martial law
-
దక్షిణకొరియా ప్రధాని అభిశంసన కొట్టివేత
సియోల్: దక్షిణ కొరియాలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దేశంలో మార్షల్ లాకు కారణమయ్యారనే ఆరోపణలపై ప్రధాని హన్ డక్–సూను అభిశంసిస్తూ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయడంతోపాటు ఆయనకు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ తీర్పు వెలువరించింది. గతేడాది డిసెంబర్లో అకస్మాత్తుగా దేశంలో మార్షల్ లా విధించి అభిశంసనకు గురైన అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ వ్యవహారంపై ఎటువంటి ఆదేశాలు ఇవ్వకపోవడం గమనార్హం. అయితే, మార్షల్ లా విధింపులో ఎలాంటి పాత్ర లేని హన్ విషయంలో రాజ్యాంగ కోర్టు 7–1 మెజారిటీతో వెలువరించిన తీర్పు ప్రభావం యూన్ విషయంలో ఉంటుందో లేదో ఇప్పుడే చెప్పడం కష్టమని పరిశీలకులు చెబుతున్నారు. -
యూన్ వేతనం పెరిగింది!
సియోల్: దేశంలో స్వల్ప కాలం మార్షల్ లా అమలు చేసినందుకు అభిశంసనకు గురైన దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ వార్షిక వేతనం భారీగా పెరిగింది. అధికార ప్రమాణాలను అనుసరించి మూడు శాతం మేర పెరిగి రూ.1.27 కోట్ల నుంచి రూ.1.55 కోట్లకు చేరింది. యూన్కే కాదు, ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టి అభిశంసనకు గురైన తాత్కాలిక అధ్యక్షుడు హన్ డక్–సూకు వార్షిక వేతనంలో మూడు శాతం పెరిగి, రూ.1.19కోట్లకు చేరుకోవడం గమనార్హం. యూన్ను డిసెంబర్లో పార్లమెంట్ అభిశంసించింది. దేశంలో తిరుగుబాటుకు యత్నించడం, అధికార దురి్వనియోగం ఆరోపణలపై దర్యాప్తు విభాగాలు అరెస్ట్కు చేస్తున్న యత్నాలను ఆయన అడ్డుకుంటున్నారు. ఫలితంగా దేశంలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఆయనకు ఎలాంటి అధికారాలు లేనప్పటికీ అభిశంసనపై దక్షిణకొరియా రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించే వరకు అధికార నివాసం, కార్యాలయంలోనే కొనసాగేందుకు అవకాశముంటుంది. సస్పెన్షన్కు గురైన అధ్యక్షుడికి ఇప్పటికీ వేతనం అందుకుంటున్న విషయం తెలీన ప్రజలు..తాజా పెంపు విషయం తెలిసి ఆగ్రహంతో ఉన్నారు. దేశంలో కనీస వేతనానికి రెట్టింపు మొత్తంలో యూన్ వేతనం పెరగడమేంటని ప్రశ్నిస్తున్నారు. సాధారణ ఉద్యోగులకు 1.7 శాతం మాత్రమే పెరగ్గా యూన్ 3%కి ఎలా పెంచుతారని నెటిజన్లు పళ్లు కొరుకుతున్నారు. ఈ నేపథ్యంలో యూన్ను ఎలాగైనా అరెస్ట్ చేసి తీరుతామని అవినీతి నిరోధక విభాగం స్పష్టం చేస్తోంది. ఈసారి పోలీసులను వెంటబెట్టుకుని వెళతామని, భద్రతా సిబ్బంది, ప్రజాప్రతినిధులు సహా అడ్డు వచి్చన వారిని సైతం అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తోంది. -
దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్ విఫలం
సియోల్: అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ (Yoon Suk Yeol) అరెస్టు విఫలమైంది. కోర్టు నుంచి అంగీకారపత్రంతో శుక్రవారం తెల్లవారుఝామునే కరప్షన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(CIO) అధికారులు సియోల్లోని అధ్యక్ష భవనానికి చేరుకున్నారు. అయితే అక్కడ వాళ్లకు చాలా సమయం అడ్డగింత ఎదురైంది. దీంతో చేసేది లేక అధ్యక్ష నివాసం నుంచి అధికారులు వెనుదిరిగారు. ఎమర్జెన్సీ మార్షల్ లా(Martial Law)ను ప్రకటించిన కేసులో విచారణకు సహకరించకపోవడంతో యూన్ సుక్ యోల్పై అరెస్టు వారెంటు జారీ అయింది. అయితే విచారణాధికారులు యూన్ నివాసంలోకి వెళ్లకుండా సైన్య బృందంతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఒకానొక టైంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు.. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఐవో చీఫ్ ఓహ్ డోంగ్ వున్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే అన్నివైపులా ప్రతిఘటన ఎదురుకావడంతో సుమారు ఆరు గంటలపాటు హైడ్రామా నడిచింది. చివరకు.. సీఐవో అధికారులు అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది .ఇక.. మార్షల్ లా ప్రకటించిన కేసులో.. అధ్యక్ష భవనంలో సోదాలకు విచారణ అధికారులు ప్రయత్నించినప్పుడు కూడా ఇలాంటి ప్రతిఘటనే ఎదురైంది. అయినప్పటికీ అధికారులు పోలీసుల సాయంతో బలవంతంగా లోపలికి వెళ్లి తనిఖీలు జరిపారు. మరోవైపు ఈ కేసులో మూడుసార్లు విచారణకు పిలిచినా ఆయన హాజరుకాకపోవడంతో అధికారులు అరెస్ట్ వారెంట్ కోరుతూ కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అంగీకరించింది. అదే జరిగితే దక్షిణ కొరియా చరిత్రలో అరెస్ట్ అయిన తొలి అధ్యక్షుడిగా నిలుస్తారు.అరెస్ట్ జరిగితే.. కోర్టు 6వ తేదీ వరకూ గడువిచ్చిందని, ఆలోపే యూన్ను అరెస్టు చేస్తామని సీఐవో మరోమారు స్పష్టం చేశారాయన. యూన్ గనుక అరెస్ట్ అయితే.. ఆయన్ని గవాచియాన్లోని సీఐవో కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది. మార్షల్ లా విధింపు కేసులో అక్కడ ఆయన్ని విచారణ జరపనున్నారు. అరెస్ట్ వారెంట్ నేపథ్యంతో.. 48 గంటలపాటు ఆయన్ని అదుపులో ఉంచుకునే అధికారం సీఐవోకు ఉంటుంది. అయితే అటుపై కస్టడీ కోసం కోర్టును అభ్యర్థించాల్సి ఉంటుంది.విఫలయత్నాలే..దక్షిణ కొరియాలో ఇలాంటి పరిణామాలు కొత్తేం కాదు. 2000, 2004 సంవత్సరాల్లో చట్ట సభ్యులను అరెస్ట్ చేయాలని ప్రయత్నించారు. అయితే.. రెండు సందర్భాల్లోనూ అరెస్ట్ వారెంట్ గడువు ముగిసేదాకా(ఏడురోజులపాటు) వాళ్ల పార్టీ సభ్యులు, మద్దతుదారులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో అది సాధ్యపడలేదు. హైటెన్షన్సెంట్రల్ సియోల్లో ఎటు చూసిన భారీగా బలగాలు కనిపిస్తున్నాయి. యూన్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో ఆయన అనుచరులు భారీగా అధ్యక్ష భవనం వద్దకు చేరి మోహరించారు. గురువారం యూన్ వ్యతిరేకులకు, మద్దతుదారులకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో భద్రతా బలగాలు కొందరిని అదుపులోకి తీసుకున్నాయి. మరోవైపు.. యూన్ మద్దతుదారులు అమెరికా జెండాలతో నినాదాలు చేస్తూ కనిపించడం కొసమెరుపు. యూన్ అరెస్ట్ నేపథ్యంలో.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2,700 మంది పోలీసులు మోహరింపజేసినట్లు సమాచారం.మార్షల్ లాతో చిక్కుల్లో..ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ.. యూన్ ఇటీవల ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్షాలు ‘మార్షల్ లా’ అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా.. పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో యూన్ తన అధ్యక్ష అధికారాలు, విధులకు తాత్కాలికంగా దూరమయ్యారు. యూన్ను పదవి నుంచి తప్పించాలా, కొనసాగించాలా అన్న అంశాన్ని కోర్టు 180 రోజుల్లోగా తేల్చనుంది.మరోవైపు యూన్ మద్దతుదారులు సియోల్లోని ఆయన నివాసం ఎదుట భారీగా మోహరించారు. వారిని ఉద్దేశిస్తూ యూన్ మాట్లాడారు. తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించి దేశాన్ని ప్రమాదంలో పడేసేందుకు పనిచేస్తున్న శక్తులపై చివరివరకు పోరాడతానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు యూన్ను అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన తరఫు న్యాయబృందం హెచ్చరించింది. ఇంకోవైపు.. దక్షిణ కొరియాను మరో ఉత్తర కొరియాగా మార్చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఆయన అరెస్టును అడ్డుకుని తీరతామంటూ నివాసం ఎదుట భారీగా మోహరించారు. అభిశంసన ఇలా.. మార్షల్ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్(జాతీయ అసెంబ్లీ)లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా.. 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఆయన తన అధ్యక్ష అధికారాలను, విధులను ప్రధానమంత్రి హన్ డక్ సూకీకి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానప్రతులను రాజ్యాంగ న్యాయస్థానానికి పార్లమెంటు పంపుతుంది. యూన్ను తప్పించాలా, కొనసాగించాలా అన్న అంశాన్ని ఈ కోర్టు 180 రోజుల్లోపు తేలుస్తుంది. మరోవైపు యూన్ స్వచ్ఛందంగా దక్షిణ కొరియా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నట్లు ఆయన సీనియర్ సలహాదారులు, కార్యదర్శులు చెబుతున్నారు. చదవండి👉🏻: కరోనా ప్యాటర్న్లోనే.. చైనా నుంచి మరో వైరస్ -
ద. కొరియాలో ముదురుతున్న సంక్షోభం
సియోల్(దక్షిణకొరియా): దేశవ్యాప్తంగా అత్యయిక స్థితి(మార్షల్ లా) ప్రకటన నేపథ్యంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కార్యాలయంలో సోదాలకు పోలీసులు సాహసించారు. అయితే అధ్యక్ష కార్యాలయం భద్రతా బలగాలు వెంటనే పోలీసులను అడ్డుకున్నారు. దీంతో యూన్ కార్యాలయ ప్రధాన భవనంలోకి పోలీసులు ప్రవేశించలేకపోయారు. దీంతో పౌర సేవల కార్యాలయాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆధిక్యత లేకపోవడంతో ఏ బిల్లును ప్రవేశపెట్టినా విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవడం, పదవి నుంచి వైదొలగాలన్న డిమాండ్లను ఎదుర్కొంటున్న అధ్యక్షుడు యూన్ యోల్ ఇటీవల అనూహ్యంగా ‘మార్షల్ లా’ప్రకటించడం తెల్సిందే. తర్వాత విపక్షాలు పార్లమెంట్లో తీర్మానం చేసి ఎమర్జెన్సీని ఎత్తేయడం, అధ్యక్షుడు యూన్ సహా పలువురు దేశద్రోహం ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో బుధవారం అధ్యక్షుడికి సంబంధించిన ఆఫీస్లలో పోలీసులు ఆకస్మిక సోదాలు చేశారు. దాడులు జరిగిన సమయంలో అధ్యక్షుడు యూన్ కార్యాలయంలో లేరు. యోన్కు సన్నిహితులైన పలువురు అధికారులు రాజీనామా చేశారు.మాజీ రక్షణ మంత్రి ఆత్మహత్యాయత్నం ‘మార్షల్ లా’విధించడానికి కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నాటి రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ను పోలీసులు అరెస్ట్చేయగా అరెస్ట్పై మనస్తాపంతో ఆయన మంగళవారం రాత్రి జైలు గదిలో ఆత్మహత్యకు ప్రయతి్నంచినట్లు అధికారులు తెలిపారు. మార్షల్ లా విధించాలని సిఫార్సు చేసిన కిమ్ను రాజధాని సియోల్లో ఆదివారం అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే. మంగళవారం అర్ధరాత్రి అధికారికంగా అరెస్టు వారెంట్ జారీ కాకముందే ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన బాత్రూమ్లో ఆత్మహత్యకు ప్రయతి్నంచగా జైలు అధికారులు ఆయనను వెంటనే అడ్డుకున్నారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడానే ఉందని రక్షణ శాఖ శాఖ పార్లమెంట్కు తెలిపింది. కిమ్పై నేరాభియోగాలు మోపాలా వద్దా అనే దానిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 20 రోజుల్లోపు నిర్ణయం తీసుకోనున్నారు. మరోసారి అభిశంసన గత శనివారం అధ్యక్షుడిపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయిన నేపథ్యంలో ప్రధాన విపక్ష డెమొక్రటిక్ పార్టీ మరోసారి అభిశంసన తీర్మానం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. మార్షల్ లా అమలు కోసం పనిచేసిన ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను దర్యాప్తు అధికారులు బుధవారం అరెస్ట్చేశారు. రెండోసారి అభిశంసన ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే ఈ ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను అరెస్ట్చేయడం గమనార్హం. -
అండర్వేర్తో మాజీమంత్రి ఆత్మహత్యాయత్నం!
సియోల్: దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయంలో పోలీసుల సోదాలు కొనసాగుతున్నవేళ.. రక్షణ శాఖ మాజీ మంత్రి కిమ్ యోంగ్ హైయున్ అండర్వేర్తో ఆత్మహత్యాయత్నం చేశారు. విచారణ అధికారుల అదుపులో ఉన్న ఆయన.. కారాగారంలోనే ఈ ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.కిమ్ యోంగ్ హైయున్.. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కు అత్యంత సన్నిహితుడు. సైనిక పాలన విధింపు ప్రకటన వెనుక ఈయన ప్రమేయమే ఉందనేది ప్రధాన ఆరోపణ. ఈ అభియోగంపై ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే సరిగ్గా అరెస్ట్కు ముందు బాత్రూంకు వెళ్లిన ఆయన.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో అధికారులు తలుపులు బద్ధలు కొట్టి చూశారు.అండర్వేర్తో ఆయన ఉరివేసుకునే ప్రయత్నం చేయగా.. అధికారులు నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని న్యాయ శాఖ తాజాగా పార్లమెంట్కు నివేదించింది.South Korean ex-defense minister Kim Yong-hyun Wednesday attempted suicide at detention facility, Yonhap news agency reported, citing a correction official. #SouthKorea https://t.co/QbHxSw64PA https://t.co/3Mat8pNHh2— 贺亮 (@HeLiang74893) December 11, 2024సైనిక పాలనపై నిర్వహించిన ఓటింగ్కు చట్ట సభ్యులు హాజరుకాకుండా వాళ్ల మీదకు భద్రతా బలగాలను ప్రయోగించాడనే అభియోగమూ ఉంది.దక్షిణ కొరియా డిసెంబర్ 3వ తేదీన ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ హఠాత్తుగా టీవీ ఛానెల్స్ ముందు ప్రత్యక్షమై.. అత్యవసర సైనిక పాలన ప్రకటన చేశారు. ప్రతిపక్షాలు దాయాది దేశం ఉత్తర కొరియాతో చేతులు కలిపి కుట్రలకు తెర తీశాయని, అందుకే పరిస్థితి అదుపు తప్పకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే దేశంలో అలజడి రేగింది. మరోపక్క.. ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షంలోని చట్ట సభ్యులూ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సంక్షోభం తలెత్తే ప్రమాదంతో.. చేసేది లేక కొన్నిగంటల తర్వాత ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంటూ ఆయన దేశానికి క్షమాపణలు చెప్పారు.అయితే ఈ అంశంపై ప్రత్యేక మండలి విచారణ జరపనుంది. ఈ మేరకు మంగళవారం చట్ట సభ్యులంతా ఆ కౌన్సిల్కు అనుమతులు జారీ చేశారు. సైనిక పాలన విధింపు ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడనేది యూన్పై అభియోగం. అది గనుక రుజువైతే.. ఆయనకు మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: తప్పైంది.. నన్ను క్షమించండి -
పాక్ పరువు తీసిన ‘మార్షల్ లా’కు అంత పవర్ ఉందా?
రాజకీయాలపై ఆసక్తి కలిగినవారికి ప్రపంచ రాజకీయ చిత్రం ప్రతిరోజూ కొత్తగా కనిపిస్తుంది. తాజాగా దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యోల్ ఉన్నట్టుండి ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రపంచమంతా ఉలిక్కిపడింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కలకలం చెలరేగింది. అయితే ఇంతలోనే అక్కడి పార్లమెంట్లో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో దానిని రద్దు చేయాల్సి వచ్చింది.చర్చనీయాంశంగా మారి..1980 తర్వాత దక్షిణ కొరియాలో మార్షల్ లా(సైనిక పాలన) విధించడం ఇదే తొలిసారి. ఈ నేపధ్యంలో మరోసారి మార్షల్ లా చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ ఈ మార్షల్ లా చట్టాన్ని తరచూ అమలు చేసి, అపఖ్యాతి పాలయ్యింది. ఇంతకీ మార్షల్ లా అంటే ఏమిటి? అ చట్టాన్ని అమలు చేసినప్పుడు దేశంలోని పరిస్థితులు ఎలా ఉంటాయి?శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించినప్పుడు..నిజానికి మార్షల్ లా అంటే దేశ అధికారమంతా సైన్యం చేతుల్లోకి వెళ్లడం. దేశంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించినప్పుడు దీనిని అమలు చేస్తారు. ఇది దేశంలోని ఒక నిర్దిష్ట ప్రాంతానికి లేదా దేశమంతటికీ వర్తించవచ్చు. ఇది అమలైనప్పుడు పౌర పరిపాలన ముగుస్తుంది. శాంతి భద్రతల నుండి న్యాయ వ్యవస్థ వరకు సర్వం సైన్యం నియంత్రణలోకి వస్తుంది. అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్న సైన్యం అవసరమని భావించిన పక్షంలో ప్రధానిని ఉరితీసే దిశగా కూడా యోచించేందుకు ఈ చట్టంలో అవకాశాలున్నాయి. ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ పర్యవేక్షణలో..ప్రజలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైన పరిస్థితుల్లో మార్షల్ లా వర్తిస్తుంది. ఇది యుద్ధం, తిరుగుబాటు లేదా పెద్ద ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో సంభవించవచ్చు. మార్షల్ లా అమలైనప్పుడు సైన్యం ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తుంది. ఇది న్యాయపరమైన నిర్ణయాలను తీసుకుంటుంది. పాకిస్తాన్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు మార్షల్ లా ప్రయోగించడం ఆనవాయితీగా మారింది.పాక్లో నాలుగు సార్లు మార్షల్ లా పాకిస్తాన్లో ఇప్పటి వరకు ఇక్కడ నాలుగు సార్లు మార్షల్ లా విధించారు. 1958లో మొదటిసారిగా, దేశంలో రాజకీయ అస్థిరత ఏర్పటినప్పుడు నాటి అధ్యక్షుడు ఇస్కందర్ మీర్జా మార్షల్ లా విధించారు. అనంతరం మిలటరీ జనరల్ అయూబ్ ఖాన్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. తదనంతర కాలంలో దేశంలో సైనిక, రాజకీయ శక్తుల మధ్య విభేదాలు మొదలయ్యాయి.అడుగంటిన సామాన్యుల స్వేచ్ఛ1977, జూలై 5 న జనరల్ జియా-ఉల్-హక్ పాకిస్తాన్లో మార్షల్ లా విధించి, అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వాన్ని పడగొట్టాడు. జియా దేశ జాతీయ అసెంబ్లీని రద్దు చేసి, తనను తాను అత్యున్నత పాలకునిగా ప్రకటించుకున్నాడు. రాజకీయ అస్థిరతతో పాటు సామాన్యుల స్వేచ్ఛ కూడా అడుగంటిపోవడంతో నాడు పాకిస్తాన్ గడ్డు రోజులను ఎదుర్కొంది. 1999లో పాకిస్తాన్లో మరోమారు మార్షల్ లా విధించారు. అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ను తొలగించి, జనరల్ పర్వేజ్ ముషారఫ్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈసారి కూడా రాజకీయ అస్థిరతను నెపంగా చూపారు. ఇతని పాలనలో సైనిక నియంతృత్వ పోకడ చాలా కాలం పాటు దేశంపై కొనసాగింది.జర్మన్, జపాన్లలో..మరికొన్ని దేశాలలోనూ మార్షల్ లా అమలయ్యింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, జర్మన్, జపాన్లలో సైన్యం పాలనను చేపట్టింది. ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో శ్రీలంకలో, యుద్ధ సమయంలో ఉక్రెయిన్లో మార్షల్ లా విధించారు. అయితే పదే పదే మార్షల్ లా అమలు చేస్తూ పాకిస్తాన్ అపఖ్యాతి పాలైంది. ఈ చట్టం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంతగా నిర్వీర్యం చేస్తుందో పదే పదే మార్షల్ లా విధించడం చూస్తే అర్థమవుతుంది. మార్షల్ లా అమలు చేసేముందు పర్యవసానంగా వచ్చే దీర్ఘకాలిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఇటీవల దక్షిణ కొరియా నిర్ణయం ద్వారా స్పష్టమైంది.ఇది కూడా చదవండి: చైనా చేతికి ‘పవర్ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే.. -
ఉక్రెయిన్తో యుద్ధం.. రష్యాకు షాక్!.. 5 విమానాలు, హెలికాప్టర్ కూల్చివేత
మాస్కో: రష్యా దాడులతో అప్రమత్తమైన ఉక్రెయిన్ ఎదురుదాడి ప్రారంభించింది. రష్యాకు ధీటుగా భారీగా బలగాలను మోహరించి కీలక ప్రాంతాల్లో తిరుగుబాటు మొదలు పెట్టింది. రష్యా ఫైటర్ జెట్ను ఉక్రెయిన్ బలగాలు కూల్చివేశాయి. 5 రష్యా విమానాలు, హెలికాప్టర్ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యా యుద్ధం ప్రకటించడంతో ఉక్రెయిన్ ప్రభుత్వం మార్షల్ లా విధించింది. పౌరులు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని ఉక్రెయిన్ ఆదేశించింది. ఇది దురాక్రమణ చర్య: ఉక్రెయిన్ రష్యా దాడులపై ఉక్రెయిన్ స్పందించింది. రష్యా పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించిందని, ఇది దురాక్రమణ చర్యగా అధ్యక్షుడు జెలెన్స్కీ వర్ణించారు. శాంతియుత నగరాలపై దాడులకు పాల్పడుతున్నారని, ప్రపంచ దేశాలు పుతిన్ను నిలువరించాన్నారు. యుద్ధం ఆపడం ఐరాస బాధ్యతనని పేర్కొన్నారు. రష్యా దాడుల నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ముందుగా దౌత్యపరమైన ప్రయత్నాలే చేస్తామన్న జెలెన్ స్కీ.. రెండో ప్రణాళికగా బలగాలను దింపుతామని తెలిపారు. రష్యా మిలిటరీ ఆపరేషన్ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజలకు అధ్యక్షడు జెలెన్ స్కీ సందేశం అందించారు. రష్యా కేవలం సైనిక స్థావరాలపైనే దాడి చేస్తోందని, సైన్యం తన పని తాను చేసుకుబోతుందన్నారు. ఉక్రెయిన్ ప్రజలు భయాందోళనకు గురికావొద్దని తెలిపారు. #AirRaid #sirens in #Kiev as the oligarchs and the elite flee the #country in the face of the advancing #Russian peacekeeping forces. #UkraineRussianConflict https://t.co/iNxZ7vnFk0 pic.twitter.com/mK3HaJtAgA — 🇦🇺 The Cynical Hun 🇭🇺 (@TheCynicalHun) February 24, 2022 మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడితో అమెరికా ప్రెసిడెంట్ ఫోన్లో చర్చలు జరిపారు. రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని జో బైడెన్ తెలిపారు. ఇప్పటికే ఉక్రెయిన్కు బ్రిటన్,ఫ్రాన్స్ మద్దతు తెలిపాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శుక్రవారం జీ-7 దేశాలతో జో బైడెన్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. నాటో కూటమికి సహకరిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు రష్యా దాడి చేసిన ఉక్రెయిన్ ప్రాంతాలు Sound of an explosion in #Mariupol. Reports of explosions in #Kharkiv. #Russia announces military operations to demilitarise #Ukraine. Reporting from Groundzero. @aajtak @IndiaToday pic.twitter.com/2heTkRfIyx — GAURAV C SAWANT (@gauravcsawant) February 24, 2022 కాగా రష్యా బలగాలు చుట్టుముట్టిన వేళ ఉక్రెయిన్లో ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. నెలరోజుల పాటు దేశమంతా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అయితే గురువారం తెల్లవారుజామున నుంచి రష్యా ఉక్రెయిన్పై భీకర దాడులు జరుపుతోంది. కీవ్, ఖర్కీవ్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ను మూడు వైపుల రష్యా బలగాలు చుట్టుముట్టాయి. రష్యా దాడులతో కీవ్ ఎయిర్పోర్టును ఉక్రెయిన్ ఖాళీ చేసింది. BREAKING: Air raid sirens wail across Ukraine's capital pic.twitter.com/jclNZ5h7kx — BNO News (@BNONews) February 24, 2022 -
సైనిక పాలన కావాలంటూ పోస్టర్లు
పాకిస్థాన్లో ప్రభుత్వాన్ని పడగొట్టి సైనిక పాలన విధించాలని అక్కడి ఆర్మీచీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ను కోరుతూ 13 నగరాల్లో పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. లాహరో, కరాచీ, పెషావర్, క్వెట్టా, రావల్పిండి, ఫైసలాబాద్, సర్గోడా, హైదరాబాద్ నగరాలతో పాటు.. మరికొన్ని నగరాల్లో కూడా ఈ బ్యానర్లు కనిపించాయి. ‘మూవ్ ఆన్ పాకిస్థాన్’ అనే పార్టీ నేతృత్వంలో ఈ బ్యానర్లు పెట్టారు. ఇంతకుముందు ఇదే పార్టీ వాళ్లు షరీఫ్ను నవంబర్లో పదవీ విరమణ చేయొద్దంటూ ఓ చిన్నపాటి ఉద్యమమే నడిపించారు. అధికారుల ప్రభుత్వం ఇక చాలని.. ఆర్మీచీఫ్ నేతృత్వంలో సైనిక పాలన విధించాలని తమ పార్టీ కోరుకుంటున్నట్లు ‘మాప్’ సెంట్రల్ చీఫ్ ఆర్గనైజర్ అలీ హష్మీ తెలిపారు. జనరల్ రహీల్ షరీఫ్ స్వయంగా ప్రభుత్వాన్ని చూసుకోవాలని అన్నారు. దీనిపై ఆర్మీ అధికారిక వార్తా సంస్థ ఏమీ స్పందించకపోయినా.. అక్కడి రాజకీయ విశ్లేషకుడు అమీర్ రాణా మాత్రం ఇదంతా చూస్తుంటే త్వరలోనే సైనిక కుట్ర ఏదో జరగబోతోందన్న సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. రాత్రికి రాత్రే ప్రధాన నగరాలన్నింటిలో.. అందులోనూ కంటోన్మెంటు ప్రాంతాలలో కూడా ఈ పోస్టర్లు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు.