దరూ ఏడో వికెట్కు 100 పరుగులు జోడించారు. చివర్లో ఉమేశ్ యాదవ్ (25; 1 ఫోర్, 2 సిక్స్లు), బుమ్రా (24; 4 ఫోర్లు) నిలబడటంతో ఇంగ్లండ్ ముందు టీమిండియా భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 191; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 290; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (సి) వోక్స్ (బి) రాబిన్సన్ 127; రాహుల్ (సి) బెయిర్స్టో (బి) అండర్సన్ 46; పుజారా (సి) అలీ (బి) రాబిన్సన్ 61; కోహ్లి (సి) ఒవర్టన్ (బి) అలీ 44; జడేజా (ఎల్బీ) (బి) వోక్స్ 17; రహానే (ఎల్బీ) (బి) వోక్స్ 0; పంత్ (సి అండ్ బి) అలీ 50; శార్దుల్ ఠాకూర్ (సి) ఒవర్టన్ (బి) రూట్ 60; ఉమేశ్ యాదవ్ (సి) అలీ (బి) ఒవర్టన్ 25; బుమ్రా (సి) అలీ (బి) వోక్స్ 24; సిరాజ్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 9; మొత్తం (148.2 ఓవర్లలో ఆలౌట్) 466. వికెట్ల పతనం: 1–83, 2–236, 3–237, 4–296, 5–296, 6–312, 7–412, 8–414, 9–450, 10–466. బౌలింగ్: అండర్సన్ 33–10–79–1, రాబిన్సన్ 32–7–105–2, వోక్స్ 32–8–83–3, ఒవర్టన్ 18.2–3–58–1, మొయిన్ అలీ 26–0–118–2, రూట్ 7–1–16–1. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్స్ (బ్యాటింగ్) 31; హమీద్ (బ్యాటింగ్) 43; ఎక్స్ట్రాలు 3; మొత్తం (32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 77. బౌలింగ్: ఉమేశ్ 6–2–13–0, బుమ్రా 7–3–11–0, జడేజా 13–4–28–0, సిరాజ్ 6–0–24–0. -
వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తుకు చివరి రోజు
-
టీమిండియా గెలుపుకు వరుణుడి ఆటంకం..?
నాటింగ్హామ్: ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టు ఆఖరి రోజు ఆట ప్రారంభానికి వరుణుడు ఆటంకం కలిగించాడు. మ్యాచ్ ప్రారంభంకావాల్సిన సమయానికి వర్షం కురుస్తుండటంతో ఆట ఆలస్యంగా ప్రారంభమయ్యేలా కనిపిస్తోంది. 209 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీ సేన నాలుగో రోజు వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. నాలుగో రోజు ఆట చివర్లో ధాటిగా ఆడిన కేఎల్ రాహుల్ (38 బంతుల్లో 26; 6 ఫోర్లు) నిష్క్రమించగా.. రోహిత్ శర్మ (12 బ్యాటింగ్), పుజారా (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆఖరి రోజు మరో 157 పరుగులు చేస్తే భారత్ విజయ జయభేరి మోగిస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా గెలుపును వరుణుడు అడ్డుతగిలేలా కనిపిస్తున్నాడు. అంతకుముందు 25/0 ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్లో 303 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (172 బంతుల్లో 109; 14 ఫోర్లు) సెంచరీ సాధించాడు. రూట్ శతక్కొట్టిన తర్వాత ఔట్ చేసిన బుమ్రా (5/64) మిగతా టాపార్డర్ను కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్కు చేర్చాడు. ఓపెనర్ సిబ్లీ (28; 2 ఫోర్లు), వన్డౌన్లో క్రాలీ (6) సహా లోయర్ ఆర్డర్లో స్యామ్ కరన్ (45 బంతుల్లో 32; 4 ఫోర్లు), బ్రాడ్ (0)లను బుమ్రా ఔట్ చేశాడు. మరోవైపు శార్దుల్... లారెన్స్ (25), బట్లర్ (17) వికెట్లను పడగొట్టాడు. సిరాజ్ 2, షమీ ఓ వికెట్ పడగొట్టారు. -
అలరించిన ఆవిష్కరణలు
కాజీపేట అర్బన్: వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో విద్యార్థులు నిర్వహిస్తున్న సాంకేతిక సంబురం టెక్నోజియాన్–19 నోవస్లో శనివారం రెండో రోజూ ఆవిష్కరణ లు ఆకట్టుకున్నాయి. 14 వర్క్షాప్లు, 7 గెస్ట్ లెక్చర్లు, 55 ఈవెంట్లు, 6 అట్రాక్షన్లు, 6 స్పాట్లైట్స్ నిర్వహించారు. జహాజ్, త్రష్ట్, బాక్సింగ్ రోబోస్, అల్యూర్ లో భాగంగా విద్యార్థుల ర్యాంప్ వాక్, బాలీవుడ్ సింగర్ షెర్టీ సేటియా గీతామృతం అలరించాయి. రైతే రాజు అనే నానుడి నుంచి రైతే శాస్త్రవేత్త అనే స్థాయికి ఎదిగిన రైతన్న సంబంధిత ఆవిష్కరణలు అబ్బురపరిచా యి. చివరి రోజు ఆదివారం గెస్ట్లెక్చర్కు హీరో కార్తికేయ హాజరుకానున్నారు. ఆసు యంత్రం ఆలేరుకు చెందిన చింత కింది మల్లేశం రూపొందించిన ఆసు యంత్రాన్ని ఆలేరుకు చెందిన దామోదర్ ప్రదర్శించారు. మల్లేశం మగ్గంతో కులవృత్తి కొనసాగిస్తున్న సమయంలో ఆటంకాలను అధిగమించేందుకు ఈ యంత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఒక గంటలో 8 చీరలను నేసేందుకు వీలుగా ఆసు యంత్రం తోడ్పడుతుందని చెప్పారు. స్క్రాప్ రిమూవర్ విజయవాడకు చెందిన అబ్దుల్ జలీల్ రూ.22 వేల ఖర్చుతో ఈ యంత్రం రూపొందించారు. స్క్రాప్ను వేరు చేసి అల్యూమినియం, కాపర్ వైర్లను తిరిగి ఉపయోగించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఒక గంటలో 30 నుంచి 40 కిలోల వైర్ను తొలగిస్తూ గాలి కాలుష్యం లేకుండా ఉపయోగపడుతుంది. వైల్డ్ బోర్ అలారమ్ జగిత్యాల జిల్లా కిషన్రావుపేటకు చెందిన ఇంజపూరి అంజయ్య రూ.1,500 ఖర్చుతో దీన్ని రూపొందించారు. 5వ తరగతి వరకు చదువుకున్న ఆయన తన భూమిలో పంటలను అడవి పందులు నాశనం చేస్తుండగా, వాటిని తరిమికొట్టేందుకు యంత్రాన్ని కనుగొన్నాడు. యాంప్లీఫయర్ సాయం తో రూపొం దించిన సర్క్యూట్కు ఒక స్పీకర్ను ఏర్పాటు చేసి బోర్కు అనుసంధానం చేస్తే చాలు అడవి పందులను భయపెట్టే శబ్దం చేస్తుంది. ఏటీవీ బైక్ నిట్ వరంగల్కు చెందిన విద్యార్థులు ఎనిమిది నెలల కాలంలో రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షలు వెచ్చించి ఏటీవీ (ఆల్ టెరెయిన్ వెహికల్) రూపొందించారు. ఇది కొండలు, ఘాట్ రోడ్లపై సునాయాసంగా ప్రయాణం చేస్తుంది. 3 లీటర్ల పెట్రోల్ సామర్థ్యంతో రూపొందించిన ఈ వాహనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
టెండర్లకు మిగిలింది ఒక్క రోజే..
సాక్షి, మెదక్ : మద్యం షాపుల దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనుంది. జిల్లాలో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. సోమవారం వరకు నత్తనడకన సాగింది. అయితే.. మంగళవారం ఒక్కరోజే 79 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు బుధవారం ఆశావహులు పోటెత్తే అవకాశం ఉండటంతో మెదక్లోని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో దీనికనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2017- 19లో జిల్లా పరిధిలోని మద్యం దుకాణాలు రూ.40 లక్షలు, రూ.45 లక్షల శ్లాబ్ పరిధిలోకి వచ్చేవి. ప్రస్తుతం రూ.50 లక్షలు, రూ.55 లక్షల పరిధిలో ఉన్నాయి. గత పర్యాయంలో జిల్లాలో 37 మద్యం షాపులకు 301 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దానికి దరఖాస్తు ఫీజు రూ.లక్ష కాగా.. సర్కారుకు సుమారు రూ.3 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఆదాయం రాబట్టుకునేందుకు ప్రభుత్వం ఈ సారి దరఖాస్తు ఫీజును రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచింది. అదేవిధంగా చిన్నశంకరంపేటలో ఒక మద్యం షాపును అదనంగా కేటాయింది. ఈ లెక్కన జిల్లాలో 38 మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. మంగళవారం వరకు మొత్తం 156 దరఖాస్తులు వచ్చాయి. దీన్ని బట్టి ఇప్పటివరకు సుమారు రూ.3.12 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరినట్లు తెలుస్తోంది. దీంతో దరఖాస్తు గడువు ముగిసే ఒక్క రోజుకు ముందే గత ఏడాది టార్గెట్ను చేరినట్లయింది. పునరావృతం మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి గత, ప్రస్తుత పర్యాయాలు గడువు ఏడు రోజులుగా నిర్ధారించారు. 2017 – 19లో తొలి ఐదు రోజుల్లో కేవలం 17 వచ్చాయి. ఆరో రోజు 59, చివరి రోజు భారీగా 225 మంది దరఖాస్తు చేశారు. 2019 – 21కి సంబంధించి సైతం ఇదే పునరావృతమవుతోంది. ఐదో రోజు వరకు 77 దరఖాస్తులు రాగా.. ఆరో రోజు మంగళవారం అయినప్పటికీ నిర్దేశిత సమయం ముగిసే వరకు 79 వచ్చాయి. ఈ లెక్కన చివరి రోజున 240కి మించి దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 18న లాటరీ దరఖాస్తుల స్వీకరణ అనంతరం ఈ నెల 18న కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. ఒక్కో షాపునకు రెండు, అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ తప్పనిసరి. ఒకటే వచ్చిన పక్షంలో సదరు దరఖాస్తుదారుడికి షాపును కేటాయించనున్నారు. -
నేడే నామినేషన్లకు చివరి రోజు
సాక్షి,యాదాద్రి : సార్వత్రిక సంగ్రామంలో కీలకమైన నామినేషన్ల ఘట్టం సోమవారం మధ్యాహ్నం 3గంటలకు ముగియనుంది. భువనగిరి పార్లమెంట్ స్థానానికి ఇప్పటివరకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు 20 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సీపీఐ మినహా మిగతా ప్రధాన పార్టీలన్నీ నామినేషన్లు వేశాయి. టీఆర్ఎస్ నుంచి బూరనర్సయ్యగౌడ్, కాంగ్రెస్ తరఫున కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పీవీ శ్యాంసుందర్రావు ఈనెల22న మంచి ముహూర్తం ఉండడంతో అదే రోజు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా వీరందరూ మరోసారి సోమవారం బలప్రదర్శనతో వచ్చి నామినేషన్లు వేయనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన భువనగిరిలో భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి భారీ జన సమీకరణ చేస్తున్నారు. జనాన్ని తరలించేందుకు వాహనాలను సమకూర్చారు. ర్యాలీలు నిర్వహిస్తున్నందున ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తీసుకున్నారు. నామినేషన్ కార్యక్రమానికి ఆయా పార్టీలకు చెందిన జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారు. టీఆర్ఎస్ ర్యాలీకి హాజరుకానున్న మంత్రి జగదీశ్రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి బూరనర్సయ్యగౌడ్ ఈ నెల 22న ఉమ్మడి జిల్లా మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి నామినేషన్ వేశారు. కాగా అయన మరోసారి సోమవారం సుమారు 40 వేల మందితో భారీ ర్యాలీ మధ్య నామినేషన్ వేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీశ్రెడ్డితో పాటు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గొంగిడిసునీతామహేందర్రెడ్డి, గాదరి కిశోర్కుమార్, మంచిరెడ్డి కిషన్రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్లు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. భువనగిరిలోని సాయిబాబా దేవాలయంనుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీకి ఏర్పాటు చేసినట్లు టీఆర్ఎస్ అభ్యర్థి బూరనర్సయ్యగౌడ్ తెలిపారు. బీజేపీ ప్రముఖుల రాక బీజేపీ అభ్యర్థి పీవీ శ్యామ్సుందర్రావు నామినేషన్ కార్యక్రమానికి పార్టీకి చెందిన పలువురు ప్రముఖ నేతలు కానున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావుతో పాటు పలువురు నేతలు హాజరవుతున్నట్లు పార్టీ అభ్యర్థి శ్యామ్సుందర్రావు తెలిపారు. 30వేల మందితో భారీ ర్యాలీ తీసేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసుకుంది. ఉదయం 10గంటలకు భువనగిరి పట్టణంలోని సాయిబాబ దేవాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగుతుంది. ఇందుకోసం పార్లమెంట్నియోజకవర్గం పరిధిలోని ముఖ్యనేతలతోపాటు పార్టీ శ్రేణులను తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాంగ్రెస్ ర్యాలీకి అంతా సిద్ధం కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి మద్దతుగా భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యన సాయి కన్వెన్షన్ హాల్లో కార్యకర్తల సమావేశం ఉంటుందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ కుంభం అనిల్కుమార్రెడ్డి తెలిపారు. పార్టీ శ్రేణులన్నీ స్వచ్ఛందంగా నామినేషన్ కార్యక్రమానికి తరలిరావాలని bయన పిలుపునిచ్చారు. భారీ పోలీస్ బందోబస్తు చివరి రోజున ప్రధాన పార్టీలన్నీ మరోసారి నామినేషన్ వేస్తుండడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అభ్యర్థుల వెంట భారీగా ఆయా పార్టీల శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ర్యాలీలు నిర్వహించేలా పోలీసులు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆయా పార్టీల ర్యాలీలు ఎదురెదురు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయమై ఇప్పటికే డీసీపీ నారాయణరెడ్డి పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచనలు, సలహాలు చేశారు. బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. శాంతియుతంగా వ్యవహరించాలి నామినేషన్ల చివరి రోజున రాజకీయ పార్టీలు శాంతియుతంగా వ్యవహరించాలి. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కల్పించినా చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటాం. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ర్యాలీగా వచ్చే వారికి వేర్వేరు సమయాలలో ర్యాలీలకు అనుమతులు ఇచ్చాం. బందోబస్తు కోసం భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ ఏసీపీలు పర్యవేక్షిస్తారు. సుమారు 500 మంది సివిల్, సాయుధ పోలీస్లతో బందోబస్తు ఏర్పాటు చేశాం. రాజకీయ పార్టీల ర్యాలీని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 500 మీటర్ల దూరంలోనే నిలిపివేస్తాం. 100 మీటర్ల నుంచి కేవలం 5 గురు సభ్యులను మాత్రమే రిటర్నింగ్ అధికారి వద్దకు నామినేషన్ వేయడానికి పంపిస్తాం. ఎలాంటి అవాంచనీయ సంఘటలను జరుగకుండా రాజకీయ పార్టీలు సహకరించాలి. –నారాయణరెడ్డి, డీసీపీ -
ఆఖరి రోజు..నామినేషన్ల జోరు
ఈ నెల 12న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ నేటి(19వ తేదీ)తో ముగిసింది. సోమవారం అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. పలువురు అభ్యర్థులు తమ అనుచరులు, మద్దతుదారులతో ర్యాలీగా రిటర్నింగ్ కార్యాలయాలకు చేరుకున్నారు. నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. పాలేరులో మంత్రి, టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మంలో టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్, మధిరలో కూటమి(కాంగ్రెస్) అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క, సత్తుపల్లిలో కూటమి(టీడీపీ) అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య, కొత్తగూడెంలో కూటమి(కాంగ్రెస్) అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. పాలేరులో తుమ్మల ఖమ్మంరూరల్: పాలేరు టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి దశర«థ్కు అందించారు. తుమ్మల వెంట ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత తదితరులు ఉన్నారు. నామివేషన్ వేసిన అనంతరం తుమ్మల మాట్లాడుతూ నియోజకవర్గంలో దశాబ్దాల నుంచి కరువు పరిస్థితులు ఉండేవని, ప్రజల కష్టాలను గుర్తించి సీఎం కేసీఆర్ను ఒప్పించి భక్తరాదాసు ప్రాజెక్ట్ను రూ.100కోట్లతో చేపట్టి పాలేరు రిజర్వాయర్ నుంచి సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని అభివృద్ధి పథకాలు కొనసాగాలంటే తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కొత్తగూడెంలో వనమా కొత్తగూడెంరూరల్: కొత్తగూడెంలో కూటమి (కాంగ్రెస్) అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు తరఫున ఆయన మనవరాళ్లు(తనయులు రాఘవేంద్రరావు, రామకృష్ణల కూమార్తెలు) డాక్టర్ అలేఖ్య, హర్షిణి, మనీషా, వనమా అల్లుళ్లు మనోహర్, లక్ష్మణ్రావు నామినేషన్ వేశారు. మూడు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. బీఫాంను ఎన్నికల అధికారికి అందజేశారు. కాంగ్రెస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు, ఎంఎ రజాక్, కాసుల వెంకట్, తూము చౌదరి, ముత్యాల వీరభద్రం, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాసుల ఉమారాణి, జెడ్పీటీసీ గిడ్ల పరంజ్యోతిరావు పాల్గొన్నారు. సత్తుపల్లిలో సండ్ర సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి(టీడీపీ) అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య సోమవారం నామినేషన్ వేశారు. నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మధిరలో మల్లు భట్టి మధిర: తాజా మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్ర మార్క సోమవారం రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ప్రజాకూటమి బలపర్చి న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భట్టి తన అనుచరులతో కలిసివెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతికి నామినేషన్ అందజేశారు. ఆయన మూడుసెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ముందుగా పలు ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక క్యాంపు కార్యాలయంనుంచి తన సతీమణి మల్లు నందిని, కుమారులు మల్లు సూర్యవిక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్యలతో కలిసివచ్చారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ వాసిరెడ్డి రామనాధం, కాంగ్రెస్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం అసెంబ్లీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జే.శ్రీనివాసరావుకు అజయ్ నామినేషన్ పత్రాలను అందజేశారు. అజయ్కుమార్కు మద్దతుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆర్వో కార్యాలయంలోకి వెళ్లారు. అంతకుముందు అజయ్ నగరంలోని పవనసుత జలాంజనేయ స్వామి దేవస్థానం, చెరువు బజార్ హనుమాన్ గుడిలో పూజలు చేశారు. -
చివరి అవకాశం..రేపటినుంచి ఇక అంతే..
-
చివరి అవకాశం..రేపటినుంచి ఇక అంతే..
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్లు జమ నేటితో రద్దు. రద్దైన పెద్దనోట్ల ఆర్బీఐ ప్రత్యేక కౌంటర్లలో డిపాజిట్లకు తుది గడువు నేటి (మార్చి31) తో ముగియనుంది. గత ఏడాది నవంబర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దుచేసి సంచలనం సృష్టించారు. నల్లధనాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం భారత పౌరులు పాతనోట్లను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. నేరంగా పరిగణిస్తారు. ఈ ఉల్లంఘన రూ. 10,000 జరిమానా లేదా పట్టుబడిన సొమ్ముకు ఐదు రెట్లు వీటిలో ఏది ఎక్కువ దాని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ప్రవాస భారతీయుల (ఎన్నారైలు) పాతనోట్ల మార్పిడికి జూన్ 30కి గడువును ఇచ్చింది కేంద్ర బ్యాంకు. ఈ సౌకర్యం ముంబై, ఢిల్లీ, కోలకతా, చెన్నై, నాగ్పూర్ లో ఆర్బిఐ కార్యాలయాలలో మాత్రమే అందుబాటులో ఉంది. విదేశాలనుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులనుంచి రెడ్ ఛానల్ సర్టిపికెట్ తెచ్చుకోవాల్సి ఉంది. ఫెమా నిబంధనల ప్రకారం ఈ పరిమితి ఒక వ్యక్తికి రూ. 25,000. ఒకవేళ ఈ డిపాజిట్కు కేంద్ర బ్యాంకు నిరాకరించిన విషయంలో, 14 రోజుల లోపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ కు ఫిర్యాదు చేయవచ్చు. నేపాల్, భూటాన్, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లో ఉండే వారు ఈ సౌకర్యం ఉపయోగించుకోలేరు. కాగా నవంబర్ 8న డిమానిటైజేషన ప్రకటించిన కేంద్రప్రభుత్వం రద్దయిన పెద్దనోట్లను బ్యాంకులు స్వీకరించే గడువును జనవరి 30, 2017తో ముగించింది. అయితే రద్దయిన నోట్లను డిసెంబరు 30వ తేదీలోపు తమ అకౌంట్లలో డిపాజిట్ చేసుకోలేని వారు తగిన కారణాలను చూపి.. రిజర్వ్బ్యాంకు ప్రత్యేకించిన కౌంటర్లలో మార్చి 31వ తేదీ వరకు మార్పిడి చేసుకునే అవకాశం ఇచ్చింది. నగదు ఉపసంహరణపై అనేక ఆంక్షలు, పరిమితుల నేపథ్యంలో తీవ్ర నిరసన వ్యక్తంకావడంతో ఖాతాదారుల సౌలభ్యంకోసం విడతలవారీగా కొన్ని వెసులు బాటును ప్రకటించింది. మరోవైపు డిమానిటైజేషన్ 50 రోజుల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 86శాతం చలామణిలో ఉన్న పెద్దనోట్లను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా సంక్షోభం ఏర్పడింది. రద్దయిన నోట్లను నవంబరు 10వ తేదీ నుంచి బ్యాంకులు స్వీకరించడం ప్రారంభించాయి. దీంతో అటు డిపాజిట్లకు, ఇటు నగదుకోసం ఏటీఎంల సెంటర్లదగ్గర, బ్యాంకుల వద్ద ప్రజలుబారులు తీరారు. పనిచేయని ఏటీఎంలు, నో క్యాష్ కోర్డులు వెక్కిరించడంతో కొన్ని అవాంఛనీయ ఘటనలు, మరణాలు సంభవించిన సంగతి విదితమే. -
నేటి రాత్రి వరకే పాత నోట్లకు గడువు
-
కృష్ణమ్మ కృప కోసం
-
ఆ రోజు అందరికీ మంచి పార్టీ ఇస్తాను!
‘జీవితంలో ఇదే ఆఖరి రోజు’ అని ముందుగానే తెలుసుకుంటే.. చేయాల్సిన పనులన్నీ ఆ ఒక్క రోజులో చేయాలని తాపత్రయపడిపోతాం. ఇటీవల ఓ సందర్భంలో శ్రుతీహాసన్ దగ్గర ఈ ప్రస్తావన తీసుకొస్తే.. ‘ఇదే చివరి రోజు అయితేనా...’ అని కాసేపు ఆలోచించారు. ఈ భూమ్మీద నాకిదే చివరి రోజు అని తెలిస్తే? నేనేం చేస్తానంటే? అని శ్రుతీహాసన్ చెబుతూ - ‘‘షూటింగ్స్ కోసం త్వరగా నిద్ర లేవడం, హడావిడిగా రెడీ అవ్వడంతో బిజీ బిజీగా ఉంటాను. అందుకే, చివరి రోజని తెలిసిన రోజున చాలా ఆలస్యంగా నిద్ర లేస్తాను. ఆ తర్వాత నింపాదిగా రెడీ అయ్యి, ఒక జెట్ ఫ్లైట్ తీసుకుంటాను. నాకు నచ్చిన ప్లేస్కి వెళ్లి ఒక సంగీత కచేరీ చేస్తాను. దానికి నా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరూ హాజరయ్యేలా చూసుకుంటాను. అందరికీ మంచి పార్టీ ఇస్తాను. ఆత్మీయులను అభిమానంగా హత్తుకుంటాను. ఏడుస్తాను.. నవ్వుతాను. నా బ్లడ్లోనే సినిమా ఉంది కాబట్టి, ఏదైనా సినిమా తప్పనిసరిగా చూస్తాను. ఇంకా టైముంటే ఏది నచ్చితే అది చేస్తాను’’ అని పేర్కొన్నారు. -
నేటితో ముగియనున్న చండీయాగం
-
చిన్నారుల చిత్రోత్సవం
-
మంగంపేటలో చివరి రోజు 5లక్షల మంది
మంగంపేట (వరంగల్ జిల్లా) : వరంగల్ జిల్లాలోని మంగంపేట రామన్నగూడెం పుష్కరఘాట్లో చివరిరోజు 5లక్షల మంది భక్తులు పుష్కరస్నానం చేశారు. మంగంపేట, రామన్నగూడెం, మళ్లకట్ట పుష్కరఘాట్లలో భక్తులు శనివారం తెల్లవారుజాము నుంచే పుష్కరస్నానం ఆచరించారు. కాగా జిల్లాలోని మూడు పుష్కరఘాట్లలో 12 రోజుల్లో 25లక్షల మంది పుష్కరాల్లో పాల్గొన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎంపీ కవిత పుష్కరఘాట్లను సందర్శించారు. -
'మనూ' లో ప్రవేశ దరఖాస్తులకు చివరి తేది మే 27
హైదరాబాద్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మను) లో పలు కోర్సుల్లో ప్రవేశాలకు దర ఖాస్తు ఆన్లైన్ గడువు మే 27తో ముగియనుంది. 14 రకాల విభిన్న కోర్సులను యూనివర్సిటీ ఆఫర్ చే స్తోంది. దరఖాస్తు ఫీజు జనరల్ విద్యార్థులకు రూ. 500, ఎస్సీ,ఎస్టీ, వికలాంగులకు రూ. 300 చె ల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపు చలాన్లు యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పీహెచ్డీలో కంప్యూటర్సైన్స్, మ్యాథ్స్, మేనేజ్మెంట్ స్టడీస్, జర్నలిజం అండ్ కమ్యూనికేషన్స్, ఎడ్యుకేషన్, సోషల్ వర్క్, పబ్లిక్ అడ్మినిష్ర్టేషన్, ఉమెన్ స్టడీస్, ట్రాన్స్లేషన్ స్టడీస్, ఇంగ్లీష్, హింది, అరబిక్, ఉర్దూ, పర్షియన్ కోర్సులను, ఎం.ఫిల్ విభాగంలో పబ్లిక్ అడ్మినిష్ర్టేషన్, పొలిటికల్ సైన్స్, ఎడ్యుకేషన్, ఉమెన్ స్టడీస్,ఇస్లామిక్ స్టడీస్, స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ ఇన్క్లూజివ్ పాలసీ, ఇంగ్లీష్, హింది, అరబిక్, పర్షియన్, ఉర్దూ కోర్సులున్నాయి. కాగా పోస్టుగ్రాడ్యుయేట్ విభాగంలో కంప్యూటర్ సైన్స్(ఎం.టెక్) మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిష్ర్టేషన్, ఎం.ఏ జర్నలిజమ్ అండ్ మాస్ క మ్యూనికేషన్స్, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులున్నాయి. అదేవిధంగా ఎం.టెక్, బి.టెక్ డిప్లోమో ఎంటమెంటరీ ఎడ్యుకేషన్, బ్యాచులర్ ఎడ్యుకేషన్ వంటి కోర్సులున్నాయి. వీటికి ఎంట్రెన్స్ ద్వారా ప్రవేశాలను కల్పిస్తారు. -
ముగిసిన కూచిపూడి నాట్య సమ్మేళనం
-
షో ముగిసింది
-
రేపే ఆఖరి రోజు
-
రేపే ఆఖరి రోజు
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డికి రేపే ఆఖరి రోజని అతని సన్నిహితులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై లోక్సభలో చర్చ ప్రారంభం కాగానే రాజీనామా చేయాలని సిఎం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై లోక్సభలో రేపు చర్చ ప్రారంభమవుతుంది. సచివాలయంలోని సిఎం పేషీలో వ్యక్తిగత వస్తువులను సిబ్బంది తీసుకువెళ్లినట్లు సమాచారం. పేషీ అధికారులు కూడా సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నారు. తన రాజీనామాకు సంబంధించి సిఎం ఒకరిద్దరు ఎంపీలకు సమాచారం అందజేసినట్లు తెలుస్తోంది.