టీఎస్ లాసెట్-2017 ఫలితాలు విడుదల
వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో మూడేళ్ల, ఐదేళ్ల, పీజీ న్యాయశాస్త్ర కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్-2017 ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. ఫలితాలను కేయూ ఉపకులపతి ఆచార్య ఆర్.సాయన్న శనివారం ఉదయం 9 గంటలకు హన్మకొండలోని విశ్వవిద్యాలయ న్యాయ కళాశాలలో విడుదల చేశారు. మొత్తం 87 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండు శాతం ఉత్తీర్ణత పెరిగింది. లాసెట్ను మూడోసారి కాకతీయ విశ్వవిద్యాలయమే నిర్వహించింది.