offenders
-
ఈయనే నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతున్నట్లుంది సార్!
ఈయనే నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతున్నట్లుంది సార్! -
ఆర్థిక నేరగాళ్లకు బేడీలు వేయొద్దు
న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి బేడీలు వేయరాదని, హత్య, అత్యాచారం వంటి నేరాలకు పాల్పడిన వారితో కలిపి జైలులో ఉంచరాదని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. బేడీలు తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులు తప్పించుకోకుండా నిరోధించడానికి, అరెస్ట్ సమయంలో పోలీసు అధికారులు, సిబ్బంది భద్రత కోసమే పరిమితమని వివరించింది. అలాగే, నిందితులను అరెస్టయిన తర్వాత 15 రోజులకు మించి పోలీస్ కస్టడీలో ఉంచరాదన్న భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎన్ఎస్ఎస్)లో నిబంధనపై సవరణలను సూచించింది. -
శతమానం భారతి: గుర్తింపు చట్టం
బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం 1920లో నేరస్థుల గుర్తింపు చట్టాన్ని ఆమోదించింది. మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైన నెల రోజుల తర్వాత ఈ చట్టం అమలులోకి వచ్చింది. జాతీయవాదం పెల్లుబుకుతున్న వేళ, ప్రజలపై నిఘా పరిధిని విస్తరించడం ద్వారా వారిని మరింతగా నియంత్రించడానికిగానూ బ్రిటిష్ పాలకులు చేసిన ప్రయత్నంలో భాగంగా ఆనాడు నేరస్థుల గుర్తింపు చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం నేరస్థుల ఫొటోగ్రాఫ్లు, వేలిముద్రలు, పాద ముద్రలు వంటివాటిని (కొన్ని పరిమిత కేసుల్లో నేరస్థులు కానివారివి కూడా) భద్రపర్చే అధికారాలను చట్టాన్ని అమలు చేసే అధికారులకు దఖలు పర్చింది. ఇలాంటి వివరాలను భద్రపర్చడానికీ, తొలగించడానికీ మరిన్ని నిబంధనలు తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ 102 సంవత్సరాల తర్వాత, స్వతంత్ర భారతదేశంలో నెహ్రూ తర్వాత సుదీర్ఘ కాలం దేశాన్ని పాలిస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, వలస పాలనా కాలంనాటి చట్టం చేసిన దానికంటే మరింత అధికంగా వ్యక్తిగత డేటాను (అతితక్కువ భద్రతలతో) సేకరించడానికి ప్రయత్నిస్తూ తాజా ముసాయిదా బిల్లును తీసుకొచ్చి నేరస్థుల గుర్తింపు చట్టాన్ని మార్చనుంది. అయితే ఈ అధికారాలను చట్టపరంగా విస్తరించేటప్పుడు వాటిని క్రమబద్ధీకరించ వలసి ఉంటుందన్న ప్రజాభిప్రాయాన్నీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ చట్టంలో కొన్ని మార్పులు, చేర్పులు చేయనుంది. ఇందుకోసం మరింత ప్రజాస్వామికమైన ప్రక్రియను అనుసరించనుంది. (చదవండి: స్వతంత్ర భారతి: షా బానో కేసు) -
ఆర్థిక నేరస్థులను భారత్కు తీసుకొస్తాం
న్యూఢిల్లీ: బడా ఆర్థిక నేరస్థులను స్వదేశానికి రప్పించేందుకు దౌత్యపరమైన, అన్ని రకాల మార్గాలను ఉపయోగించుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీంతో భారత్కు తిరిగి రావడం మినహా వారికి మరో మార్గం అంటూ ఉండదన్నారు. రుణ వితరణ, ఆర్థిక వృద్ధిపై నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా ప్రధాని మాట్లాడారు. ‘ఆర్థిక నేరస్థులను తీసుకొచ్చే విషయంలో విధానాలు, చట్టపరంగా నడుచుకుంటున్నాం. మేమిచ్చే సందేశం సుస్పష్టం. మీ దేశానికి తిరిగి రండి. ఇందుకోసం మా చర్యలు కొనసాగుతూనే ఉంటాయి’ అని పేర్కొన్నారు. అయితే, ప్రత్యేకంగా ఎవరి పేరునూ ప్రధాని ప్రస్తావించలేదు. విజయ్ మాల్యా, నీరవ్మోదీలను తీసుకొచ్చేందుకు భారత్ ఇటీవలి కాలంలో చర్యలను ముమ్మరం చేసిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్యాంకులు వినూత్నంగా పనిచేయాలి.. దేశంలో బ్యాంకుల ఆర్థిక పరిస్థితులు ఎంతో మెరుగుపడినట్టు ప్రధాని మోదీ పేర్కొన్నారు. బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంబంధించి తమ సర్కారు గడిచిన ఏడేళ్లలో ఎన్నో సంస్కరణలను అమలు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్పీఏలు గత ఐదేళ్లలోనే కనిష్ట స్థాయిలకు చేరినట్టు చెప్పారు. చురుకైన చర్యల ద్వారా రూ.5 లక్షల కోట్ల మొండి రుణాలను వసూలు చేసినట్టు పేర్కొన్నారు. ‘‘సంపద సృష్టి కర్తలకు, ఉపాధి కల్పించే వారికి మద్దతుగా నిలవాల్సిన సమయం ఇది. వారికి రుణ వితరణ అందేలా చూడాలి. నిజాయితీ నిర్ణయాల్లో మీకు రక్షణగా నేను ఉంటాను’ అంటూ బ్యాంకులకు మార్గదర్శనం చేశారు. 2022 ఆగస్ట్ 15 నాటికి ప్రతీ బ్యాంకు శాఖ.. పూర్తి డిజిటల్గా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న కనీసం 100 క్లయింట్లను అయినా కలిగి ఉండాలన్న లక్ష్యాన్ని ప్రధాని నిర్ధేశించారు. సొంతంగా 5జీ, 6జీ సామర్థ్యాలు టెలికం రంగానికి సంబంధించి 5జీ, 6జీ టెక్నాలజీల్లో స్వీయ సామర్థ్యాల అభివృద్ధిపై భారత్ పెట్టుబడులు పెడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనికితోడు సెమీ కండక్టర్ల తయారీపైనా దృష్టి సారించినట్టు చెప్పారు. గురువారం ‘సిడ్నీ డైలాగ్’ వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రధాని వర్చువల్(ఆన్లైన్ మాధ్యమంలో)గా మాట్లాడారు. నూతన తరం టెలికం టెక్నాలజీల అభివృద్ధిలో జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలతో కలసి భారత్ పనిచేస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీకి సంబంధించి గొప్ప ఉత్పత్తి డేటాయేనన్నారు. డేటాను కాపాడడం, గోప్యత, భద్రతకు సంబంధించి పటిష్ట కార్యాచరణను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రజా సార్వభౌమాధికారం కోసం డేటాను ఉపయోగించుకుంటామన్నారు. డిజిటల్ డొమైన్లో భారత్ సాధించిన ఘతనను ప్రస్తావించారు. ‘‘క్లౌడ్ ప్లాట్ఫామ్లో సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్నాం. డిజిటల్ సార్వభౌమాధికారానికి ఇది కీలకం. క్వాంటమ్ కంప్యూటింగ్లోనూ ప్రపంచ స్థాయి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్లకు సైబర్ సెక్యూరిటీ పరిష్కారాలు, సేవలను అందించడంలో భారత్ ఇప్పటికే ప్రముఖ కేంద్రంగా ఉంది. సైబర్ సెక్యూరిటీకి సైతం భారత్ను కేంద్రంగా మార్చేందుకు పరిశ్రమతో కలసి టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశాం. సెమీ కండక్టర్ల తయారీకి ప్రోత్సాహకాల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నాం’’ అని ప్రధాని వివరించారు. -
సుప్రీంకోర్టులో నిర్భయ దోషుల క్యూరేటీవ్ పిటిషన్
-
విలాసాలకు మారుపేరు
బ్యాంకులకు రూ.9,000 కోట్లకుపైగా ఎగ్గొట్టి్ట లండన్కు పారిపోయిన విజయ్ మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ముంబై కోర్టు ప్రకటించింది. దీంతో దేశ విదేశాల్లో ఉన్న మాల్యా ఆస్తుల్ని జప్తు చేసే అధికారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు లభించింది. రాజ ప్రాసాదాలను తలపించే భవంతులు, ప్రకృతి సౌందర్యానికి మారుపేరుగా నిలిచే ఎస్టేట్లు, సకల సౌకర్యాలున్న విమానాలు, విలాసవంతమైన నౌకలు, రేసు కార్లు, కోట్లాది రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే మాల్యాకున్న ఆస్తులు కోకొల్లలు. మాల్యా స్థిర చరాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో ఈడీ ఒక జాబితా రూపొందించింది. బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, భూములు, భవంతులను గుర్తించింది. ఈడీ జప్తు చేయడానికి రూపొందించిన జాబితా ఇదే.. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో మాల్యాకు కోట్లాది రూపాయల విలువ చేసే భూము లు, ఫామ్ హౌస్లు ఉన్నాయి. మొత్తం 3.09 లక్షల చదరపు అడుగుల భూమి ఉంది. కర్ణాటక: బెంగళూరులో మాల్స్, మరో నాలుగు గ్రామాల్లో భూములు ఉన్నాయి. వీటి విలువ రూ.1,937.5 కోట్లుగా ఉంది. బెంగళూరులో యూబీ సిటీ మాల్ విలువ రూ.713 కోట్ల వరకు ఉంటుంది. అలాగే రూ.962 కోట్లతో కింగ్ఫిషర్ టవర్ నిర్మాణంలో ఉంది. మహారాష్ట్ర: ముంబై, ఆలిబాగ్లో ఫామ్ హౌస్లున్నాయి. వాటి ఖరీదు రూ.28.02 కోట్లకుపైమాటే. తమిళనాడు: వెల్లూరు జిల్లాలో భూముల విలువ రూ. 1.14 కోట్ల వరకూ ఉంటుంది. ఇవే కాక వివిధ కంపెనీల్లో మాల్యాకు షేర్లు ఉన్నాయి. యూబీఎల్ కంపెనీలో ఆయనకున్న షేర్ల విలువరూ. 8,758 కోట్లు కాగా, యూఎస్ఎల్లో రూ.1,692 కోట్లు, యూబీహెచ్ఎల్ రూ.27 కోట్లు, మెక్డొవెల్ రూ.10 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు ఈడీ జాబితాలో తెలిపింది. ఈడీ జాబితాలో లేనివి మరికొన్ని.. ప్రపంచవ్యాప్తంగా మాల్యాకు ఎస్టేట్లు, భవనాలు మొత్తం రెండు డజన్లకుపైగా ఉన్నాయి. కాలిఫోర్నియాలో 11వేల చ.అ.విస్తీర్ణంలో ఎస్టేట్ ఉంది. దీని విలువ 12 లక్షల డాలర్లు. న్యూయార్క్లోని ప్రఖ్యాతిగాంచిన ట్రంప్ ప్లాజాలో పెంట్ హౌస్, దక్షిణాఫ్రికాలో జోహన్నెస్బర్గ్ సమీపంలో 12,000 హెక్టార్లలో విస్తరించిన మబూలా గేమ్లాడ్జ్, అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఎస్టేట్, ఫ్రాన్స్లోని రివిరా పట్టణానికి సమీపంలోని లగ్జరీ ఎస్టేట్, భారత్లోని కర్ణాటకలో కునిగల్ పట్టణం దగ్గర 400 ఎకరాల్లో విస్తరించిన గుర్రపు శాల(స్టడ్ ఫామ్), గోవాలో రాజభవంతిని తలపించే కింగ్ఫిషర్ విల్లా వంటి స్థిరాస్తులు మాల్యా సొంతం. సొంత పనులకు 4 విమానాలు కింగ్ఫిషర్ వంటి విమానయాన సంస్థను నడిపించిన ప్రముఖ వ్యక్తికి తనకంటూ సొంతంగా విమానం ఉండటం ఏమంత పెద్ద విషయం కాదు. మాల్యా ఎక్కడికి వెళ్లాలన్నా సరే విమానంలోనే వెళ్లేవారు. మొత్తం నాలుగు విమానాలను ఆయన వినియోగించేవారు. ప్రపంచంలోని తనకున్న ఎస్టేట్లలో ఎక్కడికి వెళ్లాలన్నా బోయింగ్ 727 రకం విమానాన్ని వాడేవారు. మాల్యా దగ్గరున్న ఎయిర్బస్ ఏ319 విమానం లండన్ నుంచి అమెరికాకు ఒకే ఒక్క హాల్ట్తో ప్రయాణించగలదు. ఇక హాకర్ హెచ్ఎస్125, గల్ఫ్ స్ట్రీమ్ త్రీ అనే మరో రెండు విమానాలు కూడా ఎప్పడూ మాల్యా కోసం సిద్ధంగా ఉండేవి. తన అభిరుచికి తగ్గట్టుగా ఆ విమానంలో ఆయన సకల అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇవి కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కార్లు విజయ్ మాల్యా వద్ద చాలా ఉన్నాయి. బెంగళూరులోని యూబీ సిటీ మాల్ -
విజయ్ మాల్యా.. పరారైన నేరగాడే
ముంబై: భారత బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్మాల్యాకు మరోషాక్ తగిలింది. మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి(ఎఫ్ఈవో)గా గుర్తిస్తూ ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. తాజా ఆదేశాల నేపథ్యంలో పరారీలో ఉన్న రుణఎగవేతదారుల చట్టం–2018 కింద దేశ, విదేశాల్లోని మాల్యా ఆస్తులన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వీలవుతుంది. ముంబై న్యాయస్థానం ఆదేశాలతో ఎఫ్ఈవోగా గుర్తింపు పొందిన తొలి వ్యాపారవేత్తగా మాల్యా నిలిచారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఈడీ న్యాయవాది డి.ఎన్.సింగ్ వాదిస్తూ.. ప్రస్తుతం బ్రిటన్లో ఉంటున్న మాల్యాను భారత్కు రప్పించేందుకు అన్నిరకాలుగా ప్రయత్నించామని తెలిపారు. అక్కడి న్యాయస్థానం సైతం మాల్యాను భారత్కు అప్పగించాలని తీర్పు ఇచ్చిందన్నారు. కానీ విజయ్మాల్యా మాత్రం భారత్కు రావడం ఇష్టపడటం లేదనీ, ఈ తీర్పును పైకోర్టులో సవాలు చేసేందుకు సిద్ధమవుతున్నారని వెల్లడించారు. అయితే ఈ వాదనల్ని మాల్యా లాయర్లు ఖండించారు. చట్టప్రకారం మాల్యా లండన్ కోర్టు ముందు లొంగిపోయారనీ, ఆతర్వాత బెయిల్ పొందారని కోర్టుకు చెప్పారు. ఫోర్స్ ఇండియా జట్టు డైరెక్టర్ హోదాలో వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ సమావేశంలో పాల్గొనేందుకు బ్రిటన్ వెళ్లారని, ఈడీ చెబుతున్నట్లు మాల్యా రహస్యంగా వెళ్లలేదని తెలిపారు. స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ ఇరుపక్షాల వాదనలు విన్న అక్రమ నగదు చెలామణి నిరోధక(పీఎంఎల్ఏ) కోర్టు జడ్జి ఎం.ఎస్.అజ్మీ స్పందిస్తూ.. ‘ఎఫ్ఈవో చట్టంలోని సెక్షన్ 12(ఐ) కింద ఈడీ చేసిన దరఖాస్తును పాక్షికంగా మన్నిస్తున్నాం. విజయ్మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటిస్తున్నాం. ఆయన ఆస్తుల జప్తు ఫిబ్రవరి 5 నుంచి మొదలవుతుంది’ అని ఉత్తర్వులు జారీచేశారు. వెంటనే మాల్యా తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. కోర్టు తీర్పు పూర్తి కాపీని అందుకునేందుకు, ఎగువ కోర్టులో అప్పీలుకు వీలుగా ఈ ఆదేశాలపై 4 వారాల స్టే ఇవ్వాలన్నారు. దీంతో ఎఫ్ఈవో చట్టం కింద పనిచేస్తున్న కోర్టు తన ఉత్తర్వులపై తానే స్టే ఇచ్చుకోలేదని స్పష్టం చేశారు. రూ.100 కోట్లు, అంతకుమించి మోసానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన వ్యక్తులు అరెస్ట్ వారెంట్ జారీ అయినప్పటికీ స్వదేశానికి వచ్చేందుకు మొగ్గుచూపకపోతే ఎఫ్ఈవోఏ చట్టం కింద వారిని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటిస్తారు. మా చొరవ వల్లే..: బీజేపీ ఎన్డీయే ప్రభుత్వం చొరవ కారణంగానే ముంబైలోని కోర్టు మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తెలిపారు. మాల్యా లాంటి రుణఎగవేతదారులను అరికట్టేందుకు, చట్టం ముందు నిలబెట్టేందుకే ఎన్డీయే ప్రభుత్వం పరారీలో ఉన్న రుణఎగవేతదారుల చట్టం(ఎఫ్ఈవోఏ)–2018 తీసుకొచ్చిందని వెల్లడించారు. అన్నింటికీ బీజేపీ గొప్పలు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ ప్రతీ విషయంలో క్రెడిట్ తీసుకునేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. పారిపోయే ముందు మాల్యా కేంద్ర మంత్రి జైట్లీని కలిసి అనుమతి తీసుకున్నారంది. ‘తమ వల్లే మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా కోర్టు ప్రకటించిందని బీజేపీ నేతలు భావిస్తే అలాగే కానివ్వండి. మంగళ్యాన్, పోఖ్రాన్–1 అణుపరీక్షలు.. ఇలా అన్ని విషయాల్లో క్రెడిట్ అంతా తమదేనని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. తామొచ్చాకే అన్నీ జరిగాయని వాళ్లు భావిస్తున్నారు. ఈ లెక్కన 2019, మే 26న భారత్ తన ఐదో బర్త్డే చేసుకోవాలి’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. వినోదాల కోసం రెండు నౌకలు మాల్యా అంటేనే విందు వినోదాలకు పెట్టింది పేరు. తరచూ భారీ పార్టీలు ఇస్తూ ఉంటారు. దీని కోసం ఆయన ఏకంగా రెండు నౌకలనే కొనుగోలు చేశారు. హెలికాప్టర్లు కూడా దిగడానికి వీలుండే ఈ నౌకల్లో రెండు మెర్సెడెస్ కార్లను కూడా పార్క్ చేసుకునే సదుపాయం ఉంది. ఇక వాటిల్లో ఉండే సౌకర్యాలు ఒక్క మాటలో చెప్పలేం. బార్లు, జిమ్, వైద్యశాల, బ్యూటీ పార్లర్, సమావేశ మందిరాలు అన్నీ అందులోనే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పార్టీలను మాల్యా ఈ నౌకల్లోనే ఇచ్చారు. డచ్ షిప్యార్డ్కు చెందిన ఒక నౌకను మాల్యా 9.3 కోట్ల డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ప్రపంచ ప్రసిద్ధ సినీనటులు సర్ రిచర్డ్ బర్టన్, ఎలిజబెత్ టేలర్ వంటివారు వినియోగించిన క్లజిమా అనే మరో నౌక కూడా మాల్యాకు ఉంది. 1995లో సుమారు కోటి డాలర్లు పెట్టి దీన్ని ఆయన కొనుగోలు చేశారు. ఈ రెండు నౌకల్లో మాల్యా ఇచ్చే పార్టీలకు వీవీఐపీలు సైతం క్యూ కట్టేవారు. -
విజయ్ మాల్యాకు గట్టి షాక్..!
-
విజయ్ మాల్యాకు గట్టి షాక్..!
ముంబై: తొమ్మిది వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగవేసి.. లండన్లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విజయ్ మాల్యాను పరారైన ఆర్థిక నేరస్థుడిగా ప్రకటింటిస్తూ.. ముంబై కోర్టు శనివారం కీలక తీర్పు వెలువరించింది. మాల్యా రుణాల ఎగవేతపై విచారణ చేపట్టిన మనీలాండరింగ్ నిరోధక చట్టం కోర్టు.. పరారైన ఆర్థిక నేరస్థుల చట్టం-2018లోని సెక్షన్ 2ఎఫ్ ప్రకారం అతడిని ఆర్థిక నేరస్థుడిగా గుర్తిస్తూ తీర్పునిచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పరారైన ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద.. గుర్తించబడిన మొదటి నిందితుడిగా మల్యా నిలిచారు. మాల్యా ఆస్తుల జప్తుపై ఫిబ్రవరి 5న కోర్టు వాదనలు విననుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విజ్ఞప్తి మేరకు ముంబై కోర్టు మాల్యా రుణాల ఎగవేతపై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకుని, కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరిగే వారిని కోర్టు ఆర్థిక నేరస్తులుగా గుర్తిస్తుంది. భారత్లోని వివిధ బ్యాంకుల నుంచి మాల్యా 9వేలకోట్ల రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. కాగా కొత్త చట్టం అమలులోకి వచ్చిన తరువాత రుణాల ఎగవేతదారుగా ప్రకటించబడిన మొదటి వ్యక్తి మాల్యానే కావడం విశేషం. -
పరారీలో 58 మంది ఆర్థిక నేరగాళ్లు
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేలకోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన ఆర్థిక నేరగాళ్ల సంఖ్య యాభై ఎనిమిదికి చేరింది. ఈ వైట్కాలర్ నేరగాళ్లను వెనక్కి రప్పించడానికి కేంద్రప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. విజయ్ మాల్యా మాత్రమే కాదు నీరవ్ మోదీ, మొహుల్ చోక్సీ, నితిన్, చేతన్ సందేస్రా, లలిత్ మోదీ, యూరోపియన్ దళారీ గ్యూడో రాల్ఫ్ హస్చకే, కార్ల్ గెరోసాలను వెనక్కి రప్పించడానికి లుక్అవుట్ సర్క్యులర్స్ (ఎల్ఒసీ), ఇంటర్పోల్ ద్వారా నోటీసులు ఇప్పటికే జారీ చేశామని కేంద్రం పేర్కొంది. బ్రిటన్, యూఏఈ, బెల్జియం, ఈజిప్ట్, అమెరికా, అంటిగా, బార్బుడా దేశాల్లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాళ్లను తమకు అప్పగించాల్సిందిగా భారత్ ఆయా దేశాల ప్రభుత్వాలకు అప్పగింత అభ్యర్థనలను సమర్పించింది. ఇప్పటిదాకా చేసిన 16 అప్పగింత అభ్యర్థనలు ఎంతవరకు పురోగతి సాధించాయో అని సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డీఆర్ఐ వంటి సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఆయా ప్రభుత్వాలపై మరింత ఒత్తిడిపెంచుతున్నామని కేంద్ర ప్రభుత్వం లోక్సభకు తెలిపింది. వీవీఐపీ హెలికాప్టర్ల స్కామ్లో మధ్యవర్తిగా వ్యవహరించిన గ్యూడో రాల్ఫ్, కార్లో గెరోసాల అప్పగింత అభ్యర్థన, సంబంధిత నోటీసుల తాజా పరిస్థితిని విదేశాంగ శాఖ లోక్సభకు నివేదించింది. గెరోసా అప్పగింతపై గత ఏడాది నవంబర్లో, గ్యూడో అప్పగింతపై ఈ ఏడాది జనవరిలో అభ్యర్థనలు పంపిస్తే వాటిని ఇటలీ ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపింది. రూ.13 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన మొహుల్ చోక్సీ అప్పగింతపై 2 అభ్యర్థనలు పెండింగ్లో ఉన్నాయి. చోక్సీపై ఇంటర్పోల్ ద్వారా నోటీసులు జారీ అయ్యాయి. గుజరాత్కు చెందిన వ్యాపారి ఆశిష్ జోబన్పుత్ర, ఆయన భార్య ప్రీతిని అమెరికా నుంచి రప్పించడానికి ట్రంప్ సర్కార్కు భారత్ ఇప్పటికే అప్పగింత విజ్ఞప్తులు పంపింది. దీపక తల్వార్ను యూఏఈ నుంచి తీసుకురావడానికి అవసరమైన న్యాయపోరాటం చేస్తోంది. స్టెర్లింగ్ బయోటెక్ ద్వారా బ్యాంకులకు 5వేల కోట్లు ఎగ్గొట్టిన చేతన్, నితిన్, దీప్తి సందేసర, హితేష్కుమార్ పటేల్లపై రెడ్ కార్నర్ నోటీసులు జారీఅయ్యాయి. అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్ను వెనక్కి తీసుకురావడంలో సక్సెస్ సాధించిన బీజేపీ సర్కారు మిగిలిన వారినీ తీసుకువస్తామన్న ఆత్మవిశ్వాసంతో ఉంది. -
ఆర్థిక నేరగాళ్ల బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: బడా ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోకుండా అడ్డుకునేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. ‘పరారీ ఆర్థిక నేరగాళ్ల బిల్లు–2018’ను లోక్సభ గత గురువారమే ఆమోదించగా, రాజ్యసభ బుధవారం ఈ బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ చట్టాలను తప్పించుకుని దేశాన్ని విడిచి పారిపోతున్న ఆర్థిక నేరగాళ్ల సంఖ్య పెరిగిపోతోందనీ, దీనిని అడ్డుకోవాల్సి ఉందని అన్నారు. ప్రస్తుత చట్టాలతో ఆ పనిని సమర్థంగా చేయలేకపోతున్నామన్నారు. వంద కోట్ల రూపాయల కన్నా ఎక్కువ మొత్తంలో మోసం చేసిన వ్యాపారవేత్తలకే ఈ బిల్లులోని నిబంధనలు వర్తిస్తాయి. ‘నేరగాళ్లు పారిపోకుండా ఆపేందుకు సమర్థమైన, వేగవంతమైన, రాజ్యాంగబద్ధమైన విధానాన్ని ఈ బిల్లు ద్వారా తీసుకొచ్చాం’ అని గోయల్ తెలిపారు. ప్రస్తుత చట్టాల ప్రకారం నేరగాళ్లు కోర్టు ముందు హాజరుకానంత వరకు వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ఇప్పటికే ఎన్నో చట్టాలు ఉన్నా ప్రభుత్వ సహకారంతోనే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి ఆర్థిక నేరగాళ్లు దేశాలు దాటి తప్పించుకుపోయారని విపక్షాలు ఆరోపించాయి. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్లపై కాంగ్రెస్ సభ్యులు ఇచ్చిన సభా హక్కుల నోటీసులు తన పరిశీలనలో ఉన్నాయని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. -
కొత్త ఆర్డినెన్స్ : విజయ్ మాల్యాకు సమన్లు
సాక్షి, ముంబై: ప్రభుత్వ బ్యాంకులకు భారీ రుణ ఎగవేత దారుడు, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు తాజాగా మాల్యాకు సమన్లు జారీ చేసింది. భారీగా రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరస్తులపై కొరడా ఝుళిపించేందుకు కొత్తగా ప్రకటించిన ఆర్డినెన్స్ కింద ఆగష్టు 27న, లేదా అంతకుముందు కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. లేదంటే ‘పరారీలో ఉన్న నేరస్థుడి’గా ప్రకటించడంతోపాటు మాల్యాకు చెందిన రూ. 12,500కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. పెండింగ్లో ఉన్నబ్యాంకు బకాయిలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాననీ, ఇందుకు బ్యాంక్ ఆఫ్ కన్సార్షియంతో చర్చలు జరపడానికి ప్రయత్నిస్తున్నట్లు మాల్యా సంసిద్ధత వ్యక్తం చేసిన సందర్భంలో సమన్లు జారీ చేయడం విశేషం. ఈ ఏడాది ప్రారంభంలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్యుజిటివ్ ఎకనామిక్ నేరస్థుల ఆర్డినెన్స్ ప్రకారం రుణదాతల "అన్ని లింక్డ్ ఆస్తులను" స్వాధీనం చేసుకోవడానికి అనుమతి లభిస్తుంది. దేశంలో ఈ ఆర్డినెన్స్ తరువాత ఈడీ తీసుకున్న మొదటి కేసు.. మొదటి చర్య మాల్యాపైనే. ఈ క్రమంలో బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద కుంభకోణంగా నిలిచిన పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితులు, వజ్రాల వ్యాపారి నీరవ్మోదీ, గీతాంజలి జెమ్స్ అధిపతి మెహుల్ చోక్సీ పై చర్యలకు ఈడీ సిద్ధం కానుంది. మరోవైపు మాల్యా బేరానికి దిగొచ్చారన్న వార్తలపై మాల్యా నేడు(శనివారం) స్పందించారు. తనది బేరమైతే..ఈడీ అధికారులు కూడా అదే సిద్ధాంతాన్ని అనుసరించాలంటూ సెటైర్ వేశారు. ఈ సందర్భంగా ట్విటర్లో ఈడీ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తాను బేరసారాలకు ప్రయత్నిస్తున్నానని చెప్పిన ఈడీ అధికారులు ముందు ఈడీ ఛార్జ్షీట్ చదవాలని సలహా యిచ్చారు. అదే నిజమైతే ఈడీ అధికారులుకూడా ఇదే సిద్ధాంతాన్ని అనుసరించి.. ఎక్కడైతే తనఆస్తులు ఉన్నాయో ఆ కోర్టుల్లో ఇలాంటి బేరసారాల ఒప్పందానికి రావాలని ఆహ్వానిస్తున్నానంటూ మాల్యా ట్వీట్ చేశారు. -
నోట్ల రద్దు.. ప్రభుత్వం ఊహించిన దానికంటే
న్యూఢిల్లీ: నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేసిన అనంతరం బ్యాంకుల్లో డిపాజిట్లు ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకు బ్యాంకుల్లో జమ అయిన రద్దు చేసిన పెద్ద నోట్ల విలువ సుమారు 13 లక్షల కోట్లకు దగ్గరగా ఉందని సమాచారం. ఇంతకుముందు 13-14 లక్షల కోట్ల పాత కరెన్సీ బ్యాంకులకు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పటికే డిపాజిట్లు ప్రభుత్వ అంచనాలకు దగ్గరగా చేరుకోవడం.. ఇంకా వచ్చే అవకాశం ఉండటంతో 15.5 లక్షల కోట్ల వరకు ఈ డిపాజిట్లు చేరుకోవచ్చని ప్రభుత్వం తన అంచనాలను సవరించుకుంది. ఇంతకు ముందు ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం నవంబర్ 18 నాటికి 5.4 లక్షల కోట్లు, నవంబర్ 27 నాటికి 8.5 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. అయితే ఇటీవల మాత్రం ఊహించని విధంగా ఈ డిపాజిట్లు పెరిగిపోవడం గమనార్హం. దీంతో నవంబర్ 27 నుంచి భారీ మొత్తంలో జరిగిన డిపాజిట్లను నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇన్కం టాక్స్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ అధికారులు అనుమానిత డిపాజిట్లపై విచారణ జరుపుతున్నాయి. -
నేరస్తుల ‘టోలు’ తీస్తారు!
►రాష్ట్రంలోని టోల్గేట్లన్న ►ఆన్లైన్లో అనుసంధానం ►‘టోల్ ఐ’ పేరుతో అప్లికేషన్ రూపొందిస్తున్న నగర పోలీసులు ►నేరాల నిరోధం, కేసులు కొలిక్కి తీసుకురావడానికి ఉపయుక్తం మహానగరంలో అంతర్రాష్ట్ర, ఇతర జిల్లాల ముఠాలు చేసే నేరాలకు సంబంధించిన కేసుల్ని కొలిక్కి తీసుకురావడం, ‘పొరుగు’ ప్రాంతాల నుంచి వచ్చే నేరస్తులను కట్టడి చేయడం.. చోరీకి గురైన వాహనాల ఆచూకీ త్వరగా కనుక్కోవడం.. ఈ లక్ష్యాలతో నగర పోలీసు విభాగం రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ ‘టోల్ ఐ’. రాష్ట్రంలోని అన్ని టోల్గేట్లను ఆన్లైన్లో అనుసంధానిస్తూ.. ప్రయోగాత్మకంగా అమలులోకి తెచ్చిన ఈ యాప్ త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. - సాక్షి, హైదరాబాద్ కేసు నగరంలో దోపిడీకి పాల్పడిన ఓ ముఠా వాహనంలో పారిపోతోంది. నగరమంతా జల్లెడపట్టినా ఆచూకీ చిక్కలేదు. అంతర్రాష్ట్ర ముఠాగా భావించిన పోలీసులు సిటీ సరిహద్దులు దాటిందని అనుమానించారు. వారు ఏవైపు వెళ్లారో తెలుసుకోవడానికి టోల్గేట్లే ఆధారం. ప్రస్తుతం నేరం జరిగిన పరిధిలోని ఠాణా పోలీసులు వ్యక్తిగతంగా ఆ టోల్గేట్స్కు వెళ్లి వివరాలు పరిశీలించాల్సిందే. దీనివల్ల కాలయాపన జరగడంతో నేరగాళ్లు సేఫ్డెన్కు చేరుకోవడంతో పాటు చోరీ సొత్తును మాయం చేస్తుండటంతో కేసులు కొలిక్కి రావడంలేదు. పరిష్కారం ‘టోల్ ఐ’ అమలులోకి రావడంతో ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నేరం జరిగిన ప్రాంతంలో ప్రత్యక్ష సాక్షుల ద్వారా లేదా ఆయా చోట్ల ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నేరగాళ్ల వాహనం నంబర్ గుర్తించే వీలుంది. కేసు దర్యాప్తు అధికారులో, కంట్రోల్ రూమ్ సిబ్బందో ‘టోల్ ఐ’లో వాహనం నంబర్ ఎంటర్ చేస్తే చాలు. నేరగాళ్ల వాహనం రాష్ట్రంలోని ఏ టోల్గేట్ నుంచైనా ప్రయాణిస్తే వెంటనే గుర్తిస్తుంది. ఆ విషయాన్ని అలెర్ట్ రూపంలో పోలీసులతో పాటు కం ట్రోల్ రూమ్ సిబ్బందికీ సమాచారం ఇస్తుంది. దీంతో వాహనం ప్రయాణిస్తున్న మార్గంలోని పోలీసుస్టేషన్కు సమాచారమివ్వడం ద్వారా నేరగాళ్లను పట్టుకోవచ్చు. కేసు పాతబస్తీలో భారీ చోరీకి పథకం వేసిన ఓ అంతర్రాష్ట్ర/జిల్లా ముఠా అక్కడ నుంచి బయలుదేరింది. ద్విచక్ర వాహనం లేదా తేలికపాటి వాహనంలో వస్తున్న గ్యాంగ్ మెంబర్లు.. తాము వినియోగిస్తున్న వాహనానికి ఇతర వాహనానిదో, బోగస్ నంబరో వేసి ప్రయాణించారు. నేరం చేసిన తర్వాత చేపట్టే దర్యాప్తులోనే తప్పుడు నంబర్ ప్లేట్తో వచ్చారని తేలుతోంది. ఫలితంగా నేర నిరోధం సాధ్యం కాకపోగా.. కేసు దర్యాప్తు క్లిష్టంగా మారుతోంది. పరిష్కారం ఇలాంటి సవాళ్లకూ ‘టోల్ ఐ’నే సమాధానం. నగర పోలీసులు ఈ సర్వర్కు ఆర్టీఏ డేటాబేస్ను సైతం అనుసంధానిస్తున్నారు. ఫలితంగా ఓ రకం వాహనానికి(టూ వీటర్) మరో రకం వాహనానికి(లారీ) చెందిన నంబర్ ఉంటే సర్వర్ గుర్తిస్తుంది. ఫలానా వాహనం, దొంగ నంబర్తో ఫలానా టోల్గేట్ దాటి వస్తోందని హెచ్చరిస్తుంది. వాళ్లు వస్తున్న మార్గంపై దృష్టిసారించి పట్టుకోవడం ద్వారా నేరాలు నిరోధించవచ్చు. మరిన్ని హంగులతో.. →పస్తుతం టోల్గేట్లను మాత్రమే అనుసంధానించారు. ఇంటర్నెట్ సమస్య కారణంగా ఔటర్ రింగ్ రోడ్పై ఉన్న టోల్ప్లాజాల అనుసంధానంసాధ్యం కావట్లేదు. దీంతో ప్రతి రెండు గంటలకు ఓసారి వారి డేటా అప్లోడ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. →నగరంలో చోరీకి గురైన వాహనాలకు సంబంధించిన స్టోలెన్ వెహికిల్ డేటాబేస్ను సైతం ‘టోల్ ఐ’ సర్వర్తో అనుసంధానించనున్నారు. ఫలితంగా ఆ వాహనం రాష్ట్రంలోని ఏ టోల్గేట్ను దాటినా వెంటనే అప్రమత్తం చేస్తుంది. →అప్లికేషన్ రూపంలో ఉన్న ‘టోల్ ఐ’ని యాప్ రూపంలోకి మార్చనున్నారు. ప్రస్తుతం దర్యాప్తు తదితరాల కోసం నగర పోలీసులు వినియోగిస్తున్న ‘హైదరాబాద్ కాప్’తో దీన్ని లింక్ చేస్తారు. →టోల్గేట్ల వద్ద ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టంతో కూడిన కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిని కంట్రోల్ రూమ్కు అనుసంధానిస్తారు. ఫలితంగా టోల్గేట్ నిర్వాహకులతో సంబంధం లేకుండానే ‘ఆపరేషన్’ నడుస్తుంది. -
ఒక్క రోజే 5.63 లక్షల జరిమానా
ముంబై: కొత్త సంవత్సర వేడుకల్లో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారి నుంచి ముంబై పోలీసులు శుక్రవారం ఒక్క రోజే రూ.5.63 లక్షలను జరిమానా రూపంలో వసూలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిని పట్టుకోవడం కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో బారీ కేడ్లను ఏర్పాటు చేశారు. బ్రీత్ అనలైజర్లతో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిని గుర్తించారు. మొత్తం 705 డ్రంక్ అండ్ డ్రైవ్, 58 రాష్ డ్రైవింగ్ కేసులను పోలీసులు నమోదు చేశారు. నిషేధిత పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలిపినందుకు 1,135 మంది నుంచి ఫైన్ వసూలు చేశారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపినందుకు 1,906 మందికి జరిమానా విధించారు. -
నేరస్తులపై కానిస్టేబుళ్ల ఆటవిక న్యాయం
-
బాలికపై అత్యాచారం, హత్య
భువనేశ్వర్: అత్యాచారాలను నిరోధించి, నిందితులను కఠినంగా శిక్షించేందుకు నిర్భయ చట్టం తీసుకొచ్చినా మార్పు మాత్రం కనిపించడంలేదు. తాజాగా ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఓ కామాంధుడి ఘాతుకానికి అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలిక బలైపోయింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. భువనేశ్వర్లోని సాలియా సాహి మురికివాడలో ఓ కుటుంబం నివసిస్తోంది. అదే వాడకు చెందిన అశోక్ సాహు(22) మంగళవారం వారి దగ్గరకు వచ్చి ఓ వ్యక్తి చిరునామా చూపించాలని కోరాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు.. నాలుగో తరగతి చదువుతున్న బాలికను అతడితోపాటు పంపించారు. అయితే అశోక్.. ఆమెను అదే మురికివాడలోని ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం సాక్ష్యం లేకుండా చేసేందుకు ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఎంతసేపటికీ తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో బాధితురాలి తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించగా, ఓ మైదానంలో ఆమె శవం కనిపించింది. పోలీసులు అక్కడకు సమీపంలోని ఓ ప్రైవేటు కాలేజ్ గేటు వద్దనున్న సీసీ కెమెరాలోని దృశ్యాలను పరిశీలించగా, అశోక్ సాహు నిందితుడని తేలింది. వెంటనే స్థానికులు అతడ్ని వెతికి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు బాధితురాలి కుటుంబానికి పరిచయస్తుడేనని పోలీసులు తెలిపారు. అసెంబ్లీలో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళన... బాలికపై అత్యాచారం, హత్య ఘటనతో ఒడిశా అసెంబ్లీ దద్దరిల్లింది. ఈ ఘటనపై సీఎం నవీన్పట్నాయక్ క్షమాపణ చెబుతూ ఓ ప్రకటన చేయాలని విపక్ష కాంగ్రెస్, బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. పోడియంలోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, ఆందోళనతో సభ రెండు సార్లు వాయిదా పడింది. అనంతరం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సభలో ఓ ప్రకటన చేశారు. జరిగిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేస్తూ బాధితురాలి కుటుంబానికి సభ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు.