Mukherjee
-
పోలవరం గడువులోగా పూర్తి చేయాలి
సాక్షి, అమరావతి: కేంద్ర మంత్రివర్గం నిర్దేశించిన గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) అథారిటీ(పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులను కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ(Debashree Mukherjee) ఆదేశించారు. 2026, మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని.. వరదలు వంటి సమస్యలు ఉత్పన్నమైతే మరో ఏడాది గడువు పొడిగిస్తామని.. ఎట్టిపరిస్థితుల్లోనూ 2027, మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్దేశించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.ఆ మేరకు ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రిమావిరా సాఫ్ట్వేర్తో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని, నెల వారీ లక్ష్యాలు నిర్దేశించుకుని పనులు చేయాలని దిశానిర్దేశం చేశారు. పనుల పురోగతిపై ప్రతి నెలా తాను సమీక్షిస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సోమవారం ఢిల్లీలోని తన కార్యాలయంలో దేబశ్రీ ముఖర్జీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్..పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై పీపీఏ సీఈవో అతుల్ జైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి వివరించారు. ప్రధాన(ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం గ్యాప్–2లో కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రం వాల్ పనులపై దేబశ్రీ ముఖర్జీ సమగ్రంగా సమీక్షించారు. 1396.6 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందంతో చేపట్టిన డయాఫ్రం వాల్ నిర్మాణంలో జనవరి 18 నుంచి ఇప్పటిదాకా ఐదు ప్యానెళ్లు దించారని పీపీఏ సీఈవో అతుల్జైన్ వివరించారు.ప్రస్తుత రెండు కట్టర్లతో పనులు చేస్తున్నారని.. వచ్చే నెలలో మూడో కట్టర్ వస్తుందని.. 2025, డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ను పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. ఆలోగా డయాఫ్రం వాల్ను పూర్తి చేయడానికి రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో చర్చించి నెల వారీ లక్ష్యాలను నిర్దేశించుకుని తనకు నివేదిక ఇవ్వాలని పీపీఏ సీఈవోను దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు.డిజైన్ల ఆమోదంపై సత్వరమే నిర్ణయంపోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టడానికి అత్యంత కీలకమైన డిజైన్ల రూపకల్పన, ఆమోదం ప్రక్రియపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమీక్షించారు. బంకమట్టి ఉన్న ప్రాంతంలో డయాఫ్రం వాల్ పనులు చేపట్టడానికి సంబంధించిన డిజైన్ను సీడబ్ల్యూసీకి పంపామని ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. అంతర్జాతీయ నిపుణుల కమిటీతో చర్చించి.. ఆ డిజైన్ను వీలైనంత తొందరగా ఆమోదించాలని సీడబ్ల్యూసీ చైర్మన్ ముకేష్కుమార్ సిన్హాను ఆదేశించారు.ప్రధాన డ్యాం గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాంను ఇప్పటికే పూర్తి చేశామని.. గ్యాప్–1, గ్యాప్–2లలో ఈసీఆర్ఎఫ్ డ్యాంను నిర్మించాలని.. అందుకు సంబంధించిన డిజైన్లను రూపొందిస్తున్నామని సీఈ కె.నరసింహమూర్తి వివరించారు. డిజైన్లను ఆమోదించడంలో జాప్యం జరగకుండా చూడాలని సీడబ్ల్యూసీ చైర్మన్ను దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు. ప్రధాన డ్యాం గ్యాప్–1, గ్యాప్–2లలో ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు చేపట్టడానికి మెటీరియల్(మట్టి, రాళ్లు) ఏ మేరకు అవసరం.. ఏ మేరకు అందుబాటులో ఉంది.. ఇంకా అవసరమైన మెటీరియల్ను ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారు అన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని సూచించారు.రూ.2,700 కోట్ల అడ్వాన్సుకు రాష్ట్ర జలవనరుల శాఖ విజ్ఞప్తిప్రాజెక్టు పనులకు రీయింబర్స్మెంట్గా రూ.459.69 కోట్లు, అడ్వాన్సుగా రూ.2,348 కోట్లు అక్టోబర్ 10న విడుదల చేశారని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ వివరించారు. ఇందులో రూ.459.69 కోట్లకు సంబంధించి యూసీలను ఇప్పటికే కేంద్ర జల్ శక్తి శాఖకు పంపామని గుర్తు చేశారు. అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,348 కోట్ల వ్యయానికి సంబంధించిన బిల్లులను పీపీఏ ద్వారా పంపామని తెలిపారు. అడ్వాన్సుగా మరో రూ.2,700 కోట్లు విడుదల చేయాలని కోరారు. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ వీలైనంత తొందరగా అడ్వాన్సుగా నిధులు ఇస్తామని చెప్పారు.నాణ్యతకు మూడంచెల విధానం..ప్రాజెక్టు పనుల్లో నాణ్యతపై ఏమాత్రం రాజీపడే ప్రశ్నే లేదని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. పనుల్లో నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడానికి వ్యాప్కోస్, సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్), రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ల్యాబ్లను ఏర్పాటు చేసుకోవా లని ఆదేశించారు. మూడు ల్యాబ్లలో ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ పనుల నాణ్యతను నిర్ధారించాలని స్పష్టం చేశారు. -
నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి
సాక్షి, అమరావతి: కృష్ణా నదిపై ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ను నెలలోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులు అంగీకరించారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏపీ భూభాగంలోని 6, తెలంగాణ భూభాగంలోని 9 అవుట్లెట్లను బోర్డుకు అప్పగించే విధానం (హ్యాండింగ్ ఓవర్ ప్రోటోకాల్)ను వారంలోగా ఖరారు చేయాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీకి దేబశ్రీ ముఖర్జీ చెప్పారు. త్రిసభ్య కమిటీ ఖరారు చేసిన విధానంపై 15 రోజుల్లోగా రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్షించి, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈమేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా ఆదేశాల మేరకు కృష్ణా జలాల వివాదానికి తెరదించేందుకు దేబశ్రీ ముఖర్జీ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్, కృష్ణా బోర్డు చైర్మన్ శివ్నందన్కుమార్, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్విందర్సింగ్ వోరా తదితరులు పాల్గొన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు డిసెంబర్ 1 నుంచి సీఆరీ్పఎఫ్ పహారాలో సాగర్ను నిర్వహిస్తున్నామని, ఈ నెలలో కుడి కాలువ ద్వారా ఏపీకి 5 టీఎంసీలు విడుదల చేశామని కృష్ణా బోర్డు ఛైర్మన్ శివన్నందన్కుమార్ వివరించారు. వెనకడుగు కాదు.. ముందడుగే కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ శ్రీశైలం నిర్వహణను ఏపీకి, సాగర్ నిర్వహణను తమకు అప్పగించారని తెలంగాణ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా చెప్పారు. ఏపీ భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను నవంబర్ 30న అక్రమంగా ఆ రాష్ట్ర అధికారులు స్వా«దీనం చేసుకున్నారని, సాగర్పై నవంబర్ 29 నాటికి ఉన్న యధాస్థితిని కొనసాగించాలని కోరారు. దీనిపై రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ నిర్వహణలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాన్ని 2014లో అధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి నవంబర్ 30 వరకూ తొమ్మిదేళ్లపాటు తెలంగాణ సర్కారు తమ హక్కులను కాలరాసిందని, హక్కుల పరిరక్షణ కోసమే మా భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి హెడ్ రెగ్యులేటర్ను స్వా«దీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. దీనిపై దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ వెనకడుగు కాదు ముందడుగు వేస్తామని స్పష్టం చేశారు. తొలుత సాగర్ నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తామని, ఆ తర్వాత ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై నిర్ణయం తీసుకుంటామంటూ చేసిన ప్రతిపాదనను ఏపీ అధికారులు సున్నితంగా తోసిపుచ్చారు. సాగర్ను మాత్రమే బోర్డుకు అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. సాగర్, శ్రీశైలంను ఒకేసారి కృష్ణా బోర్డుకు అప్పగిస్తేనే రెండు రాష్ట్రాల హక్కులను పరిరక్షించవచ్చునని సూచించారు. ఇందుకు తెలంగాణ అధికారులు కూడా అంగీకరించారు. దాంతో శ్రీశైలం, సాగర్ను కృష్ణా బోర్డుకు ఒకే సారి అప్పగించడానికి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అంగీకరించారు. అప్పగింత తర్వాత నిర్వహణ నియమావళి కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రెండున్నరేళ్లైనా అమల్లోకి రాకపోవడంపై దేబశ్రీ ముఖర్జీ అసహనం వ్యక్తంచేశారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి, రెండు రాష్ట్రాల ఈఎన్సీల నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ వారంలోగా శ్రీశైలం, సాగర్లలోని 15 అవుట్లెట్లను బోర్డుకు అప్పగించే విధానాన్ని ఖరారు చేయాలని ఆదేశించారు. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయనందున, ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి (ఆపరేషన్ ప్రోటోకాల్)ని ఖరారు చేయలేమని తెలంగాణ అధికారులు చెప్పారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చాక ఆపరేషన్ ప్రోటోకాల్ను ఖరారు చేయాలని వారు చేసిన సూచనను సీడబ్ల్యూసీ చైర్మన్ వ్యతిరేకించారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కేటాయింపుల ఆధారంగానే 2015లో రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తూ తాత్కాలిక సర్దుబాటు చేశామని, వాటికి అనుగుణంగానే శ్రీశైలం, సాగర్ ఆపరేషన్ ప్రోటోకాల్ ముసాయిదా రూపొందించామని వివరించారు. దీనిపై దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ.. ప్రాజెక్టుల అప్పగింత తర్వాత ఆపరేషన్ ప్రోటోకాల్ ఖరారుపై నిర్ణయం తీసుకుందామని చెప్పారు. రూ.8.5 కోట్లు అధికంగా ఇచ్చిన రాష్ట్రం కృష్ణా బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాలు నిధులు విడుదల చేయడంలో జాప్యం చేస్తున్నాయని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శికి బోర్డు ఛైర్మన్ శివ్నందన్కుమార్ వివరించారు. దీనిపై ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్కుమార్ స్పందిస్తూ.. తెలంగాణకంటే తాము రూ.8.5 కోట్లు అధికంగా ఇచ్చామని చెప్పారు. తెలంగాణ వాటా నిధులు ఇచ్చాకే తాము కూడా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. తక్షణమే వాటా నిధులు విడుదల చేయాలని తెలంగాణ అధికారులను దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు. -
పోలవరం తొలిదశ పూర్తికి రూ.15,661 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలిదశలో మిగిలిన పనుల పూర్తికి రూ.15,661 కోట్లు అవసరమని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) తేల్చింది. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని సిఫార్సు చేస్తూ శుక్రవారం కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి నివేదిక పంపినట్లు సీడబ్ల్యూసీ ఛైర్మన్ కుశ్విందర్సింగ్ వోరా వెల్లడించారు. ఇప్పటికే పోలవరం తొలిదశలో మిగిలిన పనుల పూర్తికి రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారు. ఇందులో భాగంగా జూన్ 5న కేంద్ర ఆర్థికశాఖ మెమో కూడా జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన లైడార్ సర్వేలో పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి అదనంగా 36 గ్రామాలు వస్తాయని తేలింది. ఆ గ్రామాల ప్రజలకు తొలిదశ కిందే పునరావాసం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. ఆ మేరకు సవరించిన ప్రతిపాదనలను రూపొందించాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో తొలిదశలో మిగిలిన పనుల పూర్తికి రూ.17,148 కోట్లు అవసరమంటూ సవరించిన వ్యయ ప్రతిపాదనలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా సీడబ్ల్యూసీకి పంపింది. వాటిని పరిశీలించిన సీడబ్ల్యూసీ తొలిదశ పూర్తికి రూ.15,661 కోట్లు అవసరమవుతాయని లెక్కగట్టింది. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత నిధుల విడుదల.. సీఎం జగన్ చేసిన విజ్ఞప్తి.. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు తొలిదశ పూర్తికి రూ.12,911.15 కోట్లు విడుదల చేసేందుకు జూన్ 5న కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించింది. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 36 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడానికి సూత్రప్రాయంగా కూడా అంగీకరించింది. ఆ గ్రామాల ప్రజలకు పునరవాసం కల్పించడానికి అదనంగా రూ.2,749.85 కోట్లు అవసరమని సీడబ్ల్యూసీ లెక్కగట్టింది. మొత్తం రూ.15,661 కోట్లను విడుదల చేయాలని కేంద్ర జల్శక్తి శాఖకు శుక్రవారం సిఫార్సు చేసింది. కేంద్ర జల్శక్తి శాఖ ఆ మేరకు పోలవరానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు సిఫార్సు చేయనుంది. దీని ఆధారంగా కేంద్ర కేబినెట్కు జల్శక్తి, ఆర్థిక శాఖలు ప్రతిపాదన పంపనున్నాయి. దీనిపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తే పోలవరం తొలిదశ పూర్తికి అవసరమైన నిధులు విడుదలకు మార్గం సుగమం అవుతుంది. దశల వారీగా పోలవరంలో నీటినిల్వ.. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు కాగా.. గరిష్ట నీటినిల్వ 194.6 టీఎంసీలు. కొత్తగా నిరి్మంచే ఏ ప్రాజెక్టులోనైనా సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ఆ ప్రాజెక్టు పూర్తయిన తొలి ఏడాది దాని పూర్తినిల్వ సామర్థ్యంలో 1/3వ వంతు.. మరుసటి ఏడాది 2/3వ వంతు, తర్వాత పూర్తిస్థాయిలో నీటినిల్వ చేయాలి. లీకేజీలుంటే వాటికి అడ్డుకట్ట వేసి ప్రాజెక్టుకు భద్రత చేకూర్చాలన్న ఉద్దేశంతోనే సీడబ్ల్యూసీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది. వీటి ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలిఏడాది 41.15 మీటర్లలో, తర్వాత దశల వారీగా నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ గరిష్ట నీటి మట్టం 45.74 మీటర్లలో నీటినిల్వ చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. కేంద్రాన్ని ఒప్పించిన సీఎం జగన్.. నిజానికి.. కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కమీషన్ల కక్కుర్తితో 2013–14 ధరల ప్రకారమే పూర్తిచేస్తామని 2016, సెప్టెంబరు 7న నాటి సీఎం చంద్రబాబు అంగీకరించి పనులను దక్కించుకున్నారు. అప్పటి ధరల ప్రకారం పోలవరం వ్యయం రూ.20,398.61 కోట్లు ఇచ్చేందుకు అప్పట్లో కేంద్ర మంత్రివర్గం అంగీకరించింది. ఇందులో 2014, ఏప్రిల్ 1 నాటికి చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లు మినహాయించి మిగతా అంటే రూ.15,667.91 కోట్లు ఇస్తామని తేల్చింది. 2014, ఏప్రిల్ 1 నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.14,969.37 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఇక రూ.698.54 కోట్లు మాత్రమే మిగిలాయి. కానీ.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునారావాసానికే రూ.33,168.23 కోట్లు అవసరం. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేస్తూ.. 2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ ఖరారు చేసిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి, నిధులు విడుదల చేసి, ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని ప్రధాని మోదీని కోరారు. ఈ క్రమంలోనే తొలిదశ పూర్తికి అడ్హక్గా రూ.పది వేల కోట్లు ఇచ్చి.. ప్రాజెక్టు ఫలాలను ముందస్తుగా రైతులకు అందించేందుకు సహకరించాలని సీఎం జగన్ చేసిన వినతిపై ప్రధాని సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని కేంద్ర జల్శక్తి, ఆర్థిక శాఖలను ఆదేశించారు. -
సుతీర్థ–ఐహిక జోడీకి టైటిల్
ట్యూనిస్ (ట్యూనిషియా): ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జోడీ సుతీర్థ ముఖర్జీ–ఐహిక ముఖర్జీ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో సంచలనం సృష్టించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో సుతీర్థ–ఐహిక ద్వయం మహిళల డబుల్స్లో చాంపియన్గా నిలిచింది. మియు కిహారా–మివా హరిమోటో (జపాన్) జంటతో 35 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సుతీర్థ–ఐహిక జోడీ 11–5, 11–6, 5–11, 13–11తో నెగ్గింది. విజేతగా నిలిచిన సుతీర్థ–ఐహిక జంటకు 1,000 డాలర్ల (రూ. 82 వేలు) ప్రైజ్మనీతోపాటు 400 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. భారత క్రీడాకారులకు డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీ టైటిల్ లభించడం ఇది మూడోసారి. 2019లో మనిక బత్రా–అర్చన కామత్ స్లొవేనియా డబ్ల్యూటీటీ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్ను... 2021లో సత్యన్ జ్ఞానశేఖరన్–హర్మీత్ దేశాయ్ ట్యూనిíÙయాలో జరిగిన డబ్ల్యూటీటీ టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్ను గెల్చుకున్నారు. -
చిన్నవయసులోనే గుండెపోటు సంఘటనలు ఎందుకు?
గుండెపోటు విషయంలో ఇటీవలి కొన్ని అధ్యయనాల్లో తెలిసి వచ్చిన అంశం ఏమిటంటే... ఇది పెద్దవారిలో మాత్రమే కాదు... టీనేజర్లలో... ఆ మాటకొస్తే చిన్నారుల్లో సైతం కనిపిస్తుందని తేలింది. క్రమబద్ధమైన రీతిలో వ్యాయామం చేస్తూ, శిక్షణ పొందే యువ అథ్లెట్లలో సైతం గుండెపోట్లు కనిపించాయి. ఫిఫా (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్బాల్) రిజిస్ట్రీలో సైతం 2014 నుంచి 2018 మధ్యకాలంలో 617 మంది యువ అథ్లెట్లు గుండెపోటుతో కుప్పకూలిన దాఖలాలున్నాయి. అంతేకాదు... మనదేశంలో సైతం చాలా పెద్ద సెలబ్రిటీలు మొదలుకుని... మన వీధిలో మనకు తెలిసిన వారిలో అకస్మాత్తు గుండెపోట్లు కనిపించడం, వారు హఠాత్తుగా మరణించడం చాలా ఎక్కువగా కలవరపరిచే విషయాలే. అతి చిన్న వయసులోనే ఎందుకిలా గుండెపోట్లు? అతి చిన్నవయసులో గుండెపోట్లు కనిపించడానికి కొన్ని అండర్లైయింగ్ ఫ్యాక్టర్స్ దోహదపడుతున్నట్లు వెల్లడైంది. ♦ కుటుంబ చరిత్రలోనే చిన్నవయసులో గుండెపోటు సంఘటనలు ఉండటం. ♦ గుండె నిర్మాణంలోనే పుట్టుకతో తేడాలు ఉండటం. ♦ గుండెలో లయబద్ధంగా కొట్టుకోడానికి నిత్యం ఒకే రీతిలో విడుదలయ్యే ఎలక్ట్రిసిటీ కావాలి. అది సయనో ఏట్రియల్ నోడ్ అనే గుండెలోని ఓ కేంద్రం నుంచి వెలువడుతుంది. ఈ కరెంటు వెలువడటంలోని తేడాలు (అబ్నార్మాలిటీస్) కూడా ఇలా యువత అకస్మాత్తు మరణాలకు ఒక కారణమని అధ్యయనాల్లో తేలింది. కోవిడ్ నష్టాలూ కొంతవరకు కారణం... ఎలాగంటే...? కోవిడ్ అనంతరం వచ్చే కొన్ని సమస్యలు సైతం గుండెపోటుకు కారణమని కొన్ని అధ్యయనాల్లో తేలింది. గుండె కండరానికి ఇన్ఫ్లమేషన్ తెచ్చిపెట్టే ‘మయోకార్డయిటిస్ ’ సమస్య ఇందుకు ఓ ఉదాహరణ. ఛాతీలో నొప్పి, శ్వాస తగినంతగా అందకపోవడం వంటి లక్షణాలతో కనిపించే మయోకార్డయిటిస్ అన్నది అటు తర్వాత గుండె క్రమబద్ధంగా కొట్టుకునే లయను దెబ్బతీసేలా ‘అరిథ్మియాస్’, హార్ట్ఫెయిల్యూర్లతోపాటు మరికొన్ని ఇతర గుండె సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఇదొక్కటే కాదు... కోవిడ్ తర్వాత చాలామందిని పరిశీలించినప్పుడు వారి రక్తప్రసరణ వ్యవస్థలో / రక్తనాళాల్లో రక్తపు ఉండలు (క్లాట్స్) పెరగడం మరో అంశం. ఈ క్లాట్స్ ప్రధాన ధమనుల్లో వచ్చినప్పుడు, గుండెకు తగినంతగా పోషకాలు, ఆక్సిజన్ అందకుండా అడ్డుపడతాయి. ఇవి కూడా యువతలో గుండెపోట్లకు కారణం. ♦ ఇటీవల యువతలో మానసిక ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోయింది. ఆదుర్దా పడటం, ఆందోళన చెందడం వంటి అంశాలు యాంగ్జైట్ టీకి దారితీస్తున్నాయి. దీనికి తోడు వైరస్ అనంతర పరిణామాల్లో సామాజిక సమస్యలుగా పరిగణించే ఉపాధి కోల్పోవడం, ఆర్థికంగా దెబ్బతినడం వంటి అంశాలూ యువతలో ఒత్తిడికి కారణమవుతున్నాయి. ఈ ఒత్తిడి అధిక రక్తపోటుకూ, గుండె వేగం పెరుగుదలకూ, గుండె లయ మార్పుచెందడానికి దోహదపడుతున్నాయి. ఇవన్నీ గుండె, రక్తప్రసరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని దెబ్బతీయడం ద్వారా యువతలో చాలా చిన్నవయసులోనే గుండెపోట్లకు దారితీస్తున్నాయి. ♦ దీనికి తోడు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి అంశాలూ,ఇంకా కొనసాగుతున్న వర్క్ఫ్రమ్ హోమ్ వంటి పని అలవాట్లు యువతలో వ్యాయామలేమిని పెంచడంతో పాటు... రాత్రి తగినంతగా నిద్రలేకుండా పనిచేయడాన్ని పెంపొందిస్తున్నాయి. ఈ నిద్రలేమి కూడా యువతలో గుండెపోట్లకు ఓ ప్రధాన కారణమే. ♦ వీటన్నింటికి తోడు మనలో ఒత్తిడినీ, యాంగ్జైట్ టీని పెంచే మరో అంశం కూడా ఉంది. నిజానికి తగిన సమయానికి కోవిడ్ వ్యాక్సిన్ రావడం వల్ల చాలా మరణాలు నివారితమయ్యాయి. పెద్దసంఖ్యలో జనం రక్షణ పొందారు. కానీ ఇటీవల పెరిగిన గుండెపోట్లను వ్యాక్సిన్తో ముడిపెడుతూ చాలా వదంతులు వెలువడుతున్నాయి. మానసిక ఒత్తిడిని పెంచడానికి ఇవీ కారణమవుతున్నాయి. నిజానికి ఈ గుండెపోట్లకూ, వ్యాక్సిన్ కూ సంబంధం ఉన్నట్లుగా ఏ విధమైన ఆధారాలూ ఇప్పటివరకు వెలువడలేదు. వీటిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. ♦ గుండెపోటుతో మృతి చెందినవారిలో నిర్దిష్ట కారణాలు కనుగొనేందుకు పోస్ట్మార్టమ్ అవసరం. యుక్తవయసు గుండెపోట్లను నివారించాలంటే...? ♦ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి. క్రమంతప్పకుండా అలాగే శరీరానికి మితిమీరిన శ్రమకలిగించకుండా చేసే వ్యాయామాలు, మంచి ఆహారపు అలవాట్లు, పొగతాగడం, మద్యం వంటి అలవాట్ల నుంచి దూరంగా ఉండడంపై ప్రజల్లో అవగాహన పెంచాలి. నష్టనివారణ కోసం ఎలాంటి పరీక్షలు అవసరమంటే...? ఇటీవల హఠాత్తుగా గుండెపోట్ల పెరుగుదల అన్నది ఇటు డాక్టర్లను, అటు సామాజికవేత్తలనూ బెంబేలెత్తిస్తోంది. దేశ ఆర్థికాభివృద్ధి, పురోగతికి కారణమైన యువత ఇలా అకస్మాత్తుగా మృతి చెందడం కుటుంబాలకే కాదు, దేశానికీ నష్టమే. అందుకే గుండెపోటు మరణాల పట్ల తగినంత అవగాహన, విషయపరిజ్ఞానం, మున్ముందు రాబోయే ఇక్కట్ల నుంచి తమను రక్షించుకునేలా చేయించుకోవాల్సిన తగిన వైద్యపరీక్షల వంటి అంశాల్లో నివారణ ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న వయసువారైనప్పటికీ, తమలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారు తప్పనిసరిగా గుండె పరీక్షలు అంటే... ఈసీజీ, 2డీ ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ వంటివి డాక్టర్లు చెప్పిన విధంగా తగిన ఇంటర్వెల్స్లో చేయించుకోవాలి. ఇవేగాక ప్రాథమిక పరీక్షలైన బీపీ చెక్ అప్, కొలెస్ట్రాల్ స్థాయుల్ని తెలిపే రక్త పరీక్షలు, చక్కెర మోతాదు పరీక్షలు చేయించుకుని, డాక్టర్లు చెప్పిన విధంగా మందులు, జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ ప్రాణాలను కాపాడే సీపీఆర్ (కార్డియో పల్మునరీ రిససియేషన్)వంటివి అందరూ నేర్చుకోవాలి. దీనివల్ల అకస్మాత్తు గుండెపోటు మరణాలను చాలావరకు నివారించవచ్చు. ఈ సీపీఆర్పై సాధారణ ప్రజలందరికీ శిక్షణ ఇవ్వాలి. ♦ ఇక ప్రజలు ఎక్కువగా తిరగాడే కొన్ని కీలకమైన ప్రదేశాల్లో, కూడళ్లలో, సెంటర్లలో డీ–ఫిబ్రిలేటర్లను (ఆగిపోయిన గుండెను మళ్లీ స్పందించేలా చేసే ఉపకరణాలు) అమర్చాలి. గుండెపోటు ముప్పును తెచ్చిపెట్టే అంశాలేమిటంటే? మన దేశంలోని యువతలో ఇటీవల ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, కొవ్వు పదార్థాల వినియోగంలో పెరుగుదల... ఫలితంగా బరువు పెరగడం ఓ ప్రధాన ముప్పు. ♦ చాలా తక్కువ వయసులోనే గుండెపోటు ముప్పునకు కారణమయ్యే స్థూలకాయం, హైబీపీ (హైపర్టెన్షన్), మధుమేహం (డయాబెటిస్) పెరుగుదల కూడా మరో కారణం. ఒకప్పుడు ఈ తరహా జీవనశైలి సమస్యలు చాలా పెద్ద వయసువారిలోనే కనిపించేవి. కానీ ఇటీవల ఇవి చిన్నవయసు వారిలోనూ వస్తున్నట్లే... దీని చిట్టచివరి ప్రమాదకరమైన ఫలితమైన గుండెపోట్లూ యువతలో పెరుగుతున్నాయి. ♦ ఇటీవల యువత చేపడుతున్న వృత్తులన్నింటిలోనూ కదలకుండా కూర్చుని చేసే పనులే ఎక్కువగా ఉంటున్నాయి. కనీస కదలికలు కూడా కొరవడటం (సెడెంటరీ) అనే జీవనశైలి వల్ల ఈ ముప్పు యువతలో మరింతగా పెరుగుతోంది. ♦ ఈ అంశాలన్నీ కలగలసి చాలా చిన్నవయసులోనే గుండెపోటు ముప్పును తెచ్చిపెడుతున్నాయి. - డా. ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
ప్రఖ్యాత గాయని సంధ్యా ముఖర్జీ కన్నుమూత
కోల్కతా: ప్రముఖ గాయని, బంగ బిభూషణ్ సంధ్యా ముఖర్జీ(91) కోల్కతాలో మంగళవారం రాత్రి 7.30 గంటలకు గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందారు. ఎస్.డి.బర్మన్, నౌషద్, సలీల్ చౌదరి తదితరుల సంగీత దర్శకత్వంలో హిందీ, బెంగాలీ భాషల్లో ఎన్నో మధురైన పాటలు పాడిన సంధ్యా ముఖర్జీ దశాబ్దాలపాటు అభిమానులను అలరించారు. సంధ్యా ముఖర్జీ మృతిపట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సంతాపం ప్రకటించారు. చదవండి: (యాంకర్ శ్రీముఖి పెళ్లి చేసుకోనుందా? ఆ ఫోటోతో సర్ప్రైజ్) -
పద్మ పురస్కారాలు మాకొద్దు.. మేం తీసుకోం
న్యూఢిల్లీ: తమకు ప్రకటించిన పద్మ పురస్కారాలను పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ, ప్రముఖ నేపథ్య గాయని సంధ్యా ముఖర్జీ తిరస్కరించారు. పద్మభూషణ్ అవార్డు స్వీకరించేందుకు తాను సిద్ధంగా లేనని బుద్ధదేవ్ చెప్పినట్టు సీపీఎం తెలిపింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి పురస్కారాలు తీసుకోరాదన్నది తమ పార్టీ విధానమని స్పష్టం చేసింది. తాము ప్రజల కోసం పనిస్తామని, అవార్డుల కోసం కాదని ప్రకటించింది. గతంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ నాయకుడు ఇఎంఎస్ నంబూద్రిపాద్కు ‘పద్మ’ పురస్కారాన్ని ప్రకటించగా.. ఆయన దానిని తిరస్కరించారని సీపీఎం వెల్లడించింది. 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వ హయాంలో తనకు ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డును నంబూద్రిపాద్ నిరాకరించారు. దేశాన్ని అవమానించడమే.. గులాం కావాలనుకోవడం లేదు పద్మభూషణ్ను తిరస్కరించడం ద్వారా భట్టాచార్జీ దేశాన్ని అవమానించారని, బీజేపీ నాయకురాలు ప్రీతి గాంధీ అన్నారు. పద్మ అవార్డులు ఏ ఒక్క పార్టీకి లేదా సిద్ధాంతానికి చెందినవి కాదని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందిస్తూ.. ‘ఆయన ఆజాద్గా ఉండాలనుకుంటున్నారు. గులాం అవ్వాలను కోవడం లేద’ని వ్యాఖ్యానించారు. (చదవండి: కొందరు కావాలనే అలా చేశారు: గులాం నబీ ఆజాద్) అవమానంగా ఉంది.. అవార్డు వద్దు: సంధ్యా ముఖర్జీ నేపథ్య గాయని సంధ్యా ముఖర్జీ కూడా పద్మశ్రీ పురస్కారాన్ని నిరాకరించినట్లు పీటీఐ తెలిపింది. ఆలస్యంగా ఎంపిక చేసినందుకు ఆమె అవార్డును వద్దనుకున్నట్టు సమాచారం. ‘90 సంవత్సరాల వయస్సులో సుమారు ఎనిమిది దశాబ్దాల పాటు స్వర ప్రస్థానం సాగించిన సంధ్యా ముఖర్జీకి ఇంత ఆలస్యంగా పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం ఆమెను కించపరచడమేన’ని ఆమె కుమార్తె సౌమీ సేన్గుప్తా అన్నారు. అవార్డును తిరస్కరించడం వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. ఆ దశను ఎప్పుడో దాటాను: అనింద్య ఛటర్జీ ప్రముఖ తబలా విద్వాంసుడు పండిట్ అనింద్య ఛటర్జీ కూడా పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించినట్టు వెల్లడించారు. అవార్డు కోసం తన సమ్మతిని కోరుతూ ఢిల్లీ నుండి తనకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు ప్రతికూలంగా స్పందించినట్టు ‘పీటీఐ’కు తెలిపారు. ‘పద్మ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించాను. నాకు అవార్డు ఇవ్వాలని అనుకున్నందుకు ధన్యవాదాలు చెప్పాను. నా కెరీర్లో ఈ దశలో పద్మశ్రీని అందుకోవడానికి సిద్ధంగా లేనని.. ఆ దశను ఎప్పుడో దాటాన’ని అన్నారు. కాగా, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ‘పద్మ’ అవార్డులు ప్రకటించింది. నలుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మ భూషణ్, 107 మంది పద్మశ్రీకి ఎంపికయ్యారు. (చదవండి: బిపిన్, ఆజాద్లకు పద్మవిభూషణ్..) -
కోవిడ్ ఎప్పుడు అంతమవుతుందో తెలుసా? మరి ఇవి తెలుసుకోండి
కోవిడ్ పాండమిక్ వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటివరకు కోవిడ్ ఇంకా ఎన్ని రోజులు ఉండొచ్చు అనే విషయం పూర్తిగా తెలియటం లేదు. అయితే ఈ కోవిడ్ అనేక కొత్త విపత్తులకు దారి తీయవచ్చనేది మాత్రం ప్రస్ఫుటం. ఇందులో ప్రమాదకరమైనవి డయాబెటిస్, గుండె జబ్బుల పెనుముప్పులు. ఇవి ఎందుకు రాబోతున్నాయి, వీటిని నివారించటం ఎలా అనే విషయాలపై అవగాహన కోసమే ఈ కథనం. డయాబెటిక్ ముప్పు పెరగడమెందుకు? ఇప్పటికే మన దేశాన్ని డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. అంటే మధుమేహంలో ప్రపంచ రాజధాని అన్న (అప)కీర్తి మనదే. భారతదేశంలో 7.7 కోట్లకు పైగా డయాబెటిక్ రోగులు ఉన్నారని అంచనా. గణాంకాల ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అత్యధికమైన సంఖ్య. అంతేకాదు... ఇక్కడ సుమారు 50 శాతం మందికి షుగర్ జబ్బు ఉన్నప్పటికీ ఆ విషయం నిర్ధారణ కాకుండా ఉంటారని అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో ఇది సుమారు 60 శాతం కావచ్చు. కోవిడ్ వచ్చినవాళ్లల్లో అనేకమందికి హాస్పిటల్లో చేరిన సందర్భంలో షుగర్ బయటపడింది. అయితే వీళ్లకి కోవిడ్ వల్ల షుగర్ వచ్చిందా లేక డయాబెటిస్ ఉన్నా ఆ విషయం తెలియక కోవిడ్ వచ్చినప్పుడు బయట పడిందా అన్నది స్పష్టంగా తెలియలేదు. ఇంతకుముందు చాలా రకాల వైరల్ న్యుమోనియాలలో షుగర్ కొత్తగా రావడం డాక్టర్లకు తెలిసిన విషయమే. సార్స్ – 1 లో కూడా డయాబెటిస్ కొత్తగా రావటం గమనించారు. కోవిడ్ –19 లోనూ మధుమేహం కొత్తగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకుల అంచనా. దీనికి అనేక కారణాలున్నాయి. మొదటిగా సార్స్ సీవోవీ–2 వైరస్ శరీరంలో ప్రవేశించడానికి ఉపయోగించుకునే ఏసీఈ–2 రిసెప్టార్లు ప్యాంక్రియాస్లోనూ ఉంటాయి. కాబట్టి ఊపిరితిత్తులను పాడు చేసినట్లుగానే ఈ వైరస్ ప్యాంక్రియాస్ను కూడా ప్రభావితం చేయగలుగుతుంది. కోవిడ్ –19 రావటం అనేది శరీరానికి ఒక స్ట్రెస్. ఇన్ఫెక్షన్తో కూడిన ఈ ఒత్తిడి వల్ల మధుమేహం రావడం అనేది ఇప్పటికే తెలిసిన అంశం. ఇవి మాత్రమే కాకుండా కోవిడ్ – 19 చికిత్సకోసం స్టెరాయిడ్స్ వాడటం కొన్నిసార్లు అవసరం. వాటితో రక్తంలో షుగరు పెరగవచ్చు. చాలామందికి స్టెరాయిడ్స్ ఆపేసిన తర్వాత షుగర్ నార్మల్కి వచ్చేస్తుంది. కొంతమందికి మాత్రం స్టెరాయిడ్స్ ఆపేశాక కూడా షుగర్ అధికంగానే ఉంటుంది. డయాబెటిస్ కి దోహదం చేస్తున్న కోవిడ్ ఇన్–అప్రాప్రియేట్ బిహేవియర్ మనం కరోనా నివారణకు కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ పాటించాలన్న విషయం తెలిసిందే. అంటే.. కోవిడ్ జాగ్రత్తలతో పాటు మంచి పుష్టికరమైన ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం లాంటివి కూడా కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్లోకి వస్తాయి. ఈ సందర్భంగా కొన్ని అనవసరమైన జాగ్రత్తలూ, మరికొన్ని అజాగ్రత్తల వల్ల షుగర్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ అవుతుంది. కోవిడ్ సాకుతో వ్యాయామం చేయటం పూర్తిగా ఆగిపోయింది. బలమైన ఆహారం తీసుకుంటే కోవిడ్ ని ఎదుర్కోవడానికి శరీరంలో మంచి శక్తి వస్తుందని చెప్పటంతో... కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారం తీసుకోవడం మొదలైంది. ఇలాంటి ఆహారంతో ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఏమేరకు ఉందో తెలియకపోయినా, బరువు పెరగటం జరుగుతోంది. దాంతో కోవిడ్ రిస్క్ తగ్గకపోగా ఊబకాయంతో వచ్చే రెండు అనర్థాలు కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది కోవిడ్ –19 వల్ల కలిగే ప్రమాదపు అవకాశాలు పెరగడం, రెండోది బరువు పెరిగిన కారణంగా షుగర్ జబ్బుకి దగ్గరవడం. గుండెజబ్బుల పెనుముప్పు కోవిడ్ జబ్బుకి మన రెస్పాన్స్ వల్ల రాబోతున్న మరొక సమస్య గుండెజబ్బుల అనర్థం. గుండె జబ్బుల చికిత్సల కోసం ఆసుపత్రులకు వెళ్లే వాళ్ల సంఖ్య కోవిడ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో తక్కువగానే ఉన్నప్పటికీ, కేసులు తగ్గిపోయే సమయానికి గుండెజబ్బులతో ఆస్పత్రికి వెళ్లే వాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీనికి అనేక కారణాలున్నాయి. మొదటిగా కోవిడ్లో షుగర్ పెరగటం, వ్యాయామం తగ్గడం, ఊబకాయం బాగా పెరిగిపోవడం... వంటి అంశాలన్నీ గుండె జబ్బులకి కూడా దోహదం చేస్తున్నాయి. మానసిక ఒత్తిడి పెరగటం కోవిడ్ పాండమిక్ వల్ల అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయాయి. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం, దుకాణాలు మూత పడటం, శ్రమించినా ఉపాధి పొందే అవకాశాలు సన్నగిల్లడంతో ప్రజలు విపరీతమైన ఒత్తిడికి గురయ్యారు. ఆర్థికంగానూ, మానసికంగానూ, సామాజికంగానూ ఒక అభద్రతా భావం ప్రజల్లో నిండిపోయింది. ప్రతిరోజూ బంధువులను, తెలిసినవాళ్ళ లోనూ దుర్వార్తలు వినాల్సి రావటం, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల లోనూ భయోత్పాతాలు కలిగించే వార్తలు ఎక్కువగా వెలువడటంతోనూ భవిష్యత్తు పట్ల ఒక తెలియని భయం నెలకొంది. ఇక కోవిడ్ బారినపడి హాస్పటల్లో చేరాల్సి వచ్చిన వాళ్ల పరిస్థితి మరీ దయనీయం. భౌతిక దూరం సామాజిక దూరంగా మారిపోవడంతో ఒంటరితనం అందరినీ కలచివేసింది. చెక్ అప్లు తగ్గడం కోవిడ్ సందర్భంగా హాస్పిటల్ కి వెళ్లడానికి ప్రజల్లో విపరీతమైన భయం ఏర్పడింది. దాంతో క్రమం తప్పకుండా చేయించుకునే పరీక్షలు దాదాపు అందరూ వాయిదా వేశారు. దీనివల్ల చాలామందిలో బీపీ పెరిగిపోవడం, షుగర్ నియంత్రణలో లేకపోవడం సాధారణమైంది. దురలవాట్లు పెరగడం లాక్డౌన్ నిబంధనలు సడలించగానే మద్యం అలవాటు మళ్లీ బాగా పెరిగిపోయింది. మద్యం వల్ల రక్తపోటు పెరగడం, దానివల్ల గుండె మీద ఒత్తిడి పెరగడం కూడా జరుగుతుంది. దీంతోపాటు క్రమబద్ధమైన పరీక్షలూ, వైద్య పర్యవేక్షణ లేకపోవడంతో మద్యం, పొగతో కలిగే అనర్ధాలు బయటపడటం లేదు. గుండె జబ్బులు వచ్చిన వాళ్లు ఎక్కువగా మృత్యువాత పడటం గుండె జబ్బు వచ్చిన తర్వాత కూడా ఆ విషయం తెలియకుండా ఆస్పత్రికి వెళ్ళడానికి భయపడి, ఇంటి దగ్గరే వైద్యం తీసుకోవడానికి ప్రయత్నం చేసి, సమయం బాగా మించిపోయాక... అప్పుడు ఆస్పత్రికి వెళ్ళేవాళ్లు చాలామంది ఉన్నారు. గుండె జబ్బు వచ్చిన మొదటి ఆరు గంటల లోపులో సరైన వైద్యం అందక పోతే ప్రాణానికి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ పాండమిక్లో ఈ విధమైన ఆలస్యం వల్ల అనేక మందికి గుండె పూర్తిగా పాడైపోవడం జరిగింది. ఒకసారి గుండె పంపింగ్ బలహీనం అయిపోయిన తర్వాత ఎంత అత్యాధునికమైన వైద్యం అందించినప్పటికీ సాధారణంగా గుండె మళ్లీ పూర్వ స్థితికి వచ్చే అవకాశం ఉండదు. గుండె పంపింగ్ బలహీనంగా ఉన్న వాళ్లకి ప్రాణహాని జరిగే అవకాశం నిత్యం పొంచి ఉంటుంది. ప్రస్తుతం బయటకు సునామీలా కనపడుతున్న కోవిడ్ పాండమిక్ గురించే అందరూ ఆలోచిస్తున్నారు. కానీ అదే సమయంలో చాప కింద నీరులా కమ్ముకు వస్తున్న మధుమేహం, గుండె జబ్బుల్ని ముందే గుర్తించి, నివారించడానికి చర్యలు చేపట్టకపోతే రానున్న రోజులో భారీ మూల్యమే చెల్లించవలసి వస్తుంది. ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే ఆ అనర్థాలను నివారించుకునే అవకాశమూ ఇంకా ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామం కరోనా గాలిలో వ్యాప్తి చెందుతుంది అన్న భయంతో బయట నడవడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. ఆరు బయట ప్రాంతాల్లోనూ మైదానాల్లోనూ నడిచేటప్పుడు కరోనా వచ్చే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ ఇంటి బయటకి వెళ్ళటానికి అవకాశం లేకపోతే ఇంట్లోనే అనేక రకాల వ్యాయామాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లో వ్యాయామానికి సంబంధించిన పనిముట్లు ఇప్పుడు తక్కువ ఖర్చుతో కూడా దొరుకుతున్నాయి. అసలు ఏ విధమైన పనిముట్లు అవసరం లేకుండా కూడా అనేకమైన వ్యాయామాలు ఇంట్లో చేసుకోవచ్చు. వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం వల్ల బరువు పెరగకుండా ఉండవచ్చు. బరువు ఎక్కువ ఉన్న వాళ్లకి కరోనా వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అన్న విషయం కూడా మనకు తెలిసిందే. ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు బలమైన ఆహారం తీసుకుంటే కోవిడ్ వచ్చే అవకాశం తక్కువగా ఉండకపోవచ్చు కానీ కోవిడ్ ని ఎదుర్కొనే అవకాశం మెరుగ్గా ఉంటుంది. ఇది నిజమే. కానీ బలమైన ఆహారం అంటే ఆహారం చాలా ఎక్కువ పరిమాణంలో తీసుకోవాలని కాదు. మాంసకృత్తులు, విటమిన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిదే కానీ అదే సమయంలో నూనె వస్తువులు, కొవ్వు పదార్థాలు, రెడీమేడ్ ఆహారాలు, జంక్ఫుడ్ వంటివి ఎక్కువగా తీసుకోవడం ప్రమాదం అనే విషయం మర్చిపోకూడదు. పిండి పదార్థాలు కొవ్వు పదార్థాలు రెండూ అధికంగా ఉండే ఆహారం వల్ల మధుమేహంతో పాటు గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మధుమేహం ఉన్నవారు అన్ని రకాల తాజా పండ్లు తీసుకోవచ్చు కానీ ఇవి భోజనంలో భాగంగా తీసుకోవాలి తప్ప భోజనం తర్వాత మరీ ఎక్కువగా తీసుకున్నట్లయితే కావలసిన కేలరీల కన్నా ఎక్కువ కేలరీలు శరీరంలో చేరే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది అని అనేక పరిశోధనల్లో తేలింది. మెడిటేషన్తో కూడా స్ట్రెస్ బాగా తగ్గుతుంది. స్నేహితులకు బంధువులకు ఫోన్ లో టచ్లో ఉండటం, నెగిటివ్ న్యూస్ కి దూరంగా ఉండటం కూడా మానసిక ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడతాయి. ఆత్మీయతా, ఆధ్యాత్మికతా, స్థితప్రజ్ఞతా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మూడు ముఖ్యమైన మార్గాలు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవడం అనేక ఆసుపత్రుల్లో ఆన్లైన్ కన్సల్టేషన్ లు అందుబాటులోకి వచ్చాయి. ఇంట్లోనే బీపీ, షుగర్ పరీక్ష చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా వైద్యుల్ని సంప్రదించి మందులు క్రమబద్ధంగా వాడినట్లయితే రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉండే అవకాశం ఎక్కువ. అదేవిధంగా కొలెస్ట్రాల్ మోతాదును తెలుసుకోవడానికి రక్త పరీక్షలు ఇంటికి వచ్చి చేసే వాళ్ళు ఇప్పుడు నగరాల్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి కొలెస్ట్రాల్ లెవెల్స్ తెలుసుకున్న తర్వాత వాటిని వైద్యుల సలహాతో నియంత్రించవచ్చు. ఈ ముప్పులను నివారించాలంటే ఏం చేయాలి? మధుమేహం, గుండె జబ్బులు పెద్దసంఖ్యలో రావడం తప్పనిసరిగా జరిగి తీరుతుందని కాదు. వీటిని నివారించుకోవడానికి సమయమింకా మించిపోలేదు. వీటిని ఎదుర్కోవాలంటే మన జీవన విధానంలో పూర్తిగా మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. ఈ మార్పులను సరైన విధంగా తీసుకురాగలిగితే మనం అనేక ప్రాణాలను కాపాడగలుగుతాం. వ్యసనాలకు దూరంగా ఉండటం ఒత్తిడి అధికంగా ఉండటం ఉన్నప్పుడు వ్యసనాలకి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. వ్యసనమేదైనా అది మానసిక ఒత్తిడిని పెంచుతుంది కానీ ఎప్పటికీ తగ్గించదు కాబట్టి ఈ పాండమిక్ తరుణంలో వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే అంతా ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. పొగ తాగటం వల్ల గుండె జబ్బు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని మర్చిపోకూడదు. డా. ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
డిజీవిన్నర్ను సన్మానించనున్న ప్రధాని మోదీ
-
5 చట్టాలకు రాష్ట్రపతి ప్రణబ్ ఆమోదం
-
కుటుంబసభ్యులతో రాష్ట్రపతిని కలిసిన కేసీఆర్
-
వేదాల ప్రచారంతో శాంతి పరిడవిల్లుతుంది
-
స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానం
-
ఆధ్యాత్మికానందం
శ్రీవారితో పాటు పద్మావతీ అమ్మవారిని, కపిలేశ్వరుడిని దర్శించుకున్న ప్రణబ్ముఖర్జీ టీటీడీ ఆతిథ్యానికి పులకించిన ‘దాదా’ అన్ని కార్యక్రమాల్లో పాలుపంచుకున్న గవర్నర్, సీఎం తిరుమల: రాష్ట్రపతి తిరుమల పర్యటనలో భాగంగా ఆధ్యాత్మిక ఆనందం పొందారు. ఆయన శ్రీవారితో పాటు తిరుచానూరు పద్మావతీ అమ్మవారిని, తిరుపతిలోని కపిలేశ్వర స్వామిని దర్శించుకుని పరవశించారు. ఈ సందర్భంగా టీటీడీ చేసిన ఘనమైన ఏర్పాట్లతో ప్రణబ్ ముఖర్జీ పరవశించి ఆనందంగా తిరుగుప్రయాణమయ్యారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈవో దొండపాటి సాంబశివరావు నేతృత్వంలో తిరుమలలో జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, తిరుపతిలో జేఈవో పోలా భాస్కర్ బృందాలు వేర్వేరుగా ఏర్పాట్లు చేశాయి. విమానం దిగిన తర్వాత తిరుచానూరుకు చేరుకున్నప్పటి నుంచి రాష్ట్రపతితోపాటు గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబుకు ఎక్కడా కూడా చిన్నలోటులేకుండా ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం, ఆ తర్వాత కపిలేశ్వర స్వామి దర్శనం, తిరుమలకు చేరుకున్న తర్వాత అతిథిగృహంలో లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశారు. ధరించేందుకు పట్టువస్త్రాల నుంచి తిరిగి వెళ్లే సమయంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల వరకు అన్నీ కూడా ముందస్తుగానే సిద్ధం చేశారు. ఉత్తరాది వంటకాల వడ్డింపు రాష్ట్రపతి పర్యటన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీటీడీ ఆ మేరకు ఆహార ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించింది. రాష్ట్రపతి, గవర్నర్, సీఎంకు వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతికి ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం ఆయన వ్యక్తిగత వ ంటమనిషి (చెఫ్) ఉత్తరాది వంటకాలు సిద్ధం చేశారు. ఇక గవర్నర్, సీఎంకు టీటీడీ తయారు చేసిన పదార్థాలు వడ్డించారు. ఇదే తరహాలో వారి వెంట వచ్చిన మంత్రులు, సీఎస్, డీజీపీతోపాటు రాష్ట్రపతి భవన్, రాజ్భవన్, సీఎం పేషీ అధికార యంత్రాంగానికి సకల సదుపాయాలు సమకూర్చారు. టీటీడీ, రెవెన్యూ, విజిలెన్స్, పోలీసుల సమన్వయం టీటీడీ, రెవెన్యూ, విజిలెన్స్, పోలీసు విభాగాలు గతంలో ఎన్నడూ లేనివిధంగా సమన్వయ సహకారంతో పనిచేశాయి. అన్ని విభాగాలను, అధికారులందరినీ ఒకే తాటిపై తీసుకురావటంలో టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు పర్యవేక్షణలో టీటీడీ విభాగాలు, కలెక్టర్ సిదార్థ్జైన్, అనంతపురం రేంజ్ డీఐజీ సత్యనారాయణ, తిరుపతి అర్బన్జిల్లా ఎస్పీ గోపీనాథ్జెట్టి పర్యవేక్షణలో రెవెన్యూ, పోలీసు విభాగాలు పనిచేశాయి. సీవీఎస్వో నాగేంద్రకుమార్ పర్యవేక్షణలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది విధులు పంచుకుని సమర్థవంతంగా పనిచేశారు. రాష్ర్టపతి పర్యటన తీర్థయాత్ర మొత్తం ఏడున్నర గంటలు సాగింది. ఉదయం 10.30 గంటలకు తిరుపతి విమానాశ్రయం దిగిన తర్వాత తిరిగి సాయంత్రం 5 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. భక్తులకు 4 గంటలపాటు దర్శనం నిలిపివేత ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సామాన్య భక్తులతోపాటు రూ.300 టికెట్ల భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించలేదు. సుమారు నాలుగుగంటల తర్వాత స్వామివారి దర్శనానికి అనుమతించారు. మధ్యాహ్నం 12 గంటలకే ఆలయం వద్ద ఏ ఒక్క భక్తుడు రాకుండా చూసుకున్నారు. ఆలయంలో కల్యాణోత్సవం ముగిసిన తర్వాత కూడా వారికి దర్శనం కల్పించి, వెలుపలకు పంపారు. ఆలయ ప్రాంతంలోనూ భక్తులను కట్టడి చేశారు. సమష్టిగా పనిచేశారు : టీటీడీ ఈవో కితాబు టీటీడీతోపాటు రెవెన్యూ, పోలీసు విభాగాలు సమష్టిగా పనిచేశాయని ఈవో దొండపాటి సాంబశివరావు మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వ ప్రోటోకాల్ నిబంధనలు, భద్రతా కారణాలను కూడా పరిగణలోకి తీసుకుని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే ఏర్పాట్లు చేశామన్నారు. -
ఎస్బీహెచ్ నికరలాభం 91% అప్
గత 3 నెలల్లో రూ.300 కోట్ల ఎన్పీఏల అమ్మకం ఈ ఏడాది వ్యాపారంలో 12 శాతం వృద్ధి అంచనా తెలంగాణలో 42 శాతం వ్యవసాయ రుణాలు రోలోవర్ హుదూద్ ప్రాంత రుణగ్రహీతల కోసం ప్రత్యేక పథకం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపారం కన్నా లాభాలపైనే ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక వ్యాపారంలో ఎటువంటి వృద్ధి నమోదు చేయకుండానే నికరలాభంలో 91% వృద్ధిని ఎస్బీహెచ్ నమోదు చేయడం విశేషం. గతేడాది ఇదే కాలానికి రూ. 163 కోట్లుగా ఉన్న నికరలాభం ఇప్పుడు రూ.311 కోట్లకు చేరింది. మంగళవారం సాయంత్రం ఆర్థిక ఫలితాలను వెల్లడించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్బీహెచ్ మేనేజింగ్ డెరైక్టర్ శాంతను ముఖర్జీ మాట్లాడుతూ లాభాలను పెంచుకోవడం కోసం అధిక వడ్డీరేట్లు ఉన్న డిపాజిట్లను వదిలించుకోవడంతో పాటు, తక్కువ వడ్డీరేట్లు ఉన్న రుణాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. గత ఆరు నెలల్లో అధిక వడ్డీలు ఉన్న 6,000 కోట్ల బల్క్ డిపాజిట్లను వదిలించుకున్నామని, దీంతో డిపాజిట్ల వృద్ధిలో క్షీణత నమోదయ్యిందన్నారు. ఈ విధానం అనుసరించడం ద్వారా గత మూడేళ్లలో నమోదు చేయని విధంగా నికర వడ్డీ ఆదాయం 16% వృద్ధి చెందిందన్నారు. గతేడాది రూ. 945 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ ఏడాది రూ. 1,095 కోట్లకు పెరిగిందని, నికర వడ్డీ మార్జిన్లు 3.09% నుంచి 3.17 శాతానికి పెరిగాయని చెప్పారు. ఇదే సమయంలో వ్యాపారం రూ.2.18 లక్షల కోట్ల నుంచి రూ. 2.19 లక్షల కోట్లకు మాత్రమే పెరిగిందని, ఈ ఏడాది వ్యాపారంలో 12% వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇంకా కార్పొరేట్ రుణాలకు డిమాండ్ పెరగలేదని, చివరి త్రైమాసికం నుంచీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కాని డిమాండ్ పెరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. తగ్గుతున్న నిరర్థక ఆస్తులు నిరర్థక ఆస్తులు తగ్గించుకోవడంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు ముఖర్జీ తెలిపారు. ఇందులో భాగంగా నిరర్థక ఆస్తులను విక్రయించడం, రుణాల్ని పునర్ వ్యవస్థీకరిస్తున్నట్లు చెప్పారు. గడచిన మూడు నెలల కాలంలో రూ.300 కోట్ల ఎన్పీఏలను అసెట్ రీ కన్స్ట్రక్షన్ కంపెనీల (ఆర్క్స్)కు విక్రయించడం జరిగిందని, అలాగే వన్టైమ్ సెటిల్మెంట్ కింద రూ. 75 కోట్ల ఎన్పీఏలను వదిలించుకున్నట్లు తెలిపారు. ఇవి కాకుండా సుమారు మరో రూ. 300 కోట్ల కార్పొరేట్ రుణాలను పునర్వ్యవస్థీకరించారు. ఇక నికర ఎన్పీఏలు 3.37 శాతం నుంచి 2.87 శాతానికి తగ్గాయి. గత 3 నెలల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో కొత్త ఎన్పీఏలు నమోదు కాలేదని, ఇకపై కూడా ఇదే విధంగా ఉంటుందన్న ఆశాభావాన్ని ముఖర్జీ వ్యక్తం చేశారు. 75% వ్యవసాయ రుణాల రోలోవర్ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రుణాల రోలోవర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ప్రస్తుతం 42 శాతం రుణాలను రోలోవర్ చేసినట్లు ముఖర్జీ తెలిపారు. రుణ మాఫీ పథకంలో భాగంగా మొదటి దశ కింద తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ.6,000 కోట్లు చెల్లించదన్నారు. ఇందులో ఎస్బీహెచ్ వాటా రూ.965 కోట్లుగా ఉందన్నారు. నవంబర్ నెలాఖరునాటికి 75 శాతం రుణాలను రోలోవర్ అవుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి నిధులు రాలేదని, దాంతో అక్కడ రోలోవర్ మొదలవ్వలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హూదూద్ తుఫాన్లో దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని ఆదుకునే విధంగా కొత్త పథకాన్ని తీసుకురావడంపై ఆర్బీఐతో చర్చలు జరుపుతున్నట్లు ముఖర్జీ తెలిపారు. చిన్న వ్యాపారస్థులు తీసుకున్న రుణాలు చెల్లింపుపై మారిటోరియం లేదా ఉత్తారఖండ్ తరహాలో విడతల వారీగా రుణాలు చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
దాదా సూచనలు