NPAs of Bank
-
రూ.652 కోట్లతో మొండి బాకీల కొనుగోలు!
ద్రవ్యోల్బణం పెరుగుతోంది..ఖర్చులూ పెరుగుతున్నాయి..ఇలాంటి సందర్భంలో బ్యాంకులు రుణాలు ఇస్తాయంటే ఎందుకు తీసుకోకుండా ఉంటారు..అయితే వాటిని తిరిగి చెల్లించేపుడు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. దాంతో బ్యాంకుల వద్ద మొండి బకాయిలు పోగవుతున్నాయి. అలా ఒక్క ఐడీబీఐ బ్యాంకు వద్దే ఏకంగా రూ.6,151 కోట్లు పేరుకుపోయాయి. ఆ లోన్లను రికవరీ చేసేందుకు బ్యాంకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఇటీవల ఆ బకాయిలను విక్రయానికి పెట్టింది. వాటిని కొనుగోలు చేసేందుకు ఓంకార అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ) గరిష్ఠంగా రూ.652 కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తాకథనాలు వెలువడ్డాయి.వార్తా నివేదికల ప్రకారం..ఐడీబీఐ బ్యాంకు తన వద్ద పోగైన రూ.6,151 కోట్ల మొండి బకాయిలను విక్రయించాలని గతంలోనే నిర్ణయించుకుంది. దాంతో ప్రభుత్వ అధీనంలోని నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్తోపాటు ఇతర కంపెనీలు బిడ్డింగ్ వేశాయి. తాజాగా ఓంకార అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ) ఆ మొండి బకాయిలను దక్కించుకునేందుకు గరిష్ఠంగా రూ.652 కోట్లు(మొత్తంలో 10.5 శాతం) ఆఫర్ చేసింది.బ్యాంకుల్లో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని వారి సంఖ్య పెరుగుతోంది. వాటిని వసూలు చేసేందుకు ప్రభుత్వం నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్)ను ప్రతిపాదించింది. ఇది బిడ్డింగ్లో తక్కువ ధరకు బ్యాంకుల నుంచి మొండి బకాయిలను దక్కించుకుంటుంది. అనంతరం రుణ గ్రహీతల నుంచి పూర్తి సొమ్మును వసూలు చేస్తోంది. తాజాగా ఎన్ఏఆర్సీఎల్తోపాటు బిడ్డింగ్లో పాల్గొన్న ఓంకార ఏఆర్సీ అధికమొత్తంలో చెల్లించేందుకు సిద్ధమైంది.ఇదీ చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన గౌతమ్ అదానీ!ఐడీబీఐ బ్యాంకులో గరిష్ఠంగా ఎల్ఐసీకు 49.24 శాతం వాటా ఉంది. వీటిని 26 శాతానికి తగ్గించేందుకు మే 2021లో క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 2022లో ఆసక్తిగల సంస్థలు, వ్యక్తుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు కోరింది. ఇటీవల వెలువడిన రాయిటర్స్ నివేదిక ప్రకారం..ఫెయిర్ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, ఎమిరేట్స్ ఎన్బీడీ, కోటక్ మహీంద్రా బ్యాంక్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బిడ్డర్లుగా ఆమోదించింది. ఈ బ్యాంకులో ఎల్ఐసీ తర్వాత గరిష్ఠంగా ప్రభుత్వానికి 45 శాతం వాటా ఉంది. -
వసూలు అవ్వకపోయినా.. తగ్గిన ‘పారుబాకీలు’! ఎలాగంటే..
దేశీయంగా బ్యాంకుల స్థూల పారు బాకీలు(గ్రాస్ ఎన్పీఏలు) గత పదేళ్లలో కనిష్ఠ స్థాయికి చేరినట్లు ఇటీవల భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. కొన్నేళ్లుగా బ్యాంకింగ్ రంగ ఆర్థిక స్థితి మెరుగైందన్నది కాదనలేని సత్యం. కానీ అందుకు చాలామార్పులు తీసుకురావాల్సి వచ్చింది. డిపాజిట్దారుల నుంచి డబ్బు తీసుకుని, వారికి చెల్లించే వడ్డీకన్నా కాస్త ఎక్కువకు రుణగ్రహీతలకు అప్పులు ఇచ్చి లాభాలు ఆర్జించడమే బ్యాంకుల ప్రధాన వ్యాపారం. అప్పులు తీసుకున్నవారు వాటిని సక్రమంగా తిరిగి చెల్లించకపోతే పారు బాకీలు (ఎన్పీఏలు) ఎక్కువై బ్యాంకులు నష్టాలపాలవుతాయి. భారతీయ బ్యాంకులు 2014-15 నుంచి రూ.14.56 లక్షల కోట్ల పారు బాకీలను రద్దు చేశాయని కేంద్రం ఇటీవల పార్లమెంటులో తెలిపింది. అందులో రూ.7.40 లక్షల కోట్లు భారీ పరిశ్రమలకు, బడా సర్వీసు కంపెనీలకు ఇచ్చినవే. గడచిన మూడేళ్లలో బ్యాంకులు పారుబాకీల కింద చూపిన రూ.5.87 లక్షల కోట్లలో 19శాతాన్ని అంటే, 1.09 లక్షల కోట్ల రూపాయలను మాత్రమే తిరిగి వసూలు చేయగలిగాయని రిజర్వు బ్యాంకు తెలిపింది. గత పదేళ్లలో బ్యాంకుల పారుబాకీలు బాగా తగ్గినట్లు రిజర్వు బ్యాంకు తాజాగా వెల్లడించింది. అయితే, భారీ కంపెనీలకు ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు కాక నష్టాలపాలైన బ్యాంకులను మళ్ళీ నిలబెట్టడానికి క్యాపిటల్ మానిటైజేషన్ పేరుతో బడ్జెట్లలో వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు కేటాయించడం ఆనవాయితీగా మారింది. ఇదీ చదవండి: ఎక్కువ పన్నులు కట్టాలంటున్న బిల్ గేట్స్! ఎందుకు..? ఇలా 2016-21 మధ్య కేంద్రం దాదాపు రూ.3.10 లక్షల కోట్లు ఇచ్చింది. 2022-23, 2023-24 బడ్జెట్లలో మాత్రమే కేటాయింపులు జరపలేదు. ఈసారి బడ్జెట్లో పరిస్థితి ఎలాఉండబోతుందో చూడాలని నిపుణులు చెబుతున్నారు. -
ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల మొండిబకాయిల మాఫీ
న్యూఢిల్లీ: దేశంలో గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 10,09,511 కోట్ల మొండి బకాయిలను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు మాఫీ(రైటాఫ్) చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రైటాఫ్ అనేది రుణ గ్రహీతలకు ఎలాంటి లబ్ధి చేకూర్చదని నిర్మలా సీతారామన్ తేల్చిచెప్పారు. వారి నుంచి రుణాలను వసూలు చేసే ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టంచేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను (రైటాఫ్ లోన్లు) తిరిగి చెల్లించాల్సిందేనని వివరించారు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.6,59,596 కోట్ల రుణాలను తిరిగి వసూలు చేశాయని, ఇందులో రూ.1,32,036 కోట్ల మేర రైటాఫ్ లోన్లు ఉన్నాయని తెలియజేశారు. ఇదీ చదవండి: గోల్డ్ ఈటీఎఫ్లలో అమ్మకాలు -
ఉన్నవాళ్లకే మరిన్ని రాయితీలా?
పేదలకు అత్యవసరమైన ఉచితాలను ‘పప్పు బెల్లాలు’ అంటూ చాలామంది గగ్గోలు పెడుతుంటారు. కానీ కార్పొరేట్ కంపెనీలకు అందుతున్న రాయితీల గురించి ఎవరూ మాట్లాడరు. వ్యవసాయ రుణాలను మాఫీ చేసినప్పుడు రుణ సంస్కృతిని అవి విచ్ఛిన్నపరుస్తున్నాయని చాలామంది ఆక్షేపించారు. కానీ భారీ ఎత్తున కార్పొరేట్ పన్నులు తగ్గించడం అనేది ఆర్థిక పురోగతికి దారి తీస్తుందని వీరే తప్పుడు సూత్రాలు వల్లిస్తున్నారు. గత అయిదేళ్లలో రూ.10 లక్షల కోట్ల కార్పొరేట్ నిరర్థక రుణాలను మాఫీ చేసినట్లు కేంద్రప్రభుత్వం ఇటీవలే పార్లమెంటుకు తెలిపింది. అత్యంత సంపన్నుల జేబుల్లో డబ్బును తేరగా పోయడం ద్వారా ఇప్పటికే ఉన్న సంపద అసమానత్వం మరింతగా పెరిగింది. సంపన్నులకు యాభై సంవత్సరాలుగా లభిస్తున్న పన్ను రాయితీలు ఏమాత్రం తగ్గడం లేదని ఒక అధ్యయనాన్ని ఉల్లేఖిస్తూ ‘బ్లూమ్బెర్గ్’లో ఒక కథనం ప్రచురితమైంది. లండన్లోని కింగ్స్ కాలేజీకి చెందిన ఇద్దరు పరిశోధకులు అధునాతనమైన గణాంక విధానాన్ని ఉపయోగించడమే కాకుండా, 18 పురోగామి ఆర్థిక వ్యవస్థలు అనుసరించిన విధానాలను పరిశీలించారు. సాక్ష్యాధారాలు లేకుండా అనుభవపూర్వకంగా చాలామంది ఇంతకాలంగా చెబుతున్నదాన్ని వీళ్లు ససాక్ష్యంగా నిరూపించారు. అనేకమంది భారతీయ ఆర్థికవేత్తలు కార్పొరేట్ పన్నులను తగ్గించాల్సిన అవసరాన్ని సమర్థించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఈ ఇద్దరు పరిశోధకుల అధ్యయనం (కొద్దిమంది ఇతరులు కూడా) స్పష్టంగా ఒక విషయాన్ని బయటపెట్టింది. పన్ను రాయితీ అనేది ఆర్థిక పురోగతికి సహాయం చేయలేదు. అది మరిన్ని ఉద్యోగావశాలను కూడా కల్పించలేదు. డబ్బును తేరగా అత్యంత సంపన్నుల జేబుల్లో పోయడం ద్వారా ఇప్పటికే ఉన్న సంపద అసమానత్వాన్ని మరింతగా పెంచడంలో పన్ను రాయితీ సాయపడింది. భారతదేశంలో రైతులతో సహా పేదలకు అందిస్తున్న ఉచితాలను ‘పప్పు బెల్లాల’ సంస్కృతి అంటూ ఎన్నో వార్తాపత్రికల కథనాలు ధ్వజమెత్తుతున్నాయి. అదే సమయంలో కార్పొరేట్ సంస్థలకు అంది స్తున్న భారీ స్థాయి ఉచితాల గురించి ఇవి ఏమాత్రం ప్రస్తావించడం లేదు. కొద్దిమంది వ్యాఖ్యాతలను మినహాయిస్తే– మాఫీలు, ట్యాక్స్ హాలిడేలు, ఉద్దీపన ప్యాకేజీలు, పన్ను తగ్గింపులు వంటి కార్పొరేట్ సబ్సిడీల విస్తృతి, స్వభావాన్ని చాలామంది దాచిపెడుతున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు ‘ఫలితం ఇవ్వని ఉచితాలు’ అంటూనే, ఆ మాటకు అర్థమేమిటో స్పష్టంగా నిర్వచించలేక పోయినప్పటికీ, భారత్లో కార్పొరేట్ పన్నుల తగ్గింపు కూడా ఈ విభాగంలోనే చేరతుందని అంతర్జాతీయ అధ్యయనాలు తెలుపు తున్నాయి. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త జెఫ్రీ సాచెస్ను గతంలో ఒక ప్రశ్న అడిగారు. పారిశ్రామిక ఉత్పత్తిని ఏమాత్రం పెంచనప్పుడు లేదా అదనపు ఉద్యోగాలను సృష్టించలేకపోయినప్పుడు కార్పొరేట్లకు భారీస్థాయి పన్ను తగ్గింపు ద్వారా ఏం ఫలితం దక్కింది అని ప్రశ్నించారు. పన్ను రాయితీల ద్వారా ఆదా అయిన డబ్బు కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ల జేబుల్లో పడిందని ఆయన క్లుప్త సమాధానం ఇచ్చారు. కొన్ని ప్రముఖ ఆర్థిక వ్యవస్థల్లో కేంద్ర బ్యాంకులు వాస్తవంగా అత్యంత ధనవంతుల జేబుల్లోకి చేరేలా అదనపు డబ్బును ముద్రించాయి. 2008–09 కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిన రోజుల్లో పరిమాణాత్మక సడలింపు అనే పదబంధాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. ఈ పేరుతో ధనిక దేశాలు 25 లక్షల కోట్ల డాలర్ల అదనపు డబ్బును ముద్రించాయి. తక్కువ వడ్డీరేటుతో, అంటే సుమారు రెండు శాతంతో ఫెడరల్ బాండ్ల రూపంలో ఆ సొమ్మును సంపన్నులకు జారీ చేశాయి. ఈ మొత్తం డబ్బును వాళ్లు అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్ మార్కెట్లలో మదుపు చేశారు. అందుకే ఆ కాలంలో బుల్ మార్కెట్లు ఎలా పరుగులు తీశాయో చూశాం. మోర్గాన్ స్టాన్లీకి చెందిన రుచిర్ శర్మ ఒక వ్యాసంలో కరోనా మహమ్మారి కాలంలో జరిగిన తతంగంపై రాశారు. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో 9 లక్షల కోట్ల డాలర్ల నగదును అదనంగా ముద్రించారనీ, కునారిల్లిపోయిన ఆర్థిక వ్యవస్థలకు ఉద్దీపన ప్యాకేజీలను అందించడమే దీని లక్ష్యమనీ చెప్పారు. కానీ ఉద్దీపన ప్యాకేజీల కోసమని కేటాయించిన ఈ మొత్తం నగదు స్టాక్ మార్కెట్ ద్వారా అత్యంత సంపన్నుల జేబుల్లోకి వెళ్లిపోయిందని వెల్లడించారు. ఈ భారీమొత్తం ఏ రకంగా చూసినా ఉచితాల కిందకే వస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కల్లోల పరిస్థితుల్లో ఉన్న 2008–09 కాలంలో భారతదేశంలో 1.8 లక్షల కోట్ల రూపాయలను ఆర్థిక ఉద్దీపన పేరుతో పరిశ్రమ వర్గాలకు అందుబాటులో ఉంచారు. ఈ భారీ ప్యాకేజీని ఒక సంవత్సరం తర్వాత ఉపసంహరించుకోవాలి. కానీ ఒక వార్తా నివేదిక ప్రకారం, ప్రభుత్వంలో ఎవరో ‘నల్లాను ఆపేయడం’ మర్చిపోయారు. దీని ఫలితంగా ఉద్దీపన కొనసాగుతూ వచ్చింది. మరో మాటల్లో చెప్పాలంటే, ఆ తర్వాత పదేళ్ల కాలంలో భారత పరిశ్రమ దాదాపుగా రూ. 18 లక్షల కోట్ల డబ్బును ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా అందుకుంది. దీనికి బదులుగా ఈ మొత్తాన్ని వ్యవసాయ రంగానికి అందుబాటులోకి తెచ్చి ఉంటే, ప్రధానమంత్రి కిసాన్ పథకంలో భాగంగా మన రైతులకు యేటా ఒక్కొక్కరికి 18 వేల రూపాయల మేరకు అదనంగా ప్రత్యక్ష నగదు మద్దతు కింద అంది ఉండేది. సెప్టెంబర్ 2019లో భారత పరిశ్రమకు మరోసారి రూ. 1.45 లక్షల కోట్ల పన్నులను ప్రభుత్వం తగ్గించింది. చాలామంది ఆర్థిక వేత్తలు గ్రామీణ డిమాండును ప్రోత్సహించడం కోసం ఆర్థిక ఉద్దీపనను అందించాలని కోరుతున్న సమయంలో మళ్లీ కార్పొరేట్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కరుణించింది. దాదాపు రూ.2.53 లక్షల కోట్ల మేరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేసినప్పుడు రుణ సంస్కృతిని అవి విచ్ఛిన్నపరుస్తున్నాయని ఆర్థికవేత్తలు ఆరోపించారు. కానీ భారీ ఎత్తున కార్పొరేట్ రుణాలను మాఫీ చేయడం వల్ల ఆర్థిక పురోగతికి దారి తీస్తుందని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. గత అయిదేళ్లలో రూ. 10 లక్షల కోట్ల కార్పొరేట్ నిరర్థక రుణాలను కొట్టేసినట్లు ప్రభుత్వం ఇటీవలే పార్లమెంటుకు తెలిపింది. కార్పొరేట్ పన్నులు తగ్గించడం ద్వారా వచ్చే ప్రయోజనాలు సగటు మనిషిని చేరుకోలేదు. సంపన్నులు మాత్రమే వాటినుంచి లబ్ధిపొందారు. ఇది సంపన్నులకు, పేదలకు మధ్య అంతరాన్ని మరింతగా పెంచింది. వ్యవసాయ రుణాలను మాఫీచేసినప్పుడు బ్యాంకులు తమకు రావలసిన అసలు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డిమాండ్ చేసి మరీ తీసుకుంటాయి. కానీ కార్పొరేట్ రుణాలను మాఫీ చేసినప్పుడు బ్యాంకులు పైసా డబ్బును కూడా వసూలు చేయలేక దెబ్బతింటాయి. దేశంలో రుణాలు చెల్లించే సామర్థ్యం ఉండి కూడా ఎగవేస్తున్న సంస్థలు 10 వేల వరకు ఉంటాయి. రెండు వేలమంది రైతులు తీసుకున్న రుణాలను చెల్లించలేదని జారీ చేసిన అరెస్టు వారెంట్లను కొన్ని నెలలక్రితం పంజాబ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కానీ ఉద్దేశ పూర్వకంగా రుణాలు ఎగ్గొడుతున్న వారిని మాత్రం స్వేచ్ఛగా వదిలేస్తున్నారు. మునుపటి ప్రణాళికా సంఘం సబ్సిడీపై కార్యాచరణ పత్రాన్ని రూపొందించింది. న్యూఢిల్లీలో ఎకరాకు రూపాయి చొప్పున 15 ఎకరాల భూమిని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి సబ్సిడీల పేరిట అప్పనంగా ధారపోశారని ఇది బయటపెట్టింది. ఐటీ రంగంతో సహా ప్రైవేట్ ఆసుపత్రులు, పరిశ్రమలకు తరచుగానే చదరపు మీటరుకు ఒక రూపాయి చొప్పున భూమిని ధారపోస్తున్నారు. అదే సమయంలోనే మౌలిక వసతుల కల్పనకు, వడ్డీ, మూలధనం, ఎగుమతులతో పాటు విద్యుత్, నీరు, ముఖ్యమైన సహజ వనరులకు కూడా సబ్సిడీలు అందిస్తున్నారు. ఇవి చాలవన్నట్లుగా పలు రాష్ట్రాలు నూరు శాతం పన్ను మినహాయింపు, ‘ఎస్జీఎస్టీ’ మినహాయింపు వంటి ప్రోత్సాహకాలను అందజేస్తున్నాయి. ఈరకంగా కార్పొరేట్ ఇండియా కూడా భారీ సబ్సిడీలు, ఉచితాల మీదే ఎలా బతుకీడుస్తోంది అనేది అధ్యయనం చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. దీంతో అమూల్యమైన వనరులు హరించుకుపోతున్నాయి. పేదలకు కొద్ది మొత్తం ఉచితాలు మిగులుతున్నాయి. - దేవీందర్ శర్మ ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మొండి రుణ ఖాతాలపై ఆర్బీఐ కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: మొండి రుణ ఖాతాను (ఎన్పీఏ) స్టాండర్డ్ ఖాతాగా మార్చే విషయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాల అమలు గడువును ఈ ఏడాది సెప్టెంబర్ వరకు పొడిగిస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది నవంబర్లో ఈ మార్గదర్శకాలను బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు ఆర్బీఐ ప్రకటించడం గమనార్హం. వీటి అమలుకు 2021 డిసెబంబర్ 31 వరకు ఇచ్చిన గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఎన్బీఎఫ్సీలు చేసిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్గదర్శకాల కింద బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఎన్పీఏగా గుర్తించిన ఏదైనా ఖాతాను తిరిగి స్టాండర్డ్ ఖాతాగా (సకాలంలో చెల్లింపులు చేసే) మార్చొచ్చు. సదరు ఎన్పీఏ ఖాతాదారు పూర్తి రుణం, వడ్డీ చెల్లింపులు చేసినట్టయితేనే ఇలా చేయడానికి అనుమతించింది. కొన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఎన్పీఏ ఖాతాలను కేవలం వడ్డీ చెల్లింపులు చేసిన వెంటనే స్టాండర్డ్గా మారుస్తున్నట్టు ఆర్బీఐ దృష్టికి వచ్చింది. దీంతో కేవలం వడ్డీ కాకుండా, అసలు రుణ బకాయిలు చెల్లించిన వాటినే అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. -
బ్యాంకులకు ఆర్బీఐ షాక్ !
ముంబై: మొండి బకాయిల (ఎన్పీఏలు) గుర్తింపు విషయంలో నిబంధనలను ఆర్బీఐ కఠినతరం చేసింది. నిర్ణీత వ్యవధి వరకు రుణానికి సంబంధించి చెల్లింపులు చేయకపోతే నిబంధనల కింద ఆయా ఖాతాను ఎన్పీఏగా బ్యాంకులు ప్రకటించి, కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. అయితే ఎన్పీఏ ఖాతాలకు సంబంధించి కేవలం వడ్డీ చెల్లింపులు వచ్చినంత మాత్రాన, వాటిని స్టాండర్డ్ ఖాతాలుగా మార్చొద్దంటూ ఆర్బీఐ తాజాగా బ్యాంకులను కోరింది. ఆయా ఖాతాల విషయంలో వడ్డీతోపాటు, అసలు చెల్లింపులు, వాటికి నిర్ణీత గడువులను పేర్కొనాల్సిందేనని తన తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. కొన్ని బ్యాంకులు ఎన్పీఏల ఖాతాల విషయంలో కేవలం వడ్డీ చెల్లింపులను లేదా పాక్షిక వడ్డీ చెల్లింపులను స్వీకరించి స్టాండర్డ్ ఖాతాలుగా మారుస్తున్నట్టు ఆర్బీఐ దృష్టికి రావడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. -
ప్రభుత్వం ఆదుకోకపోతే బ్యాంకింగ్కు కష్టాలే..
ముంబై: ప్రపంచంలోనే అత్యధిక మొండి బకాయిల (ఎన్పీఏ) భారం మోస్తున్న భారత్ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్కు కేంద్రం సహాయక చర్యలు అందకపోతే పరిస్థితి మరింత విషమిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు గవర్నర్లుగా బాధ్యతలు నిర్వహించిన నలుగురు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఒక పుస్తకంలో ఈ వివరాలు వెల్లడికానున్నాయి. ‘మహమ్మారి: భారత ఘన బ్యాంకింగ్ కష్టాలు’ పేరుతో పబ్లిషింగ్ హౌస్– రోలీ బుక్స్ ఆవిష్కరించనున్న పుస్తక రచనలో భాగంగా రచయిత, ప్రముఖ పాత్రికేయులు తమల్ బందోపాధ్యాయ నలుగురు గవర్నర్లను ఇంటర్వ్యూ చేశారు. అసలు మొండిబకాయిల సమస్యలకు కారణాలపై గవర్నర్లు విభిన్నంగా స్పందించినప్పటికీ బ్యాంకింగ్ విలీనాలు, పరిపాలనా, బ్యాంకుల విషయంలో ప్రభుత్వ యాజమాన్యంపై ఒకే విధంగా స్పందించడం గమనార్హం. విలీనాలు, భారీ బ్యాంకింగ్ ఏర్పాటుతో సమస్య తీరిపోదని వారు పేర్కొన్నారు. బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలు తగ్గాలని, పాలనా వ్యవస్థ మెరుగుపడాలనీ సూచించారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం... ఈ ఇంటర్వ్యూల్లో నలుగురు గవర్నర్లూ ఏమన్నారంటే... అత్యుత్సాహమూ కారణమే కంపెనీల భారీ పెట్టుబడులు, రుణాలు అందించడంలో బ్యాంకర్ల అత్యుత్సాహం ఎన్పీఏలు భారీగా పెరిగిపోడానికి కారణమయ్యాయి. ఆర్థిక మందగమనం మొండిబకాయిల తీవ్రతకు ఒక కారణం అయితే, సత్వర చర్యలు తీసుకోవడంలో వైఫల్యం కూడా సమస్యను మరింత జఠిలం చేసింది. మొండిబకాయిల సత్వర గుర్తింపు, తగిన భారీ మూలధన కల్పన, బ్యాంకింగ్ పాలనా వ్యవస్థ పటిష్టం తక్షణం అవసరం. ఈ దిశలో చర్యలు ఉండాలి. – డాక్టర్ రఘురామ్ రాజన్ (గవర్నర్గా.. 2013–2016) అతి పెద్ద సమస్య అవును. భారత్ బ్యాంకింగ్ మొండిబకాయిలు భారీ, వాస్తవ సమస్య. ఈ సమస్య సత్వర పరిష్కారంపై దృష్టి పెట్టాలి. అసలే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు మహమ్మారితో మరింత విషమించాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ముందే ప్రారంభమైన మొండిబకాయిల సమస్య, అటు తర్వాతా కొనసాగింది. కొన్ని అననుకూల పాలనాపరమైన సమస్యల వల్ల మొండిబకాయిలను తరువాత అదుపుచేయలేకపోవడం చోటుచేసుకుంది. – దువ్వూరి సుబ్బారావు (బాధ్యతల్లో.. 2008–2013) ఇతర ఇబ్బందులకూ మార్గం బ్యాంకుల్లో ఉన్న మొండిబకాయిల సమస్య కేవలం అక్కడితో ఆగిపోదు. ఇతర సమస్యలకూ ఇది దారితీస్తుంది. బలహీన ఫైనాన్షియల్ పరిస్థితులు, మొండిబకాయిలు వాస్తవ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్నాయి. రుణాల పెంపునకు వచ్చిన ఒత్తిడులు కూడా మొండిబకాయిల భారానికి కారణం. 2015–16 రుణ నాణ్యత సమీక్ష తరువాత ఆర్థిక వ్యవస్థ విస్తృతమయినప్పటికీ, రుణాల్లో వృద్ధి లేకపోవడం ఇక్కడ గమనార్హం. – వై. వేణుగోపాల్ రెడ్డి (విధుల్లో.. 2003–2008) పెద్ద నోట్ల రద్దు... సంక్షోభం! బ్యాంకింగ్ వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు ‘ప్రణాళికా బద్దంగా జరగని’’ నోట్ల రద్దుతో మరింత తీవ్రమయ్యాయి. నోట్ల రద్దు ఒక ఆర్థిక సంక్షోభంగా పేర్కొనవచ్చు. బ్యాంకింగ్ వ్యవస్థలో సమస్యకు ఈ వ్యవస్థమాత్రమే కారణం కాదు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, పాలనాపరమైన అంశాలెన్నో ఇక్కడ ప్రతిబింబిస్తుంటాయి. పాలనాపరమైన లోపాలను సవరించడం ద్వారా బ్యాంకింగ్ రంగాన్ని ఒక గాడిన పెట్టడం సాధ్యమవుతుంది. – సీ. రంగరాజన్ (పదవీకాలం..1992–1997) -
జీఏఈఎల్, నాగార్జునా జూమ్- సింటెక్స్ బోర్లా
రేపటి నుంచి మార్కెట్లు మూడు రోజులపాటు పనిచేయని కారణంగా గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ కౌంటర్ నేటి నుంచి ఎక్స్స్ల్పిట్గా ట్రేడవుతోంది. కంపెనీ రూ. 2 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 1 ముఖ విలువగల 2 షేర్లుగా విభజించింది. ఇతర వివరాలు చూద్దాం.. జీఏఈఎల్ షేర్ల విభజనకు అక్టోబర్ 5 రికార్డ్ డేట్ కావడంతో గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్(జీఏఈఎల్) కౌంటర్కు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. దీంతో ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 20 శాతం దూసుకెళ్లి రూ. 128ను తాకింది. ఆపై కొంత వెనకడుగుతో రూ. 122 వద్ద ట్రేడవుతోంది. ఇది 12 శాతం లాభంకాగా.. బుధవారం ముగింపు రూ. 218తో పోలిస్తే.. రూ. 110 దిగువన ప్రారంభమైంది. మార్కెట్లకు మూడు రోజులు సెలవులు కావడంతో నేటి(గురువారం) నుంచి ఎక్స్స్ల్పిట్లో ట్రేడింగ్ ప్రారంభమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎన్ఎఫ్సీఎల్ ఈ ఏడాది(2020-21) తొలి త్రైమాసికంలో నాగార్జునా ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్(ఎన్ఎఫ్సీఎల్) రూ. 85.3 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ1లో రూ. 113 కోట్ల నష్టం నమోదైంది. కాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ క్యూ1(ఏప్రిల్-జూన్)లో మొత్తం ఆదాయం రూ. 347 కోట్ల నుంచి రూ. 464 కోట్లకు ఎగసింది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఎన్ఎఫ్సీఎల్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకావడంతో రూ. 4.35 వద్ద ఫ్రీజయ్యింది. సింటెక్స్ ఇండస్ట్రీస్ సింటెక్స్ ఇండస్ట్రీస్కు చెందిన రుణ ఖాతాలలో రూ. 1,203 కోట్లమేర మోసాలు జరిగినట్లు ఆర్బీఐకి పీఎస్యూ సంస్థ పంజాజ్ నేషనల్ బ్యాంక్ నివేదించింది. ఈ రుణాలు ఎన్పీఏలుకాగా.. ఇప్పటికే ఈ ఖాతా కింద రూ. 215 కోట్లకు ప్రొవిజన్లు చేపట్టినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో సింటెక్స్ ఇండస్ట్రీస్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం లోయర్ సర్క్యూట్ను తాకింది. కొనుగోలుదారులు లేకపోవడంతో రూ. 2 వద్ద ఫ్రీజయ్యింది. -
బ్యాంకులపై ‘మొండి’బండ!
ముంబై: భారత్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల (ఎస్సీబీ) మొండి బకాయిల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు స్పష్టమైపోయాయి. 2021 మార్చి నాటికి మొత్తం అన్ని బ్యాంకుల రుణాల్లో స్థూల మొండి బకాయిలు (జీఎన్పీఏ) 12.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని శుక్రవారంనాడు విడుదల చేసిన ద్వైవార్షిక ఆర్థిక వ్యవహారాల స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్)లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఆర్థిక అనిశ్చిత పరిస్థితి మరింత విషమిస్తే, ఈ రేటు ఏకంగా 14.7 శాతానికీ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని విశ్లేషించింది. 2020 మార్చి నాటికి మొత్తం బ్యాంకింగ్ జీఎన్పీఏ రేటు కేవలం 8.5 శాతంగా ఉన్న విషయం గమనార్హం. ఆర్థికాంశాలకు సంబంధించి ఆర్బీఐ తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ► పలు క్షేత్ర స్థాయి ఆర్థిక అంశాల ప్రాతిపదికన బ్యాంకింగ్ తాజా పరిస్థితిని అధ్యయనం చేయడం జరిగింది. ఇందులో ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) వృద్ధిరేటు, జీడీపీలో ద్రవ్యలోటు నిష్పత్తి, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వంటివి ఉన్నాయి. ► మార్చి నుంచి ఆగస్టు వరకూ రుణాల చెల్లింపులపై మారటోరియం అమలవుతోంది. ఈ మారటోరియం ప్రభావం బ్యాంకింగ్పై ఏ స్థాయిలో ఉంటుందన్న విషయం ఇంకా అస్పష్టంగా ఉంది. దీని గురించి ఇప్పుడే చెప్పడం కష్టం. ► ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే– జీఎన్పీఏ నిష్పత్తి 2021 మార్చి నాటికి 15.2 శాతానికి చేరే వీలుంది. 2020 మార్చిలో ఈ రేటు 11.3 శాతం. ► ప్రైవేటు బ్యాంకుల విషయంలో ఈ రేటు 4.2 శాతం నుంచి 7.3 శాతానికి చేరవచ్చు. ► విదేశీ బ్యాంకుల విషయంలో జీఎన్పీఏల నిష్పత్తి 2.3 శాతం నుంచి 3.9 శాతానికి పెరగవచ్చు. ► ఇక కనీస పెట్టుబడుల నిష్పత్తి (క్యాపిటల్ అడిక్వసీ రేషియో –సీఆర్ఏఆర్) 2020 మార్చిలో 14.6 శాతం ఉంటే, 2021 మార్చి నాటికి 13.3 శాతానికి తగ్గే వీలుంది. పరిస్థితి మరింత విషమిస్తే, ఈ రేటు 11.8 శాతానికీ పడిపోయే వీలుంది. కనీస పెట్టుబడుల నిష్పత్తిని కొనసాగించడంలో ఐదు బ్యాంకులు పూర్తిగా విఫలం కావచ్చు. ► నిజానికి 2018–19 తో పోల్చితే 2019–20 లో బ్యాంకింగ్ లాభదాయక నిష్పత్తులు బాగున్నాయి. అయితే 2019–20 ఒక్క ద్వితీయార్ధాన్ని పరిశీలిస్తే ఈ నిష్పత్తులు తగ్గాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లాభదాయక నిష్పత్తులు ఏ స్థాయిలో పడిపోయే అవకాశం ఉందో అర్థం చేసుకోవచ్చు. ► ఒకపక్క తగ్గుతున్న డిపాజిట్లు, మరోపక్క మొండిబకాయిల భారం వెరసి బ్యాంకింగ్ లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్యలనూ ఎదుర్కొనే వీలుంది. ► ఇక ఆర్థిక అంశాల విషయానికి వస్తే, కరోనా మహమ్మారి సవాళ్లు ఎంతకాలం కొనసాగుతాయో చెప్పలేని పరిస్థితి. లాక్డౌన్ ఇంకా పూర్తిస్థాయిలో ఎత్తివేయని పరిస్థితీ ఉంది. ఈ నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమన ఇబ్బందులే ఉంటాయని భావిస్తున్నాం. భారత ఆర్థిక మూలాలు పటిష్టం: శక్తికాంత్ దాస్ కోవిడ్–19 నేపథ్యంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. ప్రభుత్వంతోపాటు ఫైనాన్షియల్ రెగ్యులేటర్లు తీసుకుంటున్న చర్యల వల్ల ఆర్థిక రంగంపై కరోనా ప్రభావాన్ని తగ్గించగలిగాయి. వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, వినియోగదారులు... ఇలా అందరికీ విశ్వాసం సన్నగిల్లకుండా చూడాలంటే ఫైనాన్షియల్ రంగంలో స్థిరత్వం అవసరం. ఈ స్థిరత్వం చెక్కుచెదరకుండా చూడడంపై మేము అధిక దృష్టి సారిస్తున్నాం. బ్యాంకింగ్ విషయానికి వస్తే, ఇబ్బందులను తట్టుకోగలిగిన స్థాయికి ఎదగాల్సిఉంది. ఇందుకు తగిన యంత్రాంగం సమాయత్తం కావాలి. మూలధనాన్ని తగిన స్థాయిల్లో నిలుపుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రుణాల మంజూరీ విషయాల్లో మితిమీరిన అతి జాగ్రత్తలూ మంచిదికాదు. ఇలాంటి ధోరణీ ప్రతికూలతలకు దారితీస్తుంది. లాక్డౌన్ సమయాల్లోనూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి దేశీయ రంగాలు కొన్ని చక్కటి పనితీరునే ప్రదర్శించాయి. భారత్ ఆర్థిక వ్యవస్థలో మొత్తంగా రికవరీ జాడలు కనిపిస్తున్నాయి. ఇక అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు పటిష్టంగా ఉండడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. దివాలా చట్టం నిర్వీర్య యత్నం వల్లే కేంద్రంతో విభేదించా: ఉర్జిత్ ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి 2018 డిసెంబర్లో మధ్యంతరంగా వైదొలగిన ఉర్జిత్ పటేల్ ఎట్టకేలకు ఇందుకు కారణాన్ని వెల్లడించారు. దివాలా చట్టం నిర్వీర్యానికి మోదీ ప్రభుత్వ ప్రయత్నాలే కేంద్రంతో విభేదాలకు కారణమని శుక్రవారం ఆవిష్కరించిన తన పుస్తకంలో పేర్కొన్నారు. రీపేమెంట్లను ఆలస్యం చేస్తున్న డిఫాల్టర్లను తక్షణం డిఫాల్టర్లుగా వర్గీకరించాలని, అలాంటి వ్యక్తులు దివాలా చర్యల సందర్భంగా తిరిగి తమ కంపెనీలను బైబ్యాక్ చేయకుండా నిరోధించాలని బ్యాంకింగ్కు సూచిస్తూ ఆర్బీఐ జారీ చేసిన 2018 ఫిబ్రవరి సర్క్యులర్ మొత్తం వివాదానికి కేంద్ర బిందువైందని తెలిపారు. అయితే దీనిని చట్టరూపంలో తీసుకురావడానికి కేంద్రం నిరుత్సాహాన్ని ప్రదర్శించిందని సూచించారు. -
ఉద్దేశపూర్వక ఎగవేత రూ. 1.47 లక్షల కోట్లు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొండి బకాయిలు సుమారు రూ. 8 లక్షల కోట్లు ఉంటే అందులో ఉద్దేశపూర్వకం(విల్ఫుల్)గా ఎగ్గొట్టిన రుణాల విలువ రూ.1,47,350 కోట్లుగా ఉన్నట్లు ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) అంచనా వేసింది. రూ. 5 కోట్ల పైన రుణం తీసుకొని ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన కంపెనీల వివరాలను బ్యాంకుల వారీగా ఏఐబీఈఏ విడుదల చేసింది. 2019, సెప్టెంబర్ నాటికి 2,426 సంస్థలు రూ. 1.47 లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టాయి. ఇందులో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 685 సంస్థలు రూ. 43,887 కోట్లు ఎగనామం పెట్టాయి. రూ. 500 కోట్లుపైగా రుణం తీసుకొని ఎగ్గొట్టిన కంపెనీలు ఎగ్గొట్టిన రుణాల విలువ రూ. 32,737 కోట్లుగా ఉందని ఏఐబీఈఏ అంచనా వేసింది. రూ. 200 కోట్లుపైన రుణం తీసుకొని ఎగ్గొట్టిన కంపెనీలన్నీ కలిపి రూ. 67,609 కోట్లు రుణం ఎగవేశాయి. టాప్–20లో రెండు తెలుగు కంపెనీలు ► రుణాలు ఎగ్గొట్టిన టాప్–20 కంపెనీల్లో రెండు తెలుగు కంపెనీలున్నాయి. ► టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ రెండు బ్యాంకులకు రూ. 1,217 కోట్లు బకాయి పడింది. ► హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కోస్టల్ ప్రాజెక్టŠస్ రూ. 984 కోట్లు ఎగవేసింది. ► ఉద్యోగులు కష్టపడి బ్యాంకులను లాభాల్లోకి తీసుకువస్తే ఉద్దేశపూర్వక ఎగవేతదారులతో రూ. లక్షల కోట్లు నష్టపోవాల్సి వస్తోందని ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి బీఎస్ రాంబాబు అన్నారు. ► గడిచిన నాలుగేళ్లుగా ప్రభుత్వరంగ బ్యాంకులు అన్ని కలిపి రూ. 8,16,135 కోట్ల నిర్వహణ లాభం సంపాదిస్తే ఎగవేతదారుల రుణాలకు ఎన్పీఏలకు కేటాయింపు చేయడం వల్ల చివరికి రూ. 1,81,358 కోట్ల నష్టాలను ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలా పెద్ద మొత్తంలో ప్రజాధనం ఎగువేతదారుల వల్ల నష్టపోవాల్సి వస్తోందని, కాబట్టి వీరందరిపై తక్షణం క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఏఐబీఈఏ డిమాండ్ చేస్తోందన్నారు. -
రూ 3 లక్షల కోట్ల మొండి బకాయిలను వసూలు చేశాం
-
3 లక్షల కోట్ల మొండి బకాయిల వసూలు
సాక్షి, న్యూఢిల్లీ : రూ 3 లక్షల కోట్ల మొండి బకాయిలను వసూలు చేశామని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పార్లమెంట్లో శుక్రవారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన గోయల్ జీడీపీ వృద్ధిరేటులో గణనీయ పురోగతి సాధిస్తున్నామన్నారు. మోదీ సర్కార్ దేశ ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరిచిందన్నారు. 2022లోగా నవభారత్ను చూడబోతున్నామని చెప్పుకొచ్చారు. ధరల నడ్డివిరిచి సామాన్యుడికి ఊరట కల్పించామన్నారు. అవినీతిరహిత పాలనను తీసుకువచ్చామన్నారు. నాలుగేళ్లలో 1.53 కోట్ల ఇళ్లు నిర్మించామన్నారు. -
విచ్చలవిడి రుణాలతో కుదేలైన బ్యాంకులు..
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులు మొండిబకాయిలతో సతమతమయ్యేందుకు 2008 నుంచి 2014 వరకూ విచ్చలవిడిగా రుణాలు ఇవ్వడమే కారణమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. బ్యాంకులు విచక్షణ లేకుండా రుణాలు జారీ చేస్తుంటే అడ్డుకోవడంలో ఆర్బీఐ విఫలమైనందునే ప్రస్తుతం బ్యాంకింగ్ పరిశ్రమలో ఎన్పీఏ సంక్షోభం నెలకొందన్నారు. ద్రవ్య విధాన నిర్ణేతల స్వతంత్రతపై ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ మధ్య తీవ్రస్ధాయిలో విభేదాలు నెలకొన్నాయనే వార్తల నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రపంచ ఆర్థిక మందగమనం అనంతరం 2008 నుంచి 2014 మధ్య ఆర్థిక వ్యవస్థను కృత్రిమంగా పెంచేందుకు బ్యాంకులను విపరీతంగా రుణాలు ఇవ్వాలని అప్పటి పాలకులు కోరారని ఇండియా లీడర్షిప్ సమ్మిట్లో ప్రసంగిస్తూ జైట్లీ పేర్కొన్నారు. ఈ క్రమంలో రుణ వృద్ధి సగటు 14 శాతం కాగా, ఓ ఏడాది అసాధారణంగా 31 శాతానికి ఎగబాకిందన్నారు. బ్యాంకులు అడ్డగోలుగా రుణాలిస్తుంటే ఆర్బీఐ అడ్డుకోలేదన్నారు. మరోవైపు బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులను నియంత్రించేందుకు ఆర్బీఐకి మరిన్ని అధికారాలు ఇవ్వాలని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆచార్య కేంద్రాన్ని కోరారు. స్థూల ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు ఆర్బీఐకి విస్తృత అధికారాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. -
ప్రమాదంలో 10వేల ఉద్యోగాలు
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగు చూసిన భారీ కుంభకోణంతో, వేల సంఖ్యలో ఉద్యోగాలు ప్రమాదంలో పడబోతున్నాయి. జెమ్స్ అండ్ జువెల్లరీ రంగంలో పనిచేసే దాదాపు 10వేల మంది ఉద్యోగులపై పీఎన్బీ స్కాం ప్రతికూల ప్రభావం చూపనుందని తాజా రిపోర్టు వెల్లడించింది. నీరవ్ మోదీ సంస్థలు, గీతాంజలి గ్రూప్కు చెందిన వ్యాపారాల్లో ఆందోళనలు కొనసాగుతుండటంతో, ఈ ప్రభావం జువెల్లరీ రంగంపైనా పడుతోందని పేర్కొంది. అంతేకాక బ్యాంకింగ్ రంగంలో 11 శాతంగా ఉన్న జెమ్స్, జువెల్లరీల నిరర్థక ఆస్తులు, 30 శాతానికి పెరుగనున్నాయని కేర్ రేటింగ్స్ రిపోర్టు వెల్లడించింది. నీరవ్ మోదీ సంస్థలు, ఆయన అంకుల్ మెహుల్ చౌక్సికి చెందిన సంస్థలు కలిసి తమ బ్యాంకులో దాదాపు రూ.12,700 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ భారీ కుంభకోణం వెలుగులోకి రాగానే ఇరువురికి చెందిన సంస్థలపై దర్యాప్తు ఏజెన్సీలు కొరడా ఝుళిపించాయి. దీంతో తాము వేతనాలు చెల్లించే పరిస్థితిలో లేమని, వేరేది చూసుకోడంటూ నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిలు తన ఉద్యోగులకు లేఖ రాశారు. గీతాంజలి గ్రూప్, నీరవ్ మోదీ సంస్థలు మూత ప్రభావం: జువెల్లరీ రంగంలో విదేశీ వాణిజ్యం 2018-19లో 5 శాతం నుంచి 6 శాతం తగ్గనుంది. మొత్తంగా జువెల్లరీ విక్రయాలపై 16 శాతం ప్రభావం పడనుంది ఈ రెండు సంస్థలకు చెందిన 3వేల మంది శాశ్వత ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. మరో 7వేల నుంచి 8వేల మంది తాత్కాలిక ఉద్యోగులపైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం జువెల్లరీ రంగంలో ఎన్పీఏలు 30 శాతం పెరుగనున్నాయి బ్యాంకులపై ఎన్పీఏల ప్రభావం జువెల్లరీ రంగానికి ఇచ్చిన రుణాలు రూ.21వేల కోట్లకు పైన ఉన్నాయి. వీటిలో ఎక్కువగా గీతాంజలి జెమ్స్, నీరవ్ మోదీ కంపెనీలకు బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ.16వేల కోట్ల నుంచి రూ.17వేల కోట్ల వరకు ఉన్నట్టు ఆర్బీఐ డేటాలో తెలిసింది. కేవలం ఉద్యోగవకాశాలు, బ్యాంకులపైనే కాక, ఈ స్కాం అంతర్జాతీయ వ్యాపారం, దేశీయ రెవెన్యూలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుబాటులో ఉన్న 22 కంపెనీల డేటా ప్రకారం జువెల్లరీ రంగంలో మొత్తం 22వేల మంది ఉద్యోగులున్నారు. నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిలకు చెందిన కంపెనీల్లోనే 12-15 శాతం మంది ఉద్యోగులున్నారని కేర్ రేటింగ్స్ తెలిపింది. దేశంలో గీతాంజలి జెమ్స్ అతిపెద్ద జువెల్లరీ రిటైలర్స్గా ఉంది. దీని మార్కెట్రూ.3,90,000 కోట్లు. -
మొండి బకాయిల భారం మరింత తీవ్రం!
న్యూఢిల్లీ: బ్యాంకుల మొండిబకాయిల (ఎన్పీఏ) భారం మరింత పెరిగే ప్రమాదం ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (పీఎంఈఏసీ) చైర్మన్ సీ. రంగరాజన్ విశ్లేషించారు. ఆర్థిక మందగమన పరిస్థితులు దీనికి కారణమని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ప్రభుత్వరంగ (పీఎస్యూ) బ్యాంకులు-ఆర్థిక సంస్థల ప్రధాన నిఘా(సీవీఓ), సీబీఐ అధికారుల 5వ వార్షిక సదస్సును ఉద్దేశించి రంగరాజన్ ప్రసంగించారు. మొండి బకాయిల విషయంలో బ్యాంకులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఆర్థిక పరిణామాలను బ్యాంకులు ఎప్పటికప్పుడు అంచనావేసుకుంటూ తగిన చర్యలతో ముందుకు పోవాలని పేర్కొన్నారు. 2010లో రూ.59,924 కోట్లుగా ఉన్న బ్యాంకుల మొండిబకాయిలు 2012లో రూ. 1,17,262 కోట్లకు పెరిగిపోయాయని సిన్హా పేర్కొన్నారు. బ్యాంక్ మొండి బకాయిలపై సీబీఐ దర్యాప్తు ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి భారీ స్థాయిలో రుణాలను ఎగవేసిన వారిపై దర్యాప్తు ప్రారంభించామని సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా బుధవారం చెప్పారు. భారీగా రుణ ఎగవేతలకు సంబంధించి 30 అకౌంట్లను గుర్తించామని, ఈ 30 అకౌంట్ల కారణంగా బ్యాంకుల మొండి బకాయిలు వేల కోట్లకు పెరిగిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఈ అకౌంట్ల వివరాలను వెల్లడిస్తే దర్యాప్తు దారితప్పే అవకాశాలున్నాయని వివరించారు. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించిన చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ల ఐదవ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. మోసాలు, మొండి బకాయిలను గుర్తించడంలో బ్యాంకులు చేస్తున్న జాప్యం కారణంగా వాటిని ట్రాక్ చేయడం, రుణాలను రికవరీ చేయడం తదితర అంశాలపై ప్రభావం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ల వృద్ధిలతో పాటే బ్యాంకింగ్ మోసాలు కూడా పెరిగిపోయాయని చెప్పారు.