breaking news
OG Movie
-
నిర్మాతకు 'ఓజీ' దెబ్బ.. వివాదంపై సుజీత్ ట్వీట్
దర్శకుడు సుజీత్(Sujeeth), నిర్మాత దానయ్య కలిసి తెరకెక్కించిన చిత్రం ఓజీ (OG).. గత నెలలో విడుదలైన ఈ మూవీలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 23న ఓటీటీలోకి కూడా రానుంది. ఈ సమయంలో దర్శకుడు సుజీత్ ఒక పోస్ట్ చేశారు. ఓజీ బడ్జెట్ విషయంలో దానయ్యతో విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న సమయంలో ఆయన ఇలా క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది.దర్శకుడు సుజీత్ చేసిన పోస్ట్లో ఇలా పేర్కొన్నారు . 'ఓజీ మూవీ విషయంలో చాలామంది ఎన్నో విధాలుగా చర్చించుకున్నారు. అయితే, సినిమా మొదలైన సమయం నుంచి పూర్తి అయ్యే వరకు ఏం అవసరమనేది కొందరు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఈ విషయాలు చాలామందికి తెలియవు. ఓజీ మూవీ విషయంలో నా నిర్మాత ఇచ్చిన మద్ధతు చాలా గొప్పది. మాటల్లో చెప్పలేను.' అని ఆయన అన్నారు.ఓజీ సినిమా నిర్మాణ కోసం దర్శకుడు సుజీత్ చాలా ఎక్కువ ఖర్చు చేస్తున్నారని మొదటి నుంచే వార్తలు వచ్చాయి. మొదట అనుకున్న బడ్జెట్ కూడా దాటేసిందని ఇండస్ట్రీలో చెప్పుకొచ్చారు. అలా వారిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని ప్రచారం అయింది. రూ. 300 కోట్లు వచ్చాయని చెప్పుకుంటున్నా సరే ఈ మూవీ బడ్జెట్ భారీ స్థాయిలో పెరగడంతో నిర్మాతకు నష్టాలు తప్పలేదని చాలామంది ఆరోపించారు. దీంతో ఓజీ యూనివర్స్ నుంచి వచ్చే సినిమాలకు దానయ్య నిర్మాతగా వ్యవహరించడం లేదనే టాక్ వైరల్ అయింది.ఓజీ టైమ్లోనే హీరో నానితో సుజీత్ ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని కూడా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపైనే రూపొందిస్తున్నట్టు ఆ సమయంలో తెలిపారు. అయితే, నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఆ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైంది. దీంతో, దానయ్య- సుజీత్ల మధ్య వచ్చిన రూమర్స్కు మరింత బలాన్ని ఇచ్చాయి. అయితే, తాజాగా సుజీత్ చేసిన పోస్ట్తో ఈ గొడవలకు ఫుల్స్టాప్ పడినట్లు అయింది.pic.twitter.com/CWyzK8dcrR— Sujeeth (@Sujeethsign) October 21, 2025 -
పవన్ కల్యాణ్ ఓజీ.. ఆ సాంగ్ వచ్చేసింది
పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం ఓజీ(OG). ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి, ప్రియాంక మోహన్ కీలక పాత్రల్లో నటించారు.తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్ను రిలీజ్ చేశారు. గన్స్ అండ్ రోజెస్ అనే ఫుల్ వీడియో సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటకు విశ్వ వేమూరి లిరిక్స్ అందించగా..హర్ష ఆలపించారు. ఈ మూవీకి తమన్ సంగీతమందించారు. ఈ సినిమా అక్టోబర్ 23 నుంచి ఓటీటీలో ప్రసారం కానుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీలో 'ఓజీ'.. అధికారికంగా ప్రకటన
టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ నటించిన‘ఓజీ’ (OG) సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. కేవలం నెలరోజుల్లోనే ఓటీటీలోకి ఈ చిత్రం ఎంట్రీ ఇవ్వనుంది. సుజీత్ దర్శకత్వం వహించిన చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి, ప్రియాంక మోహన్ తదితరులు నటించారు. 'హరి హర వీరమల్లు' వంటి భారీ డిజాస్టర్ తర్వాత వచ్చిన ఓజీ కాస్త పర్వాలేదనిపించింది.ఓజీ సినిమా అక్టోబర్ 23 నుంచి ‘నెట్ఫ్లిక్స్’ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ,తమిళ్, కన్నడ, మలయాళంలో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటిరోజు భారీ కలెక్షన్స్ రాబట్టిన ఓజీ ఆ తర్వాత ఆశించినంత రేంజ్లో కలెక్ట్ చేయలేదు. కాంతార సినిమా విడుదల తర్వాత చాలాచోట్ల ఓజీ చిత్రాన్ని తొలగించేశారు కూడా. దీంతో ఓజీ బయ్యర్లకు నష్టాలు తప్పలేదు.ఓజీ కథేంటి..?ఓజీ కథ అంతా 1970-90ల మధ్యకాలంలో జరుగుతుంది. జపాన్లో జరిగిన ఓ దాడి నుంచి బయటపడ్డ ఓజాస్ గంభీర (పవన్ కల్యాణ్) ఇండియాకు వెళ్లే ఓడ ఎక్కుతాడు. అక్కడ సత్యాలాల్ అలియాస్ సత్యదాదా(ప్రకాశ్రాజ్)పై అటాక్ జరిగితే.. రక్షిస్తాడు. దీంతో ఓజీని సత్యాదాదా బొంబాయి తీసుకొస్తాడు. అక్కడ ఓ పోర్ట్ని నిర్మించి.. సత్యదాదా డాన్గా ఎదుగుతాడు. అతనికి ఓజాస్ గంభీర తోడుగా నిలుస్తాడు. కొన్నాళ్ల తర్వాత ఓ కారణంగా గంభీర బొంబాయి వదిలి వెళ్తాడు. డాక్టర్ కన్మణిని పెళ్లి చేసుకొని నాసిక్లో కొత్త జీవితం ప్రారంభిస్తారు.ఓజీ బొంబాయి వీడిన తర్వాత సత్యదాదా స్నేహితుడు మిరాజ్ కర్(తేజ్ సప్రూ)తో పాటు తన కొడుకులు జిమ్మీ (సుదేవ్ నాయర్), ఓమీ (ఇమ్రాన్ హష్మీ) నగరాన్ని తమ గుప్పిట్లో పెటుకునేందుకు ప్రయత్నిస్తారు. సత్యదాదా పోర్ట్లో ఉన్న తన కంటేనర్ని స్వాధీనం చేసుకునేందుకు ఇస్తాంబుల్లో ఉన్న ఓమీ.. ముంబైకి వస్తాడు. సత్యదాదా పోర్ట్ని స్వాధీనం చేసుకొని.. అతడి మనుషులను దారుణంగా చంపేస్తాడు. అప్పటికే ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్న సత్యదాదాకు మళ్లీ ఓజీ అవసరం పడుతుంది. మరి ఓజీ తిరిగి బొంబాయి వచ్చాడా? అసలు ఓజీ బొంబాయిని ఎందుకు వదలాల్సి వచ్చింది? తండ్రిలా భావించే సత్యదాదాకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నాడు? ఓమీ కంటేనర్లో ఉన్న విలువలైన వస్తుంలేంటి? సత్యాదాదా ఇద్దరు కొడుకులు ఎలా చనిపోయారు? దాదా మనవడు అర్జున్(అర్జున్ దాస్) ఓజీని ఎందుకు చంపాలనుకున్నాడు? ఓజీ ప్లాష్బ్యాక్ ఏంటి? ఈ కథలో శ్రీయారెడ్డి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
పవన్ గురించి ప్రశ్న.. 'వద్దు' అని కిరణ్ అబ్బవరం
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమాతో వస్తున్నాడు. 'కె ర్యాంప్' పేరుతో తీసిన ఈ చిత్రం.. దీపావళి కానుకగా ఈ శనివారం (అక్టోబరు 18) థియేటర్లలోకి రానుంది. దీంతో ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఇతడు.. ఒక్కడే ఊళ్లు తిరుగుతూ తన మూవీని ప్రమోట్ చేసుకుంటున్నాడు. తాజాగా ఓ మీడియా మీట్ సందర్భంగా పలువురు అభిమానులు, మూవీ లవర్స్తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గురించి ప్రశ్న రాగా కిరణ్ నుంచి 'వద్దు' అనే సమాధానం వచ్చింది.'పవన్ కల్యాణ్ ఫ్యాన్గా 'ఓజీ' మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియెన్స్ ఎలా అనిపించింది' అని ఓ వ్యక్తి.. కిరణ్ అబ్బవరంని అడిగాడు. దీనికి కిరణ్ నుంచి 'ఇప్పుడు వద్దు బ్రో' అనే సమాధానమొచ్చింది. అయితే ఎందుకు నో చెబుతున్నాననే దానికి కారణం కూడా చెప్పుకొచ్చాడు. 'ఇప్పుడు నా సినిమా 'కె ర్యాంప్' రిలీజ్ ఉంది. ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం చెబితే దానికోసం ఎక్కువ వాడుకుంటున్నారేమో, ఇప్పుడు ఎక్కువ చెబితే టికెట్స్ తెగుతాయేమో అనే ఫీలింగ్ వస్తుంది. నాకు అది వద్దు. మరీ అన్నిసార్లు అభిమానం గురించి పదేపదే చెప్పడం కరెక్ట్ కాదు' అని కిరణ్ అబ్బవరం నుంచి సమాధానం వచ్చింది.(ఇదీ చదవండి: క్షమాపణ చెబుతూ మనోజ్ లెటర్ రాశాడు: మౌనిక)కిరణ్ చెప్పింది నిజమేనేమే! ఎందుకంటే గతంలో ఒకరిద్దరు తెలుగు హీరోలు.. తమ సినిమాల రిలీజ్ టైంలో పవన్ అభిమానుల్ని ఆకట్టుకునేందుకు చాలా మాటలు చెప్పేవారు. కిరణ్ అబ్బవరం ఈ సమాధానం చెబుతుంటే అవే సంఘటనలు గుర్తొచ్చాయి. 'కె ర్యాంప్' విషయానికొస్తే.. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా దీన్ని తీశారు. కేరళ బ్యాక్ డ్రాప్లో మొత్తం స్టోరీ అంతా జరగనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంటోంది.'కె ర్యాంప్'తో పాటు ఈ వీకెండ్ ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్.. లిస్టులో ఉన్నాయి. అయితే ఎవరికి వాళ్లు గట్టిగా ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. మరి వీళ్లలో ఎవరు హిట్ కొడతారనేది చూడాలి? ప్రస్తుతానికి అన్ని చిత్రాల ట్రైలర్స్ బాగున్నాయి. కాకపోతే ఏది నిలబడి గెలుస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఇలియానా.. మూడోసారి తల్లి కాబోతుందా?) -
ఓజీ హీరోయిన్ 'ప్రియాంక' ఫోటోలు లీక్.. వార్నింగ్ ఇచ్చిన నటి
చెన్నై బ్యూటీ ప్రియాంక మోహన్(Priyanka Mohan) ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. తను స్నానానికి వెళ్తున్నప్పుడు తీసుకున్న సెల్ఫీలుగా వైరల్ అవుతున్నాయి. బాత్రూమ్ ఫోటోలు లీక్ అంటూ కొందరు ఫోటోలు షేర్ చేశారు. దీంతో తాజాగా ఆమె షోషల్ మీడియాలో రియాక్ట్ అయింది. రీసెంట్గా పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో ఆయనకు సతీమణిగా ప్రియాంక మోహన్ నటించిన విషయం తెలిసిందే.వాస్తవంగా నెట్టింట వైరల్ అవుతున్న ప్రయాంక మోహన్ ఫోటోలు అన్నీ కూడా AI క్రియేట్ చేసినవే.. కానీ, అవి నిజమైన వాటి మాదిరిగానే ఉండటంతో నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే ఆమె ఇలా స్పందించారు. ఇలాంటి నకిలీ ఫోటోలను వైరల్ చేయడం ఇకనైనా ఆపేయండి. నన్ను తప్పుగా చిత్రీకరించే కొన్ని AI-జనరేటెడ్ చిత్రాలు సర్క్యులేట్ అవుతున్నాయి. దయచేసి వీటిని షేర్ చేయడం ఆపేయండి. AIని నైతిక సృజనాత్మకత కోసం మాత్రమే ఉపయోగించాలి. ఇలాంటి తప్పుడు సమాచారం కోసం కాదు. మనం ఏమి క్రియేట్ చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎలాంటి వాటిని ఇతరులతో పంచుకుంటున్నాం అనేదాని గురించి జాగ్రత్తగా ఉండండి. అందరికీ ధన్యవాదాలు. అంటూ ఆమె షేర్ చేసింది.ఓజీ సినిమాలో ప్రియాంక మోహన్, పవన్ కల్యాణ్ మధ్య సువ్వి.. సువ్వి సాంగ్ ఉంటుంది. ఆ పాటలో ఆమె ఇదే కాస్ట్యూమ్తో కనిపిస్తుంది. దీనిని ఛాన్స్గా తీసుకున్న కొందరు ఏఐ సాయంతో మరింత నీచంగా ఫోటోలు క్రియేట్ చేశారు. అవే ఇప్పుడు ప్రియాంకకు ఇబ్బందిగా మారాయి. నెటిజన్లు ప్రియాంక మోహన్కు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ఏఐ టెక్నాలజీ తీరుపై కాస్త ఏకాగ్రత పెట్టాలని సలహాలు ఇస్తున్నారు. ఏఐ సాయంతో ఇలాంటి ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసేవారిపై తప్పకుండా కఠినచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వారి ఆనందం కోసం మరోకరిని బలి చేయడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు. నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ (2019) చిత్రం ద్వారా ప్రియాంకా మోహన్ తెలుగు సినీరంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత శ్రీకారం, సరిపోదా శనివారం వంటి చిత్రాలతో మెప్పించిన ఈ బ్యూటీ రీసెంట్గా ఓజీలో నటించింది. తమిళనాట శివ కార్తికేయన్ హీరోగా డాక్టర్, డాన్ సినిమాల్లో నటించింది.#priyankaMohan pic.twitter.com/wwyq3tnUC9— ❤️🩵🧡 (@ArjunPrathap13) October 10, 2025 -
'సలార్'లో సీన్కి ముందు 50-60 పుష్ అప్స్ తీసేదాన్ని
ప్రభాస్ 'సలార్' సినిమా.. థియేటర్లలో రిలీజైనప్పుడు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ తర్వాత మాత్రం చాలామందికి ఫేవరెట్ అయిపోయింది. మరీ ముఖ్యంగా ఇందులో రాధారమ అనే పాత్రలో అదరగొట్టిన శ్రియారెడ్డి.. ఈ ఒక్క చిత్రంతో చాలా గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్గా 'ఓజీ'లోనూ ఈమెకు అద్భుతమైన రోల్ పడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రియారెడ్డి.. 'సలార్'లో ఎందరో మగాళ్లు ఉన్నప్పటికీ తాను హైలైట్ కావడానికి గల కారణాన్ని బయటపెట్టింది.'సలార్ గురించి గుర్తుచేసుకుంటే.. నా ప్రతి సీన్కి ముందు దాదాపు 50-60 పుష్ అప్స్ తీసేదాన్ని. కాస్ట్యూమ్ వేసుకున్నా, కారవ్యాన్లో ఉన్నా ఇది తప్పనిసరి. నా వరకు అయితే బస్కీలు తీయడం అనేది చాలా సులభమైన వర్కౌట్. షూటింగ్ జరుగుతున్న టైంలోనూ దీని గురించి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ముందే చెప్పాను. దీంతో నా సీన్ తీయడానికి ఇంకాసేపు ఉందనగా చెప్పేవారు. నేను పుష్ అప్స్ వర్కౌట్ పూర్తి చేసుకుని వెళ్లేదాన్ని. దీంతో అందరి మధ్య నేను శక్తిమంతురాలిలా కనిపించేదాన్ని. ఖాన్సార్లోని మగాళ్ల కంటే నాకు నేనే అజేయంగా అనిపించేదాన్ని' అని శ్రియారెడ్డి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'వార్ 2'.. అధికారిక ప్రకటన)ఈమె చెప్పిన కామెంట్స్ చూస్తుంటే నిజమేననిపిస్తుంది. ఎందుకంటే 'సలార్'లో ప్రభాస్, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్.. ఇలా దాదాపు అందరూ మేల్ యాక్టర్స్ ఉన్నారు. వీళ్లతో సరిసమానంగా శ్రియారెడ్డి ఎలివేట్ అయిందంటే.. పుష్ అప్స్ వర్కౌట్ చేయడం ఈమెకు చాలా సహాయపడినట్లు కనిపిస్తుంది.శ్రియారెడ్డి వ్యక్తిగత విషయానికొస్తే.. విశాల్ 'పొగరు' మూవీలో విలన్గా నటించి అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంది. హీరో విశాల్ అన్న విక్రమ్ని పెళ్లి చేసుకుంది. తర్వాత చాన్నాళ్ల పాటు నటనకు దూరమైపోయింది. రీసెంట్ టైంలో సలార్, ఓజీ సినిమాలతో మళ్లీ అందరి నుంచి ప్రశంసలు అందుకుంటోంది. గతంలోనే ఈమె తెలుగు చిత్రాల్లో నటించింది. 2003లో అప్పుడప్పుడు, అమ్మ చెప్పింది సినిమాల్లో నటించింది గానీ ఇవి ఫ్లాప్ అయ్యాయి. దీంతో శ్రియాకు అవకాశాలు రాలేదు. మళ్లీ ఇప్పుడు తెలుగు చిత్రాలతోనే పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకోవడం విశేషం.(ఇదీ చదవండి: హిట్ సినిమా.. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్) -
ఓటీటీలో 'ఓజీ'.. నెలరోజుల్లోనే స్ట్రీమింగ్!
కాంతార సినిమాకు క్రేజ్ దక్కడంతో పవన్ కల్యాణ్ నటించిన ఓజీ చిత్రంపై భారీ దెబ్బ పడింది. ఓజీ కేవలం మొదటిరోజు మాత్రమే భారీ కలెక్షన్స్ సాధించినప్పటికీ ఆ తర్వాత థియేటర్ల పరిస్థితి ధారుణంగా మారింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా కాంతార జోరు ఉండటంతో ఓజీ థియేటర్స్ ఖాళీగానే కనిపిస్తున్నాయి. దీంతో ఓటీటీ బాటలోకి ఓజీ వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కేవలం నెలరోజుల్లోనే స్ట్రీమింగ్కు రానున్నట్లు తెలుస్తోంది.ఓజీ సినిమా నెట్ఫ్లిక్స్ (NetflixI) ఓటీటీ (OTT)లో ఆక్టోబర్ 23 నుంచి తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. నెల రోజుల్లోనే ఓటీటీలో విడుదల అయ్యేలా ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఓటీటీ వర్షన్లో కొన్ని అదనపు సీన్లు యాడ్ చేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.భారీ అంచనాలతో సెప్టెంబర్ 25న ఓజీ విడుదలైంది. అయితే, కలెక్షన్స్ పరంగా టాలీవుడ్ రికార్డ్స్ తిరగరాయాలని అత్యధిక ప్రీమియర్ షోలు (336) వేసి ఒక్కో టికెట్ ధర రూ. 1000 నిర్ణయించడంతో మొదటిరోజు భారీ కలెక్షన్స్ రాబట్టింది. కానీ, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి అగ్రహీరోల మొదటిరోజు కలెక్షన్ల రికార్డ్స్ను ఎంత మాత్రం టచ్ చేయలేకపోయింది. ఓజీ రెండోరోజు నుంచే ఒక్కసారిగా 80 శాతం పైగా కలెక్షన్స్ తగ్గిపోయాయి. కాంతార విడుదల తర్వాత కలెక్షన్స్ పరిస్థితి మరింతగా తగ్గిపోయాయి. ఇప్పటి వరకు ఓజీ రూ. 183 కోట్ల నెట్ సాధించినట్లు ప్రముఖ వెబ్సైట్ సాక్నిల్క్ పేర్కొంది. ఈ మూవీలో పవన్ కల్యాణ్తో పాటు ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి వంటి వారు నటించారు. -
'ఓజీ' నుంచి నేహా శెట్టి సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సైలెంట్ అయిపోయింది. ఈ సినిమాకు ప్రారంభ వారంలో జనాలు వెళ్లారు గానీ తర్వాత చాలావరకు తగ్గిపోయారు. అయితే రెండో వారం నేహాశెట్టి చేసిన ఓ ఐటమ్ సాంగ్ని సినిమాలో జీడించారు. అయితే మూవీలోని మిగతా పాటలతో పోలిస్తే ఇది అంతంత మాత్రంగానే ఉండటం, దానికి తోడు సినిమాలో రాంగ్ ప్లేస్మెంట్లో వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: నన్ను 'లేడీ ప్రభాస్' అని పిలుస్తుంటారు: శ్రీనిధి శెట్టి)థియేటర్లలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ పాటని ఇప్పుడు యూట్యూబ్లో రిలీజ్ చేశారు. అయితే ఈ గీతంలో నేహాశెట్టి మాత్రమే ఉంది. అటు హీరో పవన్ కల్యాణ్ గానీ విలన్ ఇమ్రాన్ హష్మీ గానీ లేకపోవడంతో ఈ పాట జనాలకు కూడా పెద్దగా రీచ్ కాలేదు. (ఇదీ చదవండి: ఓవైపు నిశ్చితార్థం.. మరోవైపు 'గర్ల్ఫ్రెండ్' రిలీజ్ ఫిక్స్) -
ముగిసిన ఓజీ ప్రమోషన్స్! మళ్లీ పొలిటికల్ మోడ్లోకి..
హైదరాబాద్/అమరావతి, సాక్షి: జ్వరంతో రాజకీయాలకు, తన విధులకు స్వల్ప విరామం తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తిరిగి బిజీ అయ్యారు. ఏపీ కేబినెట్ సమావేశం నేపథ్యంలో స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడకు చేరుకున్నారు.వైరల్ ఫీవర్ కారణంగా మెరుగైన వైద్యం కోసం ఆయన హైదరాబాద్ వచ్చారని ఆయన సిబ్బంది అధికారికంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇక్కడికి వచ్చాక ఆయన జ్వరం ఎగిరిపోయినట్లు తెలుస్తోంది. అందుకే ఎలాగూ వచ్చా కదా అని.. హైదరాబాద్లో అన్నయ్య చిరు అండ్ మెగా ఫ్యామిలీతో కలిసి ఓజీ స్పెషల్ ప్రివ్యూ వేసుకుని చూశారు. అంతేకాదు.. ఓజీ సక్సెస్ మీట్లలో హుషారుగా పాల్గొని సందడి చేశారు. అఫ్కోర్స్.. ఈ మధ్యలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వచ్చి పవన్ను పరామర్శించారు అది వేరే విషయంలేండి. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే కామినేని.. ‘వైఎస్ జగన్ సీఎంగా ఉన్న టైంలో సినిమా వాళ్లను పిలిపించుకుని మరీ అవమానించారంటూ’’ చేసిన వ్యాఖ్యలు.. వాటిపై స్పందించే క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జగన్ తనను సాదరంగా ఆహ్వానించారంటూ చిరు ఒక బహిరంగ ప్రకటనతో తేల్చేయడంతో బాలయ్యపై అటు మెగా అభిమానులు, ఇటు వైఎస్సార్సీపీ నేతలు భగ్గుమన్నారు. ఆ వ్యాఖ్యలపై పవన్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. పవన్ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోవడాన్ని ఇటు చిరు ఫ్యాన్స్తో పాటు అటు జనసేన కార్యకర్తలే ఒకానొక దశలో భరించలేకపోయారు. మరి జ్వరం తగ్గింది కదా.. పొలిటికల్ అవతార్లోకి మారిపోయారు కదా.. ఇకనైనా స్పందిస్తారేమో చూడాలి అంటున్నారు పలువురు నెటిజన్లు. -
కెనడాలో సౌత్ ఇండియన్ సినిమాల ప్రదర్శన నిలిపివేత!
కెనడాలో భారతీయ చిత్రాల ప్రదర్శన నిలిచిపోయింది. పవన్ కల్యాణ్ ఓజీ, రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1తో పాటు పలు చిత్రాల షోలను రద్దు చేసేశారు. ఈ నిర్ణయానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. వారం వ్యవధిలో అక్కడి ఓ థియేటర్పై జరిగిన కాల్పుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని సమాచారం.అసలేం జరిగిందంటే.. ఒంటారియో(Ontario) ప్రావిన్సులోని ఓ థియేటర్పై గత వారం వ్యవధిలో రెండు దాడులు జరిగాయి. సెప్టెంబర్ 25వ తేదీన వేకువ జామున ముసుగులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. థియేటర్ ఎంట్రెన్స్ వద్ద లిక్విడ్ను చల్లి చిన్నపాటి పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో థియేటర్ బయటి భాగం స్వల్పంగా దెబ్బ తింది. అలాగే.. తాజాగా అక్టోబర్ 2వ తేదీన ముసుగులో వచ్చిన ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఈ ఘటనలోనూ అదృష్టవశాత్తూ సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు.कनाडा के सिनेमाघर में आग और फायरिंगकनाडा के ओकविले में स्थित Film. Ca सिनेमा थिएटर पर हमला, 2 युवकों ने थिएटर के दरवाजे पर पेट्रोल डालकर आग लगाई, दोनों चेहरे पर मास्क लगाए SUV कार में आए थे, सिनेमाघर में फायरिंग और आग लगाई, पूरा मामला CCTV में कैद#Canada | #CCTV pic.twitter.com/evEuTSsyaj— NDTV India (@ndtvindia) October 3, 2025ఈ ఘటనల నేపథ్యంలో.. భారతీయ చిత్రాలు అందునా ప్రత్యేకించి దక్షిణ భారత చిత్రాల(South Indian Films Canada) ప్రదర్శనే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని అక్కడి థియేటర్ల నిర్వాహకులు ఓ అంచనాకి వచ్చారు. ఓక్విల్లేలోని ఫిల్మ్.సీఏ సినిమాస్(Film.ca Cinemas) ఓజీ, కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1 చిత్రాల ప్రదర్శనను మాత్రమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఫ్రాంచైజీ సీఈవో జెఫ్ నోల్ కూడా ఓ వీడియో సందేశంలో ఇదే విషయాన్ని పరోక్షంగా ధృవీకరించారు కూడా.ఎక్కడక్కెడంటే.. మరోవైపు అక్కడి ఆన్లైన్ బుకింగ్ జాబితాల నుంచి పలు భారతీయ సినిమాలను తొలగించారు. రిచ్మండ్ హిల్లోని యార్క్ సినిమాస్ కూడా ఫిల్మ్.సీఏ బాటలోనే భారతీయ సినిమాల ప్రదర్శన నిలిపివేసింది. తమ ఉద్యోగులు, ప్రేక్షకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వాళ్ల నగదును రిఫండ్ చేస్తామని ఒక ప్రకటనలో యార్క్ సినిమాస్ వెల్లడించింది. గ్రేటర్ టోరంటో ఏరియాలోనూ పలు థియేటర్లు ఇదే తరహా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. బ్రిటిష్ కొలంబియా, అల్బర్టా, క్యూబెక్, మానిటోబా ఇతర ప్రావిన్స్లోనూ ఈ అంశంపై చర్చ జరుగుతోంది.ఇదిలా ఉంటే.. ఇది ఖలీస్తానీల పని అయ్యి ఉండొచ్చని సమాచారం. గతంలోనూ ఇదే తరహా దాడులు జరగడమే ఆ అనుమానాలకు కారణంగా తెలుస్తోంది. అయితే హాల్టన్ పోలీసులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దాడులకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్న తమను సంప్రదించాలని అక్కడి దర్యాప్తు అధికారులు కోరుతున్నారు. ఇదీ చదవండి: అనుభవానికా? లేదంటే యంగ్ బ్లడ్కి పట్టమా?? -
OG డైరెక్టర్ సుజిత్తో హీరో నాని కొత్త చిత్రం ప్రారంభం
-
ఓజీ డైరెక్టర్ కొత్త సినిమా.. ఆ టాలీవుడ్ స్టార్తోనే!
ఓజీ డైరెక్టర్ సుజిత్ అప్పుడే మరో సినిమాకు సిద్ధమైపోయారు. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కించిన ఓజీ ఇటీవలే థియేటర్లో రిలీజైంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో డీవీవీ దానయ్య నిర్మించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా ఓజీ డైరెక్టర్ సుజిత్ మరో టాలీవుడ్ స్టార్తో జతకట్టారు. దసరా సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. టాలీవుడ్ హీరో నానితో మూవీకి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలను సుజిత్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి. SKY IS THE LIMIT…🔥#NaniXSujeeth @NameisNani @Sujeethsign pic.twitter.com/lIylWc2taZ— Niharika Entertainment (@NiharikaEnt) October 2, 2025 With @NameIsNani anna 🤗❤️#NaniXSujeeth pic.twitter.com/gDBYKZtoD4— Sujeeth (@Sujeethsign) October 2, 2025 -
ఓజీ విజయం నా ఒక్కడిది కాదు
‘‘ఓజీ’ సినిమా విజయం నా ఒక్కడిది కాదు.. ఇందుకు కారణమైన మా టీమ్కి ధన్యవాదాలు’’ అని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆయన హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 25న రిలీజ్ అయ్యింది. హైదరాబాద్లో నిర్వహించిన ‘ఓజీ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్’లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ–‘‘ఓ మూవీ ఫెయిల్యూర్కి నేనెప్పుడూ భయపడలేదు. ఇటీవల విడుదలైన ‘హరి హర వీరమల్లు’ సినిమాకి కూడా. నేను చాలా సార్లు ఫెయిల్ అయింది టీమ్ వర్క్ లేకే తప్ప నా ఎఫర్ట్స్ ఎప్పుడూ తగ్గవు. నాకు అన్నం పెట్టిన తల్లి సినిమా. ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా నేనున్నానంటే అది సినిమా ఇచ్చిందే. ఓడిపోతే నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు.. సినిమా అపజయమైతే ఆ నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు. సినిమా బాగున్నప్పుడు అందరూ ఉంటారు కానీ, బాగాలేనప్పుడు మన దగ్గర ఎవరు నిలబడతారో వాళ్లే మనవాళ్లు. నేనెప్పుడూ ఫెయిల్యూర్ని ఎదుగుదలకు ఒక మెట్టుగా చూస్తానే తప్ప అవరోధంగా చూడను. నేను సినిమా కంటే పెద్దది చేస్తున్నాను.. అదే రాజకీయం. చాలా కష్టమైన పని. సినిమాల్లో విలన్స్తో గొడవ పడటం ఈజీ. నిజ జీవితంలో అలా ఉండదు.. తల ఎగిరిపోవచ్చు కూడా. అది నాకు ఎక్స్ట్రా రిస్క్. కానీ, దేశంపై నాకు పిచ్చి ప్రేమ ఉంది. అందరి హీరోల సినిమాలు చూస్తాను. ప్రతి హీరో కష్టాన్ని నేను అభినందిస్తాను. అందరి హీరోల అభిమానులను నేను కోరుకునేది ఒక్కటే. ఫ్యాన్ వాయిస్ని ఆపేయండి.. అలాంటి స్లోగన్స్తో దయచేసి సినిమాని చంపేయకండి. ఇప్పుడు ఓ సినిమా జీవితం అనేది కేవలం ఆరు రోజులు అయిపోయింది. నిర్మాతలు సినిమాలు చేసేందుకు ముందుకు రాకపోతే ఎంతోమంది ఉపాధి కోల్పోతారు’’ అన్నారు. -
OG: ఆహా ఓహో అన్నా... చివరకి లేదుగా సాహో రేంజీ...
అంతన్నారు ఇంతన్నారు చివరకు తుస్సుమన్నారు అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ(OG) చిత్రం పరిస్థితి. విపరీతమైన హైప్తో విడుదలైన దే కాల్ హిమ్ ఓజీ తొలి 2 రోజుల పాటు బ్లాక్ బస్టర్ అన్నంత హంగామా సృష్టించారు. ఇక పవన్ ఫ్యాన్స్ తమ హడావిడికి హద్దే లేదన్నట్టుగా చెలరేగిపోయారు. వెయ్యి కోట్ల దాకా కలెక్షన్లు వచ్చేస్తాయంటూ పుష్ప రికార్డులు కూడా బద్దలైపోతాయంటూ ఊహాగానాలు చేసేశారు. అభిమానుల ఆశలు ఆకాంక్షలు అర్ధం చేసుకోదగినవే కానీ...పాపం వారి ఆశల్ని వమ్ము చేస్తూ ఓజీ నాలుగు రోజుల్లోనే నీరుగారిపోయింది(OG Box Office Collection). నాలుగు రోజుల్లో 252 కోట్ల కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతుంటే...ఇందులో షుమారుగా ఓవర్సీస్ 50 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 145 కోట్లు పైగా. కానీ తమిళ, హిందీ, కన్నడ పరిస్థితి ఏమిటి? తెలుగు వాళ్లున్న చోట్ల తప్ప వేరే భాషా ప్రేక్షకులు ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఓజీని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. హిందీ మార్కెట్లో నాలుగు రోజుల్లో ఈ సినిమాకు వచ్చింది 2 కోట్లలోపే.. ఇక కన్నడిగులు అయితే మరీ కరివేపాకులా తీసి పారేశారు. నాలుగు రోజుల్లో నాలుగైదు లక్షలు దాటలేదు. దాంతో అక్కడ సినిమా అప్పుడే కనుమరుగైంది తమిళనాడు పరిస్థితి చూస్తే...నాలుగు రోజుల్లో 76 లక్షలు మాత్రమే గ్రాస్. తెలుగు వారున్న ప్రతీ చోటా బెనిఫిట్ షోల రూపంలో ఇష్టా రాజ్యంగా అభిమానుల్ని దోచుకోవడం, తెలుగు రాష్ట్రాల్లోని ధియేటర్లలో టిక్కెట్ల రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెంచేయడం... ఇవన్నీ కలిపితేనే ఆ మాత్రమైనా కలెక్షన్లు. అది కూడా ప్రకటిస్తున్న కలెక్షన్లలో ఎంత వరకూ నిజమో పబ్లిసిటీ స్టంటో తెలీదు.మొత్తం మీద విపరీతమైన అంచనాలతో వచ్చిన పవన్ 2 సినిమాలూ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాయి. హరిహర వీరమల్లు డిజాస్టర్గా నిలిస్తే... ఓజీ కలెక్షన్లు కూడా పాన్ ఇండియా రేంజిలో లేకపోవడం ఫ్యాన్స్ను తీవ్రంగా నిరాశపరచింది. పవన్ తర్వాత సినీ రంగంలోకి వచ్చిన మిగిలిన టాలీవుడ్ హీరోలు ఇప్పటికే గ్లోబల్ స్టార్లుగా రూ.వేల కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంటే బోలెడంత ఫాలోయింగ్ ఉన్నట్టు చెప్పుకుంటున్న పవన్(Pawan Kalyan) మాత్రం పాన్ ఇండియా ఇమేజ్కి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదని ఓజీ సినిమా కుండబద్ధలు కొట్టినట్టు నిరూపించింది. పైగా ఇమ్రాన్ హష్మీ లాంటి బాలీవుడ్ స్టార్ ను ప్రధాన విలన్గా పెట్టుకున్నా అక్కడి ప్రేక్షకులు కన్నెత్తి కూడా ఓజీని చూడలేదంటే... ఇక చెప్పేదేముంది? కొసమెరుపు ఏమిటంటే... ఓజీ సినిమాకు దర్శకత్వం వహించిన సుజిత్ దర్శకత్వంలోనే వచ్చిన ప్రభాస్ సాహో సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే... వసూళ్లు మాత్రం రూ.250 కోట్లు దాటేశాయి. ఇందులో నార్త్ ఇండియా కలెక్షన్లే అత్యధికంగా ఉండడం గమనార్హం. దీనిని బట్టి పవన్ లేదా ఆయనతో సినిమా తీసేవారు తెలుసుకోవాల్సిన చేదు వాస్తవం ఏమిటంటే... హీరోలు మెప్పించాల్సింది అభిమానుల్ని మాత్రమే కాదు. -
పవన్ కల్యాణ్ ఓజీకి బిగ్ షాక్..!
పవన్ కల్యాణ్ ఓజీ సినిమాకు తెలంగాణలో బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపును రద్దు చేయాలంటూ తెలంగాణ పోలీస్ శాఖ జీవో రిలీజ్ చేసింది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ యాజమాన్యాలను ఆదేశించింది. ఓజీ టికెట్ రేట్స్ పెంపును తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసిన తర్వాత.. జరిగిన పరిణామాలను పోలీస్ శాఖ తన జీవోలో ప్రస్తావించింది. అంతకుముందు ప్రీమియర్ షోలతో పాటు అక్టోబరు 4 వరకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తెలంగాణ గవర్నమెంట్ అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే.టికెట్ రేట్లపై పిటిషన్ఓజీ టికెట్ రేట్ల పెంపును సవాల్ చేస్తూ మహేశ్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ.. జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ఈ నెల 24న ఆదేశాలు జారీ చేశారు. ఈ సినిమా టికెట్ రేట్లపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ ఈ నెల 26 వరకు స్టే విధించింది. రివ్యూ పిటిషన్పై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 9వ తేదీకి వాయిదా వేసింది. అంతేకాకుండా టికెట్ ధరలు ఎందుకు పెంచాలనుకుంటున్నారో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
‘ఓజీ’ నిర్మించిన డీవీవీ క్రియేషన్స్పై కేసులు వేస్తాం
పంజగుట్ట: ఓజీ సినిమాను తీసిన డీవీవీ క్రియేషన్స్పై త్వరలో పరువునష్టంతో పాటు, కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని న్యాయవాది బర్ల మల్లేష్ యాదవ్ తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓజీ సినిమా టికెట్ల రేట్లు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ తాను కోర్టులో పిటీషన్ వేయగా..రేట్లు పెంపుదలను కోర్టు నిలిపివేసిందన్నారు. ఈ నేపథ్యంలో తనను అవమాన పరుస్తూ డీవీవీ క్రియేషన్స్ వారు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారని, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తనను ట్రోల్ చేసేలా ప్రోత్సహించారని మల్లేష్ ఆరోపించారు. దీనిపై తాను మళ్లీ కేసు వేస్తానని చెప్పారు. పేదలకు వినోదం తక్కువ ధరకే అందాలనే ఉద్దేశంతోనే తాను టికెట్ రేట్ల పెంపును వ్యతిరేకించానని పేర్కొన్నారు. -
ఓజీ.. ఏ క్యా జీ!
సండే కదా.. ఓజీ సినిమాకి పోదామని అరవింద్ ఆన్లైన్లో టికెట్ బుక్ చేద్దామనుకున్నాడు. తీరా చూసి నోరెళ్లబెట్టాడు. అంతకు రెండ్రోజుల క్రితమే ఓజీ సినిమా టికెట్ల ధరల పెంపును హైకోర్టు కొట్టేసిందని విన్న అతనికి ఆ ధరలు చూస్తే ఏమీ అర్థం కాలేదు. నిజంగానే హైకోర్టు తగ్గింపు ఉత్తర్వులిచ్చిందా? లేక థియేటర్లు అమలు చేయడం లేదా? అనే డైలమాలో పడ్డాడు. సాక్షి, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ఓజీ టికెట్ల ధరల పెంపుతోపాటు ప్రత్యేక షోలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మెమోను హైకోర్టు శుక్రవారం కొట్టివేసినా, పెంచిన ధరలకే టికెట్లు అమ్ముతున్నారు. శనివారం టికెట్ల బుకింగ్ కోసం ఆన్లైన్లో ప్రయతి్నస్తే పెంచిన ధరలే కనిపించాయని పలువురు వాపోయారు. హైదరాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లోని థియేటర్లలో ఈ వ్యత్యాసం కనిపించిందని తెలిపారు. వచ్చే నెల 4వ తేదీ వరకు ఓజీ సినిమా టికెట్ ధరలు పెంచుతూ, ప్రత్యేక షోలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది బర్ల మల్లేశ్ హైకోర్టులో పిటిష¯న్ దాఖలు చేశారు.ఈ పిటిష¯న్పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. టికెట్ ధరల పెంపు మెమోను నిలిపివేశారు. తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా వేశారు. సింగిల్ జడ్జి తీర్పుపై డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ హైకోర్టులో అప్పీల్ చేయగా, విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం.. 26న విచారణ చేపట్టాలని సింగిల్ జడ్జిని కోరింది. ‘ఓజీ’చిత్రానికి ఎలాంటి ఉపశమన ఆదేశాలు జారీ చేయలేమని శుక్రవారం విచారణ సందర్భంగా సింగిల్ జడ్జి స్పష్టం చేశారు. ఈ నెల 24 ఇచి్చన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ.. అక్టోబర్ 9కి విచారణ వాయిదా వేశారు. అయినా పెంచిన ధరలనే థియేటర్లు వసూలు చేస్తున్నాయి. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తాం..ఓజీ చిత్ర టికెట్ ధరల పెంపు మెమోను ప్రభుత్వం నిలిపివేసినా సోషల్ మీడియాలో తీర్పునకు వక్రభాష్యం చెబుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా టికెట్ ధరలను తగ్గించడం లేదు. తప్పుడు సందేశాలు, పెంచిన టికెట్ ధరలు వసూలు చేయడంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తాం. – బర్ల మల్లేశ్, న్యాయవాది -
ఓజీలో పవన్ కూతురిగా సాయేషా.. ఎవరీ పాప?
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ (They Call Him OG Movie). ఇందులో పవన్.. గ్యాంగ్స్టర్గానే కాకుండా తండ్రి పాత్రలోనూ యాక్ట్ చేశారు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించారు. సినిమాలో పవన్- ప్రియాంకల కూతురిగా సాయేషా అనే పాప యాక్ట్ చేసింది. వెండితెరపై ఆమె నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం!ఇదే ఫస్ట్ మూవీ!ముంబైకి చెందిన సాయేషా ఇప్పటివరకు అనేక వాణిజ్య ప్రకటనల్లో నటించింది. సంతూర్, లెన్స్కార్ట్, ఫస్ట్క్రై వంటి బ్రాండ్స్తో పాటు రియల్ ఎస్టేట్ యాడ్స్లోనూ యాక్ట్ చేసింది. మృణాల్ ఠాకూర్తోనూ ఓ రియల్ ఎస్టేట్ యాడ్లో నటించింది. ఇప్పుడీ చిన్నారి సినిమాల వైపు అడుగులు వేస్తోంది. లాగౌట్ అనే హిందీ సినిమాలో చిన్న పాత్రలో యాక్ట్ చేసింది. కానీ ఇది నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు ఓజీ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తనకు మొదటి సినిమా అయినప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా అద్భుతంగా నటించింది. అందరికీ థాంక్స్ఈ పాపను చూసిన వారంతా తనకు మంచి భవిష్యత్తు ఉందని మెచ్చుకుంటున్నారు. ఓజీ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్తో దిగిన ఫోటోలను సాయేషా సోషల్ మీడియాలో షేర్ చేసింది. హీరోయిన్ ప్రియాంకతో ఆటలు ఆడుకోవడం మిస్ అవుతానంది. తనకు చాక్లెట్లు ఇచ్చిన అర్జున్దాస్కు కృతజ్ఞతలు చెప్పింది. ప్రకాశ్ రాజ్తో పని చేయడం ఆనందంగా ఉందని తెలిపింది. తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సుజిత్కు, అలాగే పవన్ సహా ఓజీ టీమ్కు థాంక్స్ చెప్పింది. View this post on Instagram A post shared by Sayesha Shah (@sayesha0307) చదవండి: ఆమె పనిచేసేది 8 గంటలే.. ఇంకెక్కడొస్తుంది!: దీపికపై సెటైర్లు -
తెలంగాణలో OG టికెట్ ధరల పెంపునకు మరోసారి షాక్
-
హైకోర్టులో పవన్ కల్యాణ్ ‘ఓజీ’ కి మరోసారి షాక్!
తెలంగాణలో హైకోర్టులో పవన్ కల్యాణ్ ‘ఓజీ’ చిత్రాకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో టికెట్ల పెంపుకు అంగీకరించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నెల 24న ఓజీ మూవీ టికెట్ ధరల పెంపు మొమోని హైకోర్టు సింగిల్ జడ్జి సస్పెండ్ చేసిని సంగతి తెలిసిందే. దీనిపై ఈ రోజు హైకోర్టులో వాదనలు జరిగాయి.‘ఓజీ’ యూనిట్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. రివ్యూ పిటిషన్పై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. తదుపరి విచారణను అక్టోబరు 9వ తేదీకి వాయిదా వేసింది. టికెట్ ధరలు ఎందుకు పెంచాలనుకుంటున్నారో తెలియజేస్తూ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది.కాగా, తెలంగాణలో ఓజీ సినిమా టికెట్ల పెంపుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 24న రాత్రి వేసిన ప్రీమియర్ టికెట్ ధరను రూ. 800గా నిర్ణయించారు. అక్టోబరు 4వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్స్లో రూ.100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్ల్లో రూ.150 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు న్యాయస్థానం ఆదేశాలతో వాటిని తగ్గించాల్సి ఉంటుంది. -
టికెట్ రేట్ ఎఫెక్ట్ OG కలెక్షన్స్ ఎంతంటే..?
-
ఓజీ ఫ్యాన్స్ ఓవరాక్షన్.. షాకిచ్చిన బెంగళూరు పోలీసులు!
పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ఓజీ(OG Movie) అభిమానులకు బెంగళూరు పోలీసులు దిమ్మదిరిగే షాకిచ్చారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా బెంగళూరులోని సంధ్య థియేటర్ వద్ద రిలీజ్కు ముందే ఈవెంట్ నిర్వహించినందుకు బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఈవెంట్లో కొందరు ఫ్యాన్స్ కత్తులతో హల్చల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మడివాలా పోలీసులు వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సిటీ కోర్ట్ అనుమతితోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా బెంగళూరులోని ఓ థియేటర్లో పవన్ కళ్యాణ్ అభిమానులు గొడవ చేయడంతో మిగిలిన ఆడియన్స్ ఇబ్బందులు పడ్డారు. (ఇది చదవండి: పవన్ కల్యాణ్ ఓజీ.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?)ప్రీమియర్ షోకు ముందే పవన్ అభిమానులు రోడ్లను బ్లాక్ చేసి, డీజే పెట్టి నిబంధనలను ఉల్లంఘించారు. దీనిపై కన్నడ రక్షణ వేదిక సభ్యులు థియేటర్ వద్దకు చేరుకుని.. రూల్స్ పాటించాలని పవన్ అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. దీనిపై సమాచారం అందగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. అక్కడ ఉన్న లౌడ్ స్పీకర్లను స్వాధీనం చేసుకుని.. ఏర్పాటు చేసిన వేదికను కూల్చివేయమని నిర్వాహకులను చెప్పామని వెల్లడించారు. కాగా.. పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. -
పవన్ కల్యాణ్ ఓజీ.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ ఈనెల 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. గ్యాంగ్స్టర్ నేపథ్యంలో ఈ మూవీని సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రానికి ప్రీమియర్ షోలతో పాటు టికెట్ల రేట్ల పెంపునకు అనుమతులు ఇవ్వడంతో కలెక్షన్ల పరంగా మొదటి రోజు ఫర్వాలేదనిపించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్గా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రీమియర్ షోలకు రూ.1000 టికెట్ ధరల వల్లే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.( OG Movie Box Office Collections )మొదటి ఇండియా వ్యాప్తంగా రూ.70 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ప్రీమియర్ షోలకు రూ.20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాగా.. ఓవరాల్గా తొలిరోజు దేశవ్యాప్తంగా రూ. 90.25 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రూ.100 కోట్లకు గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. అయితే ఓజీ వసూళ్లకు సంబంధించి మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ చత్రంలో ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. -
థియేటర్లో జనసేన నాయకుడిపై టీడీపీ శ్రేణులు దాడి
కృష్ణాజిల్లా: జిల్లాలోని గుడివాడలో ఓజీ సినిమా ప్రదర్శన సందర్భంగా జనసేన నాయకుడు, గుడివాడ చిరంజీవి యువత అధ్యక్షుడు మేక మురళీకృష్ణపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. గతరాత్రి ఓజీ సినిమా ప్రదర్శన సమయంలో G3 థియేటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సినిమా హాల్లో మద్యం సేవిస్తున్న టీడీపీ నాయకుల్ని.. థియేటర్లో మద్యం సేవించొద్దంటూ మురళీకృష్ణ కోరాడు. ఆడవాళ్లు ఉన్నారని, మద్యం సేవించడం కరెక్ట్ కాదని మురళీకృష్ణ అన్నాడు. దాంతో మద్యం మత్తులో ఉన్న టీడీపీ నాయకులు.. మురళీకృష్ణపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు.టిడిపి నేతల పై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు మురళీకృష్ణ. తన స్నేహితుల వల్లే ఈరోజు తాను ప్రాణాలతో ఉన్నానని మురళీకృష్ణ అంటున్నాడు. -
‘ఓజీ’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?
పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ మూవీ ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలను మాత్రం ఈ సినిమా అందుకోలేపోయింది. సాంకేతికంగా సినిమా బాగున్నా.. కథ-కథనం అంతగా ఆకట్టుకోలేకపోయిందని పలు రివ్యూస్ చెబుతున్నాయి. (‘ఓజీ’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఎలివేషన్పైనే ఎక్కువ దృష్టిపెట్టి.. కథనాన్ని గాలికొదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి రిలీజ్ ముందు ఉన్నంత అయితే హైప్ ఇప్పుడు లేదు. మరి ఈ ప్రభావం కలెక్షన్స్పై ఉంటుందో లేదో వీకెండ్లో తెలిసిపోతుంది. ఇక ఈ సినిమాకు టికెట్ రేట్లు అధికంగా పెంచడంతో సాధారణ సినీ ప్రేక్షకులు థియేటర్స్కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. నాలుగు రోజులు ఆగితే ఓటీటీలోకి వచ్చేస్తుందిలే అని చాలా మంది అనుకుంటున్నారు. నెట్టింట కూడా ఓజీ ఓటీటీ రిలీజ్పై ఆరా తీస్తున్నారు. ఏ ఓటీటీలో వస్తుంది.. ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది.. తదితర విషయాల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఆ ఓటీటీలోనే.. ఓజీ డిజిటల్ రైట్స్ని ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 80 కోట్లకు వరకు చెల్లించినట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అయితే రిలీజ్ అయిన నాలుగు వారాల్లోనే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకురావాలనుకున్నారట. ఈ ఒప్పందంతోనే నెట్ఫ్లిక్స్ అంత డబ్బు పెట్టి ఓటీటీ రైట్స్ తీసుకుందట. ఈ లెక్కన అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ ఫస్ట్ వీక్లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. -
OG మూవీలో హీరోయిన్కు అన్యాయం
టాలీవుడ్ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty)కి అన్యాయం జరిగింది. కథానాయికగా తన సినిమాలేవో తను చేసుకుంటున్న ఈ బ్యూటీకి ఐటం సాంగ్ ఆఫర్ వచ్చింది. అదీ ఓజీ మూవీ (They Call Him OG Movie)లో! హీరోయిన్గా తన క్రేజ్ ఏమాత్రం తగ్గకపోయినా సరే.. పవన్ కల్యాణ్ కోసం తొలిసారి స్పెషల్ సాంగ్కి ఓకే చెప్పింది. అలా థాయ్లాండ్లో ఈ పాటను చిత్రీకరించారు. సర్ప్రైజ్ ఉంటుందన్న బ్యూటీఈ సాంగ్లో పవన్తో కలిసి స్టెప్పులేసిందీ బ్యూటీ! ఈ విషయాన్ని తనే పరోక్షంగా బయటపెట్టింది. ఇటీవల ఓ ఈవెంట్కు వెళ్లినప్పుడు తన నెక్స్ట్ సినిమాల గురించి ప్రస్తావన వచ్చింది. నా సినిమాల గురించి తర్వాత ప్రకటిస్తాను. ఇప్పుడైతే నవంబర్లో ఓజీ మూవీ వస్తుంది కదా.. అందులో ఒక సర్ప్రైజ్ ఉంది. అది చూసి మీరందరూ సంతోషిస్తారనుకుంటున్నాను అంది. కట్ చేస్తే ఓజీ మూవీలో ఆ స్పెషల్ సాంగ్నే తీసేశారు. అది చూసి నేహా అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. ఎడిటింగ్లో తీసేశారా?ఎడిటింగ్లో నేహా శెట్టినే లేపేయడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి యూట్యూబ్లో అయినా ఆ స్పెషల్ సాంగ్ ఉంటుందేమో చూడాలి! ఓజీ విషయానికి వస్తే.. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్). పవన్ కల్యాణ్ హీరోగా నటించగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. ఇమ్రాన్ హష్మీ విలన్గా యాక్ట్ చేశాడు. ఓజీ రిలీజ్శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ నేడు (సెప్టెంబర్ 25న) ప్రేక్షకుల ముందుకు రాగా మిక్స్డ్ టాక్ అందుకుంటోంది. నేహా శెట్టి విషయానికి వస్తే.. డీజే టిల్లు మూవీలో రాధికగా విపరీతమైన క్రేజ్ అందుకుంది. టిల్లు స్క్వేర్లోనూ అతిథి పాత్రలో తళుక్కుమని మెరిసింది. రూల్స్ రంజన్, బెదురులంక 2012, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు చేసింది. ఈ ఏడాది ఏ సినిమాలోనూ కనిపించలేదు.చదవండి: They Call Him OG Review: ‘ఓజీ’ మూవీ రివ్యూ -
అసెంబ్లీకి డుమ్మా కొట్టి OG సినిమాకి చెక్కేసిన ఎమ్మెల్యేలు
-
OG సినిమా హిట్టా..! ఫట్టా..!
-
OGపై RK రోజా రియాక్షన్
-
హైకోర్టు హెచ్చరించినా లెక్కచేయని 'ఓజీ'
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా బెనిఫిట్ షోతో పాటు టికెట్ ధరలను భారీగా పెంచేశారు. అయితే, హోంశాఖ ముఖ్యకార్యదర్శి జారీచేసిన మెమో అమలును సస్పెండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. కానీ, కోర్టు నుంచి వచ్చిన ఆదేశాలను కూడా లెక్క చేయలేదని చిత్ర యూనిట్పై విమర్శలు వస్తున్నాయి. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కూడా పాటించరా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కోర్టు ఆదేశాల తర్వాత కూడా బుక్ మై షోతో పాటు డిస్ట్రిక్ట్ యాప్లలో పెంచిన ధరలే కనిపిస్తున్నాయని కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయంలో న్యాయస్థానం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆపై ఓజీ సినిమాకు ‘A’ సర్టిఫికేట్ జారీ చేయడంతో 18 ఏళ్ల లోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించకుండా చూడాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.. దానిని కూడా వారు పాటించకుండా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు.ఓజీ ప్రీమియర్ షో టికెట్ ధర రూ. 800 పెంపుతో పాటు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ. 100, మల్టీప్లెక్స్లలో రూ. 150 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనిని సవాల్ హైదరాబాద్కు చెందిన బి.మల్లేశ్యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్కుమార్ విచారణ చేపట్టారు. 2021లో జారీచేసిన జీవో120కి విరుద్ధంగా ఓజీ సినిమా టికెట్ ధరలు ఉన్నాయన్నారు. దీంతో న్యాయస్థానం కూడా ప్రభుత్వాన్ని తప్పుబడుతూ పలు వ్యాఖ్యలు చేసింది. కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలను ఎవరి ప్రయోజనాల కోసం ప్రదర్శిస్తున్నారని సూటిగానే కోర్టు ప్రశ్నించింది. ఈ షోలతో వచ్చిన డబ్బుతో అనాథలకు ఏమైనా ఆసరాగా వినియోగిస్తున్నారా అంటూ చెప్పాలని కోరింది. కేవలం ఎగ్జిబిటర్లకు లాభాలు చేకూర్చడానికి ఇలా టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతిస్తారా అంటూ కడిగిపారేసింది. ఇందుకోసం ప్రభుత్వ నిబంధనలనే ఉల్లంఘిస్తే ఎలా అంటూ ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. అయినప్పటికీ టికెట్ ధరలను మాత్రమ తగ్గించలేదు. దీంతో న్యాయస్థానం అంటూ ఎలాంటి గౌరవం లేదా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. -
చిరువ్యాపారు ఏడుస్తుంటే.. OG సినిమా చూస్తున్న ఎమ్మెల్యే
-
OG రిలీజ్ లో అపశృతి.. పవన్ అభిమాని మృతి
-
OG X Review : ‘ఓజీ’ ట్విటర్ రివ్యూ
పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాహో తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ భారీ ఆంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంతో అయినా తమ హీరోకి విజయం దక్కాలని కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాకు కావాల్సినంత హైప్ని తెచ్చిపెట్టింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 25) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఓజీ కథేంటి? ఎలా ఉంది? పవన్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర విషయాలను ఎక్స్లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో సంబంధం లేదు. ఎక్స్లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది అంటే..బాగోలేదని మరికొంతమంది చెబుతన్నారు. రొటీన్ గ్యాంగ్స్టర్ స్టోరీ అని.. ఎలివేషన్స్ తప్ప ఇంకేమి లేదని కామెంట్స్ చేస్తున్నారు. కథ- కథనం వదిలేసి..దర్శకుడు దృష్టంతా ఎలివేషన్పైనే పెట్టాడని విమర్శిస్తున్నారు. #OG A Run of the Mill Gangster Drama that is technically strong and has a few solid elevation blocks, but the rest is mundane!The first half of the film is satisfactory. Despite the drama moving in a flat way, it manages to build intrigue. The intro and interval block are well…— Venky Reviews (@venkyreviews) September 24, 2025ఓటీ టెక్నికల్గా బాగుంది. కొన్ని ఎలివేషన్స్ మినమా మిగతా కథంతా రొటీన్ అంటూ ఓ నెటిజన్ కేవలం 2.5 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు. OG MOVIE REVIEW:Story:❌❌❌❌Action:⭐️Acting:❌❌❌❌VFX: ⭐½BGM:⭐️OG MOVIE RATING: ⭐️⭐½#og #ogreview #ogmovie #pawankalyan #OGonSept25 pic.twitter.com/iTrVi0W1TH— Baap of movies (@baapofmovies) September 24, 2025 స్టోరీ బాగోలేదు. యాక్షన్, వీఎఫెక్స్ పర్వాలేదు. బీజీఎం బాగుంది అంటూ ఓవరాల్గా ఈ చిత్రానికి 2.25 రేటింగ్ ఇచ్చాడు మరో నెటిజన్.Rod movie ra babu 🙏🙏Sujeeth ga nvu TFI vadileyra Thamman bayya yentha kavalo antha iste saripodi talakaya noppi vachesindi bgm ki 🙏 #OGReview #TheycalllHimOGReview— Manoj AA (@AlluBhai__) September 24, 2025 ఓజీ ఓ రాడ్ మూవీ. సుజీత్ అర్జెంట్గా తెలుగు ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోతే మంచిది. తమన్ బయ్యా..ఎంత కావాలో అంతే బీజీఎం ఇస్తే సరిపోతుంది. తలకాయ నొప్పి వచ్చేసింది నీ నేపథ్య సంగీతానికి’ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.#OGReview 1. Second Half inkoncham better ra thieyavachu and expected drama. 2. 70% movie antha fights ee unnie.3. @MusicThaman Ekkada negaloo kadu ekkada thagaloo kuda telisinavadu goppavadu ra ayya !!!!!!4. Heroine ndhukuuuu— Dune (@Aloanworrier) September 24, 2025 సెకండాఫ్ ఇంకొంచెం బెటర్గా తీయొచ్చు. కథనం ఊహించేలా ఉంది. సినిమాలో 70 శాతం యాక్షనే ఉంది. తమన్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన గొప్పవాడు. హీరోయిన్ ఎందుకు ఉందో.. అంటూ ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు.#OGreview: Style without soul, mediocre fight choreographyRating: 2/5#Pawanakalyan #TheycalllHimOG #SujeethSambhavam @FridayWallMaghttps://t.co/Zg2Qz2fjUD— Kausalya Suharika R (@KausalyaSuhari1) September 24, 2025 First half is peak in every aspect, Sujeet fanism at high…2nd half starts with bang, loved the drama & emotion, then comes climax with cinematic high…BC this is just half of Gambheera he ll be unleashed in part2 #OG— The is my surname (@Bloodufan) September 24, 2025#TheyCallHimOG is Disappointing We were excited for this magnum opus after hearing the songs and seeing the trailer, but it did not live up to our expectations in terms of story or visual effects. Thaman is one of the few people who did their job from the start.— FukkardBO (@FukardBO) September 24, 2025#TheyCallHimOG - Original Gunapam🙏#OG #OGReview #PawanKalyan #Cinee_WorlddReview #Cinee_Worldd pic.twitter.com/fIbsouR5bs— cinee worldd (@Cinee_Worldd) September 24, 2025Rey edhem cinema ra babu 1000rs booka #DisasterOG #DisasterOG pic.twitter.com/yhWp70EabW— Tiger'sDragon🐲 (@TigersDragon999) September 24, 2025Finally Original Review 😭 💯 #OGReview || #DisasterOG pic.twitter.com/3tcKrOMVff— 𝐑𝐚𝐠𝐮𝐥𝐮𝐭𝐮𝐧𝐧𝐚 𝐘𝐮𝐯𝐚𝐭𝐚𝐫𝐚𝐦 𝟐.𝟎 (@KarnaReddy2_0) September 24, 2025#TheyCallHimOG - PK’s Swag & Screen presence Super. Emraan, Priyanka Dummy. Thaman’s BGM elevates. Gud Visuals. Passable 1st Hlf & Poor 2nd Hlf. No proper Emotions. Intro Seq, Interval block, Police Stn scene, Traveling Soldier remix impressive. Style with no substance. AVERAGE!— Christopher Kanagaraj (@Chrissuccess) September 24, 2025 -
They Call Him OG Review: ‘ఓజీ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఓజీనటీనటులు: పవన్ కల్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, సుదేవ్ నాయర్, రాహుల్ రవీంద్రన్ తదిరులునిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్టైన్మెంట్నిర్మాతలు : డీవీ దానయ్య, కళ్యాణ్ దాసరిదర్శకత్వం: సుజీత్సంగీతం: తమన్ ఎస్సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్, మనోజ్ పరమహంసఎడిటర్ : నవీన్ నూలివిడుదల తేది: సెప్టెంబర్ 25, 2025‘హరిహర వీరమల్లు’ లాంటి డిజాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ నుంచి వచ్చిన మూవీ ‘ఓజీ’(OG Review). మూడేళ్ల కిత్రం శ్రీకారం చుట్టుకున్న ఈ చిత్రం పవన్ కారణంగా ఆలస్యమై.. ఎట్టకేలకు కొన్ని నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేడు(సెప్టెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? వరుస డిజాస్టర్స్ను చవిచూసిన పవన్కు ‘ఓజీ’తో అయినా హిట్ పడిందా, లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 1970-90ల మధ్యకాలంలో జరుగుతుంది. జపాన్లో జరిగిన ఓ దాడి నుంచి బయటపడ్డ ఓజాస్ గంభీర (పవన్ కల్యాణ్) ఇండియాకు వెళ్లే ఓడ ఎక్కుతాడు. అక్కడ సత్యాలాల్ అలియాస్ సత్యదాదా(ప్రకాశ్రాజ్)పై అటాక్ జరిగితే.. రక్షిస్తాడు. దీంతో ఓజీని సత్యాదాదా బొంబాయి తీసుకొస్తాడు. అక్కడ ఓ పోర్ట్ని నిర్మించి.. సత్యదాదా డాన్గా ఎదుగుతాడు. అతనికి ఓజాస్ గంభీర తోడుగా నిలుస్తాడు. కొన్నాళ్ల తర్వాత ఓ కారణంగా గంభీర బొంబాయి వదిలి వెళ్తాడు. డాక్టర్ కన్మణిని పెళ్లి చేసుకొని నాసిక్లో కొత్త జీవితం ప్రారంభిస్తారు (OG Movie Review). ఓజీ బొంబాయి వీడిన తర్వాత సత్యదాదా స్నేహితుడు మిరాజ్ కర్(తేజ్ సప్రూ)తో పాటు తన కొడుకులు జిమ్మీ (సుదేవ్ నాయర్), ఓమీ (ఇమ్రాన్ హష్మీ) నగరాన్ని తమ గుప్పిట్లో పెటుకునేందుకు ప్రయత్నిస్తారు. సత్యదాదా పోర్ట్లో ఉన్న తన కంటేనర్ని స్వాధీనం చేసుకునేందుకు ఇస్తాంబుల్లో ఉన్న ఓమీ.. ముంబైకి వస్తాడు. సత్యదాదా పోర్ట్ని స్వాధీనం చేసుకొని.. అతడి మనుషులను దారుణంగా చంపేస్తాడు. అప్పటికే ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్న సత్యదాదాకు మళ్లీ ఓజీ అవసరం పడుతుంది. మరి ఓజీ తిరిగి బొంబాయి వచ్చాడా? అసలు ఓజీ బొంబాయిని ఎందుకు వదలాల్సి వచ్చింది? తండ్రిలా భావించే సత్యదాదాకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నాడు? ఓమీ కంటేనర్లో ఉన్న విలువలైన వస్తుంలేంటి? సత్యాదాదా ఇద్దరు కొడుకులు ఎలా చనిపోయారు? దాదా మనవడు అర్జున్(అర్జున్ దాస్) ఓజీని ఎందుకు చంపాలనుకున్నాడు? ఓజీ ప్లాష్బ్యాక్ ఏంటి? ఈ కథలో శ్రీయారెడ్డి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..గ్యాంగ్స్టర్ కథలు.. అందులోనూ ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఓజీ(They Call Him OG Review) కూడా అలాంటి రొటీన్ అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ స్టోరీనే. సినిమా ప్రారంభమైన కాసేపటికే కథనంలో ఎక్కడా బిగువు లేదన్నది తెలుస్తూ ఉంటుంది. కథ ముందుకు సాగేకొద్ది.. పవన్ నటించిన పంజా సినిమాతో పాటు చాలా సినిమాలు గుర్తుకు వస్తుంటాయి. వాటిని మరిపించేందుకు ఏవైనా ట్విస్టులు అయినా ఉంటాయా అంటే అదీ ఉండదు. కథ ప్రారంభంలోనే క్లైమాక్స్ సీన్ ఊహించొచ్చు. కథ-కథనం విషయాన్ని పక్కన పెట్టి.. ఎలివేషన్పైనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టాడు. ప్రారంభంలో ఆ ఎలివేషన్ ఆకట్టుకున్నా.. ప్రతిసారి అలాంటి సీన్లే రిపీట్ అవ్వడంతో ఒకానొక దశలో చిరాకు అనిపిస్తుంది. యాక్షన్ సీన్లు కూడా పవన్ గతంలోనే చేసిన సినిమాలనే గుర్తు తెస్తాయి. ఇక లాజిక్ల గురించి మాత్రం అస్సలు ఆలోచించొద్దు. కత్తితో గన్ నుంచి వదిలిన బుల్లెట్లను ఆపడం.. రక్తంతో కాలి బూటుకి అంటుకున్న అగ్నిని చల్లార్చడం.. ఇలా ‘బాలయ్య’ ను మించిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి.జపాన్లో కథను ప్రారంభించడంతో ఇదేదో కొత్త కథలా ఉండే అనుకుంటాం. కానీ ఆ మరుక్షణమే కొత్తదనం ఆశించడం తప్పనే విషయం తెలిసిపోతుంది. సత్యదాదాకు ఓజీ పరిచయం అవ్వడం.. ముంబై వదిలి అజ్ఞాతంలోకి వెళ్లడం.. కన్మణితో ప్రేమాయణం ఒకవైపు.. ఓమీ అరచకాలు.. దాదా పోర్ట్పై దాడి.. ఈ విషయం తెలిసి ఓజీ ముంబై రావడం.. ఫస్టాప్ అంతా ఇలా రొటీన్గానే సాగినా.. క్యారెక్టర్లకు ఇచ్చిన ఎలివేషన్ సీన్లు ఫర్వాలేదనిపిస్తాయి. ఇంటర్వెల్కి ముందు వచ్చే యాక్షన్ సీన్ ఫ్యాన్స్కి నచ్చుతుంది. ఇక సెకండాఫ్ కథనం మొత్తం ఊహకందేలా సాగుతుంది. ఫ్యామిలీ సన్నివేశాల్లో ఎమోషన్ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఎలివేషన్ మీద పెట్టిన శ్రద్ధలో సగమైనా ఎమోషనల్ సీన్లపై పెడితే బాగుండేది. రక్తపాతం జరుగుతున్నా.. కీలక పాత్రలు కనుమరుగవుతున్నా.. ఎక్కడా జాలీ, బాధ కలగదు. ముగింపు కూడా రొటీన్గానే ఉంటుంది. పార్ట్ 2 కోసమే అన్నట్లుగా.. క్లైమాక్స్లో ఓజీ ప్లాష్బ్యాక్కి మరో ఎలివేషన్ ఇచ్చారు. ‘అవసరం’ అయినప్పడు మళ్లీ వస్తా’ అని హీరోతో ఓ డైలాగ్ చెప్పింది.. రెండో భాగం కూడా ఉందని ప్రకటించారు. ఎవరెలా చేశారంటే.. పవన్ నటన పరంగా చేయడానికేమి లేదు. వింటేజ్ లుక్ తప్ప ఆయన నుంచి కొత్తగా ఏమి ఆశించొద్దు. ఆయనకు సంబంధించిన చాలా సీన్లు డూప్తో తీశారు. అది తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. యాక్షన్ సీన్లే కాదు ఎలివేషన్ సన్నివేశాల్లోనూ డూప్నే వాడినట్లు ఉన్నారు. కొన్ని చోట్ల పవన్కి కళ్లజోడు పెట్టి మ్యానేజ్ చేస్తే.. మరికొన్ని చోట్ల తలను కిందికి దింపి కవర్ చేశారు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా పవన్ని తెరపై చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక విలన్ ఓమీగా ఇమ్రాన్ హష్మీ బాగానే నటించాడు. ఇక కన్మణి పాత్రకి ప్రియాంక మోహన్ న్యాయం చేసింది. తెరపై కనిపించేది కాసేపే అయినా ఉన్నంతలో బాగానే చేసింది. సత్యదాదాగా ప్రకాశ్ రాజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గీతగా శ్రియారెడ్డి మరోసారి డిఫరెంట్ పాత్రలో కనిపించి మెప్పించింది. ఆమె పాత్రకు ఒకటి రెండు బలమైన సన్నివేశాలు పడ్డాయి. తేజ్ సప్రూ, సుదేశ్ నాయర్, హరీశ్ ఉత్తమ్, రాహుల్ రవీంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా ఓకే. తమన్ సంగీతం ఈ సినిమాకు ప్రధానబలం. రొటీన్ సన్నివేశాలకు కూడా తనదైన బీజీఎంతో హైప్ తీసుకొచ్చాడు. సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్లు బాగున్నాయి. వీఎఫెక్స్ తేలిపోయింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. (గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే) -
11 ఏళ్లలో మూడే సినిమాలు.. అసలు ఎవరీ సుజిత్?
'ఓజీ' సినిమా. ఈ పేరు చెప్పగానే చాలామంది పవన్ కల్యాణ్ అంటారేమో! కానీ కెప్టెన్ ఆఫ్ ది షిప్ సుజీత్ గురించి ముందుగా మాట్లాడుకోవాలి. 11 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాసరే ముచ్చటగా మూడంటే మూడు మూవీస్ మాత్రమే చేశాడు. ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్స్ పిలిచి మరీ ఛాన్స్లు ఇచ్చారంటే మనోడిలో మేటర్ చాలానే ఉందని అర్థమవుతోంది. అసలు ఇంతకీ ఇతడెవరు? డైరెక్టర్ ఎలా అయ్యాడు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?ఒకప్పుడు దర్శకుడు కావాలంటే కచ్చితంగా ఎవరో ఒకరి దగ్గర అసిస్టెంట్గా చాలా ఏళ్లు పనిచేయాల్సి వచ్చేది. కానీ 2010, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. చాలామంది యూత్.. షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ తమలోని టాలెంట్ బయటపెట్టారు. అలాంటి కుర్రాళ్లలో ఒకడే సుజీత్. పుట్టింది అనంతపురం. చెన్నైలో ఫిల్మ్ కోర్స్ చేశాడు. సినిమా అంటే పిచ్చి. దీంతో 17 ఏళ్లకే షార్ట్ ఫిల్మ్స్ తీయడం మొదలుపెట్టాడు. పూరీ జగన్నాథ్ దగ్గర శిష్యరికం చేయాలనేది ఇతడి ఆలోచన. కానీ పూరీని కలిసిన తర్వాత ఆ ఆలోచనని పక్కనపెట్టి, సొంతంగా షార్ట్ ఫిల్మ్స్ తీయడం షురూ చేశాడు.(ఇదీ చదవండి: 'ఓజీ' సినిమాకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ)అలా 30 వరకు లఘ చిత్రాలు తీశాడు. అయితే ఓ తెలుగు టీవీ ఛానెల్ నిర్వహించిన కాంటెస్ట్లో పాల్గొని 'రన్ రాజా రన్' అనే షార్ట్ ఫిల్మ్తో విజేతగా నిలిచాడు. దీంతో యువీ క్రియేషన్స్ నుంచి ఇతడికి ఆఫర్ వచ్చింది. తొలుత ఓ లవ్ స్టోరీని వాళ్లకు చెప్పాడు. నిర్మాతలకు బాగానే నచ్చింది కానీ బడ్జెట్ సమస్యల వల్ల దీన్ని పక్కనబెట్టేశారు. ఆ బాధలో వర్షంలో బండి తోసుకుంటా ఇంటికెళ్లాడు. తల తుడుచుకుంటున్న టైంలో ఓ కథ ఫ్లాష్ అయింది. మూడు రోజుల్లో ఆ స్టోరీని పూర్తిగా రాసి నిర్మాతలకు వినిపించాడు. అదే 'రన్ రాజా రన్' సినిమా.శర్వానంద్తో తీసిన ఈ మూవీ హిట్ అయింది. దీంతో ఓ రోజు మాటల సందర్భంలో ప్రభాస్.. 'బాహుబలి' షూటింగ్ టైంలో సుజీత్ని కలిసి ఏదైనా కథ ఉంటే చూడు డార్లింగ్ అని అన్నాడు. అలా ఓ స్టోరీని అనుకుని వినిపించాడు. అదే 'సాహో'. మేకింగ్ పరంగా హాలీవుడ్లో రేంజ్లో ఉంటుంది. మరి 'బాహుబలి' తర్వాత రావడం వల్లనో ఏమో గానీ అభిమానుల అంచనాల్ని అందుకోలేకపోయింది. రూ.350 కోట్ల బడ్జెట్ పెడితే అంతకు మించే కలెక్షన్స్ వచ్చాయి గానీ అందరినీ సంతృప్తి పరచలేకపోయింది.(ఇదీ చదవండి: మొన్న ట్రైలర్.. నేడు సినిమా.. ఓజీ ఫ్యాన్స్కు మరో బ్యాడ్ న్యూస్!)'సాహో' తర్వతా సుజీత్కి బాలీవుడ్ నుంచి పలు ఆఫర్స్ వచ్చాయి. అలా కొన్నేళ్ల పాటు హిందీలో సినిమా చేయాలని తెగ ప్రయత్నించాడు కానీ అదృష్టం కలిసి రాలేదు. దీంతో తిరిగి టాలీవుడ్కి వచ్చేశాడు. ఆ టైంలో చిరంజీవి 'గాడ్ ఫాదర్' చిత్రం చేసే ఛాన్స్ మొదట ఇతడికే వచ్చింది. కానీ రీమేక్ అని నో చెప్పేశాడు. తర్వాత పవన్ కల్యాణ్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. వెళ్లి కలిస్తే ఓ రీమేక్ చేయాలని ఆఫర్. కానీ సొంత కథతోనే మూవీ చేస్తానని చెప్పి ఓ స్టోరీ రెడీ చేశాడు. అదే 'ఓజీ'.2022 నుంచి దాదాపు మూడేళ్ల పాటు తీసిన చిత్రమే 'ఓజీ'. అయితే ఈ సినిమాలో హీరో పవన్ కల్యాణ్ అయ్యిండొచ్చు, తమన్ తన మ్యూజిక్తో వైబ్ తీసుకురావొచ్చు. కానీ దీనంతటికి కారణం మాత్రం సుజీత్ అని బల్లగుద్ది చెప్పొచ్చు. తన విజన్తో అందరూ తన గురించి, సినిమా కోసం మాట్లాడుకునేలా చేశాడు. నెక్స్ట్ నానితో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే అనౌన్స్ చేశారు. మరికొన్ని నెలల్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్పైకి వెళ్తుంది.సుజీత్.. 2020లోనే ప్రవల్లిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మొన్న జరిగిన 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈమెతో పాటు కనిపించాడు. ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఈమె హైదరాబాద్లోనే డెంటిస్ట్గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'ఓజీ'.. జస్ట్ మిస్ అయింది) -
OG మూవీకి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ
-
'ఓజీ' సినిమాకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ
పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమాకు తెలంగాణ హైకోర్ట్ షాకిచ్చింది. పెంచిన ధరల్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపు మెమోని సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్.వి శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇకపోతే ముందు రోజు అనగా 24న రాత్రి వేసే ప్రీమియర్కు తెలంగాణలో రూ.800 టికెట్ ధర(జీఎస్టీతో కలిపి) నిర్ణయించారు. విడుదల రోజు (ఈ నెల 25) నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్స్లో రూ.100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్ల్లో రూ.150 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు న్యాయస్థానం ఆదేశాలతో వాటిని తగ్గించాల్సి ఉంటుంది.'హరిహర వీరమల్లు' లాంటి డిజాస్టర్ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా ఇది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ కాగా.. ఇమ్రాన్ హష్మీ విలన్. తమన్ సంగీతమందించాడు. సుజీత్ దర్శకుడు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో నిర్మించారు. -
కృతజ్ఞత లేని వ్యక్తి.. బండ్ల ట్వీట్ పవన్కేనా?
బండ్ల గణేశ్.. కమెడిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత నిర్మాతగా మారి బడా చిత్రాలను నిర్మించాడు.ఎన్టీఆర్, రవితేజ, పవన్ లాంటి స్టార్ హీరోలతో వరుస సినిమాలు నిర్మించి..టాలీవుడ్లో కొన్నాళ్ల పాటు అగ్ర నిర్మాతగాను కొనసాగాడు. అయితే గత కొంతకాలంగా ఆయన నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి చిత్రాలు రావడం లేదు. నటుడిగానూ తెరపై కనిపించడం లేదు. అయినప్పటికీ బండ్ల గణేశ్ పేరు ఇండస్ట్రీలో ఏదో ఒక రకంగా వినిపిస్తూనే ఉంటుంది. అందుకు కారణం ఆయన చేసే ప్రసంగాలు.. సోషల్ మీడియా పోస్టులు అనే చెప్పాలి. ప్రీరిలీజ్ ఈవెంట్స్తో ఆయన ఇచ్చే స్పీచ్లు వైరల్ అవుతుంటాయి. హీరోలను పొగడ్తలతో ముంచేస్తుంటాడు.ఇక పవన్ కల్యాణ్కు ఆయన చేసే భజన అంత ఇంతా కాదు. అవకాశం వచ్చినప్పుడల్లా పవన్ని ఆకాశానికి ఎత్తేస్తుంటాడు. అలాంటి వ్యక్తిని పవన్ కల్యాణ్ కొంతకాలంగా దూరం పెట్టినట్లు తెలుస్తుంది. పవన్ సినిమా ఈవెంట్స్కి బండ్ల గణేశ్ కి ఆహ్వానం అందడం లేదు. ఇటీవల జరిగిన ఓజీ ప్రీరిలీజ్ ఈవెంట్కి సైతం బండ్ల గణేష్కు పిలుపు రాలేదు. దీంతో పవన్పై బండ్లన్న అలిగినట్లు ఉన్నాడు. తన అసహనాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు.‘కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నావో చూడరు. నీవు చేయని వాటినే మాత్రమే చూస్తారు. కృతజ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తిపరచలేవు’ అని బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు.ఈ పోస్ట్ పవన్ కల్యాణ్ గురించే చేశాడని నెటిజన్స్ అభిప్రాయపెడుతున్నారు. ‘నిజమే.. పవన్కి కృతజ్ఞత ఉండదు’, ‘ఈ విషయం ఇదివరకే అర్థమై చెప్పిన వారిపై గయ్యిన లేచే వాడివిగా! గుడ్డి మైకం లో ఉన్నప్పుడు, నీకు కూడా అర్దం కాలేదుగా! అయినా ఎప్పటికీ అర్దం కాని కొంతమంది పిచ్చి మలోకాలు ఎప్పటికీ ఉంటాయి! అందుకే ఎందుకు పనికి రాని వారు అందలం ఎక్కి ఊరేగుతారు! వారు వీరందరినీ పల్లకి మోసే బోయలు మాత్రమే!’ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నావో చూడరు.నీవు చేయని వాటినే మాత్రమే చూస్తారు.కృతఙ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తిపరచలేవు.— BANDLA GANESH. (@ganeshbandla) September 24, 2025 -
'ఓజీ'ని డామినేట్ చేసిన రిషబ్శెట్టి
టాలీవుడ్లో కేవలం వారం గ్యాప్లోనే రెండు భారీ సినిమాలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 25న పవన్ కల్యాణ్ ఓజీ, అక్టోబర్ 2న రిషబ్శెట్టి నటించిన కాంతార: చాప్టర్-1 విడుదల కానున్నాయి. అయితే, ఇప్పటికే ఈ రెండు చిత్రాల ట్రైలర్లు విడులయ్యాయి. కానీ, యూట్యూబ్లో వ్యూస్ పరంగా కాంతార జోరు కనిపిస్తుంది. టాలీవుడ్లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న పవన్ కల్యాణ్ సినిమా ట్రైలర్ కంటే.. పరాయి ఇండస్ట్రీ హీరో రిషబ్శెట్టి నటించిన కాంతారనే వ్యూస్ పరంగా దూసుకుపోతుంది.ఓజీ తెలుగు ట్రైలర్ కేవలం 10 మిలియన్ల వ్యూస్ను మాత్రమే ఇప్పటి వరకు తెచ్చుకుంది. అయితే, కాంతార: చాప్టర్-1 తెలుగు వర్షన్ ట్రైలర్ ఏకంగా 15 మిలియన్ల మార్క్ను దాటేసింది. దీంతో మలయాళ హీరో రిషబ్శెట్టి.. ఓజీని పూర్తిగా డామినేషన్ చేశారంటూ సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగులో ఎంతో క్రేజ్ ఉందని చెబుతున్న పవన్ కల్యాణ్ సినిమా ట్రైలర్కు కేవలం 10 మిలియన్ల వ్యూస్ మాత్రమే రావడం ఏంటి అంటూ నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. కాంతార ట్రైలర్ అన్ని భాషలలో కలిపి110 మిలియన్ల వ్యూస్ దాటేసింది.'హరి హర వీరమల్లు' ట్రైలర్కు 48 మిలియన్ల వ్యూస్ ఒక్కరోజులోనే వచ్చినట్లు అప్పుడు ప్రకటించారు. ఇదే ఇండస్ట్రీ రికార్డ్ అంటూ పోస్టర్ కూడా విడుదల చేశారు. కానీ, ఓజీకి వచ్చేసరికి ఇలా కావడం ఏంటి అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. వీరమల్లు ట్రైలర్ వ్యూస్ కోసం బాట్స్ ఉపయోగించారని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాస్తవంగా వీరమల్లు సినిమా కంటే ఓజీకే మొదటి నుంచి కాస్త క్రేజ్ ఎక్కువగా ఉంది. మరి ఇప్పుడు ట్రైలర్ విడుదలయ్యాక కేవలం 10 మిలియన్ల వ్యూస్కు మాత్రమే పడిపోవడం ఏంటి అంటూ పవన్ అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. -
Big Question: OG అంటే.. ఒంటరిగా గెలవలేను..!
-
ఓవర్సీస్ మార్కెట్ లో OG మూవీకి ఎదురుదెబ్బ
-
చీరలో మెరిసిపోతున్న ఓజీ భామ శ్రియా రెడ్డి లుక్స్
-
మొన్న ట్రైలర్.. నేడు సినిమా.. ఓజీ ఫ్యాన్స్కు మరో బ్యాడ్ న్యూస్!
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన తాజా చిత్రం ఓజీ. ఈ మూవీకి సుజిత్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. మాఫియా నేపథ్యంలోన తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఆడియన్స్ను బ్యాడ్న్యూస్. ఓవర్సీస్ అభిమానులకు ప్రత్యంగిరా సినిమాస్ ఊహించని ఝలక్ ఇచ్చింది. ఓజీ తమిళ వర్షన్ నార్త్ అమెరికాలో రిలీజ్ చేయడం లేదని వెల్లడించింది. కేవలం తెలుగు, హిందీ వర్షన్ మాత్రమే రిలీజ్ అవుతుందని ట్వీట్ చేసింది. తమిళంలో రిలీజ్ కాకపోవడానికి గల కారణాన్ని వివరించింది.కంటెంట్ ఆలస్యం కారణంగానే ఓజీ తమిళ వెర్షన్ ఉత్తర అమెరికాలో విడుదల కావడం లేదని తెలిపింది. అయితే తెలుగు, హిందీ వర్షన్లు ముందు అనుకున్న ప్రకారమే నార్త్ అమెరికా అంతటా ప్రదర్శిస్తామని పోస్ట్ చేసింది. మీకు కలిగిన అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నామని ప్రత్యంగిరా సినిమాస్ ట్వీట్ చేసింది.కాగా.. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ట్రైలర్ అనుకున్న టైమ్కు రిలీజ్ కాలేదు. టైమ్, డేట్ ప్రకటించినా అనుకున్నట్లు విడుదల చేయలేకపోయారు. దీంతో ఓజీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా ఉత్తర అమెరికాలో తమిళ వర్షన్ రిలీజ్ చేయకపోవడంతో కోలీవుడ్ ఫ్యాన్స్కు నిరాశ తప్పేలా లేదు. సకాలంలో కంటెంట్ అందించలేకపోయినా ఓజీ మేకర్స్ ఈ విషయంలో పూర్తిగా విఫలమైనట్లు కనిపిస్తోంది.Due to unavoidable content delays, the Tamil version of #TheyCallHimOG will not be releasing in North America. However, the Telugu and Hindi versions will be screened across the region as planned. We sincerely regret the inconvenience and thank you for your understanding and…— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 23, 2025 -
పవన్ కల్యాణ్కు బిగ్ షాక్.. ‘ఓజీ’ షోలు క్యాన్సిల్!
రిలీజ్కి రెండు రోజుల ముందు ఓవర్సీస్ మార్కెట్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (pawan kalyan) నటించిన ఓజీ (OG) మూవీకి భారీ దెబ్బ తగిలింది. నార్త్ అమెరికాలో ఓజీ మూవీ షోలు అన్ని క్యాన్సిల్ అయ్యాయి. ఓజీ షోలను రద్దు చేస్తున్నట్లు ఆ దేశంలో అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్ యార్క్ సినిమాస్ అధికారిక ప్రకటన వెల్లడించింది. నార్త్ అమెరికాలో ఓజీ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వ్యక్తుల అరాచకాలు, అనైతిక చర్యల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యార్క్ సినిమాస్ పేర్కొంది. ‘సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో సామాజిక, రాజకీయ విభేదాలు సృష్టించి ప్రజల భద్రతకు ముప్పు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. ప్రీబుకింగ్ చేసుకున్నవారికి రిఫండ్ చేస్తాం.పబ్లిక్ సెక్యూరిటే మా టాప్ ప్రయారిటీ’ అని యార్క్ సినిమాస్ ఓ సుధీర్గమైన లేఖను ఎక్స్ లో పోస్ట్ చేసింది. ‘నార్త్ అమెరికాలో ఓజీ సినిమాను పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్ తరపున యార్క్ సినిమాస్కు కొన్ని రిక్వెస్టులు వచ్చాయి. ఈ సినిమా సేల్స్ గణాంకాలను పెంచమని ఫోర్స్ చేశారు. తద్వారా భవిష్యత్లో రిలీజ్ అయ్యే దక్షిణాసియా సినిమాల వాల్యూ పెంచుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేశారు. గత కొద్దికాలంగా నార్త్ అమెరికాలో సౌత్ ఏషియా ఫిల్మ్ ఇండస్ట్రీపై కంట్రోల్ పెంచుకోవడానికి ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు. సామాజిక, రాజకీయ వర్గాలతో సంబంధాలు పెంచుకొని ఇలాంటి వ్యక్తులు నార్త్ అమెరికాలో కల్చరల్గా విభేదాలు సృష్టించి విడగొట్టడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి అనైతిక చర్యలు, విధానాలను యార్క్ సినిమాస్ వ్యతిరేకిస్తుంది. సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో సామరస్యతను పెంచేందుకు.. వారిని ప్రోత్సహించేందుకు యార్క్ సినిమాస్ ప్రయత్నిస్తుంది’ అని యార్క్ సినిమాస్ లేఖలో పేర్కొంది. సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్, ప్రియాంకా మోహన్ జోడీగా నటించిన చిత్రం ‘ఓజీ’. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.⚠️ Press Release (Safety)#YorkCinemas #TheyCallHimOG#OGMovie #Update pic.twitter.com/xoLCVV5oEU— York Cinemas (@yorkcinemas) September 22, 2025 -
OG సినిమా కోసం మరో జీవో ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
-
ఇప్పటికే టికెట్ రూ.1000.. ప్రీమియర్ షోలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
పవన్ కల్యాణ్ ఓజీ మూవీకి ఏపీ ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. ఈ సినిమా కోసం ప్రత్యేక జీవోను జారీ చేసింది. గతంలో ఎన్నడు లేని విధంగా ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చింది. ముందుగా అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ వేసుకోవచ్చని జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా రిలీజ్కు ముందు రోజే రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోలకు ప్రత్యేకంగా అనుమతులు ఇస్తూ జీవోను విడుదల చేసింది.ఒక్కో టికెట్ రూ.1000..ఇప్పటికే బెనిఫిట్ షో టికెట్ ధరను భారీగా పెంచారు. ఏకంగా ఒక్కో టికెట్ వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు. అంతేకాకుండా విడుదల రోజు నుంచి పది రోజుల పాటు టికెట్ ధరలను భారీగా పెంచుకునే అవకాశం కల్పించారు. సింగిల్ స్క్రీన్స్లో రూ.125, మల్టీప్లెక్స్ల్లో రూ.150 వసూలు చేసుకోవచ్చని దోపీడికి అవకాశమిచ్చారు. ఓజీ ఇష్టారాజ్యంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వడం కరెక్ట్ కాదని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ ఖండించారు.కాగా.. తెలంగాణలోనూ ఓజీ మూవీకి ధరలు పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణలో ఈ నెల 24న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో టికెట్ ధర రూ.800గా నిర్ణయించారు. అంతేకాకుండా ఈ నెల 25 నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్ స్క్రీన్స్లో రూ.100, మల్టీప్లెక్స్ల్లో రూ.150 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చింది. -
'అసలు పాసులు ఎందుకిచ్చావ్'.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కు ఘోర అవమానం!
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఓజీ. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ నెల 21 భారీస్థాయిలో హైదరాబాద్లోని ఎల్బీ స్డేడియంలో ఓజీ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పెద్దఎత్తున హాజరయ్యారు.అయితే ఎంతో ఆశతో ఈవెంట్కు వచ్చిన పవన్ కల్యాణ్ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పాసులు ఉన్న తమను లోపలికి పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు స్టేడియం గేటు బయటే వేచి చూశామని అభిమానులు వాపోయారు. మాకు పాసులు ఇచ్చిన లోపలికి పంపకపోవడంపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియం అంతా ఖాళీగానే ఉందని.. తమను ఎందుకు పంపరని పోలీసులపై మండిపడ్డారు.ఇది బైట ఉన్న Fans పరిస్థితి !🙏🏻What a management of Telangana Police services truly excellent with this worst…#TheyCallHimOG #PawanKalyan #TheyCallHimOG pic.twitter.com/ixIFG1Z1Dr— Karthikuuu (@Anchor_Karthik_) September 21, 2025 -
ఓజీ మూవీ ట్రైలర్ విడుదల
-
'ఓజీ' సినిమా ట్రైలర్ రిలీజ్
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఓజీ'. సుజీత్ దర్శకత్వం వహించిన చిత్రం ఈ గురువారమే(సెప్టెంబర్ 25) థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్ల రూపంలో పాటలు, స్టిల్స్ వదిలారు. హైదరాబాద్లో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు. ఆ కార్యక్రమంలో ట్రైలర్ ప్లే చేశారు గానీ బయటకు మాత్రం వదల్లేదు. ఇప్పుడు పనంతా పూర్తవడంతో ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 27 సినిమాలు)ట్రైలర్ చూస్తుంటే ముందునుంచి చెప్పినట్లే యాక్షన్ కనిపిస్తోంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. ఇమ్రాన్ హష్మీ ప్రెజెన్స్ బాగుంది. ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి, ప్రియాంక మోహన్ తదితరుల సీన్స్ కూడా ట్రైలర్లో చూపించారు. (ఇదీ చదవండి: 'కాంతార ఛాప్టర్ 1' ట్రైలర్ రిలీజ్) -
KSR Live Show: జగన్ నిర్ణయానికి జై కొట్టిన ఇండస్టీ.. OG సినిమాపై నమ్మకం లేదు..!
-
'ఓజీ'.. జస్ట్ మిస్ అయింది
హైదరాబాద్లో నిర్వహించిన ‘ఓజీ’ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ సందడి చేశారు. అయితే, ఈవెంట్ కాస్త వర్షార్పణం అయింది. 'వర్షం లేదు..బొక్కా లేదు' అని తమన్ బహిరంగంగానే కామెంట్ చేసినప్పటికీ వాన మాత్రం ఊరుకోలేదు. వేదికపై ఉన్న లైట్ బాయ్ నుంచి పవన్ కల్యాణ్ వరకు అందర్నీ తడిపేసింది. దీంతో ఓజీ ఈవెంట్ కాస్త వర్షార్పణం కావడం ఆపై ట్రైలర్ కూడా విడుదల చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే, వేదికపై పవన్ కల్యాణ్ చేసిన కత్తిసాము వల్ల తన సెక్యూరిటీ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఓజీ స్టేజీపై పవన్ కల్యాణ్ ఇలా వ్యాఖ్యలు చేశారు. ఒక ఉప ముఖ్యమంత్రి ఇలా కత్తి పట్టుకుని వస్తే ఊరుకుంటారా..? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. నేను సినిమా ప్రేమికుణ్ణి. సినిమా చేసేటప్పుడు దాని ఆలోచనలు తప్ప వేరేవి ఉండవు. రాజకీయాలు చేసేటప్పుడు అదే ఆలోచనలు తప్ప వేరేవి ఉండవు' అంటూ కత్తి పట్టుకుని స్టేజీపై పవన్ కల్యాణ్ తిప్పుతుండగా తన సెక్యూరిటీ కంటి దగ్గరి నుంచి వెళ్లింది. అయితే, అతను అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది. లేదంటే తన కంటికి తీవ్రమైన ప్రమాదమే జరిగేది. అది ఒరిజనల్ కత్తి కాదని కొందరు.. లేదూ ఒరిజినల్ కత్తే అంటూ మరికొందరూ సోషల్మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే, అది అతని కన్ను వద్ద తగిలింటే మాత్రం ఏ కత్తి అయినా సరే తీవ్రమైన నష్టం జరిగేదని చెప్పొచ్చు. Just Miss 😲pic.twitter.com/IG8mlaL5aX— Christopher Kanagaraj (@Chrissuccess) September 21, 2025 -
పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ఈ సినిమాకి ఆ ఇద్దరే స్టార్స్: పవన్ కల్యాణ్
‘‘ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారని నాకు తెలియదు. ‘ఖుషి’ చిత్రం సమయంలో ఈ జోష్ చూశాను. అలాంటి జోష్ మళ్లీ ‘ఓజీ’కి వచ్చింది. సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా మీరు (ఫ్యాన్స్) నన్ను వదల్లేదనిపిస్తోంది.. మీరు కదా నాకు భవిష్యత్ ఇచ్చింది’’ అని పవన్ కల్యాణ్ చెప్పారు. సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్, ప్రియాంకా మోహన్ జోడీగా నటించిన చిత్రం ‘ఓజీ’. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ‘ఓజీ’ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ–‘‘సుజిత్ నా అభిమాని. ‘జానీ’ మూవీ చూసి నాతో సినిమా తీయాలనుకున్నాడు. ‘సాహో’ సినిమా తర్వాత సుజిత్తో సినిమా చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ చెప్పి, నాకు పరిచయం చేశారు. తను కథని ముక్కలు ముక్కలుగా చెప్పినా సినిమా తీసేటప్పుడు తన సత్తా తెలిసింది. ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్... నాట్ పవన్ కల్యాణ్. వారిలో మొదటి క్రెడిట్ సుజిత్ది. రెండో క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ది. ‘నేను డిప్యూటీ సీఎం అని ఈ రోజు మరచిపోయాను.మీరు ఊహించుకోండి.. ఒక ఉప ముఖ్యమంత్రి ఇలా కత్తి పట్టుకుని వస్తే ఊరుకుంటారా? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. నేను సినిమా ప్రేమికుణ్ణి. సినిమా చేసేటప్పుడు దాని ఆలోచనలు తప్ప వేరేవి ఉండవు. రాజకీయాలు చేసేటప్పుడు అదే ఆలోచనలు తప్ప వేరేవి ఉండవు. సుజిత్ టీమ్ చాలా అద్భుతమైనది. ఇలాంటి టీమ్ నేను దర్శకత్వం వహించే టప్పుడు నాకూ ఉండి ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాణ్ని కాదేమో? ట్రైలర్ పూర్తిగా సిద్ధం కాలేదంటే కుదరదు. మా వాళ్లకి (ఫ్యాన్స్) ఈ రోజు ఎంతో కొంత చూపించాల్సిందే.నాకు తెలుసు కదా... అమితాబ్ బచ్చన్ గారి కోసం నేను చిన్నప్పుడు ఎలా కొట్టుకునేవాణ్ణో. ఆయన సినిమాకి టిక్కెట్ దొరక్కపోతే చంపేద్దాం అనిపించేది. ‘ఓజీ’ చిత్రం అందర్నీ రంజింపజేసేలా ఉంటుంది’’ అని చె΄్పారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాతలు అల్లు అరవింద్, ‘దిల్’ రాజు, వై. రవిశంకర్, రచయిత కోన వెంకట్, ప్రియాంక మోహన్, సంగీత దర్శకుడు తమన్, నటులు ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్ మాట్లాడారు. -
పెంచేద్దాం.. దోచేద్దాం.. మనల్ని ఎవడ్రా ఆపేది
-
OG సినిమాకు టికెట్ 1000 రూపాయలా? పవన్ కళ్యాణ్ పై అంబటి సెటైర్లే సెటైర్లు
-
రైతుల కన్నా ఓజీ మీదే శ్రద్ధ ఎక్కువైంది: వైఎస్ అవినాష్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా.. కూటమి ప్రభుత్వం వాళ్ల సమస్యలను గాలికి వదిలేసిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. రైతుల ఇబ్బందులు పట్టించుకోకుండా పవన్ సినిమా టికెట్ రేట్లను పెంచడంలోనే బిజీగా ఉందంటూ మండిపడ్డారు. శనివారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ, రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎరువులు, యూరియా అందకుండా రైతులు నష్టపోతున్నారు. అయినా వాళ్ల సమస్యలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది. ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలి. రైతుల సమస్యల పరిష్కారానికి వైఎ్ససార్సీపీ పోరాటం చేస్తుంది. పవన్ ఓజీ సినిమా టికెట్ పెంపుపై ఉన్న శ్రద్ధ రైతులపై పెడితే బాగుండు. .. కూటమి నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమం విజయవంతమైంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోం. ఎలాగైనా అడ్డుకుని తీరతాం. ఎంతటి పోరాంట చేయడానికైనా సిద్ధం అని వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు.ఇదీ చదవండి: పవన్ ఓజీ.. జగనే కరెక్ట్! -
ఓజీ.. జగనే కరెక్ట్: నట్టి కుమార్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ ధరలు రెండు రాష్ట్రాల్లో భారీగా పెంచేశారు. ఏపీలో అయితే ఏకంగా ప్రీమియర్ షో ధర 1000 చేయడంతో సామాన్యులతో పాటు ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా వ్యతిరేఖత వస్తుంది. ఒక సినిమా టికెట్ ధర ఈ రేంజ్లో పెంచడం ఇదే తొలిసారి. గతంలో ఎప్పుడూ కూడా ఇంత ధర లేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ ఓజీ ధరలపై స్పందించారు.ఓజీ సినిమా టికెట్ రేట్లు ఇంతలా పెంచడం చాలా తప్పని నిర్మాత నట్టి కుమార్ అన్నారు. ఈ విషయంలో చిత్ర నిర్మాత డి.వి.వి దానయ్యతో పాటు ఫిలిం ఛాంబర్, కౌన్సిల్ వారు బాధ్యత వహించాలన్నారు. ఎవరైతే ఈ టికెట్ ధరల పెంపు వెనుక ఉన్నారో వారందరూ ఈ తప్పులో భాగమని పేర్కొన్నారు. ఓజీ టికెట్ ధరల పెంపు విషయంలో ఈ ప్రభుత్వాలు కళ్లు మూసుకొని అనుమతులు ఇచ్చేస్తున్నాయన్నారు. పేదవాడికి పెన్షన్ ఇస్తున్నామని కుడి చేత్తో ఇచ్చి ఇలా ఎడమచేత్తో లాగేసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఇలా ఇష్టం వచ్చినట్లు సినిమా టికెట్ రేట్లు పెంచితే పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని గుర్తుచేశారు. ఇలాగే కొనసాగితే ప్రేక్షకులు ఓటీటీ, పైరసీలకు అలవాటు పడుతారన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వం పట్ల ప్రజలు అసహనంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.టికెట్ ధరల విషయంలో జగనే కరెక్ట్'సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయమే కరెక్ట్.. ఇండస్ట్రీ మీద ఆయన తీసుకున్న నిర్ణయాలు బాగానే ఉండేవి. సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు దాటితే రూ. 50, రూ. 150 కోట్లు దాటితే రూ. 100 పెంచుకునేందుకు గతంలో జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఒక్కో టికెట్ మీద రూ. 100 పెంచారు. జీఎస్టీకి సంబంధించి ఎంత ఖర్చు అయిందో చూపితే అంత మొత్తాన్ని తిరిగిచెల్లిస్తామన్నారు. దీంతో చిన్న, పెద్ద చిత్రాలకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో చాలా బాగా పనిచేసింది. ఈ విషయంలో చిరంజీవి చోరవ చూపించగా జగన్ జీవో రూపంలో సడలింపులు ఇచ్చి ఇండస్ట్రీకి మేలు చేశారు. ప్రస్తుతం ఎలాంటి విచారణ లేకుండానే టికెట్ ధరలు పెంచేస్తున్నారు. జగన్ నిర్ణయాలు కొందరికి నచ్చకపోయినప్పటికీ ఇండస్ట్రీకి అనుకూలంగానే ఉండేవి.' అని ఆయన గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇష్టం వచ్చినట్లు సినిమా టికెట్ ధరలను పెంచేసి ప్రేక్షకులను థియేటర్కు రాకుండా చేస్తున్నారని నిర్మాత నట్టి కుమార్ మండిపడ్డారు. ఒక్కసారి కర్ణాటక, తమిళనాడులో సినిమా టికెట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఆయన కోరారు.రైతులకు న్యాయం చేయరుసినిమా టికెట్ ధరలు పెంచిన ఈ ప్రభుత్వ పెద్దలు రైతులకు అండగా నిలబడరని నట్టి కుమార్ ఇలా అన్నారు. 'రైతులు కూడా పెట్టుబడిదారులు.. పేదవాళ్లు.. వాళ్లకు సాయం చేస్తే గొప్పవాళ్లు అయిపోతారు. అందుకే వీళ్లు రైతులకు మద్ధతు ధరలు ప్రకటించరు. కానీ, ఇలా సినిమా టికెట్ ధరలు పెంచి నిర్మాత దానయ్య, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజులకు మాత్రం మేలు చేస్తున్నారు.. కానీ, రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా సరే సాయం చేయరు. కనీసం యూరియా కూడా వారికి దొరకడం లేదు. ఒక సినిమాకు మద్ధతు ధర ఇచ్చిన ఈ ప్రభుత్వం.. టమాటో, ఉల్లితో నష్టపోయిన రైతులకు మద్ధతు ధర ఎందుకు ఇవ్వరు. కనీసం సినిమాకు ఇచ్చిన ప్రయారిటీ రైతుకు ఇవ్వకుంటే ఎలా.. వాళ్లు ఆత్మహత్య చేసుకోవాలా..? నేడు రైతులు ఆవేశంతో ఉన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికైనా ఈ విషయాన్ని గ్రహించాలి.' -
వాషి యో వాషి.. పవన్ కల్యాణ్ పాడిన సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఓజీ (They Call Him OG Movie). ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్గా యాక్ట్ చేశాడు. రన్ రాజా రన్, సాహో సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుజీత్ దర్శకత్వం వహించాడు. డీవీవీ దానయ్య నిర్మించగా తమన్ సంగీతం అందించాడు.సాంగ్ రిలీజ్సెప్టెంబర్ 21న ఓజీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే దానికంటే ముందు ఓ సర్ప్రైజ్ వదిలారు. పవన్ పాడిన 'వాషియో వాషి' పాటను రిలీజ్ చేశారు. ఇది జపనీస్ భాషలో సాగుతుంది. అయితే ఇదంతా పవన్ ఏదో డైలాగులు చెప్తున్నట్లు ఉందే తప్ప అసలు పాటలానే లేదు.డబ్బులు దండుకునే పనిఇక ఓజీ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లను భారీగా పెంచారు. ప్రజల కోసం, ప్రజల కొరకు అంటూ డైలాగులు చెప్పే పవన్.. తన సినిమావంతు వచ్చేసరికి మాత్రం ప్రజల జేబులో డబ్బులు దండుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయకపోవడం గమనార్హం. కాగా ఓజీ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'ఓజీ' టికెట్ రేట్ల పెంపు.. ‘యూ టర్న్’ అంటూ హరీశ్రావు ట్వీట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ రేట్ పెంపుదలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ‘ఎక్స్’లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనెల 25న విడుదల కానున్న ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపుతో పాటు 24వ తేదీ రాత్రి 9 గంటలకు రూ.800 రేట్లతో స్పెషల్ షోకు అనుమతిస్తూ హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హోం శాఖ సీఎం రేవంత్ వద్దే ఉండటం గమనార్హం. పుష్ప–2 సినిమా వివాదం నేపథ్యంలో స్పెషల్ షోలకు అనుమతిచ్చేది లేదంటూ గతంలో అసెంబ్లీ వేదికగా రేవంత్ చేసిన ప్రకటనకు సంబంధించిన క్లిప్ను హరీశ్రావు తన పోస్ట్కు జత చేశారు. ప్రాణాలు పోతున్నాయని తెలిసినా స్పెషల్ షోలకు ఎలా అనుమతి ఇస్తామని రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూనే ‘యూ టర్న్’ అంటూ హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణలో టికెట్ ధరలుతెలంగాణలో ఓజీ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈమేరకు జీవో కూడా విడుదలైంది. ఈ నెల 24న రాత్రి 9గంటలకు ప్రీమియర్ షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ.800 అని పేర్కొంది. సినిమా విడుదలరోజు ఈ నెల 25 నుంచి అక్టోబరు 4 వరకు టికెట్ ధరలను పెంచేసింది. సింగిల్ స్క్రీన్స్లో రూ.100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్ల్లో రూ.150 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.ఏపీలో టికెట్ రూ.1,000ఏపీలో 25న అర్ధరాత్రి 1గంటకు ఓజీ సినిమా బెనిఫిట్ షో ప్రదర్శించనున్నారు. దాని టికెట్ ధర రూ.1,000 పెంచేసి అభిమానులకు షాకిచ్చింది. అయితే, మిగిలినరోజుల్లో ప్రస్తుతమున్న ధరలపై అదనంగా సింగిల్ స్క్రీన్లలో రూ.125 , మల్టీప్లెక్స్ల్లో రూ.150 పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సినిమా విడుదల తేదీ నుంచి అక్టోబరు 4వ తేదీ వరకూ టికెట్ ధరల పెంపునకు అవకాశం కల్పించింది. గతంలో ఇంత భారీ ధర ఏ సినిమాకు అవకాశం కల్పించలేదు..@revanth_anumula U TURN@RahulGandhi @INCIndia @INCTelangana pic.twitter.com/QcJPftqQpb— Harish Rao Thanneeru (@BRSHarish) September 19, 2025 -
పవన్ కల్యాణ్ ఓజీ.. తెలంగాణలోనూ భారీగా టికెట్ ధరల పెంపు
పవన్ కల్యాణ్ ఓజీ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం సైతం ధరలు పెంచుకునేందుకు అనుమతులిచ్చింది. ఈ మేరకు ప్రత్యేక జీవోనూ విడుదల చేసింది. అంతేకాకుండా ఈనెల 24న రాత్రి ప్రీమియర్ షోలకు అనుమతులు జారీ చేసింది. ప్రీమియర్ షోలకు ఒక్కో టికెట్ ధర రూ.800 గా నిర్ణయించారు. ఈ మూవీ రిలీజ్ రోజు అంటే సెప్టెంబర్ 25 నుంచి అక్టోబరు 4 వరకు టికెట్ ధరల పెంచుకోవచ్చని అవకాశం కల్పించింది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్లో రూ.100, మల్టీప్లెక్స్ల్లో రూ.150 అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు ఇచ్చారు. దాదాపు పది రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి.ఏపీలో భారీగా పెంపు..పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ఓజీ సినిమా టికెట్ ధరలను భారీగా పెంచేశారు. ఏపీలో ఏకంగా బెనిఫిట్ షో టికెట్ ధరలను రూ.1000 రూపాయలు వసూలు చేసుకునేందుకు అనుమతులిచ్చారు. అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షోలు ప్రదర్శించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్పై రూ.125 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. మల్టీప్లెక్స్ల్లో ఒక్కో టికెట్పై రూ.150 పెంపునకు అనుమతులు జారీ చేశారు. సినిమా రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు ఈ టికెట్ ధరలను పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో లేని బెనిఫిట్ షోలకు ఇప్పుడు అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. -
పవన్ కల్యాణ్ ఓజీ.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఓజీ. ఈ మూవీకి సుజిత్ దర్శకత్వం వహించారు. ముంబై బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ను రివీల్ చేశారు.ఓజీ ట్రైలర్ను సెప్టెంబర్ 21న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓజీ పోస్టర్ను ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా 1980-90లో ముంబై బ్యాక్ డ్రాప్లో గ్యాంగ్స్టర్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించనుంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో డీవీవీ దానయ్య నిర్మిచారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు.భారీగా టికెట్ ధరల పెంపు.. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ఓజీ సినిమా టికెట్ ధరలను భారీగా పెంచేశారు. ఏపీలో ఏకంగా బెనిఫిట్ షో టికెట్ ధరలను రూ.1000 రూపాయలు వసూలు చేసుకునేందుకు అనుమతులిచ్చారు. అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షోలు ప్రదర్శించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్పై రూ.125 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. మల్టీప్లెక్స్ల్లో ఒక్కో టికెట్పై రూ.150 పెంపునకు అనుమతులు జారీ చేశారు. సినిమా రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు ఈ టికెట్ ధరలను పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో లేని బెనిఫిట్ షోలకు ఇప్పుడు అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ సినిమా కావడంతోనే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.#OGTrailer on Sept 21st.. pic.twitter.com/2RMr9r1dm5— Sujeeth (@Sujeethsign) September 18, 2025 -
'OG' మూవీలో పవర్ఫుల్ రోల్లో ప్రకాశ్ రాజ్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన యాక్షన్ మూవీ ఓజీ (OG Movie). ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కీలక పాత్ర పోషించారు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ క్రమంలో ఓజీ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ట్రైలర్ను పక్కనపెట్టి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ వదిలింది చిత్రయూనిట్. ఓజీలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ఉన్నట్లు ప్రకటించింది. సత్య దాదాగా ప్రకాశ్ రాజ్ఈమేరకు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఇందులో ప్రకాశ్ రాజ్.. శాలువా కప్పుకుని, కళ్లజోడు పెట్టుకుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఆయన పాత్ర పేరును సత్యదాదాగా ప్రకటించారు. మరి ఆయన క్యారెక్టర్ ఏంటనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే! ఇక ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. Here’s the versatile force Prakash Raj in #OG 🔥#TheyCallHimOG @prakashraaj pic.twitter.com/NiKjAtc1Qv— DVV Entertainment (@DVVMovies) September 18, 2025 చదవండి: దీపికా పదుకొణెకు షాకిచ్చిన 'కల్కి' టీమ్ -
ఓజీ ప్రమోషన్స్ లో ప్రియాంక.. బ్లాక్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ (ఫొటోలు)
-
పవన్ కల్యాణ్ ఓజీ.. ఏపీలో భారీగా టికెట్ ధరల పెంపు
పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ఓజీ సినిమా టికెట్ ధరలను భారీగా పెంచేశారు. ఏపీలో ఏకంగా బెనిఫిట్ షో టికెట్ ధరలను రూ.1000 రూపాయలు వసూలు చేసుకునేందుకు అనుమతులిచ్చారు. అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షోలు ప్రదర్శించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు.సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్పై రూ.125 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. మల్టీప్లెక్స్ల్లో ఒక్కో టికెట్పై రూ.150 పెంపునకు అనుమతులు జారీ చేశారు. సినిమా రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు ఈ టికెట్ ధరలను పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో లేని బెనిఫిట్ షోలకు ఇప్పుడు అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ సినిమా కావడంతోనే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. -
పవన్ హీరో అని కాదు.. అందుకే ‘ఓజీ’ ఒప్పుకున్నాను: ప్రియాంక మోహన్
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన పీరియాడికల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ చిత్రం ‘ఓజీ’. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ప్రధానపాత్ర చేశారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రియాంక అరుళ్ మోహన్ మాట్లాడుతూ– ‘‘1980–1990లలో జరిగే కథ ‘ఓజీ’. ఈ చిత్రంలో ఓజాస్ గంభీరపాత్రలో పవన్గారు, కణ్మణిగా నేను నటించాం. గంభీర జీవితాన్ని మలుపు తిప్పేపాత్ర కణ్మణిది. కథ, అందులోని నాపాత్ర నచ్చితేనే సినిమా ఒప్పుకుంటాను. ఈ సినిమా కథ, కణ్మణిపాత్ర నచ్చినందుకే ఒప్పుకున్నాను... పవన్కల్యాణ్గారు హీరో అని కాదు. ఇమ్రాన్ హష్మితో నాకు కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలు సర్ప్రైజింగ్గా ఉంటాయి. ఇక ధనుష్గారి డైరెక్షన్లోని ‘జాబిలమ్మా నీకు అంత కోపమా’లో ‘గోల్డెన్ స్పారో’ అనే స్పెషల్ సాంగ్ చేశాను. జస్ట్ ఒక్క రోజులో ఈపాట పూర్తయింది. తెలుగులో కథలు వింటున్నాను.ఇతర భాషల్లో కొన్ని సినిమాలు కమిట్ అయ్యాను. రజనీకాంత్గారి ‘జైలర్ 2’ సినిమాలో నటించలేదు. అవకాశం వస్తే చేయాలని ఉంది. ఈ మధ్య కొంతమంది దర్శక–నిర్మాతలు ఉమెన్ సెంట్రిక్ సినిమాలు తీస్తున్నారు. ఇందుకు హ్యాపీగా ఉంది. నాకు కామెడీపాత్రలూ చేయాలని ఉంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘సోషల్ మీడియాలో నా హ్యాండిల్స్ను నా టీమ్ చూసుకుంటుంది. సోషల్ మీడియా వల్ల టైమ్ వేస్ట్ అవుతుందని నా ఫీలింగ్. నా ఫొటోలు షేర్ చేయడానికి సోషల్ మీడియాను వినియోగించుకుంటాను... అంతే. పెయిడ్ నెగటివ్ క్యాంపైన్స్ ఉంటాయని విన్నాను.ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని, సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. బాక్సాఫీస్ నంబర్స్ను పట్టించుకోను. ఒకప్పుడు సినిమా బాగుందా? లేదా అని మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఫలానా సినిమా ఇంత కలెక్ట్ చేసింది, ఫలానా సినిమా అంత కలెక్ట్ చేసిందని చెప్పుకుంటున్నాం. కొందరు ఫేక్ కలెక్షన్స్ చూపించి, సినిమా సూపర్ హిట్ అని చెబుతుంటారు. కానీ సినిమాలో సరైన కంటెంట్, క్వాలిటీ ఉండవు. మనీ గురించి మాట్లాడుతూ సినిమా సోల్ను మర్చిపోతున్నాం’’ అన్నారు. -
'ఓజీ' అభిమానులకు బ్యాడ్ న్యూస్?
ఈ నెలలో టాలీవుడ్ నుంచి రాబోతున్న బడా మూవీ 'ఓజీ'. పవన్ కల్యాణ్-సుజీత్ కాంబోలో తీసిన ఈ సినిమాపై ఓ మాదిరి అంచనాలు అయితే ఉన్నాయి. అయితే గ్లింప్స్, తొలి పాటతో హై తీసుకొచ్చారు గానీ తర్వాత వచ్చిన సాంగ్స్ మాత్రం ఓ మాదిరిగానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే పవన్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు ఓ బ్యాడ్ న్యూస్ అని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'లోక'తో డబ్బులు పోతాయని ఫిక్సయ్యా: దుల్కర్ సల్మాన్)రీసెంట్ టైంలో పెద్ద సినిమాలకు ప్రీమియర్లు వేస్తున్నారు. అంతెందుకు పవన్ గత చిత్రం 'హరిహర వీరమల్లు'కి కూడా రిలీజ్ ముందురోజు రాత్రి షోలు వేశారు. కానీ కంటెంట్ తీసికట్టుగా ఉండటంతో మూవీ ఫలితం బెడిసికొట్టింది. దీంతో పోలిస్తే 'ఓజీ'పై హైప్ ఉంది. అందుకు తగ్గట్లే ఈ సినిమాకు కూడా ముందు రోజు సాయంత్రం నుంచి ప్రీమియర్లు ఉండొచ్చని కొన్నిరోజుల క్రితం టాక్ వినిపించింది. కానీ ఇప్పుడవి లేవని అంటున్నారు. అర్థరాత్రి ఒంటి గంటకు లేదంటే వేకువజామున 4 గంటల నుంచే తెలుగు రాష్ట్రాల్లో షోలు పడ్చొచని టాక్. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్స్ కు సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది.1980-90లో ముంబై బ్యాక్ డ్రాప్లో నడిచే గ్యాంగ్స్టర్ డ్రామాగా 'ఓజీ'ని తెరకెక్కించారు. పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా చేసింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. తమన్ సంగీతమందించాడు. డీవీవీ దానయ్య నిర్మాత. (ఇదీ చదవండి: సింపతీ కార్డ్ ప్లే చేయొద్దు.. రీతూని ఏడిపించిన మాస్క్ మ్యాన్!) -
కొట్టేసిన దేవుడి భూముల్లో OG ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏంటి?
-
పవన్ కల్యాణ్ ఓజీ.. ఆ సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే పవన్ కల్యాణ్ పుట్టినరోజున కారుపై ఓజీ కూర్చున్న ఓ కొత్త లుక్ రిలీజ్ చేశారు. దీంతో పాటు గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి ఓమి అనే సాంగ్ను విడుదల చేశారు. ఈ సాంగ్లో ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ కనిపించారు. ఈ పాటకు అద్వితీయ లిరిక్స్ అందిచంగా.. శ్రుతి రంజని, ప్రణతి, శ్రుతిక, అద్వితీయ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. -
'ఓజీ' కొత్త గ్లింప్స్ రిలీజ్
'ఓజీ' సినిమా నుంచి కొత్త గ్లింప్స్ రిలీజ్ చేశారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం.. కారుపై ఓజీ కూర్చున్న ఓ కొత్త లుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు గ్లింప్స్ వీడియో విడుదల చేశారు. ఇందులో విలన్ పాత్రధారిని పరిచయం చేశారు. అతడి పాత్ర పేరు ఓమి. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఈ రోల్ చేశాడు. సదరు పాత్రతో గ్లింప్స్ చివరలో హ్యాపీ బర్త్ డే ఓజీ అని చెప్పించారు.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. సైలెంట్గా మొదలుపెట్టేశారు)అంతా బాగానే ఉంది గానీ పవన్ పుట్టినరోజు సందర్భంగా అతడిని హైలైట్ చేసే గ్లింప్స్ లాంటిది పడితే అభిమానులు కాస్త ఖుషీ అయ్యేవారు. అలా కాకుండా హీరో కంటే విలన్ పాత్రకు ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చేలా గ్లింప్స్ రిలీజ్ చేయడం కాస్త విచిత్రంగా అనిపించింది. ఎప్పటిలానే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ బాగున్నాయి.పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాని ఈ నెల 25న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. సుజీత్ దర్శకుడు కాగా తమన్ సంగీతమందించాడు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ సినిమాకు అభిమానుల్లో బజ్ గట్టిగానే ఉంది. పవన్ గత చిత్రం 'హరిహర వీరమల్లు' దారుణంగా ఫెయిల్ అవడంతో ఈ మూవీపై ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి సమంత దుబాయి ట్రిప్.. వీడియో వైరల్) -
అనుకున్నదే అయింది.. అఖండ-2 వాయిదా.. పవన్ కల్యాణ్ కోసమేనా?
బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'అఖండ'. 2021 డిసెంబరులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్గా అఖండ-2ను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్లో బాలయ్య మాస్ యాక్షన్ సీన్స్ ఆడియన్స్ను తెగ ఆకట్టుకున్నాయి. మంచు కొండల్లో ఆయన్ని పరిచయం చేస్తూ.. ఓ ఫైట్ సీన్ చూపించారు.అయితే అఖండ-2 ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ మూవీ రిలీజ్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 25న అఖండ-2 రావడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పోస్ట్ చేసింది. అయితే ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు వాయిదా వేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. మరింత వీఎఫ్ఎక్స్, రీ రికార్డింగ్ మెరుగులు దిద్దేందుకే పోస్ట్పోన్ చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రకటనతో బాలయ్య బాబు అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. (ఇది చదవండి: బాలకృష్ణ 'అఖండ 2' టీజర్ రిలీజ్.. ఈసారి కూడా)అయితే గతంలోనే అఖండ-2 వాయిదా పడనుందని వార్తలొచ్చాయి. ఎందుకంటే అదే రోజున పవన్ కల్యాణ్ నటించిన ఓజీ కూడా రిలీజ్ కానుంది. ఆ కారణం వల్లే బాలయ్య సినిమాను వాయిదా వేయనున్నారని టాక్ వినిపించింది. అందరూ ఊహించనట్లుగానే ఇవాల్టి ప్రకటనతో అదే నిజమైంది. అఖండ-2 తప్పుకోవడంతో పవన్ కల్యాణ్ ఓజీకి బాక్సాఫీస్ వద్ద రిలీఫ్ లభించింది. లేకపోతే బాలయ్యతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడాల్సి వచ్చేది. మరోవైపు ఓజీ కోసమే ఈ మూవీని వాయిదా వేశారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. అఖండ- 2 చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా సంయుక్త నటిస్తోంది.#Akhanda2 - AN IMPORTANT ANNOUNCEMENT.#Akhanda2Thaandavam 'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial @MusicThaman @14ReelsPlus @iamsamyuktha_ @RaamAchanta #GopiAchanta #MTejeswiniNandamuri @kotiparuchuri @ivyofficial2023 pic.twitter.com/3cKUSuehyS— 14 Reels Plus (@14ReelsPlus) August 28, 2025 -
పవన్ కల్యాణ్ 'ఓజీ' మెలోడీ సాంగ్ విడుదల
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ఓజీ నుంచి మరో సాంగ్ విడుదలయ్యింది. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. 'సువ్వి.. సువ్వి' అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ను సింగర్ శృతి రంజని పాడారు. కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు. ఈ పాట కోసం తమన్ మెలోడీ మ్యూజిక్ను అందించారు. గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. డీవీవీ దానయ్య నిర్మాత. శ్రియారెడ్డి, ప్రకాశ్రాజ్, అర్జున్దాస్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. -
యంగ్ హీరోయిన్ ప్రేమలో 'అర్జున్ దాస్' !
కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్ ప్రేమలో పడ్డాడు. ఈమేరకు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఖైదీ సినిమాలో విలన్గా నటించిన అర్జున్ దాస్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఓజీ సినిమాలో ఆయన కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే, ఒక యంగ్ హీరోయిన్తో అర్జున్ దాస్ ప్రేమలో ఉన్నారని నెట్టింట వైరల్ అవుతుంది.2017లో వచ్చిన ‘ఆక్సిజన్’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అర్జున్ దాస్.. మాస్టర్, విక్రమ్ చిత్రాలతో పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే, యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lakshmi)తో ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారిద్దరూ కలిసి ఒక వెబ్ సిరీస్ కోసం పనిచేస్తుండగా ఈ ప్రచారం జరుగుతుంది. కానీ, అర్జున్ దాస్ ఖండించారు. ఆపై ఐశ్వర్య లక్ష్మి కూడా తామిద్దరం మంచి స్నేహితులమంటూ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ప్రచారం మాత్రం ఆగడం లేదు. కొందరు మాత్రం నిప్పు లేనిదే పొగ రాదంటూనే వారి ప్రేమ నిజమేనంటూ చెప్పుకొస్తున్నారు. సరైన సమయం చూసి ప్రేమ గురించి అందరికీ తెలుపుతారంటూ పేర్కొంటున్నారు. బ్యాంకు ఉద్యోగిగా, రేడియో జాకీగా అర్జున్ దాస్ పనిచేయగా.. ఐశ్వర్య లక్ష్మి వైద్య విద్య పూర్తి చేశారు. ఐశ్వర్య లక్ష్మి తెలుగులో సత్యదేవ్తో గాడ్సే మూవీలో నటించారు. ప్రస్తుతం 'సంబరాల ఏటి గట్టు'లో సాయిధరమ్ తేజ్తో నటిస్తున్నారు. మట్టి కుస్తీ, కింగ్ ఆఫ్ కొత్త,పొన్నియిన్ సెల్వన్,థగ్ లైఫ్ వంటి భారీ చిత్రాల్లో ఆమె మెప్పించారు. కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన ఈ బ్యూటీ తమిళ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేశారు. -
ప్రశాంతమైన కన్మణి
పవన్ కల్యాణ్, ప్రియాంకా అరుళ్ మోహన్ జోడీగా నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్మోహన్ పోషించిన కన్మణి పాత్ర ఫస్ట్ లుక్ను చిత్రబృందం శనివారం విడుదల చేసింది. ‘‘ఓజీ’లో పవన్ కల్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తారు.ప్రతి తు పానుకు అవసరమైన ప్రశాంతత ప్రియాంకా అరుళ్మోహన్ కన్మణి పాత్ర. మా సినిమా నుంచి ఇటీవల విడుదలైన మొదటి పాట ‘ఫైర్ స్టార్మ్..’కు విశేష స్పందన లభించింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రకాశ్రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలుపోషిస్తున్న ఈ సినిమాకి సంగీతం ఎస్. తమన్, కెమెరా: రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస. -
సూపర్ సెప్టెంబర్
సెప్టెంబర్ నెల సినిమా లవర్స్కి సూపర్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రతి నెలా విడుదలవుతాయి కానీ పెద్ద సినిమాలు రెండో మూడో ఉంటాయి. అయితే సెప్టెంబర్లో విడుదలయ్యేవాటిలో పెద్ద సినిమాల సంఖ్య మెండుగానే ఉంది. ఆ సినిమాల గురించి తెలుసుకుందాం.యాక్షన్ డ్రామా... ‘అరుంధతి, పంచాక్షరి, భాగమతి, నిశ్శబ్దం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల తర్వాత అనుష్క లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఘాటీ’. ‘వేదం’ (2010) వంటి హిట్ మూవీ తర్వాత అనుష్క, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో రూపొందిన ద్వితీయ చిత్రమిది. విక్రమ్ ప్రభు, జగపతిబాబు, చైతన్యా రావు, రవీంద్రన్ విజయ్ ఇతర పాత్రలుపోషించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు.పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘ఘాటీ’. ఒక బలహీన మహిళ క్రిమినల్గా, ఆ తర్వాత లెజెండ్గా మారే పాత్రలో అనుష్క నటన అద్భుతంగా ఉంటుంది. అధిక బడ్జెట్తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో మా సినిమా రూపొందింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ మా మూవీపై అంచనాలు పెంచింది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. సూపర్ యోధ... ‘హనుమాన్’ (2024) చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్న తేజ సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రితికా నాయక్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషించారు. జగపతిబాబు, శ్రియ శరణ్, జయరామ్ ఇతర పాత్రలుపోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 2డీ, 3డీ ఫార్మాట్లలో 8 భాషల్లో విడుదల కానుంది.ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాలో తేజ సూపర్ యోధగా కనిపించనున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైనపోస్టర్స్, వీడియో గ్లింప్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. గౌర హరి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ‘వైబ్ ఉంది బేబీ..’ పాట ట్రెండింగ్గా మారింది. ‘హనుమాన్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ పై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా హిందీ థియేట్రికల్ హక్కులను కరణ్ జోహార్ దక్కించుకున్నారు.అందమైన ప్రేమకథ ఓ వైపు హీరోయిన్గా బిజీ బిజీగా వరుస ప్రాజెక్టులతో దూసుకెళుతూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలకీ సై అంటున్నారు రష్మికా మందన్న. ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి లీడ్ రోల్లో నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ‘‘అందమైన ప్రేమకథగా ఈ చిత్రం రూపొందింది.మనసుని ఆకట్టుకునే అంశాలతో రాహుల్ రవీంద్రన్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో రష్మిక నటన సరికొత్తగా ఉంటుంది. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా మా మూవీ ఉంటుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను హీరో విజయ్ దేవరకొండ తన వాయిస్ ఓవర్తో రిలీజ్ చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘నదివే...’ అంటూ సాగే తొలి పాట కూడా ఆకట్టుకుంది.కిష్కిందపురిలో... ‘భైరవం’ సినిమాతో ఇటీవల ప్రేక్షకులను అలరించారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆయన నటించిన తాజా చిత్రం ‘కిష్కిందపురి’. ‘రాక్షసుడు’ (2019) వంటి హిట్ మూవీ తర్వాత సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన ద్వితీయ చిత్రమిది. కౌశిక్ పెగల్లపాటి రచన, దర్శకత్వంలో అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాని సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ‘‘హారర్ మిస్టరీగా రూపొందిన చిత్రం ‘కిష్కిందపురి’.సాయి శ్రీనివాస్ కెరీర్లో హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ఇది. ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన హారర్, మిస్టరీ ఎక్స్పీరియన్స్ని అందిస్తుంది. కౌశిక్ పెగల్లపాటి గ్రిప్పింగ్ కథనం, చిన్మయ్ సలాస్కర్ కెమెరా వర్క్, సామ్ సీఎస్ సంగీతం ఆకట్టుకుంటాయి. సాహు గారపాటి గ్రాండ్గా నిర్మించిన ఈ చిత్రం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నచ్చుతుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్పోస్టర్కి మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రం నుంచి ‘ఉండి పోవే నాతోనే...’ అంటూ సాగే తొలి పాటని విడుదల చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది. యాక్షన్ భద్రకాళి సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత, దర్శకుడు... ఇలా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు విజయ్ ఆంటోని. ఆయన నటించిన 25వ చిత్రం ‘భద్రకాళి’. అరుణ్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ ఇతర పాత్రలుపోషించారు. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్పై విజయ్ ఆంటోని నిర్మించారు. ఈ సినిమాని తొలుత సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే ఆ తేదీకి కాకుండా 19వ తేదీ రిలీజ్ చేయనున్నట్లు లేటెస్ట్గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ విడు దల చేస్తోంది. ఈ చిత్రంలో కిట్టు పాత్రలో విజయ్ ఆంటోని నటించారు. సుమారు 200 కోట్ల రూపాయల కుంభకోణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. గత చిత్రాల కంటే స్టైలిష్గా, యాక్షన్ హీరోగా కనిపించనున్నారు విజయ్. వెండితెరపై తాండవం... హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనులది హిట్ కాంబినేషన్. వారి కలయికలో వచ్చిన ‘సింహా (2010), లెజెండ్ (2014), అఖండ’ (2021) సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతోన్న ఈ మూవీలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఎం. తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్యాంగ్స్టర్ పాత్రలో... పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’. ‘రన్ రాజా రన్, సాహో’ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలుపోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ‘‘ఓజీ’ చిత్రంలో పవన్ కల్యాణ్ భీకరమైన గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. యాక్షన్ ఫ్యాక్డ్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల యేటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి కథానాయికగా నటిస్తున్నారు. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్పై ‘హనుమాన్’ (2024) వంటి పాన్ ఇండియన్ ఫిల్మ్ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘‘యాక్షన్ ఫ్యాక్డ్ థ్రిల్లర్గా రూపొందుతోన్న చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల యేటిగట్టు). ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు సాయిదుర్గా తేజ్. ఆయనపోరాట సన్నివేశాలు సరికొత్తగా ఉంటూ ఆడియన్స్ని మెస్మరైజ్ చేస్తాయి. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.నవ్వులే నవ్వులు ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీ ఫేమ్ శివానీ నగరం, ‘90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్ జంటగా నటించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఎస్ఎస్ కాంచీ, అనిత చౌదరి, సత్య కృష్ణన్ ఇతర పాత్రలుపోషించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రోడక్షన్ బ్యానర్పై ఆదిత్య హాసన్ నిర్మించారు.ఈ సినిమాని నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నారు. ‘‘పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సినిమా చూస్తున్నంత సేపు థియేటర్లలో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. 2 గంటల పాటు మా చిత్రం ఆడియన్స్కి నవ్వులు పంచుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. కాగా సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘రాజా గాడికి...’ అంటూ సాగే పాటని విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా సెప్టెంబరులో విడుదలకు ముస్తాబవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
'ఓజీ' సినిమా తొలి పాట రిలీజ్
రీసెంట్గా పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా చతికిలపడింది. దీంతో అభిమానులు ఈ మూవీ గురించి మర్చిపోవడం మొదలుపెట్టారు. ఈ సెప్టెంబరు చివర్లో రిలీజయ్యే 'ఓజీ' కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ సినిమా నుంచి 'ఫైర్ స్ట్రోమ్' అంటూ సాగే తొలి లిరికల్ గీతాన్ని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ‘కింగ్డమ్’ బాక్సాఫీస్ కలెక్షన్స్.. రెండో రోజు ఎంతంటే?)పాట గురించి రిలీజ్ ముందు వరకు హైప్ ఎక్కువగానే ఇచ్చారు గానీ తమన్ ఇదివరకే కంపోజ్ చేసిన పాటల్లానే బాగుంది. కాకపోతే మరీ సూపర్గా అయితే అనిపించలేదు. అదే టైంలో లిరిక్స్ని మ్యూజిక్ డామినేట్ చేసినట్లు అనిపించింది. ప్రస్తుతానికైతే అభిమానులకు నచ్చినట్లే కనిపిస్తోంది. రానురాను పాట అలవాటు అవుతుందేమో చూడాలి.'ఓజీ' సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా చేసింది. సుజీత్ దర్శకుడు కాగా.. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో నిర్మించారు. సెప్టెంబరు 25న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. అదే రోజున బాలకృష్ణ 'అఖండ 2' రిలీజ్ కూడా ఉంది. మరి ఇద్దరు పోటీకి దిగుతారా? లేదంటే ఎవరైనా తప్పుకొంటారా అనేది చూడాలి?(చదవండి: 'మహావతార్ నరసింహ' ఆల్టైమ్ రికార్డ్ .. కలెక్షన్స్ ఎంతంటే?) -
'ఓజీ'తో అఖండ వార్.. తగ్గేది ఎవరంటే..?
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు పోటీ పడనున్నాయి. దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న పవన్ కల్యాణ్ (ఓజీ), బాలకృష్ణ (అఖండ 2) విడుదల కానున్నాయి. ఇప్పటికే రెండు సినిమాల నుంచి అధికారికంగా ప్రకటన వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద మొదటిసారి పవన్తో బాలయ్య పోటీ పడుతుండటంతో అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ మధ్య మరోసారి బాక్సాఫీస్ లెక్కలపై చర్చ జరగనుంది. దసరా విజేతగా ఎవరు నిలుస్తారో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ పోటీ నుంచి బాలయ్య తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇండస్ట్రీలో బలంగానే వార్తలు వినిపిస్తున్నాయి.రెండు భారీ బడ్జెట్ చిత్రాల మధ్య పోటీ ఎందుకనే 'అఖండ'నే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఆపై అఖండ2 ప్రాజెక్ట్తో పాన్ ఇండియా రేంజ్లో విజయం సాధించాలని దర్శకుడు బోయపాటి పక్కా ప్రణాళికతో ఉన్నారు. అందులో భాగంగానే ఈ సినిమా గ్రాఫిక్స్ పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం కేటాయించాలని ఆయన ఆలోచిస్తున్నారట. ఆపై ఇంకా కొంత భాగం షూటింగ్ పనులు కూడా పెండింగ్లో ఉన్నాయట. 2021 డిసెంబర్లో అఖండ విడుదలై బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇప్పుడు సీక్వెల్ కూడా డిసెంబర్ నెలలోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. అఖండ2 చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా సంయుక్త (Samyuktha) నటిస్తోంది. ఓజీ' సినిమాను రూ. 250 కోట్ల బడ్జెట్తో నిర్మాత డీవీవీ దానయ్య ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా అత్యంత బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రాలు ఒకేరోజు విడుదలైతే తప్పకుండా థియేటర్స్ విషయంలో ఇబ్బందులు రావచ్చు. అందుకే ఎవరో ఒకరు తమ సినిమాను వాయిదా వేసుకుని, నిర్మాణ పరంగా మరింత బలంగా తెరకెక్కించి కొత్త తేదీన విడుదల చేయడం బెటర్ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
అటు బాలయ్య.. ఇటు పవన్.. తగ్గేదెవరు?
టాలీవుడ్కి సంక్రాంతి, దసరా, దీపావళి పండగలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో పలు బడా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. పండగ వేళ సెలవులు ఉండడం.. అంతా ఎంజాయ్ చేసే మూడ్లో ఉంటారు కాబట్టి.. స్టార్ హీరోల సినిమాలు ఎక్కువ ఈ పండగ సమయాల్లోనే వస్తుంటాయి. అయితే ఒక్కోసారి రెండు మూడు పెద్ద సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. కొన్ని సార్లు అవన్నీ హిట్ అయితే..మరికొన్ని సార్లు వాటిల్లో ఏదో ఒకటి మాత్రమే విజయం సాధిస్తుంది. ఈ పోటీ కారణంగా కొన్ని మంచి చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టలేకపోతున్నాయి. అందుకే ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్దాలేవి జరగట్లేదు. స్టార్ హీరోలలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతున్నారు. పోటీ ఉన్నా తమకు సినిమాకు ఢోకా లేదు అనుకుంటే తప్ప.. రిలీజ్ చేయట్లేదు. కానీ త్వరలోనే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ యుద్దం జరగబోతుంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వారిలో ఒకరు బాలకృష్ణ(Nandamuri Balakrishna) అయితే మరో స్టార్ హీరో పవన్ కల్యాణ్( Pawan Kalyan). వీరిద్దరు బక్సాఫీస్ వార్కి రెడీ అవుతున్నారు.మరోసారి బాక్సాఫీస్పై ‘తాండవం’?బాలకృష్ణ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అఖండ: తాండవం’(Akhanda 2). వీరిద్దరి కాంబినేషన్లో 2021లో వచ్చిన ‘అఖండ’సినిమాకు సీక్వెల్ ఇది. తాజాగా ఈ సినిమా టీజర్ని రిలీజ్ చేశారు మేకర్స్. దాంతో పాటు రిలీజ్ డేట్ని కూడా ప్రకటించారు. దసర కానుకగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం రాబోతుందని వెల్లడించారు. మరోవైపు పవన్ కల్యాణ్ ఓజీ సినిమా కూడా అదే రోజు రిలీజ్ కానుంది.‘ఓజీ’ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఓజీ(OG) ఒకటి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియంకా మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. ఇమ్రాన్ హష్మి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు కానీ రిలీజ్ డేట్ మాత్రం చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అదే రోజు బాలయ్య కూడా అఖండ 2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఇద్దరి సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒకేసారి రావడం రెండూ సినిమాకు మంచిది కాదని సినీ పండితులు చెబుతున్నారు. కాస్త గ్యాప్ తీసుకొని వస్తే రెండు చిత్రాలకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని, ఒకోసారి వస్తే కొంచెం తేడా అయితే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని అభిప్రాయ పడుతున్నారు. మరి వీరిద్దరిలో ఎవరో ఒకరు తగ్గుతారా? లేదా ‘తగ్గేదే లే’ అంటూ బాక్సాఫీస్ వార్కి సై అంటారా? కొద్ది రోజుల్లో తెలుస్తుంది. -
పవన్ 'ఓజీ' కంటే కన్నప్ప బడ్జెట్ ఎక్కువ: మంచు విష్ణు
మంచు విష్ణు హీరోగా నటించి, భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ఈనెల 27న థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల క్రితం ఈ మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ దొంగతనానికి గురవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అది దొరికిందా లేదా అనేది పక్కనబెడితే విష్ణు ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు. ఈ క్రమంలోనే తెలుగులో రౌండ్ టేబుల్ పేరుతో ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో కన్నప్ప బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?)కన్నప్ప సినిమాకు బడ్జెట్ ఎంతయిందని ఇంటర్వ్యూయర్ అడగ్గా.. కచ్చితంగా మూడంకెల ఖర్చు అయిందని విష్ణు చెప్పుకొచ్చాడు. అయితే రూ.100 కోట్లు అయిందా? రూ.200 కోట్లు అయిందా? అని మరోసారి అడగ్గా.. ఈ ఏడాది ఇప్పటికే రిలీజైన చిత్రాల కంటే తమ 'కన్నప్ప' ఎక్కువని పేర్కొన్నడు. అలానే ఈ ఏడాదిలోనే విడుదలయ్యే పవన్ కల్యాణ్ 'ఓజీ' కంటే తమ మూవీ బడ్జెట్ ఎక్కువని క్లారిటీ ఇచ్చాడు. ఎంతో చెబితే ఐటీ వాళ్లు.. తన ఆఫీస్కి వస్తారు? ఎందుకు ఈ గొడవ? అని విష్ణు చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కన్నప్ప సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో చెప్పిన మంచు విష్ణు.. గత కొన్నేళ్లుగా ఈ మూవీపైనే ఉన్నాడు. ఇందులో మంచు విష్ణు హీరో కాగా.. ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ తదితర స్టార్స్ ఇందులో నటించారు. దీంతో మూవీపై కాస్తంత బజ్ ఉంది. కానీ చాన్నాళ్ల క్రితం టీజర్ రిలీజైనప్పుడు మాత్రం కాస్త గట్టిగానే ట్రోలింగ్ వచ్చింది. కానీ తర్వాత మరో టీజర్ విడుదల చేసినప్పుడు మాత్రం అది కాస్త తగ్గిందని చెప్పొచ్చు. మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రానున్న 'కన్నప్ప'.. విష్ణు కెరీర్ని ఎలా మారుస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు) -
పవన్ కల్యాణ్ 'ఓజీ'లో శిరీష.. నారా రోహిత్ క్లారిటీ
పవన్కల్యాణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'ఓజీ'లో శిరీష లేళ్ల ఛాన్స్ దక్కించుకుంది. ఇదే విషయాన్ని అధికారికంగా ఆమెకు కాబోయే భర్త నారా రోహిత్ తాజాగా ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఓజీ సినిమా గురించి మాట్లాడారు. 'ప్రతినిధి2' చిత్రంలో నారా రోహిత్ సరసన శిరీషా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రేమలో పడిన వారిద్దరూ గతేడాదిలో నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో వివాహం కానుంది.'భైరవం' సినిమా మే 30న విడుదల కానుంది. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించారు. మూవీ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఈ ముగ్గురితో హీరో సాయి ధరమ్ తేజ్ ఒక ఇంటర్వ్యూ చేశారు. ఓజీ అప్డేట్ ఇవ్వాలంటూ రోహిత్ను ప్రశ్నించగా ఇలా చెప్పారు. 'ఓజీలో నాకు కాబోయే సతీమణి శీరీషా కూడా నటించారు. ఒక కీలకమైన పాత్రలో నటించే ఛాన్స్ ఆమెకు దక్కింది' అని ఆయన అన్నారు. ప్రస్తుతం రోహిత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.‘ఓజీ’ సినిమా షూటింగ్ స్పీడ్గానే సాగుతుంది. ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మి ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోందని సమాచారం. ఈ ఏడాది సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తమన్ సంగీతం అందించారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్లతో పాటు శిరీషా కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తుంది. -
'ఓజీ'లో నారా రోహిత్ కాబోయే సతీమణి
పవన్కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఓజీ'లో నారా ఫ్యామిలీకి కాబోయే కోడలు నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నటుడు నారా రోహిత్కు కాబోయే సతీమణి శిరీషా (శిరీష లేళ్ల) ఈ చిత్రంలో ఒక కీలకపాత్రలో నటించినున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మి ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోందని తెలిసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.'ప్రతినిధి2' సినిమాలో నారా రోహిత్ సరసన శిరీష నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గతేడాదిలో నిశ్చితార్థం జరిగింది. త్వరలో ఏడడుగుల బంధంతో ఒకటి కానున్నారు. భైరవం సినిమాతో నారా రోహిత్, ఓజీ సినిమాతో శిరీషా ఈ ఏడాదిలో తెరపై సందడి చేయనున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీషా స్వస్థలం రెంటచింతల అని తెలిసిందే. సినిమాలపై మక్కువతో ఆమె హైదరబాద్లోని తన అక్క ప్రియాంక వద్ద ఉంటూ సినిమా ఛాన్స్ల కోసం ప్రయత్నాలు చేస్తుండగా నారా రోహిత్తో ప్రతినిధి2లో అవకాశం దక్కింది. అలా వారి పరిచయం కాస్త పెళ్లి వైపు అడుగులు పడ్డాయి. వివాహానికి ఇంకా సమయం ఉండటంతో ఆమె పలు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఓజీలో ఛాన్స్ దక్కడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. -
సెప్టెంబరులో ఓజీ
పవన్కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’. ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మి ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోందని తెలిసింది.కాగా ‘ఓజీ’ని ఈ ఏడాది సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లుగా ఆదివారం మేకర్స్ వెల్లడించారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్. -
ఓజీ భామ ప్రియాంక మోహన్ గ్లామర్ షో (ఫొటోలు)
-
సినిమాల్లో నటించడంపై క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) సినీరంగంలో కొనసాగుతారా..? మళ్లీ కొత్త సినిమాలు చేస్తారా..? అని అభిమానుల్లో చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ విషయంపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పవన్ చేతిలో ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. అయితే, ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం రావడం కష్టమేనని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ, ఈ మూడు సినిమాల కోసం పవన్ ఇప్పటికే చాలా సమయం తీసుకున్నారు. దీంతో నిర్మాతలకు బడ్జెట్ పెరిగి తలనొప్పిగా మారిందని కూడా చెబుతున్నారు.తమిళ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి పవన్ కల్యాణ్ మాట్లాడారు. తనకు డబ్బు అవసరం ఉన్నంత వరకూ నటిస్తూనే ఉంటానని చెప్పారు. అయితే, తాను సినిమా నిర్మాణరంగంలో మాత్రం భాగం కానన్నారు. 'నాకు ఉన్న ఏకైకా ఆదాయమార్గం నటన మాత్రమే.. నాకు డబ్బు అవసరం ఉన్నంతవరకూ నటిస్తూనే ఉంటాను.' అని పవన్ అన్నారు. 2020 ముందు వరకు పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ కేవలం రూ. 15 కోట్ల లోపు మాత్రమే అని ఇండస్ట్రీలో చెబుతున్న మాట.. అయితే, వకీల్సాబ్ సినిమా నుంచి ఆయన రూ. 50 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. -
పవన్ కొత్త సినిమాలు క్యాన్సిల్?
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలుగులో స్టార్ హీరో. కానీ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దీంతో చేతిలో ఉన్న సినిమాలే పూర్తి చేయలని పరిస్థితి. అలాంటి కొత్త చిత్రాలంటే అస్సలు అయ్యే పనికాదు. ఈ క్రమంలోనే కొత్త సినిమాలు రెండు క్యాన్సిల్ అయ్యాయనే మాట వినిపిస్తోంది.పవన్ చేతిలో ప్రస్తుతం 'హరిహర వీరమల్లు', 'ఓజీ' (OG Movie) సినిమాలున్నాయి. వీటిలో 'హరిహర..' లెక్క ప్రకారం ఈ మార్చి 27న రిలీజ్ కావాలి. కానీ మే 9కి వాయిదా వేశారు. పవన్ కి సంబంధించిన కొన్ని సీన్స్ పెండింగ్ ఉన్నాయని అంటున్నారు. మరి మేలో అయినా సరే సినిమా రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.(ఇదీ చదవండి: వెంటిలేటర్ పై అల్లు అర్జున్ నానమ్మ.. ఇప్పుడు ఎలా ఉందంటే?)పవన్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్న 'ఓజీ'కి దాదాపు 20 రోజుల డేట్స్ పవన్ ఇవ్వాల్సి ఉందట. అది ఎప్పుడు జరిగితే దానిబట్టి రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ టీమ్ ఉంది. ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లి చాలా ఏళ్లు అయిపోయాయి. ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఎప్పుడొస్తాయో చెప్పలేని పరిస్థితి.ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaab Bhagath Singh) షూటింగ్ కొన్నిరోజులు చేశారు. గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ మూవీని హోల్డ్ లో పెట్టేశారనే టాక్ ఉంది. అలానే సురేందర్ రెడ్డితో కమిట్ అయిన ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ చేసేశారని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల బట్టి చూస్తే పవన్ చివరి చిత్రం 'ఓజీ'నే!(ఇదీ చదవండి: రామ్ చరణ్- అల్లు అర్జున్.. ఈ సారికి లేనట్టే!) -
మైమరపించే అందాలతో OG నటి శ్రీయా రెడ్డి ఫొటోస్
-
నెట్ఫ్లిక్స్లో పవన్ కల్యాణ్ ‘ఓజీ’.. రాబోయే తెలుగు సినిమాలివే!
కరోనా తర్వాత ఓటీటీల వాడకం దేశవ్యాప్తంగా ఎక్కువైంది. థియేటర్కి వెళ్లి సినిమా చూడడం తగ్గించి.. ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో సినిమాను వీక్షిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్తో పాటు నెట్ఫ్లిక్స్లోనూ ఇండియన్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్కి చెందిన స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా నెట్ఫ్లిక్స్లోనే స్క్రీమింగ్ అవుతున్నాయి. అయినప్పటికీ మిగతా భాషలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి నెట్ఫ్లిక్స్ ఖాతాదారులు తక్కువగానే ఉన్నారు. అందుకే ఆ సంస్థ టాలీవుడ్పై ఫోకస్ చేసింది. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఏడాది మరింత మందిని తమ ఖాతాదారులుగా చేర్చుకునేందుకు గాను నెట్ఫ్లిక్స్ పదులకొద్ది సినిమాలను కొనుగోలు చేసింది. టాలీవుడ్ చిత్రాలపై ఫోకస్ఒకప్పుడు నెట్ఫ్లిక్స్ టాలీవుడ్తో పాటు దక్షిణాది చిత్రాలకు కాస్త దూరంగా ఉండేది.ఏడాది మూడు నాలుగు చిత్రాలు మాత్రమే రిలీజ్ చేసేది. కానీ ఇప్పుడు దక్షిణాది చిత్రాలపై ఫుల్ ఫోకస్ చేసింది. ముఖ్యంగా టాలీవుడ్ చిత్రాలను వరుసగా రిలీజ్ చేస్తుంది. గతేడాది బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్న అనేక చిత్రాల స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది.ఇక 2025లోనూ నెట్ఫ్లిక్స్ అదే ఒరవడి కొనసాగించనుంది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న తెలుగు సినిమా జాబితాను ప్రకటించింది. ఈ సారి నెట్ఫ్లిక్స్ ఖాతాలో పవన్ కల్యాణ్ ‘ఓజీ’, నాగచైతన్య ‘తండేల్’తో సహా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు పెట్టి ఈ చిత్రాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. థియేటర్స్లో విడుదలైన తర్వాత ఒప్పందం చేసుకున్న ప్రకారం ఈ చిత్రాలు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతాయి. ఆ క్రేజీ ప్రాజెక్ట్స్పై ఓ లుక్కేద్దాం.OG is back, and everybody is about to feel the heat! 💥 OG is coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/TawVw3QavA— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025పవన్ ‘ఓజీ’.పవన్ కల్యాణ్ నటించాల్సిన సినిమాల్లో ఓజీ ఒకటి. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే రాజకీయాల్లో పవన్ బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాదిలో మాత్రం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆ దిశగా పనులు కూడా ప్రారంభించారు. ఈ చిత్రంతో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించగా.. ఇమ్రాన్ హష్మి కీలక పాత్ర పోషించబోతున్నారు.నాగచైతన్య ‘తండేల్’ When fate drags them across borders, only courage can bring them home. 🌊❤️Thandel, coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/uRMGVxk43n— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన తండేల్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ సైతం నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. తండేల్ సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటకు యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఫిబ్రవరి 7న ఈ చిత్రం థియేటర్స్లో విడుదల కానుంది.Brace yourself for a mass jathara from the one and only Mass Maharaja! Mass Jathara, coming to Netflix in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/FCCbwWHdcm— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 రవితేజ ‘మాస్ జాతర’రవితేజ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘మాస్ జాతర’. రవితేజ కెరీర్లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత రవితేజ, శ్రీలీల మళ్లీ జంటగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎస్ఐ లక్ష్మణ్ భేరీ పాత్రలో రవితేజ నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న థియేటర్స్లో విడుదల కానుంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. A man without a side and betrayal without limits.VD12, coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release!#NetflixPandaga pic.twitter.com/WugL3yTprB— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025వీడి12విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘వీడీ 12’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, రుక్మిణీ వసంత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ని కూడా నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. దీంతో పాటు నాని హిట్ 3, మ్యాడ్ స్క్వేర్, జాక్, అనగనగా ఒక రాజు సినిమాలను సైతం నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. The boys are back with double the MADness! 🔥 Mad Square, coming to Netflix, in Telugu, Tamil, Kannada, Malayalam & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/vW4nedPEsB— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025Grab your gold, the King is getting married! 🤭 Anaganaga Oka Raju, coming to Netflix, in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/fewgneVXv8— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 -
ఫ్యాన్స్ ఓజీ అని అరుస్తుంటే బెదిరింపుల్లా ఉన్నాయి: పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న సినిమాల నుంచి పెద్దగా అప్డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్లో గందరగోళం నెలకొంది. దీంతో ఎట్టకేలకు పవన్.. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలపై స్పందించాడు. సోమవారం నాడు ఆయన మాట్లాడుతూ..అభిమానులు ఎక్కడికెళ్లినా ఓజీ ఓజీ అని అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి.డేట్స్ ఇచ్చా..నేను ఒప్పుకున్న సినిమాలకు డేట్స్ ఇచ్చాను. కానీ నిర్మాతలే సరిగా వినియోగించుకోలేదు. హరిహర వీరమల్లు మూవీ (Hari Hara Veeramallu Movie) షూటింగ్ కేవలం ఎనిమిది రోజులు మాత్రమే పెండింగ్లో ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా స్క్రిప్టు పనులే జరుగుతున్నాయి. ఈ మూడు చిత్రాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తాను అని తెలిపారు. హరిహర వీరమల్లు విషయానికి వస్తే ఇది పీరియాడిక్ ఫిలింగా తెరకెక్కనుంది. (చదవండి: అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్)సినిమా..క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఓజీ విషయానికి వస్తే సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ, శ్రియ రెడ్డి, అర్జున్ దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2025వ సంవత్సరంలో రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.చదవండి: పడుచు హీరోయిన్లతో సీనియర్ హీరోల రొమాన్స్.. 'తప్పేముంది?' -
పవన్ కళ్యాణ్ 06 లో ఛాన్స్ ఎలా వచ్చిదంటే..
-
దేవర ముంగిట దుల్కర్, రవితేజ..
-
పవన్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..ఎన్టీఆర్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్!
‘జనతా గ్యారేజ్’ లాంటి హిట్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో శరవేగంగా జరుగుతోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. పార్ట్ 1 ఈ ఏడాది ఏప్రిల్ 5నే విడుదల కావాల్సింది. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో అక్టోబర్ 10కి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఆ తేది కూడా మారినట్లు తెలుస్తోంది. (చదవండి: ఆ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు: మహేశ్ బాబు)తాజా సమాచారం ప్రకారం..దేవర అనుకున్న దాని కంటే రెండు వారాల ముందే వచ్చేస్తున్నాడట. అంటే అక్టోబర్ 10 నుంచి సెప్టెంబర్ 27కి ప్రీసోన్ చేస్తున్నారట. వాస్తవానికి సెప్టెంబర్ 27న పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’చిత్రం విడుదల కావాల్సింది. చాలా రోజుల క్రితమే రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో రీలీజ్ని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. అందుకే దేవర రెండు వారాల ముందే వచ్చేస్తున్నాడు. రిలీజ్ డేట్పై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఓజీ వాయిదా పడినందుకు పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందితే.. దేవర ముందే వస్తున్నందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. (చదవండి: ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'.. బుజ్జిని డ్రైవ్ చేసిన ఆనంద్ మహీంద్రా!)ఇక దేవర విషయానికొస్తే.. ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. కల్యాణ్ రామ్ సమర్పణలో మిక్కినేని సుధాకర్, కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందుతో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. -
పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. అనుకున్న టైమ్ కంటే 'దేవర' ముందుగానే థియేటర్లలోకి రాబోతున్నాడా? అంటే అవుననే టాక్ నడుస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఏకంగా పవన్ కల్యాణ్ మూవీ రిలీజ్ తేదీకి టెండర్ వేశాడని తెలుస్తోంది. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయింది. అసలు ఏం జరుగుతుంది? 'దేవర' ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది?(ఇదీ చదవండి: హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?)'ఆర్ఆర్ఆర్' తర్వాత తారక్ చేస్తున్న మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకుడు. దీన్ని రెండు భాగాలుగా తీస్తున్నారు. లెక్క ప్రకారం ఏప్రిల్ 5న తొలి భాగం రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో కొత్త తేదీ ప్రకటించారు. అక్టోబరు 10న థియేటర్లలోకి వస్తామని క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు ఆ డేట్ మారే అవకాశముందని అంటున్నారు. షూటింగ్ త్వరగా పూర్తి చేసి చెప్పిన టైం కంటే రెండు వారాల ముందే అంటే సెప్టెంబరు 27నే థియేటర్లలోకి తీసుకువస్తారని టాక్ నడుస్తోంది.అయితే ఆ తేదీకి పవన్ కల్యాణ్ 'ఓజీ' మూవీ రిలీజ్ అవుతుందని నిర్మాత డీవీవీ దానయ్య ఇదివరకే ప్రకటించారు. ప్రస్తుతం ఎన్నికల బిజీలో ఉన్న పవన్.. ఇవి పూర్తయిన తర్వాత అయినా డేట్స్ ఇస్తాడా అంటే సందేహమే. ఒకవేళ ఇచ్చినా సరే ఇప్పట్లో పూర్తవుతాయనే నమ్మకం అయితే లేదు. అందుకే ముందు జాగ్రత్తగా 'దేవర'.. సెప్టెంబరు చివర్లో రావాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సోలో డేట్ దొరుకుతుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు దక్కే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇందులో నిజమెంతనేది త్వరలో ఓ క్లారిటీ వస్తుందిలే!(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్) -
అజ్ఞాతవాసి పొలిటికల్ సినిమా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్.. ఈ రెండు పేర్లు కూడా ఆయనవే. కానీ 2024 ఎన్నికలు జరగక ముందే 'పవర్ స్టార్' అవతారంలో ఫిక్సయ్యేలా కనిపిస్తున్నాడు పవన్. అదే అభిప్రాయం ఆయన అభిమానుల్లో కూడా కలుగుతోంది. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే ఒక ఇబ్బంది ఉంది. అదేంటంటే వాళ్లు సినిమాలు వదులుకోలేరు. రాజకీయాలను.. ముఖ్యంగా అధికారాన్ని చెలాయించాలనుకుంటారు. రెండూ కావాలని వస్తే ప్రజలు ఊరుకోరు. అందుకే గత ఎన్నికల్లో ఆయన్ను రెండు చోట్ల ప్రజలు ఓడగొట్టారు. (ఇదీ చదవండి: లగేజీ ప్యాక్ చేసుకున్న మెగా బ్రదర్స్.. పరుగులు పెడుతున్న పవన్) పవన్ కళ్యాణ్ పార్ట్ టైమ్ పొలిటిషియనా? లేక సినిమాలు పార్ట్ టైమా? అనే విషయంలో పవన్కు ఓ క్లారిటీ ఉన్నట్టుంది. గత రెండేళ్ల కాలం చూస్తే పవన్ కళ్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిసిపోతుంది. వారం క్రితం జెండా సభ అంటూ స్టేజీపై రెచ్చిపోయిన పవన్ ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఆ సభకు ముందు కూడా ఆయన రాజకీయాల్లో పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. కనీసం ఎక్కడ నుంచి పోటీ చేస్తాడో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో పవన్ ఉన్నాడు. 50 రోజుల్లో ఎన్నికలు ఉండగా ఏ పార్టీ అధినేత కూడా ఇలా చేయడు. వారాహి యాత్ర అంటూ ఊదరగొట్టినా.. ఆరు నెలల నుంచి ఆ వాహనం ఎక్కడికి వెళ్లిందో తెలియదు. తెలంగాణ ఎన్నికల్లో అతి కష్టమ్మీద 8 మంది అభ్యర్థులను దించినా.. చివరాఖరి వరకు పవన్ ప్రచారమే చేయలేదు. షూటింగ్లు లేనప్పుడు మాత్రమే పవన్కు రాజకీయాలు గుర్తొస్తాయంటారు జనసైనికులు. అధికారం కోసం అల్లాడిపోయే.. పవన్.. రాజకీయాలకు ఎంత సమయం కేటాయిస్తున్నడన్నది బిగ్ క్వశ్చన్ మార్క్. గత మూడేళ్లుగా ఆయన సినిమాల లిస్టు ఒకసారి పరిశీలిద్దాం. 2019 - సినిమా నెరేషన్ 2021 - వకీల్ సాబ్ 2022 - భీమ్లా నాయక్ 2023 - బ్రో 2024 - ఓజీ, హరిహర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్(?) 2024 ఎన్నికల కోసం నానా హంగామా చేస్తోన్న పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఓజి సినిమా కోసం ఇంకా కనీసం 30 రోజులు షూటింగ్ వర్క్ చేయాల్సి ఉంది. ఈ సినిమాకు బాగా మార్కెట్ కావాలని తెగ ప్రచారం చేశారు. ఇప్పటికే ఓజి సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. అనుకున్న సమయానికి రీలీజ్ చేయాలంటే ఎన్నికలు అయిన వెంటనే పవన్ రాజకీయాలను ప్యాకప్ చేసి సినిమాల కోసం మేకప్ వేసుకోవాలి. పవన్ చేతిలో హరిహరవీరమల్లు (క్రిష్) , ఓజీ (సుజిత్) , ఉస్తాద్ భగత్ సింగ్ (హరీష్ శంకర్) వంటి టాప్ ప్రాజెక్టులున్నాయి. వీటిలో హరిహరవీరమల్లు, ఓజీ చిత్రాలు షూటింగ్ మధ్యలో ఉన్నాయి. రెండు నెలల క్రితం ఫుల్ బిజీగా ఈ సినిమాల షూటింగ్ కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు కోసం పార్ట్టైమ్ జాబ్ మాదిరి టీడీపీలో స్టార్ క్యాంపెయినర్గా పవన్ ఉన్నాడు. ఎన్నికల్లో పవన్ రోల్ ముగిసిన తర్వాత వెంటనే మళ్లీ రెగ్యూలర్ షూటింగ్స్లోకి వెళ్లడం ఖాయం. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ మోసం చేశారు: ట్రాన్స్జెండర్) తాజాగా నిర్మాత దానయ్య కూడా పవన్ను కలిసిన విషయం తెలిసిందే.. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఓజి సినిమా పూర్తి చేస్తానని పవన్ మాట ఇచ్చారట. ఈ భారీ ప్రాజెక్ట్తో పాటు.. పవన్ పూర్తి చేయాల్సిన సినిమాలు మరో రెండు వున్నాయనే విషయం తెలిసిందే. ఇలా మొత్తం మూడు సినిమాలు చేయాలి.. సాధారణంగా ఒక టాప్ హీరోకు చెందిన సినిమా తర్వాత మరో సినిమా థియేటర్లోకి రావాలంటే సుమారు రెండేళ్లు అయినా పడుతుంది. అలాంటిది పవన్ ఒప్పుకున్న సినిమాలు మూడు ఉన్నాయి. అంటే ఈ లెక్కన పవన్ వచ్చే ఎన్నికల వరకు మళ్లీ సినిమాలతోనే బిజీగా ఉంటారు. ఉన్న ప్రాజెక్ట్లతోనే ఆయన బిజీగా ఉంటే మరో సినిమాను సెట్ చేయడానికి పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే భవిష్యత్లో సినిమాలు కొనసాగించాలనే పవన్ నిర్ణయించుకున్నారని స్పష్టంగా ఎవరికైనా అర్థం అవుతుంది. చంద్రబాబు కోసం... తాను రాజకీయం చేస్తున్నానని పదేపదే చెబుతున్న పవన్.. అందుకు తగ్గట్టు తాజాగా జరిగిన జెండా సభలో కూడా బాబును ఉద్ధండుడిగా అభివర్ణించాడు. అక్కడి వరకు జనసేన కార్యకర్తలకు ఇబ్బంది లేదు కానీ.. నన్నెలా ప్రశ్నిస్తారంటూ సొంత పార్టీ నేతలు, కార్యకర్తలపైనే పవన్ విరుచుకుపడడం .. జనసైనికులను షాక్కు గురి చేసింది. తాను అసలు రాజకీయాలు చేస్తాడా? ఎన్నికల తర్వాత పార్టీ నడుపుతాడా? అన్న విషయంలో స్పష్టత ఇవ్వడు. సింగిల్గా పోటీ చేయి, వచ్చే ఎన్నికల నాటికి నాయకుడిగా ఎదుగుతావని బీజేపీ పెద్దలు చీవాట్లు పెట్టారని తానే స్వయంగా చెప్పుకున్నాడు. అంత హితబోధ చేసినా.. పవన్ మాత్రం జై బాబు మత్తులోనే ఉన్నాడు. మరి రాజకీయాలైనా సీరియస్గా చేస్తాడా.. అదీ లేదు. ఏదేమైనా 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి ఓడిపోతుందని పవన్, ఆయన దత్తతండ్రికి ముందే తెలుసంటున్నారు. అన్ని లెక్కలు పవన్ వద్ద ఉన్నాయి కాబట్టే సినిమాలు వదులుకోకుండా వచ్చే ఐదేళ్ల వరకు పలు ప్రాజెక్ట్లను లైన్లో పెట్టాడు. తాను ఇక సినిమాల్లో నటించనని ఒకప్పుడు పవన్ అన్నాడు. కానీ ఆ మాట అన్న తరువాతే ఆయన నటించడం ఎక్కువైంది అన్నది ఫిలింనగర్లో పిల్లాడిని అడిగినా చెబుతాడు. పవన్ పొలిటికల్ సినిమాకు అప్పటివరకు భశుం. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ వీక్నెస్ ఏంటో గానీ.. మరీ ఇంత దిగజారుడా..!?) -
అభిమాని వింత కోరిక తీర్చిన 'గ్యాంగ్ లీడర్' హీరోయిన్!
హీరోయిన్ ప్రియాంక మోహన్.. అభిమాని అడిగిన వింత ప్రశ్నకు సమాధానమిచ్చింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా ఇన్ స్టాలో పలువురు సెలబ్రిటీలు అప్పుడప్పుడు 'ఆస్క్ ఎనీ థింగ్' పేరు ఫన్ సెషన్ లాంటిది పెడుతుంటారు. అయితే కొందరు ఆకతాయులు ఫన్నీ ప్రశ్నల్లాంటివి అడుగుతుంటారు. తాజాగా ప్రియాంక మోహన్ విషయంలో అలాంటి అనుభవమే ఎదురైంది. ఇంతకీ అసలేం జరిగింది? (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఊరు పేరు భైరవకోన'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) నాని' గ్యాంగ్ లీడర్' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ప్రియాంక మోహన్.. ఆ తర్వాత 'శ్రీకారం' అనే మూవీలో నటించింది. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ పూర్తిగా తమిళంకే పరిమితమైపోయింది. మళ్లీ ఇప్పుడు 'ఓజీ', 'సరిపోదా శనివారం' లాంటి తెలుగు చిత్రాలు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా ఇన్ స్టాలో ప్రియాంక మోహన్.. 'ఆస్క్ ఎనీథింగ్' అని చిన్న ఫన్ సెషన్ పెట్టింది. ఇందులో ఓ నెటిజన్/అభిమాని.. 'మీ గోళ్లు చూపించండి మేడమ్' అని అడిగాడు. దీనికి బదులిచ్చిన ప్రియాంక.. తన చేతిని స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. 'వాడు ఏ ఉద్దేశంతో అడిగాడో ఏంటో' అని పలువురు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) -
రికార్డ్ ధరకు 'ఓజీ' ఆడియో రైట్స్
-
బిగ్ బాస్ శుభశ్రీకి గోల్డెన్ ఛాన్స్.. పాన్ ఇండియా సినిమాలో ఎంట్రీ
బిగ్బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ శుభశ్రీ రాయగురుకు గోల్డెన్ ఛాన్స్ దక్కింది. లాయర్ కావాలని ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఈ ఒడిసా బ్యూటీ సినిమాలపై మక్కువతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. తెలుగు పరిశ్రమపై మక్కువతోనే ఇక్కడికి వచ్చానని ఆమె పలు ఇంటర్వ్యూలలో తెలిపింది. తాజాగా ఆమెకు పవన్- సుజీత్ కాంబినేషన్లో వస్తున్న 'OG' సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించేందుకు అవకాశం దక్కింది. ఇదే విషయాన్ని ఆమె ప్రకటిస్తూ డైరెక్టర్ సుజీత్తో దిగిన ఒక ఫోటోను షేర్ చేసింది. బిగ్ బాస్లో ఆట కూడా బాగా ఆడుతుంది అనుకునే లోపే అనూహ్యంగా ఆమె ఎలిమినేట్ అయిపోయింది. కానీ అంతా మన మంచికే జరిగిందిలే అని తాజాగా సుబ్బు ఫ్యాన్స్ తెలుపుతున్నారు. పవన్తో నటించే అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపింది. తన టాలెంట్ పట్ల నమ్మకాన్ని ఉంచిన డైరెక్టర్ సుజీత్కు థ్యాంక్స్ చెప్పింది. తనను అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు అంటూ తెలిపింది. ఇకపోతే బిగ్బాస్ సీజన్ 7 నుంచి ఐదో వారంలోనే అనూహ్యంగా ఎలిమినేట్ అయింది శుభశ్రీ రాయగురు. నిజానికి సుబ్బు చాలా బలమైన కంటెస్టెంట్గా ఉన్నప్పటికీ ఆమె ఎలిమినేషన్ కావడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆమె రీఎంట్రీ ఉంటుందని ఆశిస్తే అది కూడా ఊల్టాపుల్టా పేరుతో ఆమె ఆశలకు గండి పడింది. View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) -
పవన్ కల్యాణ్ ఓజీపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్..!
సాహో తర్వాత దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఓజీ(OG). పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గ్లింప్స్ని విడుదల చేశారు మేకర్స్. పవన్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ చూస్తే ఫుల్ యాక్షన్లో మోడ్లో గ్యాంగ్స్టర్గా పవన్ కల్యాణ్ లుక్ అదిరిపోయింది. గ్లింప్స్ అద్భుతంగా ఉందంటూ పలువురు ట్వీట్స్ చేస్తున్నారు. హంగ్రీ చీతా అనే పేరుతో వచ్చిన ఓజీ గ్లింప్స్ అద్భుతంగా ఉంది. ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. (ఇది చదవండి: ఘట్టమనేని కుటుంబంలో పెళ్లి సందడి.. ఫోటోలు షేర్ చేసిన రోజా) పవన్ కల్యాణ్కు బర్త్ డే విషెస్ చెబుతూ ఆర్జీవీ చేసిన ట్వీట్ చేశారు. 'ఓజీ గ్లింప్స్ ప్రపంచాన్ని దాటేసింది.. నేను ఇప్పటి వరకు చూసిన పీకే ట్రైలర్స్లో ఇది అత్యుత్తమం. హే సుజిత్ మీరు చంపేశారు బ్రో అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ఇది చూసిన పవన్ కల్యాణ్ అభిమానులు సైతం క్రేజీ పోస్టులు పెడుతున్నారు. ఇది చూసిన కొందరు నెటిజన్స్ ఊహించని ట్వీట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం ఓజీ గ్లింప్స్ ఆ రేంజ్లో అద్భుతంగా ఉందని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అర్జున్ దాస్ ఓయిస్ ఓవర్ తో గ్లింప్ల్ మొదలైంది. పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుపాను గుర్తుందా? అది మట్టి, చెట్లతో పాటు, సగం ఊరిని ఊడ్చేసింది. కానీ… వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాను కడగలేకపోయింది. అలాంటి వాడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటే..’ అంటూ పవన్ ఎంట్రీని చూపించారు. తమన్ నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్కి మరింత బలాన్ని చేకూర్చింది. (ఇది చదవండి: గోపీచంద్ని తిట్టడం తప్పే.. ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన డైరెక్టర్) కాగా.. గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్కు జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. విలన్ పాత్రను బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. This has to be the HAPPIEST BIRTHDAY for @PawanKalyan #OGGlimpse is simply OUT OF THE WORLD ..This is the BESTEST among all P K trailers I have ever seen Hey #Sujeeth YOU KILLED IT 💪 https://t.co/yrcB6JMd9O — Ram Gopal Varma (@RGVzoomin) September 2, 2023 -
‘ఓజీ’ గ్లింప్స్ వచ్చేసింది
‘సాహో’ తర్వాత దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఓజీ(OG). పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గ్లింప్స్ని తాజాగా విడుదల చేశారు మేకర్స్. అర్జున్ దాస్ ఓయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలైంది. పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుపాను గుర్తుందా? అది మట్టి, చెట్లతో పాటు, సగం ఊరిని ఊడ్చేసింది. కానీ… వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాను కడగలేకపోయింది. అలాంటి వాడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటే..’ అంటూ పవన్ ఎంట్రీని చూపించారు. తమన్ నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్కి బలాన్ని చేకూర్చింది. కానీ కొన్ని చోట్ల విక్రమ్ సినిమాకు అనిరుధ్ అందిచిన బీజీఎం గుర్తుకువస్తుంది. గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్కు జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ఓజీ గ్లింప్స్ని చూసేయండి


