Nagasaki
-
చరిత్రలో మాయని మచ్చలు..
జపాన్లోని హిరోషిమా నగరంపై 1945 ఆగస్టు 6న, నాగసాకిపై ఆగస్టు 9న అమెరికా జారవిడిచిన అణుబాంబులు సుమారు 2 లక్షలకుపైగా పౌరులను బలి తీసు కున్నాయి. ఇవి చరిత్రలో మాయని మచ్చలు, అతిపెద్ద దుస్సంఘటనలు. అయినా దేశాలు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు. ఒక్క క్షణంలో ప్రపంచాన్ని భస్మీ పటలం చేసే అణ్వాయుధాలను పోగేస్తూనే ఉన్నాయి.‘స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ (సిప్రి) 2024 నివేదిక, అమెరికా వద్ద 5,044 అణ్వా యుధాలు ఉన్నట్టు తెలిపింది. అదే నివేదిక ప్రకారం, రష్యా దగ్గర 5,580, ఫ్రాన్స్ దగ్గర 290, చైనా దగ్గర 500, బ్రిటన్ దగ్గర 225, భారత్ దగ్గర 172 అణ్వాయుధాలు ఉన్నాయి. పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ కూడా అణుసంపత్తిని కలిగి ఉన్నాయి. పైగా ఈ దేశాలన్నీ తమ అణ్వాయుధాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. చైనా దగ్గర గతేడాది 410 ఉండగా, ఇప్పుడది 500కు చేరింది. యుద్ధాల కారణంగా ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, రాజకీయ దౌత్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో అణ్వస్త్రాల పాత్ర ప్రముఖంగా మారిందని ‘సిప్రి’ రిపోర్ట్ పేర్కొన్నది.అణ్వాయుధాలతో పాటు ఆయుధాలు కూడా ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేవే. ప్రపంచంలో ఆయుధాలు ఎగుమతి చేస్తున్న దేశాలలో అమెరికా అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇక ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉన్నది. భారత్ అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా రష్యా కొనసాగుతున్నది. భారత దిగుమతులలో రష్యా వాటా 36 శాతం. ఆయుధాల దిగుమతుల్లో మొదటి ఐదు స్థానాల్లో ఇండియా, సౌదీ అరేబియా, ఖతార్, ఉక్రెయిన్, పాకిస్తాన్ ఉన్నాయి. రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయిల్–పాలస్తీనా యుద్ధాలు కొనసాగుతున్న వేళ అణ్వాయుధాల భయం మళ్లీ పెరిగింది. ఆయా దేశాలు రక్షణ పేరుతో ఆయుధాలు పెంచుకుంటూ పోవడం ఆయుధ పోటీకి దారి తీస్తున్నది. – నర్సింగు కోటయ్య, మిర్యాలగూడ -
‘శవాలదిబ్బ’ : ఆ మారణహోమానికి 79 ఏళ్లు
హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు జరిగి నేటికి (ఆగష్టు 6, 2024) 79 ఏళ్లు. ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసిన తీరని విషాదం. జపాన్లో 1945 ఆగస్ట్లో జరిగిన అణు బాంబు పేలుళ్లతో హిరోషిమాలో లక్షా 40వేల మంది, నాగసాకిలో 74వేల మందిని బలి తీసుకున్న ఉదంతం. ప్రపంచంలోనే తొలి అణు బాంబు దాడిగా పేరొందిన ఈ దాడుల ధాటికి విలవిల్లాడిన జపాన్ శత్రు దేశాలకు లొంగిపోవడంతో 1945 ఆగస్ట్ 14న రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. హిరోషిమా డే సందర్భంగాఈ ఘటనకు సంబంధించిన కొన్ని ప్రత్యేక సంగతులు..!1945 ఆగష్టు 6న జపాన్లోని హిరోషిమా నగరంపై అమెరికా అణు బాంబు జారవిడిచింది. ఎనోలా గే అనే అమెరికన్ B-29 బాంబర్, జపాన్ నగరం హిరోషిమాపై "లిటిల్ బాయ్" అనే అణు బాంబును జారవిడిచింది. ఈ బాంబు పేలిన కాసేపట్లోనే 5 చ.కి.మీ. పరిధిలోని ప్రాంతం నాశనమైంది. 80 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 35 వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాలు, రేడియన్ ప్రభావంతో వేలాదిమంది చనిపోయారు. మరో మూడు రోజులకు అంటే ఆగస్టు 9న నాగసాకి నగరంపై అమెరికా మరో భారీ అణుబాంబుతో దాడి చేసింది. హిరోషిమా అంటే జపనీస్ బాషలో విశాలమైన దీవి. దీవుల సమాహారమైన జపాన్లోని అతిపెద్ద దీవిలో ఉన్న పెద్ద నగరం హిరోషిమాపై యురేనియం-235తో తయారు చేసిన “లిటిల్ బాయ్”, నాగసాకిపై ప్లూటోనియంతో తయారుచేసిప “ఫ్యాట్ మ్యాన్” అనే అత్యంత పవర్పుల్ బాంబును ప్రయోగించింది.‘ఎనోలా గే’ అనే విమానం బరువు 9 వేల పౌండ్లు, పొడవు 10 అడుగులు. ఈ బాంబు నేలను తాకడానికి ముందే, 1750 అడుగుల ఎత్తులోనే పేలింది. ఈ దాడికి ముందు హిరోషిమా జనాభా దాదాపు 3.4 లక్షలు కాగా, తర్వాత అది 1.37 లక్షలకు పడిపోయిందంటే ఈ విధ్వంసాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా జపాన్లో ఐదు నగరాలను ఎంచుకుంది. కోకురా, హిరోషిమా, యోకోహామా, నీగాటా ,క్యోటో. ఈ దాడులకు యునైటెడ్ కింగ్డమ్ సమ్మతించింది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పురాతన రాజధాని పట్ల అప్పటి సెక్రటరీ ఆఫ్ వార్ హెన్రీ స్టిమ్సన్కు ఉన్న అభిమానం కారణంగా క్యోటో తప్పించుకుంది. దానికి బదులుగా, నాగసాకి నగరం బలైంది. ఈ బాంబు పేలుళ్లలో బతికి బయటపడిన వారిని హిబాకుషా అంటారు. పేలుళ్ల ప్రభావంతో ఏర్పడిన రేడియేషన్, విషవాయువులు ప్రభావంతో బాధితుల మానసిక వేదన, బాధలు వర్ణనాతీం. అణ్వాయుధాల వినాశకరమైన ప్రభావాన్ని కళ్లకు కట్టిన మారణహోమం.ఇపుడు అణుయుద్ధం జరిగితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఉత్తర, దక్షిణ అమెరికా ఘర్షణలు మధ్య ఇపుడు అణు యుద్ధం జరిగితే ఎంతమంది చనిపోవచ్చు? అనేది ప్రధానంగా వినిపించే ప్రశ్న. అణు సంఘర్షణ ప్రభావాలను అధ్యయనం చేస్తూ సంవత్సరాలు గడిపిన జర్నలిస్ట్ అన్నీ జాకబ్సెన్ అంచనాల ప్రకారం అణు యుద్ధం ప్రారంభమైన 72 నిమిషాల్లోనే దాదాపు ఐదు బిలియన్ల మంది ప్రజలు చనిపోతారు.రేడియేషన్ ప్రభావం అత్యంత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఓజోన్ పొర చాలా దెబ్బతింది కనుక అణువిస్ఫోటనాలు జరిగితే ఊహకందని విధ్వంసమే. అణుయుద్ధం నుండి బతికిన వారికి ఆహారం లభించదు. ఆకలితో అలమటించి. పోషకాహార లోపంతో కృంగి కృశించి ప్రాణాలొదులుతారు. -
ఊహించని పరిస్థితుల్లో నాగసాకిపై అణుబాంబు? అమెరికా అసలు ప్లాన్ ఏమిటి?
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా.. జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేసింది. ఈ ఘటన జరిగి 78 ఏళ్లు దాటింది. అయినప్పటికీ విధ్వంసానికి సంబంధించిన గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి. అమెరికా తొలిసారిగా 1945, ఆగస్టు 6న జపాన్లోని హిరోషిమా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని అణుబాంబు వేసింది. ఈ బాంబు పేలుడు నగరంలోని 13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ విధ్వంసం సృష్టించింది. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత అంటే ఆగష్టు 9న జపాన్లోని నాగసాకి నగరంపై మరో అణుబాంబు వేసి జపాన్కు అమెరికా తన సత్తా ఏమిటో చూపించింది. దీంతో జపాన్ అగ్రరాజ్యానికి లొంగిపోవాల్సి వచ్చింది. నిజానికి నాగసాకిపై అమెరికా దాడి చేయాలని నిర్ణయించుకోలేదు. నాగసాకిపై అణుబాంబు వేయడం అత్యంత విచిత్ర పరిస్థితిలో జరిగింది. బాంబుకు ‘ఫ్యాట్ మ్యాన్’ పేరు 1945, ఆగష్టు 8 రాత్రి గడిచిపోయింది. అమెరికన్ బీ-29 సూపర్ఫోర్రెస్(విమానం)లోని బాంబర్ బాక్స్లో బాంబు లోడ్ చేశారు. ఈ బాంబు పెద్ద పుచ్చకాయ మాదిరిగా ఉంది. దీని బరువు 4050 కిలోలు. విన్స్టన్ చర్చిల్ను ఉద్దేశించి ఈ బాంబుకు ‘ఫ్యాట్ మ్యాన్’ అని పేరు పెట్టారు. ఈ బాంబు లక్ష్యం పారిశ్రామిక నగరం కోకురా. ఈ జపాన్లోని ఈ నగరంలోనే పలు మందుగుండు సామగ్రి తయారీ కర్మాగారాలు ఉన్నాయి. 1945, ఆగస్టు 9, ఉదయం 9.50.. ఈ సమయంలో కోకురా నగరంపైన 31,000 అడుగుల ఎత్తులో బీ-29 విమానం ఎగురుతోంది. ‘ఫ్యాట్ మ్యాన్’ ను ఈ ఎత్తు నుంచి కిందకు వదలాలని నిర్ణయించారు. అయితే ఇంతలో కోకురా మీద మబ్బులు కమ్ముకున్నాయి. దీనికితోడు కింద యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్లతో కాల్పులు జరుగుతున్నాయి. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో.. ఇంతలో బీ-29లోని ఇంధనం క్షీణిస్తోంది. వెనక్కి వెళ్లేందుకు సరిపడా ఇంధనం మాత్రమే విమానంలో మిగిలివుంది. ఈ ఆపరేషన్ను నిర్వహించే బాధ్యత గ్రూప్ కెప్టెన్ లియోనార్డ్ చెషైర్ చేపట్టారు. ఈ సంఘటన తరువాత అతను మాట్లాడుతూ ‘మేము ఉదయం తొమ్మిది గంటలకు విమానం టేక్ ఆఫ్ చేశాం. మేము ప్రధాన లక్ష్యమైన కోకురా చేరుకున్న సమయంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఇంతలో ఆ బాంబును విడిచిపెట్టాలంటూ మాకు సమాచారం వచ్చింది. అయితే కోకురాపై మేఘాలు ఉండటంతో నాగసాకి నగరం మీది గగనతలానికి చేరుకున్నాం. ఆ తర్వాత సిబ్బంది ఆటోమేటిక్ బాంబు డ్రాపింగ్ ఎక్విప్మెంట్ని యాక్టివేట్ చేయడంతో కొద్ది క్షణాల్లోనే ఆ భారీ బాంబు భూమిపైకి వేగంగా దూసుకువెళ్లింది. ఆలోచనకు అవకాశం లేకుండా.. కేవలం 52 సెకన్లలో ఈ బాంబు భూమి ఉపరితలం నుంచి 500 అడుగుల ఎత్తులో పేలింది. 11:02 కాగానే బాంబు పేలింది. బాంబు పేలిన వెంటనే భగభగ మండుతున్న ఒక భారీ నిప్పు బంతి పైకి ఉబికిలేచింది. ఆ బంతి పరిమాణం పెరుగుతూ నగరం మొత్తాన్ని ఆక్రమించింది. నగరంలోని ప్రజలకు ఏం జరుగుతున్నదనే ఆలోచనకు అవకాశం లేకుండానే వారంతా మృత్యువాత పడ్డారు. నాగసాకి చుట్టూ పర్వతాలు ఉన్నాయి. దీని కారణంగా కేవలం 6.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విధ్వంసం జరిగింది. నాగసాకిలో జరిగిన ఈ దాడిలో 74 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. హిరోషిమాలో జరిగిన దాడిలో లక్షా 40 వేల మందికి పైగా ప్రజలు మరణించారు. ఇది కూడా చదవండి: తాలిబాన్తో చెలిమి వెనుక చైనా ఎత్తుగడ ఏమిటి? -
ఒపెన్హైమర్తో మన అనుబంధం
జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు జారవిడిచి 78 ఏళ్లు అవుతోంది. ఆధునిక యుగంలో ఇంతటి విధ్వంసకరమైన ఘటన మరోటి చోటుచేసుకోలేదంటే అతిశయోక్తి కాదు. రెండో ప్రపంచయుద్ధం నాటి ఈ ఘటనపై లెక్కలేనన్ని పుస్తకాలు, డాక్యుమెంటరీలు, సినిమాలు వచ్చాయి. తాజాగా ప్రదర్శితమవుతున్న ‘ఒపెన్ హైమర్’ చిత్రం కూడా ఈ కోవకు చెందినదే. మన్హాటన్ ప్రాజెక్టులో భాగంగా తయారైన అణుబాంబులు, వాటి సృష్టికర్త జె.రాబర్ట్ ఒపెన్ హైమర్ ఇతివృత్తంతో సాగుతుంది ఈ సినిమా. ఒపెన్హైమర్కు ఉన్న భగవద్గీత, సంస్కృత జ్ఞానం ఆయనపై భారతదేశంలో ఆసక్తి పెరిగేందుకు కారణమయ్యాయి. భారతదేశ ఆధ్యాత్మికత పట్ల ఆరాధన కంటే కూడా ఈ దేశంతో ఆయనకున్న సంబంధం మరింత లోతైనది. జర్మనీలో పుట్టి అమెరికాలో సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తగా ఎదిగిన ఒపెన్ హైమర్ను అణుబాంబు పితామహుడని కూడా అంటారు. ఒపెన్హైమర్కు ఉన్న భగవద్గీత, సంస్కృత జ్ఞానం ఆయనపై భారతదేశంలో ఆసక్తి పెరిగేందుకు కారణమయ్యాయి. భారతదేశ ఆధ్యాత్మికత పట్ల ఆయనకు ఉందని చెబుతున్న ఆరాధన కంటే కూడా ఈ దేశంతో ఆయనకున్న సంబంధం మరింత లోతైనది. దీన్ని 20వ శతాబ్దంలో ఆధునిక భౌతిక శాస్త్రం అభివృద్ధి నేపథ్యంలో చూడాలి. విశ్వం మొత్తానికి ఆధారమైన, మౌలికమైన కణాలపై అధ్య యనం సాగిన కాలం అది. అణు కేంద్రకం దాంట్లోని భాగాలను అర్థం చేసుకునే అణు భౌతికశాస్త్ర అభివృద్ధి కూడా ఈ కాలంలోనే వేగం పుంజుకుంది. అణుశక్తితోపాటు అణుబాంబుల తయారీకి దారితీసిన పరిశోధనలివి. ఈ కాలపు భారతీయ శాస్త్రవేత్తలు కూడా చాలామంది ఈ అణు భౌతిక శాస్త్ర రంగంలో కృషి చేశారు. దేబేంద్ర మోహన్ బోస్ (ఇతడి విద్యార్థిని బిభా చౌధురి), మేఘనాథ్ సాహా, సత్యేంద్రనాథ్ బోస్, హోమీ జహంగీర్భాభా, దౌలత్సింగ్ కొఠారీ, పియారా సింగ్ గిల్ వంటి మహామహులు వారిలో కొందరు మాత్రమే. వీరు ఆధునిక భౌతికశాస్త్రంలో పేరెన్నికగన్న వూల్ఫ్గాంగ్ పౌలీ, నీల్స్ బోర్, లార్డ్ రూథర్ఫర్డ్, పాల్ డైరాక్, ఎన్రికో ఫెర్మీ, ఎర్నెస్ట్ ష్రోడింగర్, జేమ్స్ చాద్విక్, జాన్ కాక్క్రాఫ్ట్, హిడెకీ యుకవాలతో కలిసి పని చేయడం లేదా వారితో సంబంధబాంధవ్యాలను కలిగి ఉండటం కద్దు. భాభాతో సంబంధం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఖగోళ వికిరణాలపై పరిశోధనలు చేస్తున్న సమయంలోనే హోమీ భాభాకు ఒపెన్ హైమర్ (కేంబ్రిడ్జ్లో సీనియర్. తరువాతి కాలంలో బెర్క్లీలో పనిచేశారు) గురించి ఒక అవగాహన ఉండింది. 1936లో భాభా, వాల్టర్ హైట్లర్ ఉమ్మడిగా ఖగోళ వికిరణ జల్లు (కాస్మిక్ రే షవర్స్) సిద్ధాంతాన్ని ప్రతిపాదించగా, ఒపెన్ హైమర్ ఓ ఏడాది తరువాత దాదాపుగా అలాంటిదే స్వతంత్రంగా ప్రతిపాదించారు. అప్పట్లో భాభాకు పాశ్చాత్యదేశాల్లోని గొప్ప భౌతిక శాస్త్రవేత్తలతో సంబంధాలు ఉండేవి. ఒకానొక దశలో 1940లో తనను ఒపెన్ హైమర్కు పరిచయం చేయాల్సిందిగా భాభా తన మిత్రుడు పౌలీని కోరారు. ఇద్దరూ కలిసి బెర్క్లీలో పరిశోధనలు చేయాలన్నది ఉద్దేశం. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో భాభా భారత్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. భౌతికశాస్త్ర మౌలికాంశాలపై పరిశోధనలు చేసేందుకు ఓ సంస్థను స్థాపించే అవకాశమూ అప్పుడే లభించింది. తరువాతి కాలంలో భాభాకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో కలిసి భారతీయ అణుశక్తి కార్యక్రమాన్ని సిద్ధం చేసి అమలు చేసే అవకాశమూ దక్కింది. అణు రియాక్టర్ నిర్మాణానికి, యురేనియం శుద్ధికి అవసరమైన ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని భాభా తనకు పాశ్చాత్య దేశాల్లో ఉన్నసంబంధాల ద్వారానే సంపాదించగలిగారు. ప్రిన్స్టన్ , కావెండిష్ వంటి ప్రసిద్ధ సంస్థల తరహాలో టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) స్థాపనకూ బాబా అంతర్జాతీయ సహ కారం అందేలా రూఢి చేసుకున్నారు. అయితే 1945లో హిరోషిమా, నాగసాకి లపై అణుబాంబులు పడిన తరువాత రాబర్ట్ ఒపెన్ హైమర్ వివాదాస్పద వ్యక్తి అయ్యారు. అయినా టీఐఎఫ్ఆర్లో పరిశోధకుల బృందాన్ని తయారు చేసే విషయంలో భాభా ఆయన సాయం తీసుకున్నారు. ఒపెన్ హైమర్ విద్యార్థి, ఆయనతో కలిసి మన్హాటన్ ప్రాజెక్టులో పనిచేసిన బెర్నార్డ్ పీటర్స్కు ఉద్యోగమిచ్చారు. అప్పట్లో ప్రిన్స్టన్లో పనిచేస్తున్న ఒపెన్ హైమర్ సోదరుడు ఫ్రాంక్ ఒపెన్ హైమర్కూ ఉద్యోగం ఆఫర్ చేశారు భాభా. రాబర్ట్ను సంప్రదించిన తరువాతే ఫ్రాంక్కు ఉద్యోగం ఇవ్వజూపినట్లు చరిత్రకారులు చెబు తారు. ఈ అణుశక్తి కార్యక్రమ ఏర్పాటుకు ఫ్రెంచ్ నోబెల్ గ్రహీత ఫ్రెడెరిక్ జోలియోట్ క్యూరీ సలహాలు కూడా నెహ్రూ స్వీకరించారు. పరోక్ష ప్రేరణ ఒపెన్ హైమర్పై విమర్శలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో భాభా చేసిన కొన్ని నియామకాలపై నిరసన వ్యక్తమైంది. ఒపెన్ హైమర్కు కమ్యూనిస్టులతో ఉన్న గత సంబంధాలపై కూడా వివాదాలు తలె త్తాయి. ఒపెన్ హైమర్ కూడా తన మాజీ విద్యార్థి పీటర్స్ను కమ్యూ నిస్టు సానుభూతిపరుడిగా అభివర్ణించారు. దీంతో పీటర్స్ భారత్కు రావడం కష్టమైంది. ఎలాగోలా వచ్చిన తరువాత టీఐఎఫ్ ఆర్లో అతడిపై ఇంకోసారి దుమారం రేకెత్తింది. ఇంకోవైపు ఫ్రాంక్ ఒపెన్ హైమర్ కూడా అమెరికా ప్రభుత్వం పాస్పోర్టు ఇచ్చేందుకు నిరాకరిం చడంతో భారత్కు రాలేకపోయారు. అయితే అమెరికాలో రాబర్ట్ ఒపెన్ హైమర్ మాత్రం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్సుడ్ స్టడీస్ (ఐఏఎస్) డైరెక్టర్గా కొనసాగుతూ భారతీయ శాస్త్రవేత్తలు చాలామందికి మార్గదర్శకుడిగా వ్యవహరించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్లో యువ భౌతిక శాస్త్రవేత్తగా ఉన్న అల్లాడి రామకృష్ణన్ కు ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఏడాది స్కాలర్షిప్ మంజూరు చేయడం మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే.అల్లాడి భారత్కు తిరిగి వచ్చాక ఐఏఎస్ లాంటి సంస్థను స్థాపించాలని ఆశించారు. ఈ ఆలోచనే తరువాతి కాలంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్గా 1962లో మద్రాస్లో ఆవిష్కృతమైంది. భారత్కు తరచూ... ఆ కాలంలో స్వల్పకాలిక పర్యటనపై భారత్కు విచ్చేసే విదేశీ శాస్త్రవేత్తల్లో ఒపెన్ హైమర్ పేరు తరచూ వినిపించేది. పీసీ మహాల నోబిస్ ఆలోచనల రూపమైన ‘షార్ట్ విజిట్స్ ఆఫ్ సైంటిస్ట్ ఫ్రమ్ అబ్రాడ్’లో భాగంగా ఒపెన్ హైమర్తో పాటు నీల్స్ బోర్, నార్బెర్ట్ వీనర్, పీఎంఎస్ బ్లాకెట్, జోసెఫ్ నీధమ్, జేబీఎస్ హాల్డేన్ లాంటి మహామహులు భారత్కు వచ్చిపోయేవారు. వీరికి పంపే ఆహ్వాన పత్రికలపై నెహ్రూ స్వయంగా సంతకాలు చేసేవారు. ఇందులో చాలామంది నెహ్రూకు తెలుసు. 1945 అనంతర ఒపెన్ హైమర్ నైతిక దృక్కోణాన్ని నెహ్రూ బహిరంగంగా ప్రశంసించారు. 1959లో భారత జాతీయ సైన్్స కాంగ్రెస్ సమావేశాల ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ, ఒపెన్ హైమర్ భగవద్గీత నుంచి స్ఫూర్తి పొందారని ఉల్లేఖించారు. పరి శోధనలు, ఆవిష్కరణలకు కూడా సామాజిక విపరిణామాలు ఉంటా యన్న విషయాన్ని పెద్ద శాస్త్రవేత్తలు గుర్తించేందుకు ఇది ఉపయోగ పడాలన్నారు. హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు ప్రయోగంతో రెండో ప్రపంచ యుద్ధం నాటకీయంగా ముగిసింది. ఈ ఘటన అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య అణ్వాయుధ పోటీకి దారితీసింది. అదే సమయంలో అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నాలూ మొదలయ్యాయి. వలసవాద శకం ముగిసిన తరువాత అణుశక్తిని శాంతియుత, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వాడుకోవడమన్న అంశం భారత్ లాంటి దేశాలకు ప్రధాన పరిశోధన ఇతివృత్తమైంది. ఈ నవతరం సైన్స్ ను అభివృద్ధి చేయడం భారత్కు ప్రథమ కర్తవ్యమైంది. అణుశక్తిని విద్యుదుత్పత్తికి ఉపయోగించుకుంటామని భారత్ పలుమార్లు స్పష్టం చేసింది. అయితే 1964లో చైనా అణుబాంబును పరీక్షించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పదేళ్ల తరువాత భారత్ కూడా పోఖ్రాన్–1తో అణ్వస్త్ర దేశాల జాబితాలో చేరిపోయింది. కానీ భగవద్గీతకు నెలవైన భారత్ అణు మార్గం పట్టడాన్ని ఒపెన్ హైమర్ మాత్రం చూడలేకపోయారు! దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
హిరోషిమా అణుబాంబు విషయమై పుతిన్ కీలక వ్యాఖ్యలు... షాక్లో ఫ్రాన్స్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో సంభాషించారు. ఆ సంభాషణలో జపాన్ అణుబాంబు దాడుల గురించి ప్రస్తావించినట్లు సమాచారం. పుతిన్ మరోసారి అణుదాడుల గురించి సంభాషించడం దిగ్భ్రాంతి గురి చేసిందని యూకే స్థానిక మీడియా డైలిమెయిల్ పేర్కొంది. అదీగాక పుతిన్ అవసరమైతే ఉక్రెయిన్పై వ్యూహాత్మక అణుదాడులు చేస్తానంటూ బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో పుతిన్ సంభాషిస్తూ...1945లో జపాన్లోని హిరోషిమాపై అమెరికా తన మొదటి అణుబాంబును వేసిన మూడు రోజుల తర్వాత యూఎస్ జపాన్లోని నాగసాకిని లక్ష్యంగా చేసుకున్న విషయాన్ని పునురుద్ఘాటించారు. జపాన్ లొంగిపోయేలా రెండో ప్రపంచ యుద్ధం ముగిసేలా జరిపిన బాంబు దాడులు గురించి మాట్లాడారు. అలాగే తాము గెలవాలంటే ప్రధాన నగరాలపై దాడిచేయాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా అణు దాడికి రెడీ అనే సంకేతాన్ని ఇచ్చారు. అంతేగాదు మాక్రాన్తో పుతిన్ కీవ్ని వదిలేసి తూర్పు ఉక్రెయిన్లో వ్యూహాత్మక అణుదాడి చేసే అవకాశం ఉందనే సంకేతం ఇచ్చారని డెయిల్ మెయిల్ పేర్కొంది. కానీ రష్యా పదేపదే తన నియంత్రణలో ఉ్నన ఖేర్సన్ ప్రాంతంపై డర్టీ బాంబు ప్రయోగించనుందంటూ ఆరోపణలు చేస్తోంది. ఐతే ఉక్రెయిన్ విదేశంగ మంత్రి డిమిట్రో కులేబా రష్యా తాను చేస్తున్న కుట్రని ఇతరులు చేస్తున్నట్లుగా చిత్రీకరించడం అలవాటు అంటూ మండిపడ్డారు. (చదవండి: దాడులను తీవ్రతరం చేసిన రష్యా...బలవంతంగా ఉక్రెయిన్ పౌరుల తరలింపు) -
చిన్నారిని వీపుకి తగిలించుకున్న బాలుడెవరో తెలుసా!
చిన్నారిని వీపుకి తగిలించుకుని నుడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక బాలుడు. అతన్ని చూసిన ఒక సైనికుడు ఆ చిన్నారిని కిందకి దించి వెళ్లిపో అన్నాడు. ఐతే ఆ బాలుడు చెప్పిన మాటలు ప్రపంచ గతిని మార్చే చక్కటి సందేశం ఇచ్చాడు. ఇంతకీ ఆ బాలుడెవరు ఏంటా కథ! వివరాల్లోకెళ్తే... ఒక చిన్నారిని వీపుకి తగిలించుకుంటూ వెళ్తున్న బాలుడి చిత్రాన్ని డిసెంబర్ 30 2017న వాటికన్ప్రెస్ తర పత్రికలో ప్రచురించింది. ఇది నాగసాకిపై అణుదాడి తర్వాత జరిగిన పరిణామాల ఫోటోలలో ఒకటి ఇది. జపాన్ యుద్ధ సమయంలో దాదాపు 10 ఏళ్ల బాలుడు చనిపోయిన తన తమ్ముడిని ఖననం చేసేందుకు వీపుకి తగలించుకుని వెళ్తున్నాడు. అప్పుడూ అక్కడే ఉన్న ఒక సైనికుడు ఆ చిన్నారి చనిపోయాడు కాబట్టి ఇక్కడ వదిలి వెళ్లిపోమని సలహ ఇచ్చాడు. ఆ బాలుడు ఆ చిన్నారిని మోసుకుని వెళ్లలేక నీరసించిపోతాడని అలా చెబుతాడు సైనికుడు. కానీ ఆ చిన్నారి తన తమ్ముడని, ఇది తనకు బరువు కాదని చెబుతాడు. పడిపోతే సాయం చేయండి, ఎత్తండి, తప్పు చేస్తే క్షమించండి అని ఏడుస్తూ చెబుతాడు. ఐనా ఆ చిన్నారి బరువుగా ఉండడు కాబట్టి మీ భుజాలపైకి తీసుకుని సాయం చేయండి అని అర్థిస్తాడు. ఆ బాలుడి మాటలకు సైనికుడి కళ్లలో నీళ్లుతిరుగతాయి. అప్పటి నుంచి ఈ చిత్రం జపాన్లో ఐక్యతకు చిహ్నంగా మారింది. ఈ చిత్రాన్ని యూఎస్కి చెందిన మెరైన్ కార్ప్స్ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రోజర్ ఓడొనెల్ తన కెమారాలో బంధించారు. 1945లో హిరోషిమా, నాగసాకిపై అణు బాంబు దాడుల తర్వాత దృశ్యాలను డాక్యుమెంట్ చేసే బాధ్యతను ఓడొనెల్కు అప్పగించడంతో ఆయన ఈ చిత్రాన్ని తీశారు. ఆ ఫోటో వెనుక పోప్ ఫ్రాన్సిస్ 'ది ఫ్రూట్ ఆఫ్ వార్' అని రాసి సంతకం చేశారు. నాటి విషాధ ఘటన ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఇచ్చిదనడంలో సందేహం లేదు. (చదవండి: దాడులను తీవ్రతరం చేసిన రష్యా...బలవంతంగా ఉక్రెయిన్ పౌరుల తరలింపు) -
అణు ఆయుధాలను నిషేధించండి: జపాన్
టోక్యో: అణుఆయుధాలను నిషేధించాలని జపాన్దేశం మరోసారి ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. అగ్రరాజ్యం అమెరికా జపాన్లోని రెండు ముఖ్య నగరాలైన హిరోషిమా, నాగాసాకిలపై అణుబాంబుతో దాడి చేసిన సంగతి తెలిసిందే. నాగసాకి నగరంపై దాడి జరిగి ఆదివారం నాటికి(ఆగస్టు 9) 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆదివారం నాగసాకి పీస్ పార్క్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికార యంత్రాంగంతో పాటు పౌరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాగసాకి నగర మేయర్ టొమిహిమ టావ్ శాంతి సందేశాన్ని ఇచ్చారు. అణుఆయుధాలను నిషేధించాలని మేము విజ్ఞప్తి చేస్తుంటే.. అమెరికా, రష్యాలు మాత్రం అణుఆయుధాల శక్తిని పెంచుకుంటున్నాయని ఆరోపించారు. (లిటిల్ బాయ్ విధ్వంసం.. టార్గెట్ హిరోషిమానే ఎందుకు?) 2017లో ఏర్పాటు చేసిన అణుఆయుధాల నిషేధ ఒప్పందంపై సంతకాలు చేయాలని ఆయన ప్రపంచ దేశాలతోపాటు, జపాన్ ప్రభుత్వఅధికారులను కోరారు. జపాన్ ప్రధాని షింజో అబే మాట్లాడుతూ.. అణుఆయుధాల ట్రీటీ ఒప్పందాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. అణుఆయుధాలు తయారు చేస్తున్న రాష్ట్రాలు, అణురహిత రాష్ట్రాలు కూడా దీనికి మద్దతు ఇవ్వవని ఆయన అన్నారు. రష్యా, అమెరికా దేశాలు తమ దగ్గర ఉన్న అణ్వాయుధాలను తగ్గించుకోవాలని కోరారు. న్యూక్లియర్ ప్రొలిఫిరేషన్ ట్రీటీ అమల్లోకి వచ్చి 50 ఏళ్లు గడిచినా దానిని ఎవరూ పాటించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా 1945 ఆగస్టు 6,9 తేదీలలో జరిగిన అణుబాంబు దాడిలో 1,40,000 మంది చనిపోయారు. మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు అణుబాంబుల దాడితో ఆగస్టు 15న జపాన్ యుద్ధం నుంచి వెనక్కి తగ్గడంతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. (అణుబాంబు విలయానికి 75 ఏళ్లు) -
అణుబాంబు విలయానికి 75 ఏళ్లు
సెకను కాలంలో శరీరం అయిపులేకుండా కాలి బూడిదైంది ఎప్పుడు? ఏళ్లు గడుస్తున్నా ఆ ఒక్క రోజు నాటి స్మృతులు చెరిగిపోనిది ఎక్కడ? ఈ మూడు ప్రశ్నలకు సమాధానం భూమ్మీద రెండే చోట్ల తెలుస్తాయి. అవే హిరోషిమా, నాగసాకి! జపాన్లోని ఈ నగరాల్లో అణుబాంబు విలయం సంభవించి 75 ఏళ్లు అవుతోంది! మానవాళిపై చెరగని మచ్చగా మిగిలిన ఆ మహోత్పాతం ఆనుపాను మరోసారి.... రెండో ప్రపంచ యుద్ధం పరిసమాప్తం కావడానికి హిరోషిమా, నాగసాకిలపై అమెరికా వేసిన అణుబాంబులు కారణమయ్యాయని చరిత్ర చెబుతోంది. 1945 ఆగస్టు ఆరున హిరోషిమాపై ఆ తరువాత మూడు రోజులకు అంటే ఆగస్టు తొమ్మిదిన నాగసాకిపై అణుబాంబులు పడ్డాయి. ఈ రెండు ఘటనల్లో అక్కడికక్కడ మరణించిన వారి సంఖ్య సుమారు 1.40 లక్షలు అని అంచనా. బాంబు పడ్డ ప్రాంతాల నుంచి కిలోమీటర్ చుట్టుపక్కల ఉన్న వారందరూ సెకన్ల వ్యవధిలో మాడి మసైపోగా రేడియోధార్మికత ప్రభావం కారణంగా కేన్సర్ల బారినపడ్డవారు.. తరతరాలుగా ఇతర సమస్యలు అనుభవిస్తున్న వారు కోకొల్లలు. ఆగస్టు తొమ్మిదిన ఉదయం 11.02 గంటలకు ఫ్యాట్మ్యాన్ పేరుతో నేలజారిన అణుబాంబు దాదాపు 6.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని భవనాలన్నింటినీ నేలమట్టం చేసిందంటే 22 కిలోటన్నుల అణుబాంబు సృష్టించే విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. (లిటిల్ బాయ్ విధ్వంసం.. టార్గెట్ హిరోషిమానే ఎందుకు?) బాంబు పడిన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు నాలుగు వేల డిగ్రీల సెల్సియస్కు చేరుకోగా.. కొన్ని రోజుల పాటు ఆ ప్రాంతంలో రేడియో ధారి్మకత వర్షంలా కురిసింది. నాగసాకిలో అణుబాంబు తాకిడికి వైద్యులు, నర్సులు ప్రాణాలు కోల్పోవడంతో కొంత కాలంపాటు ఆ ప్రాంతంలో గాయపడ్డ వారికి చికిత్స అందించే వారు కూడా కరువయ్యారు. దాడి తరువాత తమవారిని వెతుక్కునేందుకు సంఘటన స్థలానికి వచ్చిన వారిలోనూ అత్యధికులు రేడియోధార్మికత బారినపడ్డారు. కనీస చికిత్స లేకుండానే చాలామంది మరణించారు కూడా. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రేడియో ధార్మికత ప్రభావంతో ఆ ప్రాంతంలో కొన్నేళ్లపాటు రక్త కేన్సర్ల బారిన పడే వారి సంఖ్య ఎక్కుంది. దశాబ్దకాలం తరువాత మిగిలిన వారిలో థైరాయిడ్, ఊపిరితిత్తులు, రొమ్ము కేన్సర్ల బారిన పడగా.. చాలామంది గర్భిణులకు గర్భస్రావం జరిగింది. రేడియోధార్మికత బారినపడ్డ పసిపిల్ల శారీరక, మానసిక ఎదుగుదల సమస్యలతో బాధపడ్డారు. ఇప్పటికీ వాటి దుష్ఫలితాలను అనుభవిస్తున్నారు కూడా. అయితే ఈ అణు విధ్వంసం మంచి విషయానికి పునాది వేసింది. ప్రపంచంలో ఏమూలనైనా ఇలాంటి ఉత్పాతం మరొకటి చోటు చేసుకోకుండా అణ్వ్రస్తాలపై నిషేధానికి కారణమైంది. ఆనాటి విధ్వంసాన్ని గుర్తు చేసుకునే లక్ష్యంతో ఏటా ఆగస్టు ఆరవ తేదీని హిరోషిమా డేగానూ, తొమ్మిదవ తేదీని నాగసాకి డేగానూ ఆచరిస్తున్నారు. ఆ నగరాల ఎంపికకు కారణం... అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపైనే అణుబాంబులు కురిపించేందుకు ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. 1945 జూలై 16న అమెరికా ‘మాన్హాట్టన్ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసిన తొలి అణుబాంబును విజయవంతంగా పరీక్షించింది. న్యూ మెక్సికోలోని అలొమోగోర్డో ప్రాంతంలోని ‘ట్రినిటీ’ పరీక్ష కేంద్రంలో అణు పరీక్ష విజయవంతం కావడం.. రెండో ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో తమ సత్తాను ప్రదర్శించేందుకు ఇదే సరైన సమయమని అమెరికా భావించడం అణు విధ్వంసానికి కారణమయ్యాయి. శాంతికి జపాన్ రాజు నిరాకరించడం.. యుద్ధంలో తమ సైనికుల మరణాలను తగ్గించేందుకు అణుబాంబులు ప్రయోగించడం మేలని అమెరికా భావించింది. ముందుగా కోకురా, హిరోషిమా, యుకోహామా, నీగటా, క్యోటో నగరాలపై బాంబులు వేయాలన్నది అమెరికా ప్రణాళిక. జపాన్ మిలటరీ కేంద్రంగా ఉన్న హిరోషిమా ఈ జాబితాలో ఉండగా.. నౌకాశ్రయ నగరమైన నాగసాకి మాత్రం లేదు. సాంస్కృతికంగా జపాన్కు క్యోటో చాలా ప్రధానమైన నగరం కావడం, అప్పటి అమెరికా యుద్ధ మంత్రి హెన్రీ స్టైమ్సన్కు ఆ నగరంపై మక్కువ ఉండటంతో చివరి క్షణాల్లో క్యోటో పేరు తొలగిపోయి నాగసాకి వచ్చి చేరింది. 1920 ప్రాంతంలో హెన్రీ స్టైమ్సన్ క్యోటో నగరాన్ని సందర్శించారని అక్కడే తన హనీమూన్ జరుపుకున్నారని అందుకే ఆయన అణుబాంబు దాడి నుంచి క్యోటోను మినహాయించాలని అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ను విజ్ఞప్తి చేశారని ఒక కథనం ప్రచారంలో ఉంది. 1945 జూలై 24న జపాన్పై అణుబాంబు దాడికి అధికారిక ఉత్తర్వులు వెలువడగా ఒక రోజు తరువాత క్యోటో పేరును కొట్టివేసి చేతితో నాగసాకి పేరు రాసినట్లు దస్తావేజులు చెబుతున్నాయి. నాగసాకిపైకి ‘ఫ్యాట్మ్యాన్’ను జారవిడిచిన బీ–29 సూపర్ఫోర్ట్ట్రెస్ పేరు బాక్స్కార్. హిరోషిమా కంటే కనీసం ఏడు కిలోటన్నుల ఎక్కువ సామర్థ్యమున్న బాంబును ప్రయోగించినప్పటికీ నాగసాకిలో జరిగిన విధ్వంసం సాపేక్షంగా తక్కువే. నగరం చుట్టూ పర్వత ప్రాంతాలు ఉండటంతో ఉరకామి లోయ ప్రాంతానికే నష్టం పరిమితమైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఆగస్టు తొమ్మిదిన నాగసాకిపై కాకుండా కోకురా నగరంపై దాడి జరగాల్సి ఉంది. మేజర్ ఛార్లెస్ స్వీనీ నడుపుతున్న బాక్స్కార్ కోకురాపై మూడుసార్లు చక్కర్లు కొట్టింది కూడా. అయితే బాగా మబ్బుపట్టి ఉండటం, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో స్వీనీ మిగిలిన ఒకే ఒక్క లక్ష్యమైన నాగసాకిపై బాంబు జారవిడిచారు. అణు పరిజ్ఞానంతో ప్రయోజనాలు ఎన్నో.. టెక్నాలజీ రెండువైపులా పదును ఉన్న కత్తి అని అంటారు. అణుశాస్త్ర పరిజ్ఞానం కూడా ఇందుకు అతీతమేమీ కాదు. హిరోషిమా, నాగసాకిలపై బాంబుల ద్వారా విధ్వంసం సృష్టించిన అణు పరిజ్ఞానంతో భూమ్మీద పలు చోట్ల చీకట్లను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కనీసం 30 దేశాల్లో అణుశక్తి ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతోంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం కారణంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని శాంతియుత ప్రయోజనాలకు ఎవరైనా వాడుకునే వీలేర్పడింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ఆహార భద్రతతోపాటు, మానవ ఆరోగ్యం, పర్యావరణం వంటి అనేక రంగాల్లో అణుశక్తి వినియోగం జరుగుతోంది. వ్యవసాయ దిగుబడులను పెంచేందుకు మాత్రమే కాకుండా.. ఆఫ్రికా తదితర ప్రాంతాల్లో జంతువ్యాధులను గుర్తించేందుకు అణుశక్తిని ఉపయోగిస్తున్నారు. పంట దిగుబడుల నిల్వకు భారతదేశంలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అణుశక్తి కేంద్రాల వ్యర్థాలను సమర్థంగా వాడుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా.. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ సాయంతో కేన్సర్లతోపాటు పలు ఇతర వ్యాధుల చికిత్సలో అణుధారి్మక పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఎబోలా వంటి ప్రాణాంతక వైరస్ల గుర్తింపునకూ అణుశక్తి అక్కరకొస్తోంది. సముద్రజలాల కాలుష్యాన్ని గుర్తించేందుకు మహా సముద్రాల ఆమ్లీకరణను నియంత్రించేందుకు కూడా అణువులను ఉపయోగిస్తున్నారు. హిరోషిమా, నాగసాకి అణుబాంబుల కారణంగా మరణించిన వారి సంఖ్య 1,50,000 – 2,46,000 నాగసాకిపై పడిన అణుబాంబు ‘ఫ్యాట్మ్యాన్’ ప్లుటోనియంతో తయారైంది. యురేనియంతో తయారైన ‘లిటిల్బాయ్ హిరోషిమా విధ్వంసానికి కారణం. లిటిల్ బాయ్ సామర్థ్యం 15 కిలోటన్నులు కాగా ఫ్యాట్మ్యాన్ ఇంకో ఏడు కిలోటన్నులు అధిక శక్తి గలది. అమెరికా తొలి ప్రణాళిక ప్రకారం జపాన్లోని ఐదు నగరాలపై అణుదాడి జరగాల్సి ఉంది. ఇందులో నాగసాకి లేనే లేదు. అణు బాంబులతో దాడి చేస్తున్నట్లు అమెరికా ప్లాంప్లెట్ల ద్వారా ఇరు నగరాలను ముందే హెచ్చరించింది. నాగసాకి ఉదంతం లాంటిది మరోటి జరగక్కుండా నిరోధించేందుకు ఐక్యరాజ్యసమితి అణ్వాయుధాలపై నిషేధం విధించింది. అణ్వాయుధ దాడి తరువాత హిరొషిమాలో విరబూసిన తొలి పువ్వు ఓలియాండర్. ఈ కారణంగానే ఆగస్టు ఆరున హిరోషిమా డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఓలియాండర్ మొక్కలను నాటుతారు. అణుదాడి తరువాత హిరోషిమాలోని ఓ పార్కులో వెలిగించిన శాంతి జ్యోతి 1964 వరకూ అఖండంగా వెలిగింది. -
రక్తపు వాంతులు, జుట్టంతా రాలిపోయి..
(వెబ్డెస్క్) : ఆగష్టు 6.. జపాన్తో పాటు ప్రపంచ చరిత్రలో అత్యంత విషాదభరితమైన, దుర్దినంగా నిలిచిపోయింది. జపాన్లో అతి పెద్ద దీవిగా పేరుగాంచిన హిరోషిమాలో అమెరికన్ బాంబర్ బి–29‘లిటిల్ బాయ్’సృష్టించిన విధ్వంసానికి నేటికి సరిగ్గా 75 ఏళ్లు. సామ్రాజ్య విస్తరణ కాంక్ష, దేశాల మధ్య ఆధిపత్యపు పోరు కారణంగా వేలాది మంది ఉన్నచోటే పడి చచ్చిపోయిన ఈ ఉదంతం మానవాళి చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది. జన జీవనంతో హడావుడిగా ఉన్న నగరం క్షణాల్లో శ్మశానంలా మారిపోయిన వైనం శత్రుదేశాల ప్రజల చేత కూడా కన్నీళ్లు పెట్టించింది. అయితే ఆ మహా విస్ఫోటనం అక్కడి జీవాల్ని మాత్రమే మాయం చేయగలిగింది గానీ... హిరోషిమా వాసుల ఆత్మవిశ్వాసాన్ని కాదు! గడ్డిపోచ కూడా మొలవదని భావించిన ఆ చోటు.. ఇప్పుడు ఆకాశ హార్మ్యాలు, అత్యాధునిక సదుపాయాలు, అధునాతన రహదారులు, నియాన్ దీపాల వెలుగుజిలుగులతో ‘నక్షత్రాల దీవి’లా అలరారుతోంది. నేటికీ జపాన్ ఆర్థిక నిర్మాణంలో అతి ముఖ్యమైన నగరంగా ఉనికిని చాటుకుంటోంది. కాలంతో పోటీపడి.. వినాశనానికి ‘విశ్వాసం’తో సమాధానం చెప్పి సగర్వంగా నిలబడింది. భవిష్యత్ తరాలు బాగుండాలని.. ఒక తరం చేసిన సాహసం, త్యాగాల ప్రతిఫలంతో మానవతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అణుబాంబు దాడి చేయడానికి హిరోషిమాను ఎంచుకోవడానికి గల కారణం? అసలు ఆరోజు ఏం జరిగింది? ఎంత మంది చనిపోయారు? అణుబాంబు దాడి తదనంతర పరిణామాలేమిటి? అన్న అంశాలను పరిశీలిద్దాం. టార్గెట్ హిరోషిమానే ఎందుకు? జపాన్లో ఉన్న 6,852 దీవుల్లోని అతి పెద్ద దీవి ఇది. హిరోషిమా అంటే వెడల్పైన దీవి అని అర్థం. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. ప్రాచీన కాలం నుంచే వాణిజ్య కేంద్రగా భాసిల్లింది ఈ దీవి. ఎన్నో కర్మాగారాలకు నెలవు. అంతేగాక జపనీస్ మిలిటరీ, ఆయుధ సంపత్తికి హబ్గా ఉండేది. కాబట్టి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ను అన్ని రకాలుగా దెబ్బకొట్టేందుకు అమెరికా ఈ నగరాన్ని ఎంపిక చేసుకుందని చెప్పవచ్చు. అణుబాంబు దాడికి కొన్ని రోజుల ముందే ఫైర్ బాంబింగ్ ఆపేసిన అమెరికా.. సరైన సమయం కోసం వేచి చూసింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని అంచనా వేసి తమ ప్రణాళికను పక్కాగా అమలు చేసింది. ఆగష్టు 6, 1945.. ఆరోజు ఏం జరిగింది? జపాన్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు బీ-29 బాంబర్ ఎనోలా గే.. నాలుగు టన్నుల యురేనియంతో కూడిన బాంబు లిటిల్ బాయ్ను అమెరికా హిరోషిమాపై ప్రయోగించింది. 9600 మీటర్ల ఎత్తు నుంచి నగరం నడిబొడ్డున ఉన్న అయోవి బ్రిడ్జ్ని లక్ష్యంగా చేసుకుని బాంబును జార విడిచింది. బ్రిడ్జి పైనుంచి కేవలం 600 మీటర్ల ఎత్తులో 43 సెకన్లలోనే లిటిల్ బాయ్ పేలాడు. దీంతో ఒక్కసారిగా భారీ విప్ఫోటనం సంభవించింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర అంతా సర్వనాశనమై పోయింది. మంటల(3-4 వేల డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు) ధాటికి అంతా కాలి బూడిదై పోయారు. నగరమంతా పొగతో నిండిపోయింది. విస్పోటనం తర్వాత గంట సేపటి వరకు రేడియోధార్మిక కణాల వర్షం కురుస్తూనే ఉంది. లక్షకు పైగా మరణాలు హిరోషిమాలో లిటిల్ బాయ్ విధ్వంసం ధాటికి డిసెంబరు 31, 1945 వరకు దాదాపు లక్షా నలభై వేల మంది మృతి చెందినట్లు అంచనా. నాటి నగర జనాభాలో(ఆనాటికి 3,50,000) 40 శాతం ఇది. ఘటన సంభవించిన ప్రదేశం నుంచి అర కిలోమీటర్ దూరంలో ఒక్క ప్రాణి కూడా మిగల్లేదు. నేటి వరకు బాంబు ప్రభావం వల్ల మొత్తంగా 3 లక్షల మంది మరణించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా ప్రస్తుతం హిరోషిమా జనాభా దాదాపు 12 లక్షలు. రక్తపు వాంతులు, జుట్టంతా రాలిపోయి యురేనియం తాలూకు దుష్పరిణామాల వల్ల బాంబు దాడిలో బతికి బయటపడ్డ వారి జీవితం డిసీజ్ ఎక్స్ అనే రోగంతో నరకప్రాయంగా మారింది. రక్తపు వాంతులు, జుట్టు రాలిపోవడం వంటి లక్షణాలతో దాదాపు ఆరు వారాల్లోనే చాలా మంది చనిపోయారు. మిగిలిన వాళ్లు కూడా దినదినగండంగానే వెళ్లదీశారు. వివిధ రకాల క్యాన్సర్లు, ఇతరత్రా అనారోగ్య కారణాలతో దయనీయ జీవితం గడిపారు. ప్రభుత్వం వీరి చికిత్స కోసం అనేకానేక ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టింది. రెగ్యులర్ చెకప్, ట్రీట్మెంట్తో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించింది. దాదాపు 1,36,700 మందిని హిబాకుష(బాధితులు)లను గుర్తించి సేవలు అందించింది. అయితే బాధిత కుటుంబాల నుంచి ఒత్తిడి కారణంగా 1957లో హిబాకుషాల కోసం ప్రత్యేక చట్టం వచ్చిన తర్వాతే ప్రభుత్వం ఈ మేరకు స్పందించడం గమనార్హం. అయితే ఈ రేడియేషన్ తాలూకు రోగాల ప్రభావం కనీసం వంద ఏళ్ళు ఉంటుందని అప్పటి డాక్టర్లు అంచనా వేశారు. కానీ వారి అంచనా తప్పు అని నిరూపించడానికి హిరోషిమా వాసులంతా కంకణ కట్టుకున్నారు. ఇందులో భాగంగా డిసీజ్ ఎక్స్ సోకిన వారంతా ఆటంబాంబ్ క్యాజువాలిటీ కమిషన్కి చేరుకుని స్వచ్ఛందంగా తమ శరీరాలని అప్పజెప్పి ఎన్నో ప్రయోగాల్లో పాల్గొన్నారు. కొన్ని ప్రయోగాలు వారిని శారీరకంగానే కాక, మానసికంగానూ బాధించేవి. రాబోయే తరాల క్షేమం కోసం వీటన్నిటినీ పంటి బిగువున భరించి త్యాగధనులయ్యారు. నగరమంతా ఓరెగామి ‘పేపర్ క్రేన్లు’ తమ కోరికలు నెరవేరేందుకు జపాన్ వాసులు పేపర్లు మడిచి కొంగ ఆకారంలో తయారు చేసి వాటిని ఎగురవేస్తారనే కథ ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో రెండేళ్ల వయసులో అణుబాంబు దాడి ప్రభావానికి లోనైన సడాకో సాసకి అనే బాలికకు లుకేమియా బారిన పడింది. పదేళ్ల పాటు మహమ్మారితో పోరాడిన ఆమె.. చికిత్స తీసుకుంటున్న సమయంలో మెడిసిన్ కవర్లను చుట్టి క్రేన్లు తయారు చేసేది. ఈ క్రమంలో పన్నెండేళ్ల వయసులో మరణించిన ఆ బాలికను శాంతి చిహ్నంగా భావిస్తూ నగరమంతా నేడు పేపర్ క్రేన్లు ఎగురవేస్తారు. ఇక అణువిధ్వంసం అనంతరం శాంతి చేకూరాలని 1949లో హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్,1955లో హిరోషిమా పీస్ మెమోరియల్ మ్యూజియాన్ని ప్రారంభించారు. అణ్వాయుధాల పూర్తి నిర్మూలన కొరకు హిరోషిమా మెమోరియల్ పార్క్లో 1964లో వెలిగించిన శాంతి జ్యోతి ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. లొంగిపోయే లోపే లిటిల్ బాయ్, ఫ్యాట్మ్యాన్లతో విధ్వంసం రెండో ప్రపంచ యుద్ధ సమయం (1945)లో సోవియట్ యూనియన్ అధినేత స్టాలిన్, అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమన్, గ్రేట్ బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ (చర్చిల్ తర్వాత క్లెమెంట్ అట్లీ) జర్మనీలో సమావేశమయ్యారు. యుద్ధానికి తెర దించే అంశంపై జూలై 27 నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు చర్చించారు. జపాన్ బేషరతుగా లొంగిపోవాలన్నది నాటి డిమాండ్. అప్పటికి శత్రుదేశాలకు బదులివ్వగల సామర్థ్యం, అధికార బలం అంతగా లేనందున జపాన్ కూడా ఇందుకు సిద్ధమైంది. అయితే జపాన్ అంగీకారం తెలిపేలోపే.. తాము తయారుచేసిన అణు బాంబులను వాడే అవకాశం మళ్లీ రాకపోవచ్చునని భావించినందు వల్లే అమెరికా.. హిరోషిమాపై లిటిల్ బాయ్ను ప్రయోగించడంతో పాటుగా.. ఆ షాక్ నుంచి తేరుకునేలోగా నాగసాకి పట్టణంపై ఫ్యాట్ మ్యాన్ అనే మరో అణుబాంబుతో దాడి చేసిందనే వాదనలు నేటికీ వినిపిస్తున్నాయి. -
శ్మశానం ముందు తమ్ముడి శవంతో..
సాక్షి, వెబ్ డెస్క్ : లోకం చీకటిమయంగా మారడానికి కారణమైన అణు యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడారు. రెండేళ్ల తమ్ముడి శవాన్ని వీపునకు కట్టుకుని శ్మశానవాటికకు మోసుకెళ్తున్న పదేళ్ల బాలుడి చిత్రం గురించి ప్రత్యేకించి చర్చించారు. అమ్మ ఒడి నుంచి బయటకు రాని పసివాళ్ల చుట్టూ ఉన్న లోకం చీకటి మయం కావడానికి కారణం రెండో ప్రపంచ యుద్ధమని అన్నారు. జపాన్ దేశంలో ఆరేళ్లుగా జరగుతున్న రెండో ప్రపంచయుద్ధ మారణకాండ ఆగష్టు 9, 1945న ఉగ్రరూపం దాల్చింది. జపాన్లోని నాగసాకిపై అమెరికా అణుబాంబును విసిరింది. దీంతో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర మారణకాండకు సంబంధించిన చిత్రాలను అమెరికా మెరైన్స్ ఫొటోగ్రాఫర్ జోయ్ ఒ డొన్నెల్ తన కెమెరాలో బంధించారు. 1945 అణుబాంబు దాడి అనంతరం నాలుగేళ్ల పాటు డొన్నెల్ జపాన్లోనే ఉన్నారు. ఆయన తీసిన వందల చిత్రాల్లో తమ్ముడి శవాన్ని దహన సంస్కారాలు చేసేందుకు ఎదురుచూపులు చూస్తున్న పిల్లవాడిది కూడా ఒకటి. ఈ చిత్రాన్ని చూసిన పోప్ ఫ్రాన్సిస్ చలించిపోయారు. యుద్ధ పరిణామాల గురించి ఈ ఫొటో చెబుతున్నంత స్పష్టంగా మరేదీ చెప్పలేదని పేర్కొన్నారు. ఆ సమయంలో బాలుడి బాధ వర్ణానాతీతం అని చెప్పారు. పళ్లతో పెదవులను అదిమిపెట్టి బాధను ఓర్చుకునేందుకు బాలుడు ప్రయత్నించినట్లు వెల్లడించారు. ట్రంప్ వర్సెస్ కిమ్ ఉత్తరకొరియా పదే పదే అణుదాడిపై మాట్లాడుతున్న నేపథ్యంలో అణు ఆయుధ వ్యతిరేక సమావేశంలో ఆదివారం పోప్ ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగసాకిపై అణు దాడి ఫొటోలను తిలకించారు. శ్మశానవాటికలో తమ్ముడి శవాన్ని దహన సంస్కారాలు చేసేందుకు ఎదురుచూపులు చూస్తున్న పిల్లవాడి క్షోభ ప్రపంచ దేశాలకు అర్థం కావాలని, అందుకే ఈ ఫొటోను పునః ముద్రించి అందరికీ పంచాలని కోరారు. అణు హెచ్చరికలపై కిమ్ దేశంతో చర్చలు జరిపేందుకు వాటికన్ సిటీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. -
చరిత్ర సారాంశంతో సంభాషణ
చరిత్ర గమనంలో ఎదురయ్యే ఘటనలలో మన మనసుకు నచ్చేవి ఉంటాయి. అనిష్టమైనవీ ఉంటాయి. కానీ రెంటినీ మానవాళే పోషిస్తూ ఉంటుంది. చాలా మలుపులలో వారి ఇష్టాయిష్టాలు అప్రస్తుతమైపోతాయి. భూగోళం మీద అణుబాంబు సృష్టించిన విధ్వంసాన్ని తొలిసారి చూసిన నేల నాగసాకిలో ఆయన పుట్టి పెరి గారు. ఈ సంవత్సరం నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. కానీ ఆయన తన రచనలలో అణుబాంబు విస్ఫోటనం గురించి చెప్పరు. బాహ్య ప్రపంచానికీ, దాని మీద అంతరంగంలో మనిషి చేసే ఆలోచనలకీ మధ్య ఉన్న అగాధాన్ని ఆవిష్కరిస్తారు. ఆయనే కజువో ఇషిగురో. పోటీలో ఉన్న గూగీ వా థియాంగ్ (‘మట్టికాళ్ల మహారాక్షసి’ నవలాకారుడు), మార్గరెట్ అట్వుడ్ (కెనడా రచయిత్రి), హరుకీ మురాకమి (జపాన్ కవి)లను కాదని ఈ ఏటి పురస్కారం ఇషిగురోను వరించింది. పాశ్చాత్య సాహితీ ప్రపంచంలో అత్యున్నత పురస్కారంగా భావించే మ్యాన్ బుకర్ను 4 సార్లు స్వీకరిం చారు ఇషిగురో. జేన్ ఆస్టిన్, ఫ్రాంజ్ కాఫ్కాల సృజన శైలులను కలిపి, దానికి మార్సెల్ ప్రాస్ట్ను అద్దితే అదే ఇషిగురో రచన అవుతుందని అంటారు. దోస్త్యేవ్స్కీ ప్రభావం కూడా ఆయన మీద ఉంది. ఇష్ ఉత్తమ పురుషలో నవల చెప్పడంలో అఖండుడని ఖ్యాతి. ‘ఏ పేల్ వ్యూ ఆఫ్ హిల్స్’, ‘ది అన్కన్సోల్డ్’, ‘నెవర్ లెట్ మి గో’, ‘యాన్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఫ్లోటింగ్ వరల్డ్’, ‘వెన్ వియ్ వర్ ఆర్ఫన్స్’వంటి నవలలన్నింటిని ఆయన ఉత్తమ పురుషులోనే రాశారు. చివరి నవల ‘ది బరీడ్ జెయింట్’(2015) మాత్రం ఇందుకు భిన్నం. ‘ది ఫ్యామిలీ సప్పర్’, ‘ది సమ్మర్ ఆఫ్టర్ ది వార్’మొదలైన కథా సంపుటాలను ప్రచురించారు. ఆయన గీత రచయిత కూడా. ఉత్తమ పురుషలో నవలను అమోఘంగా నడిపించగల ఇషిగురో రాసినదే–‘ది రిమెయిన్స్ ఆఫ్ ది డే’. సమకాలీన సమాజంతో, దాని పోకడలతో మనసు చేసే పోరాటాన్నీ, వాటితో రాజీపడే తీరునీ ఇందులో ఎంతో సమర్థంగా అక్షరబద్ధం చేశారు ఇషిగురో. లార్డ్ డార్లింగ్టన్ హాలులో మూడున్నర దశాబ్దాల పాటు బట్లర్గా పనిచేసిన స్టీవెన్స్ అనుకోకుండా చేసిన ఆరురోజుల యాత్రలో తన అనుభవాలను గుర్తు చేసుకునే క్రమం ఈ నవలలో ఇతివృత్తం. 1950లలో జరిగే కథాకాలానికి ఆ హాలు డార్లింగ్టన్ అధీనంలో లేదు. ఫారడే అనే అమెరికన్ ధనవంతుడు దానిని కొనుగోలు చేశాడు. తన వైవాహిక జీవితం సజావుగా లేదంటూ మిస్ కెంటన్ రాసిన ఉత్తరం అందిన తరువాత ఆమె నివాసం ఉంటున్న కార్న్వాల్కు బయలుదేరతాడు స్టీవెన్స్. మిస్ కెంటన్ గతంలో డార్లింగ్టన్ హాలులోనే పనిచేసేది. స్టీవెన్స్ కలల రాణి. కానీ ఈ విషయం ఏనాడూ వ్యక్తం చేయకపోవడంతో ఆమె వేరే వివాహం చేసుకుని వెళ్లిపోయింది. స్టీవెన్స్ ఏదో ఆశించి వెళతాడు. ఆ ఉత్తరం అలాంటి ఆశలు రేపింది. కానీ నిరాశకు గురై తిరుగు ప్రయాణమవుతాడు. ఇదే ఇతివృత్తం. కానీ ఆ బట్లర్ జ్ఞాపకాలలో రెండు ప్రపంచ యుద్ధాల మధ్య చరిత్ర, ఇంగ్లిష్ సమాజంలోని వైరుధ్యాలు, అపోహలు, భ్రమలు, చారిత్రక తప్పిదాలు.. వంటింట్లో నుంచి పదార్థాల కంటే ముందే వచ్చే ఘాటు వాసనల్లా పాఠకులకు తగులుతూ ఉంటాయి. పాత యజమాని డార్లింగ్టన్కి, కొత్త యజమాని ఫారడేకి కూడా స్టీవెన్స్ మానసికంగా సుదూరంగా ఉండిపోయాడు. పాత యజమాని కాలంలో విన్స్టన్ చర్చిల్కి, జర్మనీ నుంచి వచ్చిన నాజీ ప్రభుత్వ విదేశాంగ మంత్రి జాచిమ్ వాన్ రిబ్బెన్ట్రాప్కీ కూడా ఆ ఇంట్లో వడ్డించాడు. బ్రిటిష్ యూనియన్ ఆఫ్ ఫాసిస్ట్ బృందం నాయకుడు సర్ ఆస్వాల్డ్ మోస్లే (లేబర్ పార్టీ)కు కూడా వడ్డించాడు. డార్లింగ్టన్ ఫాసిజం మీద సానుభూతి కలిగి ఉండడం స్టీవెన్ను బాధిస్తూ ఉంటుంది. అయినా అదే వినయంతో సేవిస్తూ ఉంటాడు. కొత్త యజమాని వ్యంగ్యోక్తులు కూడా రుచించవు. అయినా స్టీవెన్స్ ఏనాడైనా తన ప్రాణం కంటే తన విధినే ఎక్కువ ప్రేమించాడు. నిజానికి మిస్ కెంటన్ మీద ఉన్న ఇష్టాన్ని వ్యక్తం చేయకపోవడానికి కారణం కూడా అదే. మిస్ కెంటన్ను కలుసుకున్నాక ఆమె, ‘నిన్ను పెళ్లి చేసుకుని ఉంటే నా జీవితం ఇంతకంటే ఎంతో బాగుండేది’ అని అంటుంది. కానీ తన భర్తను వదిలి రాదు. తీవ్ర నిరాశతో తిరుగు ప్రయాణమవుతాడు స్టీవెన్స్. అంతా నిర్వేదమే. మళ్లీ ఆ నిర్వేదం మధ్యలోనే కొత్త యజమానికి మరింత విశ్వాసంతో పని చేసి మెప్పు పొందాలని తీర్మానించుకుంటాడు. నిజమే, చరిత్ర గమనంలో మనకు ఎదురయ్యే ఘటనలలో మన మనసుకు నచ్చేవి ఉంటాయి. అనిష్టమైనవీ ఉంటాయి. కానీ రెంటినీ మానవాళే పోషిస్తూ ఉంటుంది. చాలా మలుపులలో వారి ఇష్టాయిష్టాలు అప్రస్తుతమైపోతాయి. ఇషిగురో ఐదో ఏటనే ఇంగ్లండ్ వచ్చాడు. అందుకే తన స్వదేశం అంటే అతడికి ఒక సుదూర జ్ఞాపకం. అయినా అతడు తుడిచిపెట్టలేదు. ‘యాన్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఫ్లోటింగ్ వరల్డ్’ నవల రెండో ప్రపంచ యుద్ధానంతరం జపాన్లో బతికిన ఒక కళాకారుడి మథనను చిత్రించింది. ‘ది బరీడ్ జెయింట్’ నవలలో ఒక వృద్ధజంట ప్రయాణంతో గతానుభవాలను వర్ణిస్తాడు. వర్తమానానికీ చరి త్రకీ మధ్య విడదీయలేని ఒక బంధం ఉందని ఆయన నిర్ధారిస్తారు. ఇషిగురో తన పాత్రలకు, నిజానికి నవలలకు కూడా ప్రత్యేకమైన ముగింపును ఇవ్వరు. జనం స్మృతిపథం నుంచి పోతున్న కొన్ని వాస్తవాలను చెప్పించడానికే ఆయన వాటిని సృష్టిస్తారని విశ్లేషకులు చెబుతారు. అందుకే ఆయన ప్రతి నవల చరిత్ర చెక్కిలి మీద కన్నీటి చారికను గుర్తుకు తెస్తూ ఉంటుంది. ఆయన పూర్తిగా చరిత్రనే అంటిపెట్టుకోలేదు. ‘నెవర్ లెట్ మి గో’ నవల అందుకు సాక్ష్యం. శరీరాంగాలను తీసి అమ్మడానికి ఉద్దేశించిన పిల్లలను సృష్టించే ఒక రాక్షస యుగం వస్తుందని ఈ నవలలో చెబుతారు. ఇది సైన్స్ ఫిక్షన్. ఫ్యూచరిస్టిక్ శైలి కలిగినది కూడా. ‘ది రిమెయిన్స్ ఆఫ్ ది డే’ కంటే ఇదే గొప్ప నవలని చాలామంది భావిస్తారు. – సత్యగిరీశ్ గోపరాజు కజువో ఇషిగురో -
వణికిస్తున్న వరుస తుఫాన్లు
టోక్యో: జపాన్ను వరుస టైఫూన్(తుఫాన్)లు వణికిస్తున్నాయి. ఈ సీజన్లో ఇప్పటికే పదికి పైగా తుఫాన్లు జపాన్ను అతలాకుతలం చేయగా.. తాజాగా నామ్థియన్ తుఫాన్ జపాన్పై విరుచుకుపడుతోంది. ఈ శక్తివంతమైన టైఫూన్ సోమవారం నాగసాకీ పట్టణం సమీపంలో తీరం దాటిందని వాతావరణ సంస్థ వెల్లడించింది. తుఫాను ప్రస్తుతం ఉత్తర ప్రాంతం దిశగా ప్రయాణిస్తుందని తెలిపారు. నామ్థియన్ టైఫూన్ ప్రభావంతో బలమైన గాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ తెలిపింది. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని చోట్ల 150 మిల్లీమీటర్ల వర్షం సైతం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వ యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గతవారం లయన్రాక్ తుఫాను బీభత్సంతో రాత్రికి రాత్రే సంభవించిన వరదల్లో 10 మందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే. -
అణు పాపం