madagajaraja
-
తమిళ్లో పెద్ద హిట్.. తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుంది: అంజలి
విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘మద గజరాజా’(Madagada Raja ). ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, అంజలి హీరోయిన్లుగా నటించారు. సుందర్. సి దర్శకత్వంలో జెమిని ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న తమిళంలో విడుదలైంది. ఈ సినిమా తమిళంలో హిట్ మూవీగా నిలిచి, రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించిందని చిత్రబృందం పేర్కొంది. కాగా ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ను అదే టైటిల్తో సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ నెల 31న తెలుగులో విడుదల చేస్తోంది.హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంజలి(Anjali) మాట్లాడుతూ– ‘‘మంచి కమర్షియల్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాను ఎంజాయ్ చేస్తూ చేశాను. ఈ మూవీ, తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు. విశాల్ యాక్షన్, సంతానం కామెడీ, మ్యూజిక్, సుందర్ సర్ డైరెక్షన్ తో కలర్ ఫుల్ మూవీ ఇది. మూవీ లవర్స్ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. థియేటర్స్ లో చూడండి. తప్పకుండా నచ్చుతుంది' అన్నారు.హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. ‘హీరోయిన్గా నా ఫస్ట్ కమర్షియల్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో వెస్ట్రన్ హీరోయిన్గా కనిపిస్తాను.ఈ సినిమా తమిళ్ లో చాలా పెద్ద హిట్. మంచి ఎంటర్ టైనర్. ప్రతి ఎపిసోడ్ ని ఎంజాయ్ చేస్తారు. ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్ టైనర్. జనవరి 31న తెలుగు రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి'నిర్మాత జెమిని కిరణ్ మాట్లాడుతూ.. ఒక హీరో ఇద్దరు హీరోయిన్స్ తో వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం అని ఈ సంక్రాంతికి ఇక్కడ పెద్ద హిట్ కొట్టారు. అలాగే అక్కడ విశాల్ గారు మదగజరాజా తో తమిళ్ లో పెద్ద విజయం అందుకున్నారు. అక్కడ వి ఇక్కడ వి. ఖచ్చితంగా ఇక్కడ కూడా సూపర్ హిట్ కొడతారు. ఈ సినిమా తమిళ్లో సూపర్ డూపర్ హిట్టు. ఇక్కడ కూడా అలానే అవుతుందని ఆశిస్తున్నాను. థాంక్యూ ఆల్ ది బెస్ట్' అన్నారు. -
గేమ్ ఛేంజర్ డిజాస్టర్పై స్పందించిన అంజలి.. బాధేస్తోందంటూ..
గేమ్ ఛేంజర్ సినిమా (Game Changer Movie) రిజల్ట్పై హీరోయిన్ అంజలి (Anjali) తొలిసారి స్పందించింది. కొన్ని ఫలితాలను చూసినప్పుడు బాధగా అనిపిస్తుందని పేర్కొంది. ఈ సంక్రాంతికి అంజలి నటించిన రెండు సినిమాలు రిలీజయ్యాయి. ఒకటి గేమ్ ఛేంజర్ కాగా మరొకటి మదగజరాజ. పన్నెండేళ్లక్రితం అంజలి హీరోయిన్గా నటించిన మదగజరాజ ఎట్టకేలకు తమిళనాట విడుదలైంది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో జనవరి 31న రిలీజ్ చేస్తున్నారు.అంతవరకే నా పనిఈ సినిమా సమావేశంలో అంజలికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. గేమ్ ఛేంజర్ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఆ సినిమాకు మంచి ఫలితం వచ్చుంటే బాగుండేది కదా.. దానిపై మీ ఫీలింగ్ ఏంటి? అన్న ప్రశ్నకు.. ఒక నటిగా నా పాత్రకోసం నేను బాధ్యత తీసుకోగలను. నా పాత్రను ఎలా పోషించాలి? అందుకోసం వందశాతం ఎఫర్ట్స్ పెడుతున్నానా? లేదా? అన్నదే నా చేతిలో ఉంటుంది. అక్కడితోనే నా పనైపోతుంది. మా సినిమాను జనాలు ఆదరించాలన్నది మా తపన. అందుకోసం ప్రమోషన్స్కు వెళ్తుంటాము. ప్రేక్షకులకు మా సినిమా చూడమని చెప్తాము.ఎవరూ సినిమా బాగోలేదని అనలేదుఅయినా గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడాలంటే దానికోసం ప్రత్యేక ఇంటర్వ్యూ పెట్టాలి. ఎందుకనేది మీ అందరికీ తెలుసు. కొన్ని సినిమాలపై నమ్మకం ఉంచి నటిస్తాము. నేను గేమ్ ఛేంజర్ను పూర్తిగా నమ్మాను. ఈ సినిమా చూసిన జనరల్ ఆడియన్స్ ఎవరూ గేమ్ ఛేంజర్ బాగోలేదని చెప్పలేదు. మంచి సినిమా అని కితాబిచ్చారు. సినిమా బాగుండటం వేరు, మంచి సినిమా వేరు. బాధగా ఉందిగేమ్ ఛేంజర్ మంచి సినిమా.. మీరు చాలా బాగా యాక్ట్ చేశారు అని నాతో చాలామంది అన్నారు. అది నాకు చాలు. అయినా సరే.. కొంత బాధగా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది. మదగజరాజ సినిమా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చుంటే ఒప్పుకునేవారా? అన్న ప్రశ్నకు.. అంజలి, వరలక్ష్మి (Varalaxmi Sarathkumar).. కథ ఎవరు చెప్తున్నారనేదాన్ని బట్టి తమ నిర్ణయం ఆధారపడి ఉంటుందన్నారు.గేమ్ ఛేంజర్ఇదిలా ఉంటే రామ్చరణ్ ప్రధాన పాత్రలో నటించిన గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించినంత విజయం రాబట్టలేకపోయింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటించింది. చరణ్ ద్విపాత్రాభినయం చేయగా అంజలి కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చదవండి: సినిమాలు వదిలేయాలనుకున్నాను: అప్సరా రాణి -
యాక్షన్... కామెడీ
విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన ‘మదగజరాజా’ చిత్రం జనవరి 12న తమిళంలో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి మంచి స్పందన లభించిందని యూనిట్ పేర్కొంది. కాగా ఈ నెల 31న సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. ‘‘విశాల్ పవర్ఫుల్ యాక్షన్, సంతానం కామెడీ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్’’ అని యూనిట్ పేర్కొంది. ఇక ‘మదగజరాజ’ పన్నెండేళ్ల క్రితమే రూపొందింది. కానీ రిలీజ్ కాలేదు. చివరికి తమిళంలో ఈ పొంగల్కి రిలీజైంది. -
విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు.. అసలు విషయం ఇదీ: ఖుష్భూ
కోలీవుడ్ హీరో విశాల్( Vishal) అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ‘మదగజరాజ’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన వణుకుతూ మాట్లాడారు. అంతకు ముందు కొన్నాళ్ల పాటు కెమెరాకు కనిపించలేదు. సడెన్గా ఈవెంట్లో కనిపించి.. అలా వణుకుతూ మాట్లాడడంతో తమ హీరోకి ఏమైందోనని అభిమానులు కంగారు పడ్డారు. ఆయన జ్వరంతో బాధపడుతన్నాడని వైద్యులు చెప్పినప్పటికీ.. విశాల్ హెల్త్పై రకరకాల పుకార్లు వస్తున్నాయి. అసలు విశాల్కి ఏమైందనే విషయాన్ని తాజాగా నటి ఖుష్బూ(khushboo sundar) వివరించింది.కంగారు పడాల్సిన అవసరం లేదుతాజాగా ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..విశాల్ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పారు. ‘ఢిల్లీలో ఉన్నప్పుడే విశాల్కి జ్వరం వచ్చింది. కానీ 12 ఏళ్ల తర్వాత ‘మదగజరాజ’ రిలీజ్ అవుందుని ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఈవెంట్కి వచ్చాడు. అప్పటికే విశాల్ డెంగీ ఫీవర్తో బాధపడుతున్నాడు. 103 డిగ్రీల జ్వరం కారణంగా వణికిపోయారు. ‘ఇంత జ్వరంతో ఎందుకు వచ్చావు?’అని అడిగితే.. ‘నేను నటించిన చిత్రం 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ఈవెంట్కి కచ్చితంగా రావాలనుకున్నాను. అందుకే బాడీ సహకరించకపోయినా వచ్చేశాను’ అని విశాల్ చెప్పారు. ఈ ఈవెంట్ పూర్తయిన వెంటనే విశాల్ని ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. కంగారుపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. అయినా కూడా కొంతమంది యూట్యూబర్స్ విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. సెలబ్రిటీల గురించి నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలను ప్రచారం చేయకండి’ అని ఖుష్భూ విజ్ఞప్తి చేశారు.కాగా, విశాల్, ఖుష్భూ మధ్య మంచి స్నేహబంధం ఉంది. కలిసి సినిమాలు చేయకపోయినా.. చాలా క్లోజ్గా ఉంటారు. మదగజరాజు సినిమాకు ఖుష్భూ భర్త సుందర్.సి దర్శకత్వం వహించారు. విశాల్తో తనకున్న అనుబంధం గురించి ఖుష్భూ మాట్లాడుతూ.. ‘మేమిద్దరం కలిసి సినిమాలు చేయలేదు. కానీ మొదటగా ఇద్దరం కలిసి ఓకే పార్టీలో పని చేశాం. ఆ కారణంగానే మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. విశాల్ నటించిన సినిమాల్లో కొన్ని నాకు చాలా ఇష్టం. మంచి టాలెంట్ ఉన్న నటుడు ఆయన. సినిమా కోసం చాలా కష్టపడతాడు’ అని ఖష్భూ చెప్పుకొచ్చింది.12 ఏళ్ల తర్వాత రిలీజ్విశాల్ హీరోగా సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘మదగజరాజ’(Madha Gaja Raja). 2013లో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పలు కారణాల వల్ల వాయిదా పడి దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్ కామెడీగా రూపొందిన ఈ మూవీలో అంజలి, వరలక్ష్మీ శరత్కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఆర్య, సదా అతిథి పాత్రల్లో సందడి చేయనున్నారు. ఈ సినిమా కోసం విశాల్ ఎయిట్ ప్యాక్ చేశాడట. షూటింగ్ ఆసల్యం అయినా కూడా మరో సినిమా చేయకుండా.. ఈ మూవీ కోసం కష్టపడ్డాడని ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సుందర్ చెప్పారు. అంతేకాదు విశాల్ తనకు సొంత తమ్ముడి లాంటి వాడని చెప్పాడు. మొదట్లో విశాల్ని అపార్థం చేసుకున్నానని, అతనితో పరిచయం ఏర్పడిన తర్వాత అతను ఎంత మంచి వాడనే విషయం తెలిసిందన్నాడు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలతో పని చేసినప్పటికీ.. కార్తిక్ తర్వాత విశాల్తోనే తను బాగా క్లోజ్ అయ్యానని చెప్పారు. #Vishal na get well soon.. #MadhaGajaRajapic.twitter.com/I2K3lTRR0Q— Tamil Cinema Spot (@tamilcinemaspot) January 5, 2025 -
అల్లాటప్పా పాత్రలు చేయను
నటి వరలక్ష్మిశరత్కుమార్ అల్లాటప్పా పాత్రలు చేయనంటున్నారు నటి వరలక్ష్మీశరత్కుమార్. పోడా పోడీ అంటూ శింబుకు జంటగా కోలీవుడ్లో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ తొలి చిత్రంలోనే అందాలారబోతలో ఇరగదీసి యూత్ను గిలిగింతలు పెట్టారు. బెల్లీ డాన్స్తో జిగేల్ మన్నారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో అవకాశాలు స్పీడ్ అందుకోలేదు. ఆ తరువాత విశాల్తో రొమాన్స్ చేసిన మదగజరాజా చిత్రం ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఆ చిత్ర షూటింగ్ సమయంలోనే విశాల్తో సాన్నిహిత్యం పెరిగిందనీ, వారిద్దరు ప్రేమించుకుంటున్నారనే వదంతులు జోరుగా సాగాయి. ఏదేమైనా చాలా గ్యాప్ తరువాత అందిపుచ్చుకున్న చిత్రం తారైతప్పట్టై. బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గరకాటకారి పాత్రలో వరలక్ష్మి దుమ్మురేపారు. ఫలితం చిత్రం విజయం సాధించకపోయినా వరలక్ష్మి ఎలాంటి పాత్రలోనైనా సత్తా చాటగలదన్న పేరును సంపాదించుకున్నారు. తాజాగా అవకాశాలు ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం అర్జున్తో నిపుణన్ చిత్రంతో పాటు, మలయాళంలో మమ్ముట్టి సరసన ఒక చిత్రం చేస్తున్నారు. కాగా తను యాక్షన్ హీరోయిన్ కావాలనుకుంటున్నారనే ప్రచారం మీడియాలో జోరందుకుంది. అది తన చెవికి తాకడంతో స్పందించిన వరలక్ష్మి యాక్షన్ పాత్రలు కోరుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు గానీ, అయితే అల్లాటప్పా పాత్రలు మాత్రం చేయదలచుకోలేదన్నారు. నటనకు అవకాశం ఉన్న బలమైన పాత్రల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. అర్జున్తో నటిస్తున్న నిపుణన్, మమ్ముట్టికి జంటగా నటిస్తున్న మలయాళం చిత్రాలు విడుదలైన తరువాత తన రేంజ్ మారిపోతుందనే విశ్వాసాన్ని వరలక్ష్మి వ్యక్తం చేశారు. -
నటరాజు తనే రాజు
ఇన్నాళ్లూ యాక్షన్ హీరోగా అలరించిన విశాల్ ఈసారి ఫుల్కామెడీ పండించడానికి సిద్ధమవుతున్నారు. కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ సుందర్.సి దర్శకత్వంలో విశాల్ హీరోగా తమిళంలో ‘మదగజరాజా’, తెలుగులో ‘నటరాజు తనే రాజు’ చిత్రం రూపొందుతోంది. దీనికి విశాల్ నిర్మాత కావడం విశేషం. ఇందులో అంజలి కథానాయిక. హీరో శరత్కుమార్ కుమార్తె వరలక్ష్మి మరో నాయికగా చేస్తున్నారు. విశాల్ మాట్లాడుతూ -‘‘ఆద్యంతం వినోదాత్మకంగా ఉండే సినిమా ఇది. సమస్యల్లో ఉన్న స్నేహితుడి కోసం ఏమైనా చేసి అతన్ని మెప్పించాలనే కాంక్షను కలిగిన వ్యక్తిగా ఇందులో నా పాత్రను దర్శకుడు ఆద్భుతంగా తెరకెక్కించారు. షూటింగ్, డబ్బింగ్ పూర్తయింది. ఈ నెల 30న పాటలను, వచ్చే నెల ప్రథమార్ధంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. సోనూసూద్, సుబ్బరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, కెమెరా: రిచర్డ్స్, నిర్మాణ సారథి: వడ్డి రామానుజం. -
హిట్పై నమ్మకంతోనే శ్రమిస్తాం
హిట్ అవుతుందన్న నమ్మకంతోనే ఏ చిత్రానికైనా శ్రమిస్తామని యువ నటుడు విశాల్ పేర్కొన్నారు. నేటి తరం నటుల్లో విశాల్కు ఒక ప్రత్యేకత ఉంది. తనకు నచ్చిన పని చేయడాన్ని ఎవరు చెప్పినా ఆపరు. అలాగే తాను చెప్పదలచుకున్న విషయాన్ని నిర్భయంగా వెల్లడిస్తారు. తాజాగా నిర్మాతగా మారారు విశాల్. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై పాండినాడు అనే చిత్రాన్ని నిర్మిస్తూ హీరోగా నటిస్తున్నారు. ఆయన హీరోగా నటించిన మరో చిత్రం మదగజరాజ (ఎంజీఆర్) విడుదల హక్కులను తానే సొంతం చేసుకున్నారు. ఆ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పత్రికల వారితో విశాల్ శనివారం భేటీ అయ్యూరు. ప్రశ్న :మదగజరాజా (ఎంజీఆర్) చిత్రం గురించి చెప్పండి? జవాబు: 1980లో రజనీకాంత్ రాజాధిరాజా, కమలహాసన్ సకలకళా వల్లభన్ తరహాలో చిత్రం చేయాలని దర్శకుడు సుందర్.సి, నేను భావించాం. అలాంటి పుల్ జాయ్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ఈ మదగజరాజా. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ అంటూ అన్ని జనరంజక అంశాలున్న చిత్రమిది. ప్రశ్న : చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది? జవాబు: ఊటీలో కేబుల్ ఆపరేటర్గా నటిం చాను. ఆ పాత్ర ఎదుర్కొన్న సంఘటనల సమాహారమే చిత్రం. ప్రశ్న: చిత్రంలో అంజలి, వరలక్ష్మి శరత్కుమార్ అంటూ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. వీరిలో ఎవరు బాగా సహకరించారు? జవాబు: మరో హీరోయిన్గా సదా నటించారు. ఆమె చాలా బాగా సహకారం అందించారు. ప్రశ్న : మదగజరాజ చిత్ర విడుదలలో జాప్యానికి కారణమేమిటి? జవాబు : ఈ చిత్రాన్ని జెమినీ సర్క్యూట్ ఫిలిం సంస్థ నిర్మించింది. ఈ ప్రశ్న మీరు ఆ సంస్థను అడగాలి. ప్రతి చిత్రానికీ ఏదో సమస్య ఉం టుం ది. ఈ చిత్రానికి కాస్త ఎక్కువ ఉండొచ్చు. ప్రతి సినిమా హిట్ అవుతుందనే శ్రమిస్తాం. సమస్యలొస్తాయని ఎవరూ ఊహించరు. ప్రశ్న : ఇప్పుడీ చిత్రాన్ని మీరే విడుదల చేస్తున్నారు కదా? జవాబు : నేను నటించిన చిత్రాన్ని నేనే విడుదల చేయడానికి ముందుకు రాకపోతే ఎవరు వస్తారు? మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మదగజరాజ తొలి కాపీ చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యాను. మొదటి నుంచి ఈ చిత్రంపై ప్రత్యేక ప్రేమ ఉంది. అందుకే మదగజరాజా చిత్రాన్ని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో నేనే విడుదల చేయనున్నాను. తెలుగులో నటరాజ తానే రాజ (ఎన్టీఆర్) అనే పేరును నిర్ణయించాం. ప్రశ్న: తమిళంలో ఎంజీఆర్ అనే ఉపశీర్షికను తొలగించడానికి కారణం? జవాబు : ఎంజీఆర్ అంటే ఎనలేని గౌరవం ఉంది. ఆ పేరును ఈ చిత్రానికి ఉపశీర్షికగా పెట్టి అవమానపరచడం ఇష్టం లేక తొలగించాం. ప్రశ్న : మదగజరాజాను సెప్టెంబర్ 6న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ రోజుకు ఏమైనా ప్రత్యేకత ఉందా? జవాబు : మదగజరాజా ఫెస్టివల్ చిత్రమని దర్శకుడు సుందర్.సి అంటుండేవారు. అదే విధంగా ఈ చిత్రాన్ని వినాయకచతుర్థి సందర్భంగా విడుదలకు సిద్ధం చేస్తున్నాం. మరో ముఖ్య విషయం ఏమిటంటే సరిగ్గా సెప్టెంబర్ ఆరుకి నేను పరిశ్రమకు వచ్చి దశాబ్దం పూర్తవుతుంది. ఈ సందర్భంగా నా సంస్థలో నేను నటించిన చిత్రం విడుదల కావడం విశేషంగా భావిస్తున్నాను.