Moong dal
-
ఈ పప్పు మనిషి మాంసాన్ని తింటుందట! ఇది ప్రోటీన్ కాదట..
భారతీయ ఇళ్లలో పప్పులు లేనిదే వంట సంపూర్ణం కాదు. ఏదో ఒక విధంగా పప్పులను వినియోగిస్తాం. అలాగే వారంలో ఏ రెండు లేదా మూడు రోజులైనా భోజనంలో పప్పు ఉండాల్సిందే. అయితే పప్పు అనేది ప్రోటీన్ల మూలకమని, ఎన్నో మాంసకృత్తులు ఉంటాయని విన్నాం. కానీ ఈ పప్పు మనిషి మాంసాన్ని తింటుందట. ఇది ప్రోటీన్ మూలం కాదట. వాట్ పప్పులు మనిషి మాంసాని తినడం ఏమిటి..? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఐఏఎస్ ఇంటరర్వ్యూలో ఓ అభ్యర్థికి ఎదురైన ప్రశ్న ఇది. ఔను మనిషి మాంసాన్ని తినేసే పప్పు ఏది అని ప్రశ్నించారట. కాబట్టి ఆ పప్పు రకం ఏంటి..?దాని కథాకమామిషు గురించి చూద్దామాభారతీయ ఇళ్లలో సాధారణంగా పెసర పప్పుని ఎక్కువగా వినియోగిస్తారు. ముఖ్యంగా పండుగల టైంలో ఈ పప్పుతో చేసే వంటకాలను దేవుడికి నైవేద్యంగా పెడతారు. ముఖ్యంగా ఏకాదశి వ్రతాలు చేసేవాళ్లు నియమానుసారంగా నీళ్లు, పాలు, పండ్లు తప్ప ఘన పదార్థాలు తీసుకోకూడదు. కానీ నిష్టగా చేయలేని వాళ్లు లేదా ఉపవాసానికి ఆగలేని వాళ్లు ఈ పెసరపప్పుతో చేసిన అత్తెసర లేదా హవిష్యాన్నం తిని ఉండొచ్చని వేదాలు చెబుతున్నాయి. అంతలా భారతీయ వంటకాల్లో అగ్రస్థానంలో ప్రాధాన్యత కలిగినది ఈ పెసరపప్పు. ఇంతకి పెసరపప్పు(Moong Dal) మనిషి మాంసాన్ని తింటుదా..? అని విస్తుపోకండి. ఎందుకంటే దీన్ని అలా అనడానికి వెనుకున్న శాస్త్రీయ కోణం గురించి సవివరంగా తెలుసుకుందాం."ప్రోటీయోలైటిక్ ఎంజైమ్లు"గా పలిచే ఒక ప్రత్యేక రకం ప్రోటీన్ ఉంది. ఈ ఎంజైమ్లు మన జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. స్తంభించి ఉన్న కొవ్వు, చనిపోయిన కణాల రూపంలో ఉండే అశుద్ధ మూలకాలు, చెత్తని తొలగించడం వాటి ప్రధాన విధి. పెసర పప్పు "మానవ మాంసాన్ని తింటాయి" అనగానే మన శరీర మాంసాన్ని తింటుందని కాదు, శరీరంలోని టాక్సిన్స్, వ్యర్థ పదార్థాలు, అదనపు కొవ్వును తినేస్తుందని అర్థం. బరువు తగ్గడానికి, శరీరాన్ని ఆరోగ్యంగా మార్చడానికి పెసరపప్పు చాలా మంచిదని చెప్పడానికీ ఇదే రీజన్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారుఆరోగ్య ప్రయోజనాలు:బరువు తగ్గడం: ఊబకాయం ఉన్నవారికి పెసర పప్పు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో సహాయపడతాయి. ఇది శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తొలగించడానికి పనిచేస్తుంది. ఈ చెడు కొలెస్ట్రాల్, వ్యర్థపదార్థాలు చూడటానికి మాంసం మాదిరిగా కనిపిస్తాయి. అందుకని ఇలా అనడం జరిగిందని చెబుతున్నారు నిపుణులు. ఇది శరీరాన్ని మంచి ఆకృతిలో ఉండేలా చేస్తుంది. పైగాఎక్కువ కాలం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.ఇది అతిగా తినే అలవాటును తగ్గిస్తుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది.రక్తపోటును నియంత్రిస్తుంది: పెసర పప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులో పొటాషియం , మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి రక్తపోటును సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి.పోషణ , జీర్ణశక్తి: పెసర పప్పు చాలా పోషకమైనది, సులభంగా జీర్ణమయ్యేదిగా పరిగణిస్తారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉపయోగపడే బలవర్ధకమైన పప్పు ఇది. అన్ని వయసుల వారు హాయిగా తీసుకోవచ్చునని చెబుతున్నారు నిపుణులు. తేలికగా జీర్ణమయ్యే ఆహారంగా పేర్కొంటారు. శరీరంలోని కొవ్వు, మలినాలను తొలగిస్తుందని ఇలా మానవ మాంసాన్ని తినేసే పప్పుగా పేర్కొన్నారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది, సురక్షితమైనది కూడా. ముఖ్యంగా శాకాహారులు హాయిగా తీసుకునే మంచి బలవర్ధకమైన పప్పు ధాన్యంగా చెబుతున్నారు నిపుణులు.(చదవండి: నిజమైన ప్రేమ అంటే ఇది కదా..!) -
పెసర పిండితో బ్యూటీ ప్యాక్స్ : మెరిసే మోము
శీతాకాలంలో చర్మం, ముఖం సౌందర్య పట్ల మరింత జాగ్రత్త తీసుకోవాలి. రసాయనాలులేని సహజ పదార్థాలతోనే చర్మ సౌందర్యాన్నిమెరుగు పర్చు కోవడానికి ప్రయత్నించాలి. చర్మాన్ని మృదువుగా చేయడంలోనూ, చర్మానికి మెరుపును ఇవ్వడంలోనూ, చక్కటి రంగు తేలేలా చేయడంలోనూ పెసలు చక్కగా పని చేస్తాయి. ఈ నేపథ్యంలో పెసర పిండితో కొన్ని చిట్కాలను ఇపుడు చూద్దాం! టీ స్పూన్ పెసరపిండిలో పచ్చిపాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మాన్ని ఈ మాస్క్ మృదువుగా మారుస్తుంది.పెసరపిండిలో కొద్దిగా పెరుగు, కొబ్బరి నూనె కలిపి చేతులకు రాయాలి. సున్నితంగా రబ్ చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పెసరపిండి, పెరుగు, కొబ్బరి నూనె చర్మాన్ని మరింత మృదువుగా మారుస్తాయి.టేబుల్ స్పూన్ పెసర్లు, ఐదు బాదంపప్పులు రాత్రి నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని పేస్ట్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారడం సమస్యే దరిచేరదు. -
Diwali 2024 దివాలీకి ఈ స్వీట్లు చేసిపెడితే : దిల్ ఖుష్!
దీపాల పండుగ దీపావళి (Diwali 2024) కోసం ఉత్సాహంగా జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా పిల్లా పాపా అంతా ఎదురు చూస్తున్నారు. దీపావళి దీప కాంతులు, బాణాసంచా వెలుగులతో పాటు, స్వీట్ల సందడి కూడా ఉంటుంది.మరి ఈ క్రమంలో టేస్టీగా, ఈజీగా, హెల్దీగా చేసుకునే రెండు హల్వాల గురించి తెలుసుకుందాం. ఒకటి మూంగ్ హల్వా, రెండు క్యారెట్–ఖర్జూరం హల్వా. మరి వీటికి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇదిగో..ఇలా..!మూంగ్ హల్వాకావల్సిన పదార్థాలునెయ్యి – రెండు టేబుల్ స్పూన్లుచాయ పెసరపప్పు – అరకప్పు (కడిగిపెట్టుకోవాలి)నీళ్లు – రెండు కప్పులునెయ్యి – అరకప్పుగోధుమ పిండి – రెండు టేబుల్ స్పూన్లుపంచదార – ముప్పావు కప్పుఫుడ్ కలర్ – చిటికెడుయాలకుల పొడి – పావు టీస్పూనుజీడిపలుకులు – రెండు టేబుల్ స్పూన్లుకిస్మిస్లు – రెండు టేబుల్ స్పూన్లుతయారీ స్టవ్ మీద ప్రెజర్ కుకర్ పెట్టి వేడెక్కిన తరువాత టీస్పూను నెయ్యి వేసి పెసరపప్పును దోరగా వేయించాలి.తరువాత రెండు కప్పుల నీళ్లుపోయాలి, కుకర్ మూతపెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.పప్పు చల్లారాక మిక్సీజార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ∙స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని పావుకప్పు నెయ్యి, గోధుమ పిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ వేయించాలి.పిండి వేగిన తరువాత పప్పు మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉడికించాలి.ఐదు నిమిషాల తరువాత ముప్పావు కప్పు పంచదార వేసి సన్నని మంట మీద పదిహేను నిమిషాల పాటు తిప్పుతూ ఉడికించాలి.ఇప్పుడు పప్పు మిశ్రమం బాగా ఉడికి బాణలికి అంటుకోకుండా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో ఫుడ్ కలర్ వేసి మరో ఇరవై నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. స్టవ్మీద మరో పాన్ పెట్టి టేబుల్ స్పూను నెయ్యి, జీడిపలుకులు, కిస్మిస్లు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంతవరకు వేయించి హల్వాలో వేయాలి. యాలకులపొడి వేసి రెండు నిమిషాలు తిప్పితే మూంగ్ హల్వా రెడీ. క్యారెట్–ఖర్జూరం హల్వా కావల్సిన పదార్థాలు ఖర్జూరం – పావు కప్పు (గింజలు తీసి, కడిగి, కొన్ని మంచి నీళ్లలో కొంత సేపు నానబెట్టి తీసి, ఉడికించి, మిక్సీ పట్టుకోవాలి)క్యారెట్ తురుము– 1 కప్పు, కొబ్బరి పాలు– 2 కప్పులుకొబ్బరి కోరు, కస్టర్డ్ మిల్క్– పావు కప్పు చొప్పున, నెయ్యి,పంచదార– పావు కప్పు చొప్పున (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు), కుంకుమ పువ్వు – చిటికెడు, వెనీలా ఎసెన్స్– 1 టీ స్పూన్కిస్మిస్ గుజ్జు– 1 టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు– కొన్ని (నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి)తయారీముందుగా ఖర్జూరం గుజ్జు, కొబ్బరి పాలు, పంచదార, ఏలకుల పొడి వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ బౌల్లో నెయ్యి వేడి చేసుకుని.. అందులో ఖర్జూరం మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద, గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి.కాస్త దగ్గర పడుతున్నప్పుడు క్యారెట్ తురుము, కస్టర్డ్ మిల్క్, ఫుడ్ కలర్ వేసుకుని తిప్పుతూ ఉండాలి.ఆ తర్వాత కిస్మిస్ గుజ్జు, కొబ్బరి కోరు, వెనీలా ఎసెన్స్ ఒకదాని తరవాత ఒకటి వేసుకోవాలి.ఆ మిశ్రమం మరింత దగ్గర పడగానే, డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపి, సర్వ్ చేసుకోవాలి. -
వేసవి తాపాన్ని తగ్గించడంలో మేటి ఈ పప్పు! ఎన్ని ప్రయోజనాలంటే..
పెసరపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో పెసరపప్పు ఒకటి. వేడిగా ఉండే వాతావరణంలో తేలికపాటి భోజనాలు చేయాలి. పెసరపప్పుతో చేసిన వంటకాలు తినడం వల్ల తేలికగా జీర్ణం అవ్వడమేగాక ఈజీగా బరువు తగ్గుతారు. అలాంటి ఈ పెసరపప్పు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటీ? తాపాన్ని ఎలా పోగొట్టగలదు అంటే.. పెసర పప్పు తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు వేసవి కాలం కాబట్టి.. పెసర పప్పు తినడం చాలా మంచిది. పెసర పప్పుతో కూరలు, స్నాక్స్, బ్రేక్ ఫాస్ట్ వంటివి కూడా తయారు చేస్తారు. అయితే ఈ పెరస పప్పుతో ఏం చేసినా రుచిగానే ఉంటాయి. పెసర పప్పు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే.. బరువు తగ్గడంలో.. పెసర పప్పును తినడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. కాబట్టి కొద్దిగా తిన్నా.. త్వరగా కడుపు నిండుతుంది. దీంతో ఎక్కువగా ఆహారం తీసుకోలేరు. అంతే కాకుండా చిరు తిళ్లను కూడా తినడం నివారిస్తుంది. అంతే కాకుండా పోషకాలు కూడా అన్నీ శరీరానికి అందుతాయి. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా అదుపులో ఉంటాయి. ఇలా ఈజీగా బరువు తగ్గొచ్చు. అలసట, నీరసం నుంచి.. పెసర పప్పులో పోషకాలు అనేవి అధికంగా లభ్యమవుతాయి కాబట్టి.. శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. బాడీలో ఇమ్యూనిటీ లెవల్స్ పెరగడం వల్ల.. సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. అందులోనూ వేసవిలో ఎక్కువగా అలసట, నీరసం వస్తాయి. పెసరపప్పు తినడం వల్ల.. అలసట లేకుండా ఉండొచ్చు. గుండె జబ్బుల ప్రమాదం.. గుండెకు పెసరపప్పు ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పెసరపప్పు రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. దీనివల్ల పెసరపప్పు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చర్మ సంరక్షణ కోసం.. పెసరపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా ఉండటం వల్ల.. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. జుట్టు బలంగా, దృఢంగా ఉండేలా చేస్తుంది. దీంతో జుల్లు రాలడం అనేది తగ్గుతుంది. అదే విధంగా చర్మంపై ముడతలు రాకుండా నిరోధిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అదీగాక ఈ వేసవి ప్రారంభంలోనే చైత్రమాసం మొదలవుతుంది. తెలుగు వాళ్ల కొత్త సంవత్సరం, శ్రీరామ నవిమి మొదలయ్యేది కూడా ఈ నెలలోనే. అందువల్ల దేవుళ్లకు కూడా పెసరపప్పుతో చేసిన ప్రసాదాలే పెట్టడం జరగుతుంది. బహుశా ఈ కాలానికి తగ్గట్టు ఈ నియమం పెట్టి ఉంటారు. భగభగమండే ఎండల్లో శక్తిని, చలువ నిచ్చే పెసరప్పు మంచిదని గుర్తించే దానితో చేసే వంటకాలను చేసేవారు కాబోలు. (చదవండి: జుట్టు మృదువుగా నిగనిగలాడలంటే గంజితో ఇలా చేయండి!) -
ఎప్పుడైనా పెసలుతో ఇలా పాలక్ ఇడ్లీ ట్రై చేశారా...?
పెసర-పాలకూర ఇడ్లీ.. కావలసినవి: పెసరపప్పు – కప్పు పాలకూర – కప్పు నూనె – రెండు టీస్పూన్లు ఉప్పు – రుచికి సరిపడా కారం – పావు టీస్పూను వంటసోడా – పావు టీస్పూను. తయారీ: పెసరపప్పును శుభ్రంగా కడిగి ఐదారు గంటలు నానబెట్టుకోవాలి నానిన పప్పును మెత్తగా గ్రైండ్ చేయాలి పాలకూరను కూడా శుభ్రంగా కడిగి మెత్తగా గ్రైండ్ చేయాలి ∙పాలకూర పేస్ట్లో రుబ్బిన పెసర పప్పు, కారం, వంటసోడా, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా సోడా ఉప్పు వేసి కలపాలి ∙పిండిని మరీ జారుడుగా కాకుండా తగినంత నీటిని చేరుస్తూ ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి ∙ఇడ్లీప్లేటుకు కొద్దిగా నూనె రాసి పిండిని ఇడ్లీ ప్లేటులో వేసి ఆవిరి మీద ఉడికించాలి ∙పదిహేను లేదా ఇరవై నిమిషాలు ఉడికిస్తే ఇడ్లీ రెడీ పెసర పాలకూర ఇడ్లీలను పుదీనా చట్నీ లేదా సాంబార్తో వేడిగా వడ్డించాలి. (చదవండి: అరటికాయతో బజ్జీలు కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి! అస్సలు వదిలిపెట్టరు..) -
పెసర పప్పు రుచులు.. డోక్లా, దాల్ కచోరి ఇలా ఇంట్లోనే ఈజీగా!
Recipes In Telugu: వేసవి కాలంలో ఎంతో చలువ చేసే పెసర పప్పుతో రకరకాల వంటకాలు వండుకోవచ్చు. మండే ఎండల్లో పెసర పప్పుని మరింత రుచికరంగా వండుకుని ఎలా ఆస్వాదించవచ్చో చూద్దాం... డోక్లా కావలసినవి: పొట్టుతీయని పెసరపప్పు – కప్పు, అల్లం – అంగుళంన్నర ముక్క, పచ్చిమిర్చి – రెండు, కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను, ఆయిల్ – టేబుల్ స్పూను, నిమ్మరసం – టేబుల్ స్పూను, బేకింగ్ సోడా – అరటీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు – పావు కప్పు, పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు, వేయించిన నువ్వులు – టీస్పూను. తాలింపు కోసం: ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు – అర టీస్పూను, జీలకర్ర – ఆరటీస్పూను, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – రెండు రెమ్మలు. తయారీ: ►పెసర పప్పుని శుభ్రంగా కడిగి రాత్రంతా లేదా ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి. ►నానిన పప్పుని నీళ్లు వంపేసి కొత్తిమీర తరుగు వేసి బరకగా రుబ్బుకోవాలి. ►మందపాటి పాత్రలో రెండున్నర కప్పులు నీళ్లు పోసి..మెటల్ స్టాండ్ పెట్టాలి. ►ఈ స్టాండ్పై ఒక వెడల్పాటి పాత్రనుపెట్టి అడుగున ఆయిల్ రాయాలి. ►పప్పు రుబ్బులో అల్లం, పచ్చిమిర్చిని దంచి వేయాలి. కొద్దిగా ఆయిల్, నిమ్మ రసం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. దీనిలో అరటీస్పూన్ బేకింగ్ సోడా వేసి కలిపి, ►ఆయిల్ రాసి పెట్టుకున్న పాత్రలో వేసి ఆవిరి మీద ఇరవై నిమిషాల పాటు ఉడికించి దించేయాలి. ►బాణలిపెట్టి ఆయిల్ వేయాలి, ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు వేసి చిటపటలాడనిచ్చి, జీలకర్ర, ఇంగువ కరివేపాకు వేసి వేయించాలి. ►దీనిలో రెండు టేబుల్ స్పూన్లు నీళ్లుపోసి తిప్పి స్టవ్ ఆపేయాలి. ►ఆవిరి మీద ఉడికించిన పప్పుపైన ఈ తాలింపు వేయాలి. కొత్తిమీర తరుగు, పచ్చికొబ్బరి, నువ్వులు చల్లి, ముక్కలుగా కట్ చేస్తే డోక్లా రెడీ. దాల్ కచోరి కావలసినవి: గోధుమ పిండి – రెండు కప్పులు, ఉప్పు – అర టీస్పూను, నెయ్యి – పావు కప్పు. స్టఫింగ్ కోసం: పొట్టుతీసిన పెసరపప్పు – అరకప్పు, నెయ్యి టేబుల్ స్పూను, పసుపు – పావు టీస్పూను, కారం – అర టీస్పూను, జీలకర్ర – అరటీస్పూను, సొంటిపొడి – అరటీస్పూను, ధనియాల పొడి – టీస్పూను, సోంపు – టీస్పూను, ఆమ్చూర్ పొడి – టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ముందుగా పెసరపప్పుని శుభ్రంగా కడిగి రెండు గంటలపాటు నానబెట్టి, తరువాత బరకగా రుబ్బి పక్కనపెట్టుకోవాలి. ►గోధుమ పిండిలో పావు కప్పు నెయ్యి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా కలుపుకోని పక్కన పెట్టుకోవాలి. ►స్టవ్ మీద బాణలి పెట్టి అర టేబుల్ స్పూను నెయ్యి వేయాలి. ►వేడెక్కిన తరువాత పెసర పప్పు రుబ్బు జీలకర్ర, సొంటిపొడి, ధనియాలపొడి, సోంపు పొడి, ఆమ్చూర్పొడి, పసుపు, కారం వేసి కలపాలి. ►నాలుగు నిమిషాలు వేగాక రుచికి సరిపడా ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు వేయించి స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ►చల్లారాక మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ►ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని చపాతీలా వత్తుకుని మధ్యలో పెసరపప్పు ఉండ పెట్టి, పూర్తిగా కవర్ అయ్యేలా ఉండలా చుట్టుకోవాలి. ►ఈ ఉండని చిన్న కచోరిలా చేసి బంగారు వర్ణంలోకి మారేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే దాల్ కచోరి రెడీ. చదవండి: అవును... నాకు బట్టతలే.. అయితే ఏంటి? -
పెసరంత భక్తి
రాములవారికి ఏ నైవేద్యం పెట్టినా స్వీకరిస్తాడు. అందులో భక్తి నింపితే చాలు. పెసరంత నైవేద్యానికి కొండంత అండగా ఉంటాడు.పండగరోజు పెసరలతో స్వామికి నైవేద్యం!మీకు ప్రసాదం! వడ పప్పు కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు; క్యారట్ తురుము – ఒక టేబుల్ స్పూను; పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; నిమ్మ రసం – 2 టీ స్పూన్లు; ఉప్పు – కొద్దిగా. తయారీ: ►ముందుగా పెసరపప్పును సుమారు మూడు గంటల సేపు నానబెట్టి, నీళ్లు ఒంపేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు, క్యారట్ తురుము, పచ్చి మిర్చి తరుగు, నిమ్మ రసం, ఉప్పు వేసి బాగా కలిపి, సుమారు అర గంట తరవాత తింటే రుచిగా ఉంటుంది. పానకం కావలసినవి: నీళ్లు – 4 కప్పులు; బెల్లం పొడి – రెండు కప్పులు; ఏలకుల పొడి – టీ స్పూను; మిరియాల పొడి – రెండు టీ స్పూన్లు. తయారీ: ►ముందుగా ఒక పెద్ద పాత్రలో నీళ్లు, బెల్లం పొడి వేసి బెల్లం కరిగేవరకు బాగా కలపాలి ►ఏలకుల పొడి, మిరియాల పొడి జత చేసి మరోమారు కలపాలి ►గ్లాసులోకి తీసుకుని తాగాలి. పెసర పప్పులడ్డు కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; బియ్యం – అర కప్పు; మినప్పప్పు – ఒక కప్పు; నెయ్యి – 2 టీ స్పూన్లు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – చిటికెడు; ఎండు కొబ్బరి తురుము – అర కప్పు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ►ముందుగా ఒక పాత్రలో మినప్పప్పు, బియ్యం, ఉప్పు వేసి సుమారు నాలుగు గంటలు నానబెట్టాలి ►మిక్సీలో వేసి మెత్తగా దోసెల పిండి మాదిరిగా రుబ్బి పక్కన ఉంచాలి ►పెసర పప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు గంటసేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి ►బాణలి లో తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి ►పెసరపప్పు జత చేసి ఉడికించి దింపేయాలి ►చల్లారాక, రంధ్రాలున్న గిన్నెలో పోసి నీళ్లు పోయేవరకు సుమారు ఐదు నిమిషాలు పక్కన ఉంచాలి ►నీరంతా పోయాక మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, బెల్లం పొడి, పావు కప్పు నీళ్లు పోసి తీగ పాకం వచ్చేవరకు కలుపుతుండాలి ►కొద్దిగా నెయ్యి వేసి బాగా కలిపి, ఉడికించి ఉంచుకున్న పెసర పప్పు ముద్ద వేసి కలిపి, గట్టి పడిన తరవాత దింపేయాలి ►కొద్దిగా చల్లారాక ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ►బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న పెసర పూర్ణాలను మినప్పప్పు మిశ్రమం పిండిలో ముంచి బూరెల మాదిరి గా నూనెలో వేసి వేయించాలి ►దోరగా వేగిన తరవాత పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►కొద్దిగా చల్లారాక మధ్యకు చేసి, కాగిన నెయ్యి వేసి అందించాలి. పెసర పాయసం కావలసినవి: పెసర పప్పు – అర కప్పు; నీళ్లు – ఒక కప్పు; పల్చటి కొబ్బరి పాలు – అర కప్పు; బెల్లం పొడి – ముప్పావు కప్పు; చిక్కటి కొబ్బరి పాలు – ఒక కప్పు; కొబ్బరి నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; జీడిపప్పులు – 15; కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను. తయారీ: ►పెసర పప్పును శుభ్రంగా కడగాలి ►తగినన్ని నీళ్లు జత చేసి కుకర్లో ఉంచి ఐదారు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►చల్లారాక మూత తీసి ఉడికిన పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►గరిటెతో మెత్తగా మెదపాలి ∙పల్చటి కొబ్బరి పాలు, నీళ్లు జత చేసి బాగా కలపాలి ►బెల్లం పొడి జత చేసి కరిగేవరకు కలుపుతుండాలి ►చిక్కటి కొబ్బరిపాలను జత చేసి, రెండు నిమిషాల తరవాత దింపేయాలి (ఎక్కువ సేపు ఉంచితే, పాలు విరిగిపోతాయి) ►స్టౌ మీద బాణలిలో కొబ్బరి నూనె కాగాక, జీడిపప్పులు, కిస్మిస్లు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి ►ఉడికిన పాయసంలో వేయాలి ►ఏలకుల పొడి కూడా జత చేసి కలిపి దింపేయాలి. పెసర పప్పుహల్వా కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; నెయ్యి – 10 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; పిస్తా తరుగు – ఒక టేబుల్ స్పూను (అన్సాల్టెడ్); కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను; చిక్కటి పాలు – ఒక కప్పు; నీళ్లు – 2 కప్పులు; పంచదార – ఒకటిన్నర కప్పులకు కొద్దిగా తక్కువ. తయారీ: ►పెసరపప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి, సుమారు ఐదు గంటల సేపు నానబెట్టాక నీళ్లు ఒంపేసి, గ్రైండర్లో వేసి, తగినన్ని నీళ్లు జత చేస్తూ మెత్తగా చేయాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కాగాక మెత్తగా రుబ్బుకున్న పెసరపిండిని అందులో వేసి ఆపకుండా సన్నటి మంట మీద కలుపుతుండాలి ►బాగా ఉడికి, బాణలి నుంచి విడివడేవరకు కలుపుతుండాలి ►ఈలోగా మరొక బాణలి స్టౌ మీద ఉంచి పాలు, నీళ్లు, పంచదార వేసి ఉడికించాలి ►పెసర పిండి మిశ్రమం కొద్దిగా రంగు మారుతుండగా, పంచదార పాలు మిశ్రమాన్ని జతచేసి కలియబెట్టాలి ►నెయ్యి వేరుపడే వరకు కలపాలి ►ఏలకుల పొడి, పిస్తా తరుగు, కిస్మిస్ జత చేసి కలియబెట్టాలి ►హల్వాను వేడిగానే అందించాలి. పెసర పప్పు బూరెలు కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; పంచదార – అర కప్పు; నెయ్యి – పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; డ్రై ఫ్రూట్స్ – పావు కప్పు (జీడి పప్పు, బాదం పప్పులు, పిస్తాలు...) తయారీ: ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక పెసర పప్పు వేసి దోరగా అయ్యేవరకు వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి ►చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పిండిలా అయ్యేలా గ్రైండ్ చేయాలి ►పిండిని జల్లించాలి ∙అదే మిక్సీలో పంచదార, ఏలకుల పొడి వేసి మెత్తగా చేయాలి ►ఒక పాత్రలో పెసర పిండి, పంచదార పొడి వేసి రెండూ కలిసేలా కలపాలి డ్రైఫ్రూట్స్ జత చేయాలి ►కరిగించిన నేతిని కొద్దికొద్దిగా జత చేస్తూ ఉండలు కట్టుకోవాలి ►బాగా చల్లారాక గాలి చొరని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి. పెసర పప్పు ఫ్రై కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; నీళ్లు – రెండున్నర కప్పులు; పసుపు – చిటికెడు. పోపు కోసం: ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 3 (నిలువుగా మధ్యకు తరగాలి); ఎండు మిర్చి – ఒకటి; అల్లం తురుము – పావు టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 4; జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – చిటికెడు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; గరం మసాలా – పావు టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; కసూరీ మేథీ – అర టీ స్పూను; నూనె – 2 టేబుల్ స్పూన్లు; బటర్ – అర టేబుల్ స్పూను తయారీ: ►పెసర పప్పును ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు జత చేసి శుభ్రంగా కడగాలి ►తగినన్ని నీళ్లు, పసుపు జత చేసి కుకర్లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి దింపేయాలి ►చల్లారాక గరిటెతో మెత్తగా మెదపాలి ►అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జత చేసి, స్టౌ మీద సన్నని మంట మీద ఉంచాలి ►చిన్న బాణలిలో నూనె లేదా బటర్ వేసి కరిగాక, జీలకర్ర వేసి వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి మరోమారు వేయించాక, అల్లం తురుము, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి మిర్చి తరుగు, ఎండు మిర్చి వేసి వేయించాలి ►టొమాటో తరుగు జత చేసి ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి ►మిరప కారం, గరం మసాలా, ఇంగువ, కసూరీ మేథీ, కొత్తిమీర జత చేయాలి ►బాగా ఉడికేవరకు వేయించాలి ►తడ్కా మిశ్రమం జత చేసి మరోమారు కలిపి, రెండు నిమిషాల తరవాత దింపేయాలి. పెసర పప్పుతడ్కా కావలసినవి: పెసర పప్పు – ముప్పావు కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; నీళ్లు – 3 కప్పులు; ఉప్పు – తగినంత పోపు కోసం: జీలకర్ర – ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 5; గరం మసాలా పొడి – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; తరిగిన పచ్చిమిర్చి – 2; ఇంగువ – కొద్దిగా; నెయ్యి లేదా నూనె – 3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర – కొద్దిగా తయారీ: ►స్టౌ మీద కుకర్లో కొద్దిగా నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు, టొమాటో తరుగు, అల్లం తురుము వేసి కలుపుకోవాలి ►పసుపు, మిరపకారం, నీళ్లు జత చేసి బాగా కలపాలి ►పెసర పప్పు వేసి కలియబెట్టి మూత పెట్టాలి ►నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►ఉప్పు జత చేసి కలియబెట్టాలి ►స్టౌ మీద చిన్న బాణలిలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి కాగాక జీలకర్ర వేసి వేయించాలి ►వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చి మిర్చి జత చేసి కలిపి దింపేయాలి ►గరం మసాలా, మిరప కారం, ఇంగువ జత చేసి బాగా కలిపి, ఉడికిన తడ్కా మీద వేసి కలపాలి ►కొత్తిమీరతో అలంకరించాలి ►అన్నం, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. పెసర సలాడ్ కావలసినవి: పెసలు – రెండు కప్పులు; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 1 (సన్నగా తరగాలి); మిరప కారం – పావు టీ స్పూను; చాట్ మసాలా – అర టీ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను; ఉడికించిన బంగాళ దుంప – ఒకటి (తొక్క తీసి సన్నగా తరగాలి); కొత్తిమీర – కొద్దిగా; తయారీ: ►ముందు రోజు రాత్రి పెసలు నానబెట్టి, మరుసటి రోజు ఉదయం నీరు ఒంపేసి, పక్కన ఉంచాలి ►ఆ మరుసటి రోజు ఉదయానికి మొలకలు వస్తాయి ►మొలకలు వచ్చిన పెసలను ఉపయోగించాలి. తయారీ: ►మొలకలు వచ్చిన పెసలకు తగినన్ని నీళ్లు జతచేసి ఉడికించి, నీళ్లు ఒంపేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►ఉల్లితరుగు, టొమాటో తరుగు జత చేయాలి ►పచ్చి మిర్చి తరుగు, బంగాళదుంప తరుగు జత చే సి కలియబెట్టాలి ►పావు మిరపకారం, చాట్ మసాలా జతచేశాక, ఉప్పు, నిమ్మ రసం వేసి, బాగా కలపాలి ►కొత్తిమీరతో అలంకరించి, వెంటనే అందించాలి. పెసర కిచిడీ కావలసినవి: పెసర పప్పు – అర కప్పు; బియ్యం – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – ఒకటి; జీలకర్ర – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – చిటికెడు; నీళ్లు – మూడున్నర కప్పులు; నూనె లేదా నెయ్యి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత. తయారీ: ►ఒక పాత్రలో పెసర పప్పు, బియ్యం వేసి తగినన్ని నీళ్లు జత చేసి శుభ్రంగా కడగాలి ►మంచి నీళ్లు జత చేసి సుమారు అరగంటసేపు నానబెట్టాలి ►స్టౌ మీద కుకర్ ఉంచి, వేడయ్యాక నెయ్యి వేసి కాగాక జీలకర్ర వేసి చిటపటలాడేవరకు వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము జత చేసి వేయించాలి ►పసుపు, ఇంగువ జత చేసి టొమాటోలు మెత్తపడే వరకు వేయించాలి ►నానబెట్టుకున్న పెసర పప్పు, బియ్యం మిశ్రమంలోని నీటిని తీసేసి, బియ్యం మిశ్రమాన్ని కుకర్లో వేసి బాగా కలపాలి ►తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి కుకర్ మూత పెట్టాలి ►ఆరేడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►మిశ్రమం మరీ ముద్దగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు జత చేయాలి ►కిచిడీ మీద నెయ్యి వేసి వేడివేడిగా అందిస్తే రుచిగా ఉంటుంది ►పెరుగు, సలాడ్లతో తినొచ్చు. పెసర పప్పు కచోరీ కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు; ఉప్పు – తగినంత; నెయ్యి లేదా నూనె – పావు కప్పు; నీళ్లు – తగినన్ని కచోరీ స్టఫింగ్ కోసం: పెసర పప్పు – అర కప్పు; నెయ్యి – అర టేబుల్ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; శొంఠి పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; సోంపు పొడి – ఒక టీ స్పూను; ఆమ్చూర్ పొడి – ఒక టీ స్పూను; నూనె – డీప్ ఫ్రై చేయడానికి తగినంత తయారీ: ►ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు వేసి కలపాలి ►పావు కప్పు నెయ్యి జత చేయాలి ►తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలపాలి ►తడి వస్త్రం మూత వేసి గంట సేపు పక్కన ఉంచాలి ►పెసర పప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి రెండు గంటలపాటు నానబెట్టాలి ►నీళ్లు ఒంపేసి, పెసర పప్పును మిక్సీలో వేసి మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వలా ఉండేలా మిక్సీ పట్టాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి కాగాక మిరప కారం, ఆమ్చూర్ పొడి వంటి మసాలా దినుసులు జత చేసి దోరగా వేయించాలి ►రవ్వలా మిక్సీ పట్టిన పెసర పప్పు, ఉప్పు, ఇంగువ జత చేసి మూడునాలుగు నిమిషాలు ఆపకుండా కలియబెట్టి, దింపి చల్లార్చాలి ►చేతికి కొద్దిగా నూనె పూసుకుని, పిండిని తగు పరిమాణంలో చేతిలోకి తీసుకుని, ఉండలు చేసి పక్కన ఉంచాలి ►కలిపి ఉంచుకున్న మైదాపిండిని మరోమారు బాగా కలపాలి ►పిండిని పొడవుగా గుండ్రంగా ఒత్తి, సమాన భాగాలుగా కట్ చేయాలి ►ఒక్కో ఉండను చపాతీకర్రతో కొద్దిగా పల్చగా ఒత్తాలి ►పెసరపప్పు మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి అంచులు మూసేసి, (మరీ పల్చగాను, మరీ మందంగాను కాకుండా చూసుకోవాలి) ►మరోమారు ఒత్తాలి (పల్చటి వస్త్రం పైన వేసి ఉంచాలి. లేదంటే ఎండిపోతాయి) ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఒత్తి ఉంచుకున్న కచోరీలను వేసి, దోరగా వేయించాలి ►కొద్దిగా పొంగుతుండగా, జాగ్రత్తగా వెనుకకు తిప్పాలి ►బంగారు వర్ణంలోకి వచ్చాక పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►గ్రీన్ చట్నీ లేదా స్వీట్ చట్నీతో తింటే రుచిగా ఉంటాయి. పెసరపప్పు ఢోక్లా కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; అల్లం + పచ్చి మిర్చి ముద్ద – టేబుల్ స్పూను; నీళ్లు – అర కప్పు; కొత్తిమీర ఆకులు – టేబుల్ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను; నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; నిమ్మ ఉప్పు – టీ స్పూను. పోపు కోసం: నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; వేయించిన నువ్వులు – టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు గార్నిషింగ్ కోసం: కొత్తిమీర తరుగు – పావు కప్పు; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు తయారీ: ►పెసరపప్పుకి తగినన్ని నీళ్లు జతచేసి రెండుమూడు సార్లు బాగా కడిగి, నాలుగు గంటల పాటు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి ►కొత్తిమీర, అరకప్పు నీళ్లు జత చేసి, మిక్సీలో వేసి కొద్దిగా పలుకులా ఉండేలా మిక్సీ పట్టాలి (మరీ ముద్దలా అవ్వకూడదు. మరీ పల్చగాను, మరీ గట్టిగానూ కూడా ఉండకూడదు) ►ఒక పాత్రలో రెండున్నర కప్పుల నీళ్లు పోసి, మరిగించాలి ►వెడల్పాటి పళ్లానికి కొద్దిగా నూనె పూసి పక్కన ఉంచాలి ►ఒక పాత్రలో అల్లం + పచ్చిమిర్చి ముద్ద, నూనె, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి, తయారుచేసి ఉంచుకున్న పెసర పిండి మిశ్రమాన్ని జత చేయాలి ►చివరగా నిమ్మ ఉప్పు జత చేసి బాగా కలిపి, నూనె పూసిన పాత్రలో పోసి సమానంగా పరవాలి ►స్టౌ మీద మరుగుతున్న నీళ్ల పాత్రలో ఈ పళ్లెం ఉంచి, మూత పెట్టి, సుమారు పావు గంట తరవాత దింపేయాలి ►బాగా చల్లారాక బయటకు తీయాలి ►చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి ►నువ్వులు జత చేసి మరోమారు కలియబెట్టాలి ►ఇంగువ, కరివేపాకు వేసి వేయించి బాగా కలపాలి ►రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు జత చేసి పోపు మిశ్రమాన్ని బాగా కలపాలి ►ఈ మిశ్రమాన్ని తయారు చేసి ఉంచుకున్న ఢోక్లా మీద వేయాలి ►కొత్తిమీర, కొబ్బరి తురుములతో అలంకరించి అందించాలి. పానకం– వడపప్పు ప్రాముఖ్యత ఏమిటి? శ్రీరామ నవమి రోజున అందరిళ్లలోనూ పానకం–వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థం దాగి ఉంది. ఇది ఎండాకాలం. కాబట్టి పానకాన్ని, వడపప్పును ప్రసాదరూపంలో సేవించడం వల్ల ఆరోగ్యం, ఆయుష్యాభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద శాస్త్రజ్ఞుల అభిప్రాయం. మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, దేహారోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు – పానకం కూడా అంతే. శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చే గొంతువ్యాధులకు... పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు. పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైనదని చెబుతారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ’పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ’ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. అందుకే పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. బాగా జ్వరంతో బాధపడి తిరిగి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వారికి పెద్దలు పెసరపప్పుతో చేసిన కట్టు, పెసరపప్పు కలిపి వండిన పులగం వంటి వాటిని తినిపిస్తారు. ఎందుకంటే పెసరపప్పు తేలికగా అరుగుతుంది. శరీరం కోల్పోయిన బలాన్ని, సత్తువను తిరిగి తెస్తుంది. వేసవి కాలంలో వడపప్పును తినడం వంటికి చలువ చేస్తుంది. అలాగే తియ తియ్యటి బెల్లం పానకాన్ని సేవించడం వల్ల ఎండలను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. -
కందిపప్పు కేజీ రూ. 85
నంద్యాల : కందిపప్పుల ధరలు ఆకాశాన్ని తాకడంతో వ్యాపారులు ఇదే అవకాశంగా తీసుకుని టాంజానియా కందిపప్పును మార్కెట్లోకి దిగుమతి చేసుకున్నారు. ఈ పప్పు కిలో రూ. 85 నుంచి రూ.90 మధ్యన విక్రయిస్తుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఈ పప్పును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే స్థానిక కందపప్పు తినడానికి అలవాటు పడినవారు ఈ పప్పును తినలేరని వ్యాపారులు సైతం పేర్కొంటున్నారు. నిల్వ కూడా రెండుగంటల కంటే అధికంగా ఉండదని వివరిస్తున్నారు. సందట్లో సడేమియ హోటల్, మెస్ల యజమానులు విద్యార్థుల కోసం విద్యాసంస్థల్లో నిర్వహిస్తున్న హాస్టళ్లలో కూడా 75 శాతం మంది ఈ టాంజానియా పప్పునే వినియోగిస్తున్నట్లు సమాచారం.ఉప్పు, కారం, నూనె రుచి ముసుగులో వీటి నాణ్యత అంతగా తెలియదని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. స్థానిక కందిపప్పు ధరలు పెరగక ముందు టాంజానియా కందిపప్పు కేవలం కేజీ రూ. 40 నుంచి రూ. 50 మధ్యన విక్రయించేవారమని చెప్పారు. కాగా కందిపప్పు ధర అమాంతంగా రూ. 210కి చేరడంతో... ఈ పప్పును మార్కెట్లోకి దిగుమతి చేసుకుని... కొనుగోలుదారులకు మరీ వివరించి.. విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. టాంజానియా కందిపప్పు ను భారీ ఎత్తున విక్రయించి భారీగా లాభాలు గడించడానికి హైదరాబాద్ నుంచి కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆదోని, కర్నూలు ప్రాంతాలకు దళారులను రంగప్రవేశం చేయించి... సరుకు పంపుతున్నారు. ఈ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా కొనసాగిస్తున్నారు. అయితే ఈ పప్పు వాడకం వల్ల వచ్చే అనర్థాలపై అధికారులు ఎటువంటి అవగాహన లేకపోవడంతో వ్యాపారం యథేచ్చగా సాగుతోంది.