Peace of mind
-
అద్దిల్లా..? సొంతిల్లా..?
చాలా మంది తేల్చుకోలేని అంశం.. అద్దె ఇంట్లో ఉండడం నయమా? లేక సొంతిల్లు సమకూర్చుకోవడం బెటరా? అని. ఈ రెండింటిలో ఆర్థికంగా ఏది లాభదాయకమో నిపుణులను అడిగితే చెబుతారు. కానీ, ఇల్లు అన్నది భావోద్వేగాలు, సామాజిక గుర్తింపు, మానసిక ప్రశాంతత తదితర ఎన్నో అంశాలతో ముడిపడి ఉంటుంది. అద్దె ఇల్లు ఆర్థిక భారం లేనిది. సొంతిల్లు ఆర్థిక బాధ్యతను తెచి్చపెడుతుంది. ఒకటి రెండు నెలల అడ్వాన్స్ ఉంటే నిమిషాల్లో అద్దె ఇంట్లో దిగిపోవచ్చు. కానీ, సొంతింట్లో కుడి కాలు మోపాలంటే భారీ మొత్తం కావాలి. లేదంటే బ్యాంక్ తలుపు తట్టాలి. అద్దె ఇంట్లో మనకు నచ్చకపోయినా, ఇంటి యజమానికి గిట్టకపోయినా మరో గూడు వెతుక్కోవాల్సిందే. సొంతింట్లో ఎవరికి వారే రారాజు. ఇలా నాణేనికి రెండువైపులా లాభనష్టాలున్నాయి. తమకు ఏది అనుకూలమో ఎవరికి వారు తేల్చుకోవాల్సిందే. ఈ దిశగా అవగాహన కలి్పంచి, సులువుగా నిర్ణయం తీసుకోవ డానికి దారి చూపించేదే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం. ఆర్థిక కోణం... ఇంటి విషయంలో ముందుగా తమ ప్రాధాన్యతలు ఏంటన్నవి ముఖ్యం. మెట్రో నగరాల్లో ఇంటి ధరలు చూస్తే చుక్కల్లో కనబడుతున్నాయి. కనుక అక్కడ సొంతిల్లు చాలా మందికి సాధ్యపడకపోవచ్చు. అలాంటి చోట అద్దె ఇల్లే ఆర్థి కంగా సౌకర్యం. ఇంటి కొనుగోలుతో పోలిస్తే అద్దే తక్కువగా ఉంటుంది. ఇంటి కొనుగోలుకు సరిపడా ఆర్థిక స్థోమత ఉన్న వారి విషయంలో అంత గందరగోళం అక్కర్లేదు. వృత్తి/ఉద్యోగ/వ్యాపార రీత్యా తరచూ ప్రాంతాలు మారే అవసరం లేకపోతే నిశి్చంతగా సొంతింటికి మొగ్గు చూపొచ్చు. కానీ, నగరాలు, పట్టణాల్లో రుణంపై ఇంటిని సమకూర్చుకోవాలని భావించే వారు అక్కడి రెంటల్ ఈల్డ్స్ (ప్రాపర్టీ విలువపై అద్దె రాబడి), ప్రాపర్టీ విలువ పెరుగుదల శాతం ఏ మేరకు ఉంది, తదితర అంశాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. మన దేశంలోని చాలా పట్టణాల్లో రుణంపై ఇల్లు కొనుగోలు చేసి చెల్లించే ఈఎంఐతో పోలి్చతే.. చాలా తక్కువకే అద్దె ఇల్లు వచ్చేస్తుంది. పట్టణాల్లో ఇంటిని కొనుగోలు చేయడం మంచి ఆప్షనే. కాలం గడిచే కొద్దీ దాని విలువ పెరుగుతూ వెళ్తుంది. కానీ, దాన్ని సమకూర్చుకునేందుకు సరిపడా పెట్టుబడి కావాలి. పెట్టుబడి కోసం అయితే కొత్తగా అభివృద్ధిలోకి వస్తున్న నగర, పట్టణ శివారు ప్రాంతాల్లో ఇల్లు కొనుగోలు చేసుకోవడం వల్ల.. తక్కువ కాలంలోనే ఎక్కువ విలువ సమకూరుతుంది.అద్దె రాబడి తక్కువ... మన దేశంలో ఇంటిపై సగటు రాబడి 2.9 శాతంగా ఉంది. ప్రపంచంలో ఇక్కడే తక్కువ. అదే యూఎస్, కెనడా, దుబాయిలోని పట్టణాల్లో ఇంటిపై అద్దె రాబడి 5–6 శాతంగా ఉంది. అద్దె రాబడి 4 శాతాన్ని మించినప్పుడు రుణంపై ఇంటిని కొనుగోలు చేసుకోవడం అత్యుత్తమమని ఆర్థిక గణాంకాలు చెబుతున్నాయి. మీరు ఉండాలనుకుంటున్న ప్రాంతంలో ప్రస్తుత రెంటల్ ఈల్డ్ (అద్దెకు ఇస్తే వచ్చే రాబడి) (ప్రాపర్టీ విలువతో పోలిస్తే చెల్లించే అద్దె రేటు), ఏటా ఎంత చొప్పున పెరుగుతుందన్నది తెలుసుకోవాలి. వీటి ఆధారంగా అద్దె/ఈఎంఐ రేషియో ఎంతో తేల్చుకోవాలి. రియల్ ఎస్టేట్ పరిశోధనా సంస్థ ‘లైసస్ ఫొరాస్’ ఇందుకు సంబంధించి విలువైన గణాంకాలు రూపొందించింది. దీని ప్రకారం 100 శాతం అంతకంటే తక్కువ నిష్పత్తి ఉన్న పట్టణాల్లో అద్దె ఇంట్లో ఉండడమే లాభం. ఈ రేషియో 100 దాటిన చోట సొంతిల్లు సమకూర్చుకోవడం లాభం.విశ్లేషణ విశాఖలో రెంటల్ ఈల్డ్ ప్రాపర్టీ విలువపై 2 శాతంగా ఉంది. ఇది ఏటా 5 శాతం పెరుగుతూ పోతే రెంటల్/ఈఎంఐ రేషియో 57 శాతం అవుతుంది. ఏటా 10 శాతం పెరిగితే ఈ రేషియో 84 శాతంగా ఉంటుంది. 11 శాతం పెరిగితే రేషియో 93గా ఉంటుంది. అదే హైదరాబాద్లో రెంటల్ ఈల్డ్ 2.5 శాతం.. ఏటా 9 శాతం వరకు పెరిగితే రెంట్/ఈఎంఐ రేషియో 94గా ఉంటుంది. ఒకవేళ ఏటా 10 శాతం పెరిగితే ఈ రేషియో 104కు వెళుతుంది. హైదరాబాద్లో ఏటా 10 శాతం చొప్పున అద్దెలు పెరిగేట్టు అయితే అప్పుడు రుణంపై ఇల్లు కొనుగోలు చేసి, ఈఎంఐలు కట్టుకోవడమే ప్రయోజనకరం. అద్దె పెరుగుదల 10 శాతంలోపే ఉంటే కిరాయికి తీసుకోవడం ఆర్థికంగా ప్రయోజనకరం. ఒకవేళ మీరు ఎంపిక చేసుకున్న ప్రాంతంలో ప్రస్తుత రెంటల్ ఈల్డ్ ప్రాపర్టీ విలువపై 4 శాతం అంతకంటే ఎక్కువే ఉండి, ఏటా అద్దె 5 శాతం పెరిగినా సరే.. అక్కడ రుణంపై ఇల్లు కొనుగోలు చేసి ఈఎంఐ కట్టుకోవడమే లాభం.లాభాలుఈ అంశాలు గమనించాలి.. ఆర్బీఐ డేటా ప్రకారం 2010–11 నుంచి 2017–18 మధ్య కాలంలో (రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ సంస్థ (రెరా) రాక ముందు) ప్రాప ర్టీల ధరలు ఏటా 15 శాతం చొప్పున పెరిగాయి. 2018–19 నుంచి 2022–23 కాలంలో (రెరా వచ్చిన తర్వాత) ఏటా 3 శాతం పెరిగాయి. చారిత్రకంగా చూస్తే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం కంటే రెట్టింపు స్థాయిలో ప్రాపరీ్టల ధరలు పెరిగినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ రకంగా చూస్తే ప్రాపర్టీ కొనుగోలు లాభదాయకమే. 30 ఏళ్ల కాలానికి రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేస్తే, ప్రతి నెలా చెల్లించాల్సిన ఈఎంఐ, ఇంటి అద్దె కంటే రెట్టింపు ఉంటుంది. కానీ, 15–17 ఏళ్లు గడిచే సరికి ఇంటి అద్దె ఏటా పెరుగుతూ రుణ ఈఎంఐకి చేరువ కావచ్చు.సొంతిల్లు→ ఒకే చోట స్థిరపడిన వారు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. మన దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. ఇది ఇళ్లు, స్థలాల విలువలకు దన్నుగా నిలుస్తుంది. కనుక ఇంటిపై పెట్టుబడి దీర్ఘకాలంలో సంపదకు దారితీస్తుంది. → సొంతిల్లుతో వచ్చే ప్రశాంతతను వెలకట్టలేం. భద్రతకు హామీనిస్తుంది. ఖాళీ చేయాల్సిన అనిశ్చితి ఉండదు. ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. గోపత్య ఉంటుంది. ఇంటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంలో పరిమితులు ఉండవు. నచ్చినట్టుగా ఇంటిని మార్చుకోవచ్చు. రాజీపడాల్సిన అవసరం ఉండదు. → అద్దెకు బదులు ఈఎంఐ కట్టుకుంటే స్థిరాస్తి సమకూరుతుంది. రుణంపై ఇంటిని సమకూర్చుకోవడం వల్ల దీర్ఘకాలంలో దాని విలువ పెరగడమే కాదు.. పన్ను రూపంలోనూ ఎంతో ఆదా అవుతుంది. ఇంటి రుణ ఈఎంఐలో అసలు (ప్రిన్సిపల్), వడ్డీ అని రెండు భాగాలుంటాయి. అసలుకు చెల్లించే మొత్తం గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే, సెక్షన్ 24 కింద ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 2 లక్షల వడ్డీ భాగంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఒకవేళ రుణంపై కొనుగోలు చేసిన ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే అప్పుడు వడ్డీ ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉన్నా, ఆ మొత్తంపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. → సొంతింటితో అనుబంధం విడదీయరానిది. అదే అద్దె ఇంట్లో ఉండి, చుట్టుపక్కల వారితో మంచి సంబంధాలు ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడం కష్టమనిపిస్తుంది. ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేయాల్సిన అగత్యం ఏర్పడదు. సొంతిల్లు వ్యక్తిగత హోదాను పెంచుతుంది. సామాజిక గుర్తింపును తెస్తుంది. → చివరిగా సొంతిల్లు ఉంటే.. విశ్రాంత జీవనంలో స్థిరమైన ఆదాయాన్నిచ్చే బంగారు బాతు అవుతుంది. రివర్స్ మార్ట్గేజ్తో ప్రతి నెలా స్థిరమైన ఆదాయాన్ని బ్యాంక్ నుంచి పొందొచ్చు. అద్దె ఇల్లుళీ అద్దె ఇంటితో ఉండే అత్యంత అనుకూలత.. నచి్చన ప్రాంతంలో ఉండొచ్చు. సొంతిల్లు అయితే మారకుండా ఎప్పటికీ ఒకేచోట ఉండిపోవాల్సి వస్తుంది. → ప్రతికూల ఆర్థిక పరిస్థితుల్లో, ఉద్యోగం కోల్పోయి ఖాళీగా ఉండాల్సి వస్తే, తక్కువ అద్దె ఇంటికి వెళ్లి సర్దుకోవచ్చు. సొంతిల్లు అయితే వ్యక్తిగత కష్టాలతో సంబంధం లేకుండా ఈఎంఐ కట్టాల్సిందే. → అద్దె ఇల్లు అయితే ఇంటి నిర్వహణ భారం తమ మీద పడదు. వాటర్ ట్యాంక్లు, నీటి మోటార్ల నిర్వహణ, రిపేర్లు, పెయింట్స్ తదితర బాదర బం«దీలు ఉండవు. వీటి రూపంలో ఆర్థిక భారం పడదు. ఇంటి పన్నుల బాధా ఉండదు. → రుణంపై ఇల్లు కొనుగోలు చేయాలంటే.. మొత్తం విలువలో 20 శాతం డౌన్ పేమెంట్ కింద సమకూర్చుకోవాలి. అదే అద్దె ఇంటి విషయంలో ఈ అవసరం ఉండదు. కొద్ది నెలల అద్దెకు సరిపడా రిఫండబుల్ డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది.వేతన జీవులకు రియల్టీ ఆస్తివేతన జీవులకు రియల్ ఎస్టేట్ ఒక ఆస్తిగా మారుతుంది. నీవు ప్రతి నెలా అద్దె కింద రూ.లక్ష చెల్లిస్తుంటే, దానికి అదనంగా రూ.50,000–60,000 చెల్లించేట్టు అయితే సొంతిల్లు దక్కుతుంది. పదేళ్ల పాటు ఇదే అద్దెను చెల్లించడం వల్ల ఎలాంటి ఆస్తి సమకూరదు. కనుక ఈఎంఐతో ఒక ఆస్తిని సమకూర్చుకోవచ్చు. – అజితేష్ కొరుపూలు, అశోక బిల్డర్స్ (రియల్ ఎస్టేట్ కంపెనీ) సీఈవోతెలివైన నిర్ణయం కాదు!గురుగ్రామ్లో నేను ఉండే ఇంటికి ప్రతి నెలా రూ.1.5 లక్షలు అద్దె, మెయింటెనెన్స్తో కలిపి రూ.1.65 లక్షలు చెల్లిస్తున్నా. అది గోల్ఫ్కోర్స్తో కూడిన ఖరీదైన ప్రాంతం. నేను ప్రస్తుతం అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్ ఖరీదు రూ.7.5–8 కోట్లు. దీన్ని కొనుగోలు చేయాలంటే 70 శాతం మేర రూ.6 కోట్లు రుణం తీసుకోవాలి. దీనికి ప్రతి నెలా రూ.6–7 లక్షల ఈఎంఐ చెల్లించాలి. అంటే నేను ప్రస్తుత ఇంటికి చెల్లిస్తున్న అద్దెకంటే ఈఎంఐ నాలుగు రెట్లు అధికం. కనుక ఇల్లు కొనుగోలు చేయడం నాకు తెలివైన నిర్ణయం కాబోదు. ఇల్లు అనేది లిక్విడిటీ (కోరుకున్న వెంటనే సొమ్ము చేసుకోగల) ఉన్న ఆస్తి కాదు. కనుక నేను అదే రూ.6 లక్షలను పబ్లిక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తాను. పైగా అద్దె ఇల్లు తీసుకోవడంలో కొంత స్వేచ్ఛ ఉంటుంది. 15 రోజుల్లోనే చిన్న సైజు నుంచి పెద్ద సైజు ఇంటికి మారొచ్చు. నేను నా పిల్లలు, తల్లిదండ్రులతో కలసి ఉంటే తప్ప ఇంటి విషయంలో నా ఆలోచన ఇదే. – శంతను దేశ్పాండే, బోంబే షేవింగ్ కంపెనీ ఫౌండర్హాస్యాస్పదంప్రస్తుత వేల్యూషన్ల వల్లే నేను రియల్ ఎస్టేట్ను కొనుగోలు చేయలేదు. నా వరకు ఈ వేల్యూషన్లు నిజంగా హాస్యాస్పదం. వడ్డీ రేట్ల కంటే ఇంటిపై రాబడులు తక్కువ. ఇళ్లు, ఆఫీస్ల ధరలు పెరుగుతాయని కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయం అనిపించడంలేదు. పెట్టుబడులపై 10–12 శాతం రాబడులు సంపాదించుకోలిగినప్పుడు, 3 శాతానికే (ప్రాపర్టీ విలువలో) వచ్చే అద్దె ఇల్లు తీసుకోవడమే మంచిది. పెట్టుబడులపై వచ్చే రాబడి కంటే రెంటల్ ఈల్డ్ చాలా తక్కువ. నా తల్లిదండ్రులు నివసించిన ఇల్లు ఒక్కటే నాకు ఉంది. దానికి కూడా భావోద్వేగ పరమైన కారణాలున్నాయి. – నిఖిల్ కామత్, జెరోదా కో–ఫౌండర్ ఆఫీసుకు దగ్గరుంటే.. తమ కార్యాలయాలకు దగ్గరగా లేదా వ్యాపార సంస్థలకు సమీపంలో ఉండాలనుకుంటే ఇంటిని అద్దెకు తీసుకోవడమే లాభం. అలాంటి చోట సొంతిల్లు సమకూర్చుకోవడానికి భారీ పెట్టుబడి కావాలి. దాంతో పోలిస్తే చాలా తక్కువకే అద్దె ఇల్లు వచ్చేస్తుంది. పైగా రోజూ ఇంటి నుంచి వెళ్లి వచ్చేందుకు ఎక్కువ సమయం పట్టదు. ఇంధన వ్యయాల భారం ఉండదు. విలువైన సమయం, వనరుల ఆదా అవుతాయి. సెలబ్రిటీలు ఇలా..సెలబ్రిటీలు మాధురి దీక్షిత్, కృతి సనన్ సొంతింటికి బదులు అదంట్లో ఉండడానికే ప్రాధాన్యమిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ ముంబైలో ఒకే ప్రాజెక్టులో 6 అపార్ట్మెంట్లు కొన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మితభాషణం
మనిషిని జంతుప్రపంచం నుండి వేరు చేసేది భాష, దానికి కారణమైన ఆలోచన, ఆలోచనకి మూలస్థానమైన మెదడు. ఇంతటి విలువైనదానిని సద్వినియోగం చేసుకోటం తెలివిగలవారి లక్షణం. కాని, దానిని దుర్వినియోగం చేసే వారిని ఏమనాలి? అన్నింటి వలెనే మాటని కూడా పొదుపుగా వాడుకోవాలి. ‘‘అతి సర్వత్ర వర్జయేత్’’ అని నానుడి. ఇది మాటలకి కూడా వర్తిస్తుంది. అతిగా మాట్లాడటాన్ని వాగటం అంటారు. జల్పమన్నా అదే. అవి పేరుకి మాటలే కాని, వాస్తవానికి శబ్దాల సముదాయాలు మాత్రమే. అతిగా మాట్లాడుతూ ఉంటే అనవసర విషయాలు ప్రసక్త మౌతూ ఉంటాయి. ఏదో ఒకటి మాట్లాడాలనే తపన వల్ల అసత్యాలు దొర్లవచ్చు. కొన్నిసార్లు అప్రయత్నంగా నోరు జారి బయటపెట్ట కూడని విషయాలు బహిర్గతం అవుతాయి. ఆ సంగతిని గుర్తించక పోవచ్చు, కాని, ఒకసారి నోరు జారితే వెనక్కి తీసుకోవటం కుదరదు. దాని వల్ల ఇబ్బందులు, కొండొకచో ప్రమాదాలు కూడా కల్గవచ్చు. శతృత్వాలు పెరిగితే మనశ్శాంతి కరువు అవుతుంది. కొంచెం నోరు సంబాళించుకుంటే ఎంత బాగుండేది? అని తరవాత ఎంతగా పశ్చాత్తాప పడినా ఏం లాభం? గతం గతః అతిగా మాట్లాడటం కూడా ఒక వ్యసనం. వ్యసనం అంటే వదిలి పెట్టలేని అలవాటు. చేస్తున్నది తప్పని తెలిసినా, చేయకుండా ఉండలేని బలహీనత వ్యసనం. వాగటం అనే బలహీనత ఉన్న వారు అవతలి వాళ్ళు విసుక్కుంటున్నారు, వినటం లేదు అని గుర్తించినా మాట్లాడటం ఆపలేరు. ఈ లక్షణం చిన్నపిల్లలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పెద్దవాళ్లు మాట్లాడ వద్దన్నా, చివరకు చేతితో నోరు మూసినా, వేళ్ళసందులలో నుండి తాము చెప్పదలచిన దానిని చెప్పేస్తారు. పిల్లలని వాగుడుకాయ అని తేలికగా తేల్చేస్తాం. పెద్దలని ఊరుకోమని అనలేం. పెద్దవారిని ఎదురుగా అనకపోయినా వాచాలుడు, వ్యర్థప్రసంగి, అధికప్రసంగి అంటూ తేలికగా మాట్లాడుతారు. నోరు అదుపులో ఉంటే ఈ చెడ్డ పేరు రాదు. కుటుంబ సభ్యుల మధ్య, బంధువులు స్నేహితుల మధ్య, సహోద్యోగుల మధ్య, దేశాల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి సత్సంబంధాల బదులు తగాదాలు, యుద్ధాలు రావటానికి కారణం చాలా వరకు అధిక ప్రసంగాలే. ‘‘మాటకి మాట తెగులు, నీటికి నాచు తెగులు’’ అని సరసంగా మొదలయిన సంభాషణ చినికి చినికి గాలివానగా మారే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి రాకుండా ఉండటానికి ఏకైక మార్గం వీలైనంత తక్కువగా మాట్లాడటం. అందుకే ‘‘ఊరుకున్నంత ఉత్తమం లేదు’’ అనే సామెత వచ్చింది. అవతలివారి రహస్యాలను కూపీ తియ్యటానికి చేసే మొదటి పని, ఉత్తమమైన పద్ధతి వారిని మాటల్లోకి దించటం. మాటల ధోరణిలో ఎవరితో ఏం మాట్లాడుతున్నారో మర్చిపోయి వాగి, వాగి తమ వ్యక్తిగత విషయాలను, గోప్యంగా ఉంచవలసిన కుటుంబ వ్యవహారాలను, చివరకు దేశరక్షణకు సంబంధించిన రహస్యాలను కూడా బయట పెట్టిన సందర్భాలు చరిత్రలో కనపడతాయి. ఆలోచనతో పాటు విచక్షణని కూడా ఉపయోగిస్తే దేనిని వృథా చేయటం ఉండదు. మాటని వృథా చేయటం అంటే ప్రకృతి మనకి ఇచ్చిన దానిని సరిగా వాడుకోక ప్రకృతి పట్ల అపచారం చేయటం. ఎందుకంటే మాట్లాడటానికి ఎంతో శక్తిని వెచ్చించ వలసి ఉంటుంది. వినే వారి సమయం వృథా అవుతుంది. అందుకే అతి వాగుడు ఆయుః క్షీణం అంటారు. నోరు చేసుకుని, నోరు పెట్టుకుని బతికేవాళ్ళు తగు జాగ్రత్తలని తెసుకోకపోతే ఆయువు తరిగే ప్రమాదం ఉంది సుమా! మునుల దీర్ఘాయువు రహస్యం కూడా ఇదే. కాళిదాసు పేర్కొన్న రఘువంశ రాజుల లక్షణాలలో మితభాషణం ఒకటి. అది సత్ప్రవర్తనలో ప్రధానాంశం. మనకి నోరు ఉన్నది మాట్లాడటానికే కదా! ఎందుకు పరిమితం చేసుకోవాలి? అన్న ప్రశ్నకి మహాకవి కాళిదాసే సమాధానం కూడా చెప్పాడు – ‘‘సత్యాయ మితభాషిణాం’’ అని. సత్యాన్ని పలకటానికి మాత్రమే పెదవి విప్పేవారట. -
మనసుకు హత్తుకునేలా...
గొప్ప వాక్కును కొందరు మహాత్ములు పద్యరూపంలో చెప్పారు. మరి కొందరు గద్యరూపంలో చెప్పారు, ఇంకొందరు గీతం రూపంలో చెప్పారు. పోతన భాగవతాన్ని పద్య, గద్యరూపంలో చెప్పారు. ప్రధానంగా పద్య రూపంలో చెప్పారు. పద్యానికి ఉన్న లక్షణం –అది ఛందోబద్దం. నాలుగుసార్లు చదివితే అది నోటికొచ్చేస్తుంది. జ్ఞాపకంలో ఉండిపోతుంది. జీవితంలో ఏది ప్రధానంగా జ్ఞాపకం ఉంచుకోవాలో, అలా ఉంచుకుని సందర్భాన్నిబట్టి గుర్తు తెచ్చుకుని సానుకూలంగా ఆచరణలో పెట్టుకోగలిగిన వాటిని ఛందోబద్దంగా ఇస్తే అవి మనసుకు హత్తుకుని మనకు అవసరాన్నిబట్టి ప్రయోజనం కలిగిస్తాయి. కానీ అంత జ్ఞాపకం పెట్టుకోవలసిన అవసరం లేని వాటిని గద్యరూపంలో(వచనంగా) అందించాడు పోతన, పద్యం, గద్యం కలిసి రాసినప్పుడు. తెలుగులో పద్యరూపంలో చెప్పినట్టుగానే, సంస్కృతంలో శ్లోకరూపంలో చెప్పారు. ఒక పద్యాన్ని చదవడంకన్నా, ఒక శ్లోకాన్ని చదవడంకన్నా, మేము వాక్యరూపంలో ఉన్న వచనాన్ని(గద్యాన్ని) చదువుకుని ప్రయోజనం పొందుతామని ఇష్టపడేవారికి గద్యంలో కూడా అందుబాటులో ఉంచారు. మరికొందరు చాలా తేలికగా అవతలివారికి బోధ చేయడానికి గీతం రూపంలో అందించారు. గీతం అంటే పాట. పాట మనసును రంజింప చేస్తుంది. సహజంగా పుట్టుకచేత క్రౌర్యం ఉన్నవి కూడా సంగీతం వినబడేటప్పటికి అవి వాటి క్రూరత్వాన్ని ఆ కాసేపు పక్కనబెట్టేస్తాయి. అలాగే గాఢమైన అజ్ఞానంతో ఏమీ తెలియనివారు కూడా సంగీతంతో కూడిన గీతం వినేటప్పటికి గొప్ప శాంతిని పొందుతారు. పశువులు కావచ్చు, పసిబిడ్డలు కావచ్చు .. పాటవినేటప్పటికి ఒక తన్మయావస్థకు లోనుకావడం జరుగుతుంది. ఏడుస్తున్న వాళ్ళు కూడా ఆ కాసేపు ఏడుపు ఆపేస్తారు. మనసు శాంతిని పొందుతుంది. సమాజ హితం కోసం పద్యరూపంలోగానీ, గద్య, గీత రూపాల్లో కానీ ఎవరు ఏమీ ఆశించకుండా వాక్కులుగా వెచ్చించారో వారు శాశ్వత్వాన్ని పొందారు. ‘ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్/ సొమ్ములు? గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము? బాసి కాలుచే/ సమ్మెట పోటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ/ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్.’ అంటాడు పోతన. నేను సమాజహితాన్ని కోరి పలుకుతున్నాను తప్ప నేనేమీ ఆశించడంలేదన్నాడు.. అదే శాశ్వతమైనది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మంగళకరం
భారతీయ సంప్రదాయంలో ఏదయినా ప్రారంభం చేసేటప్పుడు.. మంగళకరమైన వాక్కులతో, శబ్దాలతో ప్రారంభం జరుగుతుంటుంది. ‘మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని శాస్త్రాణి ప్రథంతే’.. అంటారు. అంటే మంగళకర వాక్కుతో ప్రారంభించాలి, మధ్యలో మంగళకరమైన వాక్కు ఉండాలి. ముగింపును కూడా మంగళకరంగా పూర్తి చేయాలి.. అని శాస్త్ర వాక్కు. అంటే జీవితం ఎప్పుడూ మంగళకరంగా, శోభాయమానంగా ఉండాలి. శాంతికి విఘాతం కలగకుండా చూసుకుంటుండాలి. అంటే ఇతరుల మనశ్శాంతికి కారణమయ్యేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి. మంగళకర వాక్కులు, శబ్దాలు ఉన్నచోట పూజనీయత ఉంటుంది. వాతావరణం కూడా పరిశుద్ధమయి, దేవతల అనుగ్రహానికి కారణమవుతుందని విశ్వసిస్తాం. ఘంటానాదంతో పూజ ప్రారంభం చేస్తాం. ఎందుకని.. ఆగమార్థంతు దేవానాం/ గమనార్థంతు రాక్షసాం/ కురుఘంటారవంతత్ర/ దేవాతాహ్వాన లాంఛనం... అంటే రాక్షసులు అక్కడినుంచి వెళ్లిపోవాలన్నా, దేవతలు రావాలన్నా... ఘంట మోగాలి. ఆ శబ్దంలోని పవిత్రత, మంగళప్రదత్వం అటువంటిది. నాదస్వరం, షెహనాయి, మృదంగం, డోలు, శాక్సోఫోన్, మద్దెల, ఘంటలు, గజ్జెలు, ఢమరుకం, శంఖం, కొమ్ము, వేణువు, వీణ, వయోలిన్, హార్మోనియం, క్లారినెట్... ఇవన్నీ మంగళప్రదమైన శబ్దాలు చేసే సంగీత పరికరాలు. బ్యాండ్ కూడా అంతే... దానిలోని శాక్సోఫోన్ కానీ, క్లారినెట్ కానీ, ఇతర పరికరాలు కానీ అవి కూడా గురుముఖతః నేర్చుకుని వాయిస్తారు. వీటిని మోగించే కళాకారులను కూడా సమాజం సమున్నతం గా ఆదరిస్తుంది. పండిట్ రవిశంకర్, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ లను భారతరత్న వరించింది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్... వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలను ఆయన అందుకున్నారు. ‘నేను సరస్వతీ ఆరాధకుడిని’ అని బిస్మిల్లాఖాన్ ప్రకటించుకున్నారు. ‘యావత్ భారతదేశంలోని ప్రజలందరూ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు..’ అని ఆయన తరచుగా అంటూండేవారు. ఒకసారి అమెరికాలో కచేరీ సందర్భంగా అభిమానులు ఆయనను అక్కడే ఉండిపొమ్మని కోరగా... కాశీని, విశ్వనాథుడిని, విశాలాక్షిని, గంగమ్మను వదిలి రాలేను అని.. ప్రకటించుకున్న గొప్ప దేశభక్తుడు. సింహాచలం ఆస్థాన విద్వాంసుడు చిట్టబ్బాయిని... సంగీతనాటక అకాడమీ, కళాప్రపూర్ణ వంటి బిరుదులెన్నో వరించాయి. కాకినాడలో సత్యనారాయణ అనే గొప్ప క్లారినెట్ విద్వాంసుడు ఎందరో శిష్యులను తయారు చేసాడు.. వారందరూ కలిసి ఆయనకు గురుదక్షిణగా బంగారు క్లారినెట్ ను బహూకరించారు. ఇటువంటి వాద్య సంగీత విద్వాంసులను కూడా గౌరవించడం, వారి కచ్చేరీలు నిర్వహించి వారిని, వారి కళను, వారి వాయిద్యాలను సమాదరించడం మన కర్తవ్యంగా భావించాలి. మంగళత్వం అనేది కోయిల కూతలో, మామిడాకులో వానచినుకులో, పసుపులో, కుంకుమలో, పువ్వులో.. కూడా దర్శించే సంప్రదాయం మనది. ఇప్పటికీ నృత్యకళను అభ్యసించినవారు అరంగేట్రం చేయడానికి ముందు .. సభలో ఆసీనులైన పెద్దల దగ్గరకు వచ్చి, వారి చేతికి గజ్టెలు అందించి... తిరిగి వారి చేతులనుండి స్వీకరించి కాలికి కట్టుకుని వెళ్ళి ప్రదర్శిస్తుంటారు... అంత గాఢంగా మనం ఈ కళలను అభిమానిస్తాం... ఈ సంప్రదాయాన్ని నవతరం కూడా నిష్ఠతో కొనసాగించాలని కోరుకుందాం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ప్రేమ కోసం ప్రేమగా
ధనం వృద్ధి ΄పొందటానికి కొంత సమయం పడుతుంది. విత్తనాన్ని భూమిలో నాటితే ఫలం చేతికి అందటానికి సమయం పడుతుంది, కానీ క్షణంలో ఫలితాన్ని అందజేసేది ప్రేమ ఒక్కటే. ప్రేమతో కూడిన ఒక్క మాట, ఒక చర్య అద్భుతాలను సృష్టిస్తుంది. ఈ ప్రేమకు వయసుతో పనిలేదు. రక్తసంబంధం ఉండాలని నియమం లేదు. కుల మతాల ప్రసక్తే లేదు.మరో గొప్ప విషయం ఏమిటీ అంటే ఇచ్చేవారికీ, పుచ్చుకునే వారికీ సంతోషం కలిగించే శక్తి కేవలం ప్రేమకు మాత్రమే ఉంది. ఒక్కసారి ప్రేమ గొప్పతనం అర్థం అయ్యాక, ప్రేమను పంచటంలోని మాధుర్యం అనుభవం అయిన తరువాత కఠినంగా కఠోరంగా ఉండటం సాధ్యం కాదు. పరిస్థితుల దృష్ట్యా కొన్నిసార్లు కావాలని కఠినంగా ఉండాలని ప్రయత్నించినా రాతి అడుగున దాగిన నీటి బుగ్గలాగా పెల్లుబికి వస్తుంది ప్రేమ. మట్టితో కూడిన చెరువు నీటికుండలో చిన్న పటిక ముక్క వేస్తే మట్టి విడిపో యి స్వచ్ఛమైన నీరు తయారవుతుంది. అనేక సమస్యలు, ఒత్తిడులతో మనశ్శాంతికి దూరం అయిపో తున్న నేటి సమాజంలో శాంతిని చేకూర్చగల ఏకైక మార్గం ప్రేమ. కేవలం యువతీ యువకుల మధ్య కలిగేదే ప్రేమ అనే భ్రమ నుంచి బయటపడితే ప్రతిజీవి తోటి వారి అందరిపట్ల పశుపక్ష్యాదుల పట్ల, ప్రకృతి పట్ల చూపించేది అంతా ప్రేమే. ఒక కర్మాగారం చాలా చిక్కు సమస్యలలో మునిగి పో యింది. కార్మికుల మధ్య తగులాటలు, శత్రుత్వాలు. అప్పటివరకు ఉన్న అధికారి ఆ ఒత్తిడిని తట్టుకోలేక పదవికి రాజీనామా చేసి వెళ్లిపో యాడు. అతని స్థానంలో మరొక అధికారిని నియమించారు. కొద్దికాలంలోనే కర్మాగారం పరిస్థితి చక్కబడింది. మునుపటి శత్రుత్వం నిండిన వాతావరణం మారిపో యి చక్కని వాతావరణం ఏర్పడింది. పైవారు కొత్త అధికారిని ప్రశంసలతో ముంచెత్తారు. ఇటువంటి మార్పు కోసం ఆ కొత్త అధికారి ఉపయోగించిన ఏకైక ఆయుధం ప్రేమ. ఉదయం రాగానే అందరినీ ఒక్కొక్కరినీ పిలిచి ప్రేమగా పలకరించేవాడు. వారి యోగక్షేమాలను విచారించేవాడు. మీకు ఏ కష్టం వచ్చినా చెప్పండి నేను ఉన్నాను. మనందరం ఒక కుటుంబం అని ప్రేమగా మాట్లాడేవాడు. ఆ చిన్న పని వల్ల ఆయన అందరికీ ఆత్మీయుడిగా మారిపో యాడు.ఆయన సంతోషం కోసం అందరూ గొడవలు మానేసి పరస్పరం స్నేహంగా ఉండటంప్రా రంభించారు. మనం ప్రస్తుతం నివసిస్తున్న ఈ సమాజంలోఅన్నీ వుండి కూడా కాస్తంత ప్రేమ కోసం అలమటించే వారు ఎందరో ఉన్నారు. అయిన వారందరూ దూర్రప్రాం తాలకు తరలిపో గా ఒంటరితనంతో బాధపడుతూ కాస్తంత ఆప్యాయత కోసం, తపించి పో యే వారికి ఊరట కలిగేలా మనకు ఉన్న సమయంలో కొద్ది సమయం ఇటువంటి వారికోసం కేటాయించి ప్రేమతో నాలుగు మాటలు మాట్లాడితే వారికి ఎంతో ఉత్సాహం కలుగుతుంది. జీవితం పట్ల ఆసక్తి నశించిపో యి జీవించే వారికి జీవితం పట్ల ఆసక్తి కలుగుతుంది. అంతేకాదు, ప్రేమను చవిచూసిన వారు ఇతరులకు ప్రేమను పంచగలుగుతారు. మన దైనందిన జీవితంలో మనకు సేవలందించే వారిపట్ల ప్రేమతో నాలుగు మంచి మాటలు మాట్లాడితే, వారంతా మనకు మరింత దగ్గరవుతారు. వారితోపాటు మన జీవితం కూడా ఆనందమయంగా మారుతుంది. – పొత్తూరి విజయలక్ష్మి -
మంచి మాట: పలకరింపు ఎంత మధురం!
తీయని పలకరింపు మదిలో చక్కని భావనను రేపుతుంది. ఒక చల్లని అనుభూతినిస్తుంది. ఓ హాయిని చేకూరుస్తుంది. పలరింపు పెద్ద ఓదార్పు. కొన్ని సందర్భాలలో అద్భుతమైన ఊరటను, కొండంత బలాన్నిస్తుంది . ‘తోడుగా నీకు నేనున్నాను‘ అనే ఆత్మీయత, ఆప్యాయతలతో నిండిన పలకరింవు గొప్ప భరోసా నిస్తుంది. మన దుఃఖాన్ని, నిర్వేదాన్ని, నిరాశను, నిçస్పృహను అమడ దూరంలో పెట్టే ఔషధమై మనసుకు సాంత్వననిస్తుంది. బీటలుబారిన భూమికి ఎంతో హర్షాన్నిస్తుంది వర్షం. అదే విధంగా, చక్కని పలకరింపు శోకంతో ఛిద్రమైన మనోక్షేత్రాన్ని ఏకం చేసే ప్రేమజల్లు అవుతుంది. కొందరికి పలకరింపంటే మాటల మూట అనే భావన ఉంది. పలకరింపు అంటే అద్భుతమైన పదవిన్యాసము కాదు. భాషా సొబగులు చూపటం, భాషా సౌందర్యాన్ని ఒలికించటమూ అంతకన్నా కాదు. సమాసాల హోరు, జోరు కానే కాదు. పలకరింపు ఒక లాలిత్యం... ప్రేమ ధ్వనించాలి. స్నేహం తొంగి చూడాలి. పెదవుల చివర నుంచి కాక మనసులోంచి రావాలి. అపుడే అది ఎదుటివారి మనసును తాకి ఆహ్లాదాన్నిచ్చే మలయమారుతమవుతుంది. చక్కని పులకరింపై మనసుకు ఓ ప్రశాంతతనిచ్చి మన పలకరింపును స్వీకరించిన వారి ముఖాన చిరునవ్వును వెల్లి విరిసేటట్టు చేస్తుంది. కొందరు నోరు విప్పి పలుకరించటానికి ముందే వారి ముఖం మీద చిరునవ్వు పుడుతుంది. ఆ తరువాతే మాటలు. అటువంటి వారి మాటకు మృదు మధురంగానే ఉంటాయి. శ్రీరాముడు స్మిత పూర్వ భాషి అన్నారు. చిరునవ్వుతో తానే ముందు అందరిని పలకరిస్తాడు. పదాల అర్థం వాటి పర్యవసానం, వాటి పయనం, వాటి ప్రభావాల గురించి మన అంచనా శక్తి మనకు తెలియాలి. మన పలకరింపు ఎదుటివారికి చేరేది మాటల రూపంలోనే కదా. అది మన గొంతు నుండి పెదవులను దాటి స్వరరూపంలో బయటకు వస్తుంది. స్వరం స్థాయి, మాటల ఊనిక చాలా అవసరం. మనం ఎన్నుకున్న మాటల అర్థాన్ని, ఉద్దేశాన్ని ఎదుటివారికి తెలియజెప్పేది మాటల రూపంలో వ్యక్తమయ్యేది పలకరింపే. అందుకనే ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఒకరకంగా ఇది అతి సులువు గా కనిపించే అత్యంత క్లిష్టమైన విషయం. ‘బావున్నారా‘ అనేది మనమందరం చేసే అతి సాధారణ పలకరింపు. ఈ నాలుగు అక్షరాలు మన గొంతులో పలికే మన స్వర స్థాయిని బట్టి మన మనోభావాన్ని తెలియచేస్తుంది. అందుకే మాటలు అవే అయినా వాటిని పలికే తీరులో ఎంతో తేడా ఉంటుంది. మన భావాన్ని తెలియచెప్పే మాటల ధ్వని, దాని అర్థం మనం స్వరం లో పలికేటట్టు మాట్లాడగలగాలి. అదే చక్కని పలకరింపుకు చిరునామా అవుతుంది. మనల్ని చక్కని సంభాషణ పరులుగా చేసేది. పలకరింపు అంటే భాష మీద పట్టు, సాధికారత కానే కాదు. పలకరింపుకు మన విజ్ఞత, వివేచన ఉండాలి.. అపుడే అది చేయదగ్గ పనిని చేస్తుంది. తల్లిదండ్రులు తమ జీవితమంతా పిల్లలకే ధారపోస్తారు. అహరహం వారి బంగారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వయసు మీరిన తరువాత పలకరింపుకోసం తపించిపోతారు. ఈరోజు విషయాన్ని పిల్లలు అర్థం చేసుకోవాలి. స్వదేశంలో ఉన్నా, విదేశంలో ఉన్నా తమ తల్లిదండ్రులను పలకరించాలి. ఆ పలకరింపు, గడపబోయే సమయం కొన్ని క్షణాలైనా చాలు. అది వృద్ధులకు ఎంతో ధైర్యాన్ని, భరోసాను ఇస్తుంది. అన్నిటికీ మించి వర్ణించలేని సంతృప్తిని, అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. మనం పలకరించినా, లేకపోయినా ప్రకృతి మనల్ని పలకరిస్తూనే ఉంటుంది. ప్రకృతిపరమైన ఈ పలకరింపులు ఆలకించగలగాలి లేదా అలవాటు చేసుకోవాలి. అపుడు ఎంతో ఆనందాన్ని పొందగలం. ఆ దృష్టి ఆనంద హేతువు. ఉదయానే కొక్కోరోకో అనే ధ్వని, ఉదయపు వ్యాహ్యాళి వేళ తమ ఆవాసమైన వృక్షాన్ని వీడి పక్షులు తమ ఆహారన్వేషణ కు ఆకాశానికెగిరే వేళ చేసే టప టప మనే ధ్వని ప్రకృతి పలకరింపు. పండిన నారింజ రంగులో ఉన్న భానోదయం, భాస్కరుని నులివెచ్చని కిరణాలు నిశ్శబ్ద పలకరింపులే కదా! గాలి ఈలలు, చిరుగాలి సవ్వడి, నీటి గలగలలు, నిన్నటి మొగ్గ నేడు తన రేకానయనాలను విప్పార్చుకుంటూ పరిమళాలతో మనల్ని మన ఆత్మీయులు పలుకరించిన అనుభూతి కలగదా! పలకరింపు మాటల్లోనే ఉండనక్కర లేదు. అది ఒక చూపు, స్పర్శ, చిరునవ్వు, దృశ్యం, పుస్తకం.. ఇలా ఏవైనా కావచ్చు. ఇలా ఏదోరకమైన పలకరింపును మనం చేయగలగాలి. అది పొందిన వారు, కోరుకునే వారికి తీయని అనుభూతినిస్తుంది. వారి మనసు ఆనంద సంద్రమవుతుంది. కొందరు ఎంత ఉన్నతపదవుల్లోకి వెళ్లినా తమ హితులను, స్నేహితులను, బంధువులను విస్మరించరు. పలకరించే ఏ సందర్భాన్ని వదలుకోరు. వారి హోదాకు, అంతస్థుకి చెందినవారిని ఎంత ఆప్యాయంగా, ఆత్మీయంగా పలుకరిస్తారో పేదలైనా, ధనికులైనా, చదువుకున్న వారైనా, చదువుకోనివారైనా ఒకేరకమైన ప్రవర్తన. ఒకేరకంగా పలకరిస్తారు. అది ఎంతో గొప్ప లక్షణం. ఇది చాలామందిలో ఉండదు. అటువంటి వారు వేళ్ళమీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉంటారు. అందుకే వారిది అపురూప వ్యక్తిత్వమవుతుంది. అదే మనకు ఆదర్శం కావాలి. ఆర్థిక బాధల్లో ఉన్న వారందరికీ మనం సహాయం చేయడం సాధ్యం కాకపోవచ్చు. అయితే, కష్టాల కడలిలో ఉన్న మన చుట్టాలను, స్నేహితులను, ఇరుగు పొరుగుని ఓదార్పుగా పలకరించవచ్చు. అది వారికి హార్దికంగా ఎంతో శక్తినిస్తుంది. పెడతోవలో వెళ్ళే వారి ఆలోచనలకు ఒక క్రమ మార్గం ఏర్పరుస్తుంది. ఇటువంటి సందర్భాలలోనే మన సంభాషణ చాతుర్యం తెలిసేది. మన మాటల ఎన్నిక, కూర్పు, పొందికలలో ఎంతో జాగ్రత్త అవసరం. ఇవన్నీ మన పలకరింపు పెదవులను దాటటానికి ముందు మనసులో జరిగే ప్రక్రియ. ఇది పూర్వభాగమైతే, మన భావనలు పలకరింపై ఎదుటివారిని చేరటం ఉత్తరభాగం. సరిగ్గా, ఇక్కడే మాటలకున్న అర్థాన్ని మనమెంత లోతుగా గ్రహించగలిగామో తెలిసేది. – లలితా వాసంతి -
లాటరీ గెలిచానన్న ఆనందమే లేదు.. ప్లీజ్ నన్ను చావగొట్టకండిరా అయ్యా!
అదృష్టం ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో తెలియదు. ఒక్కరోజులో సామాన్యుడు ధనవంతుడు కావచ్చు.. కోటీశ్వరుడు సామాన్యుడు కావొచ్చు. కాగా, ఇటీవలే కేరళకు చెందిన ఆటో డ్రైవర్ అనూప్.. లాటరీలో రూ. 25 కోట్ల బహుమతి గెలుచుకొని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఈ క్రమంలో ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కానీ, ఐదు రోజులు గడిచిన తర్వాత అనూహ్యంగా తనకు బహుమతి వద్దనిపిస్తుందని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే, కేరళ ప్రముఖ పండగ ఓనం సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన మెగా ఓనం రాఫిల్లో ఆటోడ్రైవర్ అనూప్ రూ. 25 కోట్ల లాటరీ బహుమతిని గెలుచుకున్నాడు. దీంతో, అనూప్.. ఆనందం వ్యక్తం చేశాడు. కానీ, ఇంతలోనే ఆ డబ్బు వస్తున్న కారణంగా తాను మనోవేదనకు గురవుతున్నట్టు తెలిపాడు. తాజాగా అనూప్ మాట్లాడుతూ.. లాటరీ డబ్బులో పన్ను, ఇతర బకాయిలు పోయిన తర్వాత ప్రైజ్ మనీగా రూ. 15 కోట్లు వచ్చే అవకాశం ఉంది. లాటరీ గెలిచాక 2 రోజులుగా ఆనందంగా గడిపాను. కానీ, ప్రస్తుతం మాత్రం మనశ్శాంతిని కోల్పోయాను.. నిద్ర కూడా పట్టడంలేదని అన్నాడు. ఎందుకంటే, నేను లాటరీ గెలిచాక నా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తమ అసరాలను తీర్చమంటూ కాల్స్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. దీంతో, ఇంట్లో నివసించే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగానే నా అవసరాలు తీరే విధంగా తక్కువ మొత్తంలో డబ్బులు వచ్చినా బాగుండేది. అలాగైనా ప్రశాంతంగా ఉండేవాడినని అంటున్నాడు. ఎందుకంటే డబ్భులు వచ్చాయని తెలియగానే తనకు తెలిసిన వారు చాలా మంది శత్రువులుగా మారుతున్నారని వాపోయాడు. అయితే, తనకు ఇంకా డబ్బులు అందలేదని సోషల్ మీడియా ద్వారా అందరికీ చెబుతున్నానని అన్నాడు. కాగా, ఒక్కసారిగా అంత మొత్తంలో డబ్బు వస్తున్నందు వల్ల ఆ డబ్బును ఏం చేయాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నాడు. వచ్చిన మొత్తం డబ్బును కొద్దిరోజులు బ్యాంకులోనే ఉంచుతానని స్పష్టం చేశాడు. After being announced as the winner of the Onam bumper lottery, Kerala resident Anoop says that regrets winning the prize amount of INR 25 crore. Anoop said that he has lost all peace of mind winning the lottery.#Lottery #KeralaLottery https://t.co/8oSOFHjwnp — G2G News (@NewsG2G) September 24, 2022 -
మనశ్శాంతి కరువైతే...
సాధారణ జీవితానికి పెద్దగా లోటు లేకపోయినా మనశ్శాంతి కరువవుతుంది కొందరికి. ఫలితంగా నిరంతరం దిగులుగా ఉంటూ మానసికంగా కుంగిపోతూ ఉంటారు. ఏ పని మీదా దృష్టి కేంద్రీకరించలేకపోతారు. జీవితంలో ఎదగడానికి ఉపయోగపడే అవకాశాలు వచ్చినా, వాటిని అందిపుచ్చుకోలేకపోతుంటారు. ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి పాటించాల్సిన కొన్ని పరిహారాలు... ► ప్రతిరోజూ ఉదయం స్నానసంధ్యలు ముగించుకున్న తర్వాత స్వహస్తాలతో ఒక రొట్టెను తయారు చేయండి. ఆ రొట్టెను నల్లకుక్కకు తినిపించండి. ఆ తర్వాతే రోజువారీ కార్యక్రమాలను ప్రారంభించండి. ► మూడంగుళాల పొడవుండే పాదరస శివలింగాన్ని ఇంట్లోని పూజ గదిలో ప్రతిష్ఠించండి. పాదరస లింగానికి ప్రతిరోజూ ధూపదీపాలు సమర్పించి, పంచాక్షరీ మంత్రాన్ని పదకొండుసార్లు జపించండి. ► కోతులు విరివిగా సంచరించే ఆలయానికి మంగళవారం ఉదయంపూట వెళ్లి, అక్కడ ఉండే కోతులకు శనగలు తినిపించండి. ఈ పరిహారాన్ని కనీసం పదహారు వారాలు పాటించాల్సి ఉంటుంది. ►ప్రతిరోజూ రాత్రివేళ చిన్నరాగిపాత్రలో మంచినీటిని నింపి, ఆ నీటిలో కాసిన్ని కృష్ణతులసి దళాలను వేయండి. ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఆ నీటిని ఇంటి నలుమూలలా, ఇంటి గుమ్మం వద్ద చల్లండి. మిగిలిన నీటిని తీర్థంగా సేవించండి. ►ఏదైనా ఆదివారం రోజున కనీసం ఐదుగురు పేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు, కలాలు వంటి వçస్తువులను కానుకగా ఇవ్వండి. – పన్యాల జగన్నాథ దాసు -
మనకు మనమే..!
‘‘జీవితాన్ని ఎలా తీసుకుంటు న్నాం? అనేదాని మీదే మన మనశ్శాంతి ఆధారపడి ఉంటుంది. అవతలివాళ్లు ఏమనుకుంటారో అని ఆలోచించడం మొదలుపెడితే తిప్పలు తప్పవు’’ అని రాశీ ఖన్నా అంటున్నారు. ఇంకా ఈ బ్యూటీ మాట్లాడుతూ – ‘‘అందంగా ఉన్నవాళ్లను చూసి, ‘మనం అలా లేం అని అదే పనిగా బాధపడిపోతారు కొంతమంది అమ్మాయిలు. అది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. దేవుడిచ్చిన రూపం గురించి ఆలోచించి బాధపడే బదులు మీరు ఎందులో బెస్టో తెలుసుకుని, ‘మనకు మనమే బెస్ట్’ అనుకుని చూడండి.. మీ కాన్ఫిడెన్స్ లెవల్ పెరుగుతుంది. ఒకప్పుడు నేను బొద్దుగా ఉండేదాన్ని. తగ్గితే బాగుంటుందనిపించి తగ్గాను. తగ్గక ముందు ‘నువ్వు లావుగా ఉన్నావు’ అనేవాళ్లు. తగ్గిన తర్వాత ‘ఇంతకుముందే బాగున్నావ్’ అన్నారు. సో.. మనం ఏం చేసినా ఏదో ఒకటి అనడానికి మనుషులు ఉంటారు. అందుకే చెబుతున్నా.. ఎలా ఉంటే బాగుంటుందో మీకు మీరుగా అనుకోండి. ఆ ప్రకారం తగ్గాలో.. పెరగాలో నిర్ణయించుకోండి. ఇతరుల కోసం ఏమీ చేయవద్దు. మన కోసం మనం బతకాలి. ఇతరుల కోసం బతకడం మొదలుపెడితే జీవితంలో రాజీపడాల్సి వస్తుంది’’ అన్నారు. పాయింటే కదా!