Nifty intraday trading
-
నిఫ్టీ సూచీలలో అదానీ గ్రూప్ షేర్లు
నిఫ్టీ ఇండెక్సులలో ఈ ఏడాది మార్చి31 నుంచి సవరణలు చేపడుతున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా వెల్లడించింది. నిఫ్టీ ఇండెక్సులలో ప్రయివేట్ రంగ కంపెనీలు అదానీ విల్మర్, అదానీ పవర్తోపాటు పలు ఇతర కంపెనీలకు చోటు లభించనుంది. అదానీ విల్మర్ నిఫ్టీ నెక్ట్స్ 50, నిఫ్టీ 100కు ప్రాతినిధ్యం వహించనుంది. ఇక అదానీ పవర్కు నిఫ్టీ 500, 200లతోపాటు నిఫ్టీ మిడ్క్యాప్ 100, 150, లార్జ్మిడ్ క్యాప్ 250, మిడ్స్మాల్ క్యాప్ 400లలో చోటు లభించనుంది. ఇండెక్సుల నిర్వహణ సబ్కమిటీ షేర్ల జాబితాలో సవరణలను నిర్ణయించినట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. అయితే ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ–50లో ఎలాంటి మార్పులూ చేపట్టడంలేదని ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది. కాగా.. నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్లో ఏబీబీ ఇండియా, కెనరా బ్యాంక్, పేజ్ ఇండస్ట్రీస్, వరుణ్ బెవరేజెస్ సైతం ప్రాతినిధ్యం వహించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు బంధన్ బ్యాంక్, బయోకాన్, గ్లాండ్ ఫార్మా, ఎంఫసిస్, వన్ 97 కమ్యూనికేషన్స్లను నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొంది. -
రికార్డులు.. రయ్ రయ్!
ముంబై: స్టాక్ మార్కెట్లో రికార్డు ర్యాలీ రెండోరోజూ కొనసాగింది. ఆర్థిక వృద్ధి ఆశలతో పాటు మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదుతో ఇన్వెస్టర్లు ట్రేడింగ్ ప్రారంభం నుంచి కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఫార్మా, రియల్టీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు రాణించడంతో శుక్రవారమూ సూచీలు ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డు స్థాయిలను లిఖించాయి. సెన్సెక్స్ 644 పాయింట్లు ఎగసి 55,488 వద్ద ఆల్టైం హై స్థాయిని అందుకుంది. చివరికి 593 పాయింట్ల లాభంతో 55,437 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 180 పాయింట్లు పెరిగి 16,544 వద్ద సరికొత్త గరిష్టాన్ని నమోదుచేసింది. మార్కెట్ ముగిసేసరికి 165 పాయింట్ల లాభంతో 16,529 వద్ద స్థిరపడింది. నిఫ్టీకిది వరుసగా ఐదోరోజూ, సెన్సెక్స్కు రెండోరోజూ లాభాల ముగింపు. ఐటీ కంపెనీలు భారీ ఆర్డర్లను దక్కించుకున్న నేపథ్యంలో రెండింతల ఆదాయ వృద్ధి నమోదు కావచ్చనే అంచనాలు ఈ రంగ షేర్లకు డిమాండ్ను పెంచాయి. ఇటీవల స్తబ్ధుగా ట్రేడ్ అవుతున్న ఎఫ్ఎంసీజీ రంగ కౌంటర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లలో 10 షేర్లు మాత్రమే నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.818 కోట్ల షేర్లను.., దేశీ ఇన్వెస్టర్లు రూ.149 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ఇంట్రాడే నష్టాలను పూడ్చుకొని 74.24 వద్ద ఫ్లాట్గా ముగిసింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 1160 పాయింట్లు, నిఫ్టీ 291 పాయింట్లను ఆర్జించాయి. ఆద్యంతం కొనుగోళ్లే... ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ... ఉదయం మన మార్కెట్ స్థిరంగా మొదలైంది. సెన్సెక్స్ 68 పాయింట్ల లాభంతో 54,912 వద్ద, నిఫ్టీ 22 పాయింట్లు పెరిగి 16,386 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. దేశీయ మార్కెట్లో నెలకొన్న సానుకూలతలు ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు ప్రేరేపించాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ తొలిసారి 55,000 స్థాయిని, నిఫ్టీ 16,500 మార్కును అధిగమించాయి. మిడ్సెషన్లో యూరప్ మార్కెట్లు లాభాల ప్రారంభంతో సూచీలు మరింత పరుగులు పెట్టాయి. మార్కెట్ ముగిసే వరకు ఏ దశలో కొనుగోళ్ల జోరు తగ్గకపోవడంతో సూచీలు ఇంట్రాడే, ముగింపులో కొత్త రికార్డులను నమోదు చేశాయి. రెండురోజుల్లో రూ.3.48 లక్షల కోట్లు సూచీల రికార్డు ర్యాలీ కొనసాగడంతో స్టాక్ మార్కెట్లో రెండోరోజుల్లోనే రూ.3.48 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.240 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ►ఐటీ దిగ్గజ కంపెనీ టీసీఎస్ షేరు బీఎస్ఈలో 3%పైగా లాభపడి రూ.3,462 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నాలుగుశాతం ర్యాలీ చేసి రూ.3,479 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. కంపెనీ మార్కెట్ విలువ తొలిసారి రూ.13 లక్షల కోట్లకు చేరింది. ►ఐఆర్సీటీసీ షేరులో లాభాల స్వీకరణ కొనసాగింది. బీఎస్ఈలో ఒకశాతం నష్టపోయి రూ.2,661 వద్ద ముగిసింది. -
'రికార్డులు బద్దలు కొడుతున్నాయి'
-
'రికార్డులు బద్దలు కొడుతున్నాయి'
ముంబయి : స్టాక్ మార్కెట్లు రికార్డులు బద్దలుకొడుతున్నాయి. వరుసగా ఆరో రోజు కూడా స్టాక్ మార్కెట్లు తారాజువ్వలా దూసుకు పోతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లో గురువారం సరికొత్త ఆల్టైం రికార్డు నమోదైంది. లాభాల బాటలో పయనిస్తున్న సూచీల ఈ రోజు సరికొత్త ఉన్నత శిఖరాగ్రాలకు చేరుకున్నాయి. సెన్సెక్ తొలిసారి 29 వేల మార్కును దాటింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే నిఫ్టీ 8,700 మార్కు దాటింది. 130కి పైగా పాయింట్లలో సెన్సెక్స్, 30 పాయింట్ల లాభంతో నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. కాగా 2016 వరకూ భారత వృద్ధికి ఢోకా లేదని ఐఎంఎఫ్ తాజా నివేదిక వెల్లడించడం కూడా స్టాక్ మార్కెట్ల జోరును మరింత పెంచింది. ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు, కేంద్రం మరిన్ని సంస్కరణలు చేపట్టనుందన్న అంచనాలు, యూరోజోన్ను ఆదుకునేందుకు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) మరిన్ని ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించవచ్చన్న ఆశలు, చైనా ఆర్థిక వృద్ధిరేటు క్షీణత అంచనాకంటే కాస్త మెరుగ్గానే ఉండటం వంటి అంశాలు బుల్ర్యాలీలో సూచీల పరుగు వేగాన్ని రెట్టింపు చేశాయి. మెటల్, ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరో రోజు కూడా స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్ 110 పాయింట్లకు పైగా లాభాల్లోనూ, నిఫ్టీ 20 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా స్టాక్ మార్కెట్లు మంగళవారం కొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే ట్రేడింగ్లో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. కొత్త గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. -
28,900 మార్క్ దాటిన సెన్సెక్స్
ముంబయి : స్టాక్ మార్కెట్లు వరుసగా అయిదో రోజు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే ట్రేడింగ్లో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. తొలిసారిగా సెన్సెక్స్ 28,900 మార్క్ దాటగా, నిఫ్టీ కూడా 8,730 వద్ద ట్రేడ్ అవుతోంది. విదేశీ నిధుల ప్రవాహం ఇన్వెస్టర్ల సెంటిమెంట్కు మరింత జోష్నివ్వటంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కేంద్రం మరిన్ని ఆర్థిక సంస్కరణలు చేపడుతుందన్న సానుకూల సంకేతాలతో పాటు, కంపెనీల ఆర్థిక ఫలితాలు, భవిష్యత్ ఆర్జన అంచనాలు బాగా ఉండడం, రానున్న బడ్జెట్లో సంస్కరణలుంటాయనే అంచనాలు.... ఇవన్నీ స్టాక్ మార్కెట్ల జోరుకు ప్రధాన కారణాలని విశ్లేషకులంటున్నారు. -
బుల్.. ధనాధన్!
రికార్డుల ర్యాలీ... ⇒కొత్త గరిష్ట స్థాయిలను తాకిన సెన్సెక్స్. నిఫ్టీ ⇒ముగింపులోనూ ఆల్టైమ్ గరిష్ట స్థాయిలు ⇒522 పాయింట్ల ప్లస్తో 28,785కు సెన్సెక్స్ ⇒145 పాయింట్ల లాభంతో 8,696కు నిఫ్టీ ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం కొత్త రికార్డులు సృష్టించాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే ట్రేడింగ్లో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. కొత్త గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. బ్యాంక్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడం, లోహ, చమురు, గ్యాస్ షేర్లలో రికవరీ కారణంగా స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. విదేశీ నిధుల ప్రవాహం ఇన్వెస్టర్ల సెంటిమెంట్కు మరింత జోష్నిచ్చిందని ట్రేడర్లంటున్నారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు, భవిష్యత్ ఆర్జన అంచనాలు బాగా ఉండడం, రానున్న బడ్జెట్లో సంస్కరణలుంటాయనే అంచనాలు.... ఇవన్నీ స్టాక్ మార్కెట్ల జోరుకు ప్రధాన కారణాలని విశ్లేషకులంటున్నారు. ఆర్బీఐ రేట్లకోతతో మొదలైన ర్యాలీ, మరిన్ని సంస్కరణలు వస్తాయనే అంచనాలతో కొనసాగుతోందని కోటక్ సెక్యూరిటీస్ విశ్లేషకులు దీపేన్ షా వివరించారు. చైనా జీడీపీ గణాంకాలు అంచనాలను మించి ఉండడం, యూరోపియన్ కేంద్ర బ్యాంక్ ఉద్దీపన ప్యాకేజీని ఇస్తుందన్న అంచనాలు ర్యాలీకి మరింత తోడ్పాటునందించాయని పేర్కొన్నారు. 2016 వరకూ భారత వృద్ధికి ఢోకా లేదని ఐఎంఎఫ్ తాజా నివేదిక వెల్లడించడం కూడా స్టాక్ మార్కెట్ల జోరును మరింత పెంచింది. సూచీల జోరు: బీఎస్ఈ సెన్సెక్స్ 522 పాయింట్లు లాభపడి 28,785 పాయింట్ల వద్ద, నిఫ్టీ 145 పాయింట్లు లాభపడి 8,696 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇవి రెండూ ముగింపులో కొత్త గరిష్ట స్థాయిలు. ఇక నిఫ్టీ 8,700 స్థాయిని తొలిసారి దాటేసింది. వరుసగా నాలుగో సెషన్లోనూ మార్కెట్లు లాభపడ్డాయి. ఇంట్రా డే ట్రేడింగ్లో సెన్సెక్స్, నిఫ్టీలు జీవితకాల గరిష్ట స్థాయిలను తాకాయి. సెన్సెక్స్ 28,829ను, నిఫ్టీ 8,708 పాయింట్లను తాకాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ హాట్ ఫేవరేట్గా నిలవనున్నదని ... 2016లో వృద్ధి రేటు విషయంలో చైనాను భారత్ మించిపోనున్నదని ఐఎంఎఫ్ తాజా నివేదిక వెల్లడించింది. చైనా జీడీపీ గణాంకాలు అంచనాలను మించడంతో లోహ షేర్లు దూసుకుపోయాయి. లోహాలను అధికంగా వినియోగించే చైనా వృద్ధిపై ఆందోళనలను ఈ జీడీపీ గణాంకాలు తగ్గించాయని, దీంతో లోహ షేర్లు వెలిగిపోయానని విశ్లేషకులు పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ జోరు... ఆర్బీఐ రెపోరేట్ కోత వల్ల బ్యాంకుల కంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకే అధిక లాభదాయకమన్న అంచనాలతో హెచ్డీఎఫ్సీ షేర్ 5.8 శాతం పెరిగి 1,251 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా లాభపడ్డ షేర్ ఇదే. ఇక సెసాస్టెరిలైట్ 5.3%, టాటా స్టీల్ 4.5%, యాక్సిస్ బ్యాంక్ 4.3%, టాటా మోటార్స్ 3.7%, ఐటీసీ 3.5%, హిందాల్కో 3%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.4%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.7%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.7%, ఎస్బీఐ 1.5 శాతం, భారతీ ఎయిర్టెల్ 1.3%, విప్రో 1% చొప్పున పెరిగాయి. గెయిల్ 1.9 శాతం క్షీణించింది. మొత్తం 1,560 షేర్లు లాభాల్లో ముగియగా, 1,412 షేర్లు నష్టపోయాయి. మొత్తం టర్నోవర్ రూ.3,292 కోట్లుగా నమోదైంది. ఇక ఎన్ఎస్ఈలో నగదు విభాగంలో రూ. 18,133 కోట్లు, డెరివేటివ్స్ విభాగంలో రూ.2,90,288 కోట్ల టర్నోవర్ నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,276 కోట్ల నికర కొనుగోళ్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.762 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. ఆసియా, యూరప్లోని ప్రధాన స్టాక్ మార్కెట్లన్నీ లాభాల్లోనే ముగిశాయి. ఏడాది గరిష్టానికి 199 షేర్లు మంగళవారం నాటి రికార్డ్ల ర్యాలీలో దాదాపు 199 షేర్లు ఏడాది గరిష్ట స్థాయికి చేరాయి. బ్లూ చిప్ షేర్లలో యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఇక ఇతర స్టాక్లు-యస్ బ్యాంక్, వర్ల్ పూల్ ఆఫ్ ఇండియా, స్పైస్జెట్, మైండ్ట్రీ, ఎంఆర్ఎఫ్, హెచ్టీ మీడియా షేర్లు కూడా ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. వీటితో పాటు బాష్, యునెటైడ్ స్పిరిట్స్, శ్రీ సిమెంట్స్, బీఏఎస్ఎఫ్ ఇండియా, అంబుజా సిమెంట్స్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఐడీఎఫ్సీ, సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీలు కూడా ఏడాది గరిష్ట స్థాయి షేర్ల క్లబ్లో స్థానం సాధించాయి. ఎందుకు పెరిగాయంటే... ⇒ ఆర్బీఐ రెపోరేట్ను తగ్గించడం ⇒ అంచనాలను మించిన చైనా జీడీపీ వృద్ధి గణాంకాలు ⇒ ప్రపంచంలోనే భారత్ భేష్ అన్న ఐఎంఎఫ్ తాజా నివేదిక ⇒ యూరప్ కేంద్ర బ్యాంక్ నుంచి ప్యాకేజీ వస్తుందన్న అంచనాలు ⇒ బడ్జెట్లో మరిన్ని సంస్కరణలు వస్తాయన్న ఆశాభావం రికార్డ్ల ర్యాలీతో మంగళవారం ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.89,000 కోట్లకు పైగా వృద్ధి చెందింది. రూ.102.3 లక్షల కోట్లకు ఎగబాకింది.