Pankaj Singh
-
అన్ని వర్గాలకు నచ్చే విధంగా... ఢిల్లీ కేబినెట్ కూర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీలో దాదాపు 26 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తాజాగా ఏర్పాటైన రేఖా గుప్తా ప్రభుత్వంలో అన్ని ప్రధాన వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా(50) బనియా వర్గానికి చెందిన ఎమ్మెల్యే. మంత్రులుగా పర్వేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజిందర్ సింగ్ సిర్సా, కపిల్ మిశ్రా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ ప్రమాణం చేశారు. వీరిలో పర్వేశ్ వర్మ జాట్ నేత. సీఎం పదవికి పోటీ పడిన వారిలో ఈయన ముందు వరుసలో ఉన్నారు. రవీందర్ ఇంద్రజ్ సింగ్ దళిత నేత కాగా, మజిందర్ సింగ్ సిర్సా సిక్కు నేత . కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్లు పూర్వాంచల్ ప్రాంత వాసులు. ఆశిష్ సూద్ బీజేపీ పంజాబీ నేతల్లో ప్రముఖుడిగా ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చిన ఆయా వర్గాల వారికి సంతుష్టి కలిగించేందుకు బీజేపీ పెద్దలు యత్నించినట్లు చెబుతున్నారు.కేబినెట్లో జాట్ వర్గం నేత ఢిల్లీ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో న్యూఢిల్లీ సీటు నుంచి ఆప్ చీఫ్, మాజీ సీఎం కేజ్రీవాల్పై ఘన విజయం సాధించడం ద్వారా ఒక్కసారిగా తెరపైకి వచ్చారు పర్వేశ్ వర్మ(47). ఢిల్లీ సీఎం కుర్చీ కోసం పోటీ పడిన బీజేపీ నేతల్లో ఈయన కూడా ఉన్నారు. 2014 ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన పర్వేశ్ వర్మ పేరు జాతీయ రాజకీయాల్లో వినపడింది. అయితే, మూడుసార్లు సీఎంగా పనిచేసిన కేజ్రీవాల్ను ఓడించిన తర్వాత ఈయన పేరు ఒక్కసారిగా మారుమోగింది. ఢిల్లీలోని జాట్ నేతల్లో ప్రముఖంగా ఉన్నారు. గురువారం సీఎం రేఖా గుప్తాతోపాటు మంత్రిగా ప్రమాణం చేసిన వారిలో పర్వేశ్ వర్మ ఒకరు. మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేశ్. కేజ్రీవాల్పై పోటీ చేస్తానంటూ బహిరంగంగా ప్రకటించిన ఫైర్ బ్రాండ్ నేత. అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కు గట్టి పోటీ ఇచ్చేది తానేనంటూ ముందుకు వచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో నాలుగు వేల ఓట్ల తేడాతో కేజ్రీను ఓడించారు. కాగా, మూడు పర్యాయాలు సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్ను ఇదే న్యూఢిల్లీ నియోజకవర్గంలో 2013లో కేజ్రీవాల్ ఓడించడం గమనార్హం. 1977లో పుట్టిన పర్వేశ్ వర్మ రాజకీయాలపై ఆసక్తి పెంచుకుని 1991లో ఆర్ఎస్ఎస్లో బాల్ స్వయంసేవక్గా చేరారు. బీజేపీ యువ మోర్చాలో చేరి నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడి స్థాయికి ఎదిగారు. బీజేపీ ఢిల్లీ విభాగం ప్రధాన కార్యదర్శిగాను పనిచేశారు. ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ డిగ్రీ చేసిన వర్మ తన తండ్రి నెలకొల్పిన రాష్ట్రీయ స్వాభిమాన్ అనే ఎన్జీవో ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. 2013లో మెహ్రౌలీ నుంచి మొదటి సారిగా ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం ఢిల్లీ పశ్చిమ లోక్సభ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. 2019 ఎన్నికల్లో ఏకంగా 5.78 లక్షల ఓట్ల తేడాతో పర్వేశ్ వర్మ సాధించిన విజయం ఒక రికార్డుగా ఉంది.దంత వైద్యుడు.. పూర్వాంచల్ నేత పంకజ్ కుమార్ సింగ్ రేఖా గుప్తా ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన మరో ఎమ్మెల్యే పంకజ్ కుమార్ సింగ్(48). వృత్తి రీత్యా దంతవైద్యుడైన పంకజ్ కుమార్ గుప్తా పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన నేత. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా వికాస్పురి నుంచి పోటీ చేసి, ప్రత్యరి్థపై 12వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఢిల్లీ బీజేపీ పూర్వాంచల్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు పంకజ్ కుమార్. ఢిల్లీలో ఉండే ఉత్తరప్రదేశ్, తూర్పు ప్రాంతం బిహార్, జార్ఖండ్ వారిని పూర్వాంచల్ వాసులుగా పిలుస్తుంటారు. ఢిల్లీలోని పలు నియోజకవర్గాల్లో వీరిదే పైచేయి. బిహార్లోని బోధ్గయలో ఉన్న మగధ్ యూనివర్సిటీ నుంచి 1998లో డెంటల్ సర్జరీలో ఇగ్రీ చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కార్పొరేషన్ నేతగా పనిచేశారు. మరికొద్ది నెలల్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ ఈయనకు కేబినెట్లో స్థానం కల్పించడం గమనార్హం. ఒకప్పుడు మోదీ విమర్శకుడు.. నేడు హిందుత్వ వీరాభిమాని ఢిల్లీ మంత్రిగా గురువారం ప్రమాణం చేసిన కపిల్ మిశ్రా(44) ఒకప్పుడు ఆప్ సభ్యుడు. ప్రధాని మోదీని, బీజేపీ, ఆర్ఎస్లను తీవ్రంగా విమర్శించిన వివాదాస్పద నేతగా ఉన్నారు. అటువంటి వ్యక్తి పూర్తిగా మారిపోయారు. నేడు హిందుత్వకు వీరాభిమాని అయ్యారు. కపిల్ మిశ్రాను కేబినెట్లో తీసుకోవడాన్ని బీజేపీ వ్యూహాత్మక చర్యగా భావిస్తున్నారు. 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ జరిగిన సమయంలో కపిల్ మిశ్రా అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కుమార్ విశ్వాస్కు సన్నిహితుడిగా భావిస్తారు. ఢిల్లీ వర్సిటీ నుంచి సోషల్ వర్క్లో ఎంఏ చేసిన మిశ్రా 2015లో ఆప్ తరఫున కరవల్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేజ్రీవాల్ కేబినెట్లో జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, కేజ్రీవాల్, కుమార్ విశ్వాస్ మధ్య విభేదాలు తలెత్తడంతో కపిల్ మిశ్రా కూడా కేజ్రీకి దూరమయ్యారు. అనంతరం కుమార్ విశ్వాస్, కపిల్ మిశ్రాలు కేజ్రీతోపాటు ఆప్ మరో నేత సత్యేందర్ జైన్లకు వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు చేశారు. 2017లో మంత్రి పదవి కోల్పోయారు. అయినప్పటికీ, ఆప్ ఎమ్మెల్యేగా ఉంటూనే కేజ్రీవాల్పై విమర్శలు మాత్రం మానలేదు. 2019లో ఆయనపై ఆప్ బహిష్కరణ వేటు వేసింది. 2019లోనే బీజేపీలో చేరారు కపిల్ మిశ్రా. బీజేపీ ఢిల్లీ విభాగం ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. 2020 ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం, బీజేపీ, హిందుత్వకు అనుకూలంగా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలైంది. 2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో విద్వేష ప్రసంగాలు చేశారంటూ ఆయనపై ఆరోపణలొచ్చాయి. తాజాగా బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన నేపథ్యంలో గతంలో ఆయన ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్, బీజేపీల తీరును ఎండగడుతూ ఆయన చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇటీవలి ఎన్నికల్లో ఆప్ నేత మనోజ్ కుమార్ త్యాగిపై 23 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు.పంజాబీ నేత ఆశిష్ సూద్ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడైన ఆశిష్ సూద్(58) ఢిల్లీలోని బీజేపీ పంజాబీ నేతల్లో ఒకరు. తాజా ఎన్నికల్లో జనక్పురి నుంచి 18 వేల ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా గెలుపొంది గురువారం రేఖా గుప్తా కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేశారు. సంస్థాగత వ్యవహారాల్లో నిపుణుడిగా పేరున్న సూద్ ప్రస్తుతం బీజేపీ గోవా వ్యవహారాలతోపాటు జమ్మూకశ్మీర్ సహ ఇన్చార్జిగా ఉన్నారు. ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగాను పనిచేశారు. 2003లో బీజేపీ యువమోర్చా జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఈయన, ఆ తర్వాత రెండేళ్లకే జాతీయ ఉపాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 2009లో ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2012లో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికయ్యారు. ఆర్ఎస్ఎస్తోపాటు బీజేపీ అగ్ర నాయకులకు ఆశిష్ సూద్ ఎంతో నమ్మకస్తుడని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వ్యాపారవేత్త అయిన ఈయన కామర్స్లో డిగ్రీ చేశారు. దళిత వర్గం నేత రవీందర్ రేఖా గుప్తా సారథ్యంలోని ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన రవీందర్ ఇంద్రజ్ సింగ్(50) కేబినెట్లో దళిత వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీజేపీ ఎస్సీ మోర్చాలో కీలక సభ్యుడిగా ఉన్న రవీందర్ ఇటీవలి ఎన్నికల్లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఢిల్లీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఓపెన్ లెరి్నంగ్(ఎస్వోఎల్) నుంచి బీఏ పట్టా అందుకున్న రవీందర్కు ఢిల్లీ బీజేపీలో దళిత నేతగా మంచి పేరుంది. ఇటీవలి ఎన్నికల్లో బావన ఎస్సీ రిజర్వుడ్ స్థానంలో ఆమ్ఆద్మీ పార్టీ నేత జై భగవాన్ ఉప్కార్ను 31 వేల ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. నార్త్ ఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీకి మద్దతు కూడగట్టడంలో రవీందర్ కీలకంగా వ్యవహరించారు. మొదట్నుంచీ బావన నియోజకవర్గంతోనే ఆయనకు ఎక్కువగా అనుబంధం ఉంది. ఈయన తండ్రి ఇంద్రజ్ సింగ్ గతంతో నరేల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎన్నికల కమిషన్కు సమరి్పంచిన అఫిడవిట్ను అనుసరించి ఈయన ఆస్తులు రూ.7 కోట్లు కాగా, ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు.సిక్కుల ప్రతినిధి మంజిందర్ సింగ్ సిర్సా ఢిల్లీ రాజకీయ ముఖచిత్రంలో బాగా వినిపించే పేరు మంజిందర్ సింగ్ సిర్సా(53). కోవిడ్ మహమ్మారి ప్రబలంగా ఉన్న సమయంలో ఆక్సిజన్ లాంగార్స్ నిర్వహించి చురుగ్గా వ్యవహరించిన సామాజిక కార్యకర్తగా సిక్కు నేతగా సిర్సాకు మంచి పేరుంది. తాజాగా రేఖా గుప్తా ప్రభుత్వంలో మంత్రిగా మాతృభాష పంజాబీలో ప్రమాణం చేశారు. సిక్కు వర్గం మద్దతు కూడగట్టేందుకే ఈయనకు బీజేపీ మంత్రి వర్గంలో స్థానం కల్పించినట్లు పరిశీలకులు చెబుతున్నారు. తాజా ఎన్నికల్లో ఆప్కు చెందిన ధన్వతి చండేలాపై 18 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజౌరీ గార్డెన్ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మజీందర్ సింగ్ శిరోమణి అకాలీదళ్ను వీడి 2021లో బీజేపీలో చేరారు. 2013లో మొదటిసారిగా రాజౌరీ గార్డెన్ సీటును గెలుచుకున్నారు. 2013 నుంచి 2019 వరకు ఢిల్లీ సిక్కు గురుద్వారా యాజమాన్య కమిటీ(డీఎస్జీఎంసీ)కి సుదీర్ఘకాలం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం డీఎస్జీఎంఎంసీకి అధ్యక్షుడిగా 2019–2022 మధ్య సేవలందించారు. ఎన్నికల సంఘానికి సమరి్పంచిన అఫిడవిట్లో తనకు రూ.188 కోట్ల ఆస్తులు, భార్య సత్విన్దర్ కౌర్ సిర్సాకు కూడా రూ.71 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. మంజిందర్పై ఒక ఎఫ్ఐఆర్, నాలుగు పరువు నష్టం కేసులు నమోదై ఉన్నాయి. -
రంజీల్లో కేరళ బౌలర్ ఆల్టైమ్ రికార్డు.. అత్యంత అరుదైన ఘనత
కేరళ స్పిన్నర్ జలజ్ సక్సేనా(Jalaj Saxena) సంచలన రికార్డు సాధించాడు. రంజీ చరిత్ర(Ranji Trophy)లో ఇంత వరకు ఏ బౌలర్కూ సాధ్యం కాని ఓ అరుదైన ఘనత సాధించాడు. అత్యధికంగా పందొమ్మిది వేర్వేరు జట్లపై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన క్రికెటర్గా ఆల్టైమ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.కాగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించిన జలజ్ సక్సేనా.. దేశవాళీ క్రికెట్లో కేరళ(Keral) జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో జనవరి 23న రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్లో రెండో దశ పోటీలు ఆరంభం కాగా... కేరళ తరఫున మరోసారి బరిలోకి దిగాడు. సెకండ్ లెగ్లో కేరళ తొలుత మధ్యప్రదేశ్తో తలపడగా.. జలజ్ ఈ మ్యాచ్లో మొత్తంగా మూడు వికెట్లు మాత్రమే తీశాడు.సల్మాన్ నిజార్ భారీ శతకంఇక ఈ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగియగా.. తాజాగా కేరళ బిహార్తో తలపడుతోంది. ఎలైట్ గ్రూప్- ‘సి’లో భాగంగా తిరువనంతపురంలో గురువారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కేరళ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 351 పరుగులకు ఆలౌట్ అయింది. సల్మాన్ నిజార్ భారీ శతకం(150) బాదడంతో కేరళ ఈ మేరకు స్కోరు చేయగలిగింది.జలజ్కు ఐదు వికెట్లుఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన బిహార్ జట్టుకు జలజ్ సక్సేనా చుక్కలు చూపించాడు. 7.1 ఓవర్ల బౌలింగ్లో 19 పరుగులు ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. ఓపెనర్ షర్మాన్ నిగ్రోథ్(6)తో పాటు.. సకీబుల్ గనీ(0), బిపిన్ సౌరభ్(4), కెప్టెన్ వీర్ ప్రతాప్ సింగ్(0), హర్ష్ సింగ్(5) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.జలజ్ సక్సేనాకు తోడుగా ఎండీ నిధీశ్ , వైశాఖ్ చంద్రన్, ఆదిత్య సర్వాటే రాణించారు. నిధీశ్ రెండు, వైశాఖ్, ఆదిత్య ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్లో 64 పరుగులకే బిహార్ కుప్పకూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో కేరళకు ఏకంగా 287 పరుగుల ఆధిక్యం లభించింది.కాగా జలజ్ సక్సేనా రంజీల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ప్రత్యర్థి జట్లలో బిహార్ పందొమ్మిదవది కావడం విశేషం. ఇంతకుముందు పంకజ్ సింగ్ రంజీల్లో పద్దెనిమిది జట్లపై ఐదు వికెట్ల హాల్ సాధించగా.. తాజాగా జలజ్ అతడిని అధిగమించాడు.400కు పైగా వికెట్లురంజీ ట్రోఫీలో జలజ్ సక్సేనాకు గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి వరకు అతడు 416కు పైగా వికెట్లు తీశాడు. తద్వారా టోర్నీ చరిత్రలో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో టాప్-10లో నిలిచాడు. ఇక ఇటీవలే అతడు రంజీల్లో ఆరు వేల పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు.ఈ క్రమంలో రంజీల్లో ఈ మేర పరుగులు రాబట్టడంతో పాటు నాలుగు వందలకు పైగా వికెట్లు తీసిన తొలి ఆల్రౌండర్గా చరిత్రకెక్కాడు. ఇక 2005లో స్వరాష్ట్రం మధ్యప్రదేశ్ తరఫున తొలిసారి రంజీ బరిలో దిగిన జలజ్.. 2016-17 సీజన్ నుంచి కేరళ జట్టుకు ఆడుతున్నాడు.రంజీల్లో అత్యధిక జట్లపై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఆటగాళ్లు వీరే👉జలజ్ సక్సేనా- 19👉పంకజ్ సింగ్- 18👉సునిల్ జోషి- 16👉ఆర్. వినయ్ కుమార్- 16👉షాబాజ్ నదీం- 16👉ఆదిత్య సర్వాటే-16. చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్టైమ్ రికార్డు -
అదరగొట్టారు.. ఎవరీ పంకజ్ సింగ్, తన్మయ్ శ్రీవాత్సవ?
టీమిండియా జట్టుకు ఆడాలని ప్రతీ క్రికెటర్ కలగనడం సహజం. కానీ తుది జట్టులో 11 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నప్పటికి కొందరు అనామక క్రికెటర్లుగా మిగిలిపోతున్నారు. మరికొందరు మాత్రం జెంటిల్మెన్ గేమ్ అని చెప్పుకునే క్రికెట్లో నీచ రాజకీయాల వల్ల ఆటకు దూరం కావాల్సి వస్తుంది. గతంలో జరిగింది.. ఇప్పుడు జరుగుతుంది.. ఇకపై కూడా ఇలాంటి రాజకీయాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అందుకు సంజూ శాంసన్ చక్కటి ఉదాహరణ. మంచి బ్యాటింగ్ టెక్నిక్ గల సంజూ శాంసన్కు టి20 ప్రపంచకప్కు మరోసారి మొండిచేయి ఎదురైంది. అతన్ని ఎంపిక చేయకపోవడంపై అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పుడంటే ఐపీఎల్ లాంటి క్రికెట్ లీగ్స్తో జాతీయ జట్టుకు ఆడకపోయినా దండిగానే డబ్బులు సంపాదిస్తున్నారు. తాజాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా ఇండియా మహారాజాస్కు ఆడిన పంకజ్ సింగ్, తన్మయ్ శ్రీవాత్సవలు అద్బుత ప్రదర్శన చేశారు. పంకజ్ సింగ్ ఐదు వికెట్లతో చెలరేగి బౌలింగ్లో అదరగొడితే.. మరొకరు బ్యాటింగ్లో హాఫ్ సెంచరీ సాధించి క్లాస్ ప్రదర్శన చేశాడు. అద్భుత ప్రదర్శనతో పంకజ్ సింగ్, తన్మయ్ శ్రీవాత్సవలు తమ గురించి మాట్లాడుకునేలా చేశారు. ఎవరీ పంకజ్ సింగ్? ఉత్తరప్రదేశ్కి చెందిన పంకజ్ సింగ్, టీమిండియా తరుపున 2 టెస్టులు, ఓ వన్డే మ్యాచ్ ఆడాడు. ఇంగ్లాండ్తో జరిగిన రెండు టెస్టుల్లో 2 వికెట్లు మాత్రమే తీసిన పంకజ్, శ్రీలంకతో జరిగిన ఏకైక వన్డేలో వికెట్ తీయలేక జట్టులో చోటు కోల్పోయాడు. తన రెండో టెస్టులో పంకజ్ సింగ్ జో రూట్, జోస్ బట్లర్లను ఔట్ చేశాడు . మొదటి మ్యాచ్లో పంకజ్ సింగ్ బౌలింగ్లో అలిస్టర్ కుక్ ఇచ్చిన క్యాచ్ని రవీంద్ర జడేజా డ్రాప్ చేశాడు. ఆ మ్యాచ్లో వికెట్ తీయలేకపోయిన పంకజ్.. అరంగ్రేట మ్యాచ్లో వికెట్ తీయకుండా అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు. ఆ మ్యాచ్లో పంకజ్ సింగ్ ఏకంగా 179 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మాత్రం పంకజ్ సింగ్కి ఘనమైన రికార్డు ఉంది. 117 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన పంకజ్ సింగ్ 472 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 28 సార్లు ఐదేసి వికెట్లు తీశాడు. 76 లిస్టు ఏ మ్యాచ్లో 115 వికెట్లు తీశాడు. ఐపీఎల్ ద్వారా పరిచయం.. పంకజ్ సింగ్తో పాటు తన్మయ్ శ్రీవాస్తవ కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకుని ఇండియా మహారాజాస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా తరుపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన తన్మయ్.. ఐపీఎల్లో మాత్రం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కొచ్చి టస్కర్స్ కేరళ, డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడాడు.34 మ్యాచుల్లో 649 పరుగులు చేశాడు. ఇక ఫస్ట్ క్లాస్ కెరీర్లో తన్మయ్ శ్రీవాస్తవ 10 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో 4918 పరుగులు చేశాడు.లిస్టు ఏ క్రికెట్లో 7 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు చేసిన తన్మయ్... 2020లో క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: పఠాన్ బ్రదర్స్ విధ్వంసం.. ఇండియా మహారాజాస్ ఘన విజయం 'మొన్ననే కదా ఫైనల్ చేరారు.. అంత మాట ఎలా అంటావు!' -
పఠాన్ బ్రదర్స్ విధ్వంసం.. ఇండియా మహారాజాస్ ఘన విజయం
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా బీసీసీఐ ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఇండియా మహారాజాస్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. పంకజ్ సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. బ్యాటింగ్లో తన్మయ్ శ్రీవాత్సవ, యూసఫ్ పఠాన్లు హాఫ్ సెంచరీలతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించారు. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కెవిన్ ఒబ్రెయిన్ 52, దినేశ్ రామ్దిన్(42 పరుగులు నాటౌట్), తిసార పెరీరా 23 పరుగులతో రాణించారు. ఇండియా మహారాజాస్ బౌలింగ్లో పంకజ్ సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్, జోగిందర్ శర్మ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మహారాజాస్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. వీరేంద్ర సెహ్వాగ్ 4 పరుగులు చేసి నిరాశ పరచగా.. తన్మయ్ శ్రీవాత్సవ 39 బంతుల్లో 54 పరుగులు చేశాడు. చివర్లో పఠాన్ బ్రదర్స్.. యూసఫ్ పఠాన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 నాటౌట్, ఇర్ఫాన్ పఠాన్ 9 బంతుల్లో 3 సిక్సర్లతో 20 పరుగులు చేసి జట్టును గెలిపించారు. వరల్డ్ జెయింట్స్ బౌలింగ్లో టిమ్ బ్రెస్నన్ 3 వికెట్లు తీయగా.. ఫిడెల్ ఎడ్వర్డ్స్ ఒక వికెట్ తీశాడు. చదవండి: ఫెదరర్ ఆస్తి విలువ ఎంతో తెలుసా? -
తొలిదశలో 64 శాతం పోలింగ్
► యూపీలో 73 నియోజకవర్గాలకు ముగిసిన ఎన్నికలు ► ఓటింగ్ స్వల్ప హింసాత్మకం లక్నో: దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో తొలిదశ కింద శనివారం 15 జిల్లాల్లోని 73 నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిశాయి. ఓటింగ్ సందర్భంగా అక్కడక్కడా స్వల్ప హింసాత్మక ఘటనలు జరిగాయి. 64.22 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఓటరు స్లిప్లను దౌర్జన్యంగా లాక్కోవడం, రాళ్లు రువ్వుకోవడం వంటి ఘటనలు తమ దృష్టికి వచ్చాయని ముఖ్య ఎన్నికల అధికారి వెంకటేష్ చెప్పారు. ఇవే నియోజకవర్గాల్లో 2012 ఎన్నికలతో పోలిస్తే తాజాగా పోలింగ్ మూడు శాతం పెరిగింది. ఈ దశలో మొత్తం ఓటర్లు 2.6 కోట్లు కాగా వారిలో 1.17 కోట్ల మంది మహిళలు. 839 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటిదాకా ఎన్నికల సంఘం ఇక్కడ రూ.9.56 కోట్ల నగదు, 14కోట్ల విలువైన 4.44 లక్షల లీటర్ల మద్యం, రూ.14 కోట్ల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. శనివారం హాపూర్, షామ్లీ, ముజఫర్నగర్, బాగ్పట్, మీరట్, ఘజియాబాద్, గౌతమ బుద్ధ నగర్, బులంద్ షహర్, అలీగఢ్, మథుర, హత్రాస్, ఆగ్రా, ఫిరోజాబాద్, ఎటా, కాస్గంజ్ జిల్లాల్లో పోలింగ్ ముగిసింది. ఉత్తరప్రదేశ్లోని మొత్తం జిల్లాలు 75. మీరట్, బాగ్పట్లో ఘర్షణలు... బాగ్పట్లో ఓటర్లను అడ్డుకుంటున్నారంటూ వివిధ వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 10 మంది గాయపడ్డారు. బాగ్పట్ జిల్లాలోని మరో గ్రామంలో ఆర్ఎల్డీ కార్యకర్తలు దళితులను ఓటు వేయకుండా అడ్డుకోగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మీరట్లో ఓ బీజేపీ నేత సోదరుడు పోలింగ్ బూత్కు తుపాకీ తేవడంతో పోలీసులు అరెస్టుచేశారు. తొలిదశలోని ప్రముఖులు వీరే... తొలిదశ పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ తనయుడు పంకజ్ సింగ్ (నోయిడా), కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు ప్రదీప్ మాథుర్ (మధుర), బీజేపీ అధికార ప్రతినిధి శ్రీకాంత్శర్మ, బీజేపీ ఎంపీ హుకుమ్ సింగ్ కూతురు మృగాంకా సింగ్ (కైరానా), బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీ కాంత్ (మీరట్), ఆర్జేడీ అధినేత లాలూ అల్లుడు రాహుల్ సింగ్ (సికింద్రాబాద్), రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్సింగ్ మనవడు సందీప్ (అత్రౌలి) తదితర ప్రముఖులు పోటీలో నిలిచారు. బీజేపీ ఖాతాలోకి 3 ఎమ్మెల్సీలు రాష్ట్రంలోæ అసెంబ్లీ ఎన్నికల హడావుడి నడుస్తుండగానే.. బీజేపీకి శుభ సంకేతాలు కనబడుతున్నాయి. కాన్పూర్, బరేలీ, గోరఖ్పూర్ స్థానాలకు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఈ మూడు చోట్ల కూడా బీజేపీ అభ్యర్థులు పూర్తి ఆధిపత్యం కనబరిచారు. కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం, పేదల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని మోదీ తీసుకొచ్చిన పథకాలే తమను గెలిపించాయని అభ్యర్థులు తెలిపారు. కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించటమే.. యూపీలో మళ్లీ కమలం వికసించేందుకు సంకేతమని కేంద్ర మంత్రి వెంకయ్య అన్నారు. -
'రాజ్నాథ్ కొడుకులా కాదు.. కార్యకర్తగా వస్తున్నా'
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీకి తానేం తక్కువ కాదని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ అన్నారు. ఇప్పుడప్పుడే వారిపై తాను ఎలాంటి రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయబోనని అన్నారు. త్వరలో జరగబోతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో నోయిడా నుంచి ఎమ్మెల్యేగా పంకజ్ బీజేపీ తరుపున బరిలోకి దిగాడు. వాస్తవానికి అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల పిల్లల పోటీ చేయొద్దని ప్రధాని మోదీ నిబంధన పెట్టినప్పటికీ ఇప్పటికే రాష్ట్రంలోని పలు చోట్ల పలువురు నేతలు తమ పిల్లలను, మనుమళ్లనుమనువరాళ్లను బరిలోకిదించారు. అయితే, తన ఆరంగేట్రాన్ని పంకజ్ సమర్థించుకున్నారు. మోదీ పెట్టిన నిబంధనను తాను మీరలేదన్నారు. తాను తన తండ్రి రాజ్నాథ్ సింగ్ అసలు రాజకీయాలు మాట్లాడుకోమని, ఎప్పుడూ ఆయన ఆశీస్సులు మాత్రమే తీసుకుంటానని అన్నారు. తాను కేంద్ర హోంమంత్రి కొడుకులా కాకుండా ఓ కార్యకర్తలా వస్తున్నానని అన్నారు. చాలా ఏళ్లుగా పార్టీకోసం పనిచేస్తున్న పంకజ్ 2014లోనే సీటు కోరుకున్నప్పటికీ అప్పటి నేతలు ఎంపికచేయలేదని, ఇప్పుడు ఆయన తండ్రి స్థాయిని చూసి కాకుండా రాజకీయ సేవను చూసి సీటు ఇచ్చినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, నోయిడాలో ఇప్పటికే ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఓం మార్థుర్ని పక్కకు పెట్టి మరీ పంకజ్కు సీటు ఇచ్చారంట. దీనిపై స్థానిక పార్టీ క్యాడర్ మొత్తం అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తుండగా తాము ఇప్పటికే అందరితోనూ చర్చలు జరిపి వారు అంగీకరించాకే తనకు ఆ సీటు కేటాయించారని పంకజ్ తెలిపారు. తనను 200శాతం తగినవాడిని అని భావించారని, స్థానికుల మద్దతు తనకే ఉందని స్పష్టం చేశారు. -
ఆ విషయంలో హోం మంత్రికి కోపం లేదు
లక్నో: త్వరలో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వారసులు బరిలో దిగుతున్నారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ బంధుగణం, ఆ పార్టీ సీనియర్ నేతల వారసులతో పాటు బీజేపీ సీనియర్ నేతల వారసులు కూడా రంగంలోకి దిగారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్, బీజేపీ మరో సీనియర్ నేత లాల్జీ టాండన్ కొడుకు గోపాల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ నేతల వారసులకు టికెట్లు ఇవ్వడాన్ని ఆ పార్టీ యూపీ వ్యవహారాల ఇంచార్జి ఓం మాధుర్ సమర్ధించుకున్నారు. నోయిడా నుంచి పంకజ్ పోటీచేస్తున్నారు. బీజేపీ ఇటీవల విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో పంకజ్కు టికెట్ దక్కింది. పంకజ్కు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వనందుకు రాజ్నాథ్ సింగ్ మనస్తాపం చెందారని వచ్చిన వార్తలను మాధుర్ తోసిపుచ్చారు. పంకజ్కు టికెట్ ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి ఎప్పుడూ అడగలేదని, ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకోలేదని, గతంలో టికెట్ ఇవ్వనందుకు కోప్పడ్డారన్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. గత 15 ఏళ్లుగా పంకజ్ పార్టీలో పనిచేస్తున్నారని, ఆఫీస్ బేరర్గా ఉన్నారని, ఎన్నికల్లో పోటీచేయడానికి ఆయన 200 శాతం అర్హుడని మాధుర్ అన్నారు. మరో నేత లాల్జీ టాండన్ కొడుకు ఇప్పటికే చట్టసభ సభ్యుడిగా ఉన్నారని, మరోసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చెప్పారు. -
‘15 ఏళ్లు వేచిచూడాల్సి వచ్చింది’
లక్నో: అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడానికి తాను 15 ఏళ్లు వేచిచూడాల్సి వచ్చిందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్ తెలిపారు. పార్టీ కార్యకర్తగా 15 ఏళ్లు కిందిస్థాయిలో పనిచేశానని ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయాలనేది తమ పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందని, తాను సామాన్య కార్యకర్తనని చెప్పారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నోయిడా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పంకజ్ సింగ్ పోటీ చేయనున్నారు. 155 స్థానాలకు ఆదివారం బీజేపీ విడుదల చేసిన రెండో జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. రాజ్ నాథ్ తనయుడు కావడంతో పంకజ్ పై అందరి దృష్టి నెలకొంది. యూపీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు. -
మీరు జర్నలిస్తులు.. వారిని మీరే గుర్తించాలి
లక్నో: మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు.. నా కోడుకుపై రూమర్లు సృష్టిస్తున్న వారిని మీరే పట్టుకోవాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. తన కుమారుడిపై వస్తున్న ఆరోపణల్ని ఖండించారు. తన కుమారుడిపై రూమర్లు సృష్టిస్తున్న వారేవరో తనకు తెలియదని.. వారి గురించి తాను ఆలోచించడం లేదని ఓ ప్రశ్నకు రాజ్ నాథ్ స్పందించారు. తన కుటుంబ సభ్యుల దుష్ప్రవర్తన ఉన్నట్టు రుజువైనట్లయితే తాను రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని రాజ్ నాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. రాజ్ నాథ్ కుమారుడు పంకజ్ ప్రవర్తనపై ప్రధాన మంత్రి కార్యాలయం స్పందించిన సంగతి తెలిసిందే. -
ఎన్డీయే మంత్రులకు 'సన్' స్ట్రోక్
ఎన్డీయే మంత్రులకు 'సన్' స్ట్రోక్ తగులుతోంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తనయుడి వివాదం మరవక ముందే మరో కేంద్రమంత్రి కూడా వార్తల్లో నిలిచారు. తాజాగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడపై రేప్ కేసు నమోదు అయ్యింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ కార్తీక్గౌడపై వర్ధమాన నటి మైత్రేయి గౌడ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాంతో అతనిపై రేప్, చీటింగ్ కేసు నమోదు అయ్యాయి. ఈ కేసు విషయంలో కార్తీక్ గౌడ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను సదానంద గౌడ కొట్టిపారేశారు. అవన్నీ నిరాధారమేనని తేల్చిపారేశారు. అయితే పోలీసులు మాత్రం మంత్రి కుమారుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి...తన పని తాము చేసుకు పోతున్నారు. మరోవైపు రాజ్నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్పై ఆరోపణల వ్యవహారం రాజకీయ దుమారంగా మారిన విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్లో బీజేపీ నేతగా ఉన్న పంకజ్ సింగ్ వ్యవహార శైలిపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహంగా ఉన్నారని, అవినీతి ఆరోపణలపై పంకజ్ను మందలించారని, దీనిపై రాజ్నాథ్ వివరణ ఇచ్చారని మీడియాలో వార్తలు సంచలనంగా మారాయి. కాగా మీడియాలో వచ్చిన ఈ వివాదం వెనుక రాజ్నాథ్ అంటే గిట్టని, ఆ హోదాను ఆశిస్తున్న ఓ సీనియర్ నేత ఉన్నారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. అయితే తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేలితే రాజకీయాల నుంచి వైదొలగుతానని రాజ్నాథ్ సింగ్ ప్రకటించటం విశేషం. ఏది ఏమైనా ఇద్దరు కేంద్ర మంత్రులు తమ సుపుత్రుల ద్వారా ప్రముఖంగా వార్తల్లోకి నిలవటం విశేషం. -
రాజ్నాథ్ తనయుడిపై వివాదం
* దిద్దుబాటు చర్యల్లో బీజేపీ, పీఎంఓ * రాజ్నాథ్ కుమారుడిపై ప్రధాని ఆగ్రహం అంటూ మీడియాలో వార్తలు * అవన్నీ పచ్చి అబద్ధాలంటూ పీఎంఓ వివరణ * రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: రాజ్నాథ్ న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి, రాజ్నాథ్ సింగ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణల వ్యవహారం బుధవారం రాజకీయ దుమారంగా మారింది. రాజ్నాథ్ కుమారుడు పంకజ్ సింగ్ వ్యవహార శైలిపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహంగా ఉన్నారని, అవినీతి ఆరోపణలపై పంకజ్ను మందలించారని, దీనిపై రాజ్నాథ్ వివరణ ఇచ్చారని మీడియాలో వార్తలు సంచలనంగా మారాయి. దీంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన రాజ్నాథ్సింగ్, ప్రధాని కార్యాలయం, బీజేపీలు బుధవారం వేర్వేరుగా వివరణలు ఇచ్చాయి. తన కుమారుడి ప్రవర్తనకు సంబంధించి వచ్చిన ఆరోపణలను రాజ్నాథ్ తీవ్రంగా ఖండించారు. తనపై, తన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలను ఏ మాత్రం రుజువుచేసినా రాజకీయాల నుంచి తప్పుకుని ఇంట్లో కూర్చుంటానని ఘాటుగా స్పందించారు. నార్త్బ్లాక్లోని తన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరణ ఇచ్చారు. ఈ విషయంపై ప్రధానితో, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో మాట్లాడానని, వారు కూడా ఆ వార్తలను ఖండించారన్నారు. పార్టీలో, మంత్రివర్గంలో తనకు ప్రత్యర్థిగా ఉన్న ఒక సీనియర్ నేతే ఈ వదంతులను వ్యాపింపజేస్తున్నారని రాజ్నాథ్ ఆగ్రహంగా ఉన్నారన్న వార్తలపై ప్రశ్నించగా.. ఆ విషయాన్ని జర్నలిస్టులుగా మీరే కనుక్కోవాలని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ప్రధాని కార్యాలయం(పీఎంఓ) నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది. రాజ్నాథ్ కుమారుడికి సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలు పచ్చి అబద్ధాలని అందులో పేర్కొన్నారు. అవన్నీ ప్రభుత్వ ఇమేజ్ను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్రపూరిత ప్రయత్నాలు గా పీఎంఓ అభివర్ణించింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్షా కూడా రాజ్నాథ్కు బాసటగా నిలిచారు. రాజ్నాథ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నానన్నారు. సెప్టెంబర్ 13న జరగనున్న యూపీ ఉప ఎన్నికల్లో నోయిడా నుంచి పోటీ చేయాలని ఆశించిన పంకజ్కు పార్టీ టికెట్ నిరాకరించడం గమనార్హం. 2012 ఎన్నికల్లోనూ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. విషయమేంటో చెప్పండి! ఈ అంశాన్ని ప్రతిపక్షాలు బీజేపీపై, మోడీ ప్రభుత్వంపై చురకలేసాయి. రాజ్నాథ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణలేంటో చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ వ్యాఖ్యానించారు. ‘ప్రతిపక్ష పార్టీగా మేమైతే ఎలాంటి ఆరోపణలు చేయలేదు. మరి మీరు ఏ ఆరోపణలపై వివరణ ఇస్తున్నారు? అసలు ఆరోపణలు చేసింది ఎవ రు? మీ కుమారుడిపై వచ్చిన ఆరోపణలేమిటో తెలుసుకోవాలని కాంగ్రెస్, దేశప్రజలు కోరుకుంటున్నార’ని అన్నారు. రాజ్నాథ్ కుటుంబసభ్యులపై వదంతులు ఎవరు వ్యాప్తి చేస్తున్నారో పీఎంఓ స్పష్టం చేయాలని వామపక్షాలు కోరాయి. కాగా, జేడీయూ, సమాజ్వాదీ పార్టీలు రాజ్నాథ్కు మద్దతుగా నిలిచాయి. ఇంతకీ వివాదమేంటి? బీజేపీ వర్గాల సమాచారం మేరకు అంటూ రాజ్నాథ్సింగ్ కుమారుడికి సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలే వివాదానికి కారణాలయ్యాయి. ఆ వార్తల ప్రకారం ‘యూపీలో బీజేపీ నేతగా ఉన్న పంకజ్సింగ్.. పోలీసు నియామకాలకు సంబంధించి డబ్బులు తీసుకున్నారన్న విషయం మోడీ వరకు వచ్చింది. మోడీ రాజ్నాథ్ను, పంకజ్ను తన చాంబర్కు పిలిపించుకుని. పంకజ్ను ప్రశ్నించారు. ఆయనను మందలించారు. పోలీసు నియామకాలకు తీసుకున్న డబ్బులను తిరిగిచ్చేయాలంటూ ఆదేశించారు. మోడీ చాంబర్ నుంచి రాజ్నాథ్, పంకజ్లు తిరిగి వెళ్తున్న సమయంలోనూ.. మరోసారి ఇలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని పంకజ్ను హెచ్చరించారు.’ మీడియాలో వచ్చిన ఈ వివాదం వెనుక రాజ్నాథ్ అంటే గిట్టని, ఆ హోదాను ఆశిస్తున్న ఓ సీనియర్ నేత ఉన్నారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. -
'నా కొడుకుది తప్పని తేలితే పాలిటిక్స్ కు గుడ్ బై'
న్యూఢిల్లీ: నా కుమారుడిపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు అని కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉంటే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని రాజ్ నాథ్ స్పష్టం చేశారు. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల గురించి ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చించానని రాజ్ నాథ్ తెలిపారు. రాజ్ నాథ్ కుమారుడు పంకజ్ సింగ్ పై వచ్చిన ఆరోపణలు నిరాధారమని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఓ ప్రకటనలో తెలిపింది. పంకజ్ సింగ్ వచ్చిన ఆరోపణలన్ని అవాస్తవాలు. రాజకీయ దురుద్దేశంతో చేసినవని పీఎంవో తెలిపింది. అవినీతి, చెడు ప్రవర్తన కారణంగానే నరేంద్రమోడీ బీజేపీ టికెట్ ను నిరాకరించారనే వార్తలు ఇటీవల రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. నోయిడా టికెట్ ను పంకజ్ సింగ్ ఇవ్వడానికి మోడీ నిరాకరించారనే వార్తలు గతంలో వెలువడిన సంగతి తెలిసిందే.