maha ganapathi
-
ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు
-
20 టన్నుల బెల్లంతో గాజువాక మహా గణపతి
-
ఖైరతాబాద్ మహా గణపతికి సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజ
-
భక్త కోటి ఇష్టదైవం బొజ్జ గణపయ్య తొలి పూజకు వేళాయింది..
విశాఖపట్నం: భక్త కోటి ఇష్టదైవం బొజ్జ గణపయ్య తొలి పూజకు వేళాయింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి ఉత్సవాల కోసం నగరం శోభాయమానమైంది. వినాయక చవితి వేడుకలకు మండపాలు అందంగా ముస్తాబయ్యాయి. మహా నగరం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మరోవైపు వినాయక విగ్రహాలు, పూలు, పండ్లు, పూజా సామగ్రి తదితర వస్తువుల కొనుగోళ్లతో పూర్ణామార్కెట్, అక్కయ్యపాలెం, మధురవాడ, గాజువాక, కంచరపాలెం తదితర ప్రాంతాల్లోని మార్కెట్లు కళకళలాడాయి. ప్రధాన రహదారులకు ఇరువైపులా అమ్మకాలతో సందడి నెలకొంది. పర్యావరణహిత మట్టి ప్రతిమల పట్ల నగరవాసులు ఆసక్తి చూపారు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నేతలు, వివిధ సంస్థలు ఇప్పటికే వందలాది మట్టి విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశాయి. మధురవాడ, కంచరపాలెం, అక్కయ్యపాలెం, గాజువాక, పెదగంట్యాడ తదితర ప్రాంతాల్లో భారీ వినాయక విగ్రహాల అమ్మకాలు ఆఖరి రోజైన ఆదివారం జోరుగా సాగాయి. విగ్రహాల తరలింపు, పూలు, పండ్లు, పూజా వస్తువుల కొనుగోళ్ల కోసం జనం పెద్ద ఎత్తున రహదారులపైకి చేరడంతో నగరంలోని పలు చోట్ల ఉదయం నుంచే ట్రాఫిక్ రద్దీ నెలకొంది. వైవిధ్యమూర్తులు.. ఈ సారి కూడా వైవిధ్యభరితమైన విగ్రహమూర్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. బీహెచ్ఈఎల్ దరి గ్లోబెక్స్ థియేటర్స్ వద్ద 112 అడుగుల విగ్రహం, పాతగాజువాక దరి లంకా మైదానంలో 117 అడుగుల విగ్రహం, దొండపర్తిలోని రామాలయం వద్ద 108 అడుగుల భారీ గణనాథుడి విగ్రహాలు ముస్తాబయ్యాయి. వీటితో పాటు అర్ధనారీశ్వరుడి సమక్షంలో కొలువైన బొజ్జ గణపయ్య, బహు ముఖ వినాయకుడు, భక్తుల మదిని దోచే వివిధ రకాల భంగిమలు, ఆకృతులతో, చక్కటి రంగులతో అద్భుతంగా తీర్చిదిద్దిన విగ్రహాలు ఇప్పటికే మండపాలకు చేరుకున్నాయి. సందడిగా మార్కెట్లు.. ధరలకు రెక్కలు వినాయక చవితి సందర్భంగా పూజ కోసం వినియోగించే 21 రకాల పత్రి, బంతి పూలు, మామిడి ఆకులు, మారేడు కాయల అమ్మకాలతో మార్కెట్లలో సందడి నెలకొంది. పండగ సందర్భంగా పూల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. హోల్ సేల్ మార్కెట్లో బంతిపూలు కిలో రూ.90 వరకు ఉంటే పూల దుకాణాల వద్ద కిలో రూ.150 వరకు విక్రయించారు. పూర్ణా మార్కెట్లో 50 గ్రాముల పువ్వులు రూ.100 పైగా అమ్మకాలు జరిపారు. చామంతి పూలు, గులాబీ, తదితర పువ్వుల ధరలు సైతం భారీగా పెరిగాయి. -
‘మహాగణపతి’కి శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులకు శుక్రవారం కర్రపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్ లైబ్రరీ ప్రాంగణంలో మహాగణపతిని ప్రతి ఏటా మాదిరిగానే 60 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేషుడు ‘సప్తముఖ వినాయకుడిగా’ భక్తులకు దర్శనమిస్తారని శిల్పిరాజేంద్రన్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ మీడియాకు తెలిపారు. ఇప్పటివరకు ఎన్నడూ తయారుచేయని విధంగా విఠల శర్మ సిద్ధాంతి సూచనల మేరకు సప్తముఖ వినాయకుడిగా ఖైరతాబాద్ మహాగణపతిని రూపుదిద్దాలని నిర్ణయించినట్లు తెలిపారు. మహాగణపతిని ఎటువైపు నుంచి చూసినా ఒకే విధంగా వివిధ రంగులలో వినాయకుడి తలలు, ఆపై ఏడు తలల సర్పం, 14 చేతుల్లో వివిధ రకాల ఆయుధాలతో మహాగణపతి డిజైన్ను తయారుచేస్తున్నామన్నారు. మరో వారం పది రోజుల్లో ఈ డిజైన్ ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. ప్రతీ సంవత్సరం సర్వేశాం ఏకాదశి సందర్భంగా నిర్వహించే కర్రపూజా కార్యక్రమం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రధానకార్యదర్శి భగవంతరావు, శిల్పి రాజేంద్రన్తో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు ఖైరతాబాద్ మంటపంలో వినాయక విగ్రహానికి పూజలు చేసి అనంతరం కర్రను పాతారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గజ్జల నాగేష్, ఉత్సవ కమిటీ సభ్యులు సందీప్, రాజ్కుమార్ నాయకులు మహేష్యాదవ్, మహేందర్బాబు, మధుకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి సంఘం తరపున మహాగణపతికి భారీ కండువా.... మహాగణపతికి ప్రతీ సంవత్సరం లాగానే పద్మశాలి సంఘం ఖైరతాబాద్ నియోజకవర్గం తరపున 75 అడుగుల భారీ గాయత్రి జంధ్యం, 75 అడుగుల భారీ చేనేత కండువా వినాయక చవితి రోజు సమర్పించనున్నట్లు సంఘం గౌరవ అధ్యక్షులు కొండయ్య, వ్యవస్థాపక అధ్యక్షులు కడారి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి ఏలే స్వామి శుక్రవారం తెలిపారు. -
ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర
-
లుంబినీ పార్క్ దగ్గరకు మహా గణపతి
-
లుంబినీ పార్క్ దగ్గరకు మహా గణపతి
హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణనాథుడి శోభాయాత్ర కనుల విందుగా సాగుతోంది. ఎన్టీఆర్ ఘాట్ రోడ్డు మీదుగా మహా గణపతిని నిమజ్జన కార్యక్రమానికి తరలించారు. ప్రస్తుతం లుంబినీ పార్క్ వద్దకు మహాగణపతి శోభాయాత్ర చేరుకుంది. మరో రెండు గంటల్లో మహా గణపతి నిమజ్జన కార్యక్రమం ముగిస్తామని పోలీసులు చెప్పారు. గంట సమయం వెల్డింగ్ పనులు చేసేందుకు.. మరో గంట సమయం పూజలకు పడుతుందని, ఆ తర్వాత నిమజ్జనం మొదలు పెడతామని చెప్పారు. మరోపక్క, ఆదివారమే నిమజ్జన పనులు ముగుస్తాయని భావించినా సోమవారం మొత్తం గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు కొనసాగేలా ఉన్నాయి. గణేశ్ నిమజ్జన వేడుకలతో తెలుగు రాష్ట్రాల రాజధాని భాగ్యనగరం పులకించిపోతోంది. జంటనగరాలు విఘ్నేశ్వరుడి శోభాయాత్రతో సందడిగా మారాయి. కన్నుల పండువగా సాగుతున్న నిమజ్జన వేడుకులను తిలకించేందుకు భక్త జనం ట్యాంక్ బండ్కు బారులు తీరింది. లక్షలాది మంది భక్తులు గణపతి విగ్రహాల వెంట తరలిరావడంతో మహానగర రహదారులు ఆధ్యాత్మికశోభను సంతరించుకున్నాయి. గణపతి బప్పా మోరియా నినాదాలతో భక్తిమయ వాతావరణం నెలకొంది. సామాన్య భక్తులతో పాటు రాజకీయ నేతలు కూడా ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు.