Prabhala theertham
-
కోనసీమ: జగ్గన్నతోట ప్రభల తీర్థంలో అపశ్రుతి
సాక్షి, కోనసీమ జిల్లా: జగ్గన్నతోట ప్రభల తీర్థం(Jagganna Thota Prabhala Theertham)లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎడ్ల బండ్లు(Bullock carts) జనంలోకి దూసుకెళ్లడంతో బాలుడు సహా ముగ్గురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. కూటమి నేతల కుటుంబ సభ్యుల కోసం ఎడ్ల బండ్లు ఏర్పాటు చేశారు. జనం నడవటానికే ఖాళీ లేని చోట ఎడ్ల బండ్లను ఏర్పాటు చేయడం విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కాగా, కోనసీమలో సంక్రాంతి నుంచి మక్కనుమ తరువాత రోజు వరకూ అన్ని మండలాల్లో ప్రభల తీర్థాలు జరుగుతాయి. చిన్నా పెద్దా అన్నీ కలిపి సుమారు 84 వరకూ ప్రభల తీర్థాలు నిర్వహిస్తారని అంచనా. సంక్రాంతి రోజున జరిగే తొలి ప్రభల తీర్థం కొత్తపేటదే. కనుమ రోజున నిర్వహించే.. మొసలపల్లి శివారు జగ్గన్నతోట తీర్థానికి ప్రత్యేకత ఉంది. కనుమ రోజున జరిగే తీర్థంలో 11 గ్రామాలకు చెందిన ప్రభలు ఈ తీర్థానికి తరలివస్తాయి.మొసలపల్లి భోగేశ్వరస్వామి, గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నకేశవ మల్లేశ్వరస్వామి, వ్యాఘ్రేశ్వరం వ్యాఘ్రేశ్వరస్వామి, కె.పెదపూడి మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనంద రామేశ్వరస్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వరస్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామిలు జగ్గన్నతోటలో సమావేశమై లోక కల్యాణార్థం చర్చలు జరుపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.ఇదీ చదవండి: నెమలి ‘పుంజు’ తడాఖా.. పందెంలో ‘కోటి’ గెలిచిన కోడిగంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రు ప్రభలు జగ్గన్నతోటను ఆనుకుని ఉండే ఎగువ కౌశికను దాటుకుని వచ్చే తీరు నయనానందకరంగా ఉంటుంది. తీర్థానికి చాలా మంది ఇప్పటికీ గూడు బండ్లపై రావడం సంప్రదాయమే. ఈ తీర్థానికి 50 వేల మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేశారు. వాకలగరువు సోమేశ్వరస్వామి, తొండవరం ఉమా తొండేశ్వరస్వామి, గున్నేపల్లి రామలింగేశ్వరస్వామి ప్రభలు 45 అడుగులు, 43 అడుగుల ఎత్తున నిర్మిస్తారు.మామిడికుదురు శివారు కొర్లగుంటలో జరిగిన ఈ తీర్థానికి సైతం అరుదైన గుర్తింపు ఉంది. ఇక్కడ ప్రభలు పంట కాలువలు, పచ్చని పొలాల మధ్య నుంచి తరలి వస్తుంటాయి. తీర్థానికి మామిడికుదురు, నగరం, పాశర్లపూడి, ఈదరాడ, పెదపట్నం గ్రామాల నుంచి 17 ప్రభలు వస్తాయి. పెదపట్నం నుంచి 12 ప్రభలు కొర్లగుంట తీర్థానికి రావడం గమనార్హం. వీటితోపాటు అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, అయినవిల్లి, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో పలుచోట్ల ప్రభల తీర్థాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. -
కోనసీమలో విశిష్టమైన జగ్గన్న తోటలో కోలాహలంగా ప్రభల తీర్థం
-
Prabhala Teertham 2024 Photos: కోనసీమ జిల్లాలో కన్నుల పండువగా ప్రభల తీర్థం (ఫొటోలు)
-
జగ్గన్నతోట ప్రభల తీర్థానికి పెద్దసంఖ్యలో తరలివస్తోన్న భక్తులు
-
కర్తవ్యపథ్లో అబ్బురపరిచిన కోనసీమ ‘ప్రభ’
సాక్షి , అమలాపురం: రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్లో జరిగిన పరేడ్లో ఏపీలోని కోనసీమ ప్రాంతంలోని ప్రభల తీర్థం శకటాన్ని ప్రదర్శించారు. కనుమ పండుగ రోజు జగ్గన్న తోటలో జరిగే ప్రభల తీర్థంను శకటంగా రూపొందించారు. వేడుకల్లో మొత్తం 17 రాష్ట్రాలకు చెందిన శకటాలను ప్రదర్శించగా..అందులో ఏపీ నుంచి ప్రభలతీర్థం ఒకటి కావడం విశేషం. ఈ పరేడ్లో పాల్గొన్న వారు ‘సాక్షి’తో తమ భావాలను ఇలా పంచుకున్నారు. ఈ సారి ప్రత్యేకం గతంలో నాలుగుసార్లు రిపబ్లిక్ డే కవాతులో పాల్గొన్నాను. కాని ఈసారి ప్రత్యేకం. మన ప్రాంతానికి చెందిన ప్రభ శకటం కూడా వెళ్లడం చాలా సంబరంగా అనిపించింది. మన ప్రభను అందరూ ప్రత్యేకంగా తిలకించారు. కొంతమంది భక్తితో నమస్కరించారు. ఇది మన ప్రాంతానికి దక్కిన గుర్తింపు. – చింతా వీరాంజనేయులు జన్మ ధన్యమైంది నాద బృందంలో ఇప్పటివరకు మా నాన్న పసులేటి నాగబాబు 15 సార్లు రిపబ్లిక్ డే కవాతులో పాల్గొన్నారు. నేను పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ అవకాశం ఎప్పుడు దక్కుతుందా అని చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. గతంలో రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, ప్రతిభాపాటిల్, ప్రధాని నరేంద్ర మోదీ వద్ద మేము ప్రదర్శనలు చేసినా కవాతులో పాల్గొనడం ఇదే తొలిసారి. ఏకాదశ రుద్రులతో ఉన్న ఏపీ శకటాన్ని ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా తిలకించారు. విదేశీ ప్రముఖులు పక్కవారిని వివరాలు అడుగుతూ కనిపించారు. 10.51కి శకటం ప్రయాణం ప్రారంభం కాగా, కవాతు ముగిసి ఎర్రకోటకు చేరే సరికి 01.15 అయ్యింది. – పసుపులేటి కుమార్, ముక్కామల, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
గణతంత్ర దినాన... తెలుగు ప్రభలు
భారతదేశం విభిన్న సంస్కృతి సంప్రదాయాల సమాహారం. వందల ఏళ్ల నాటి సంప్రదాయాలను నేటికీ కొనసాగించడం దేశం గర్వించదగ్గ విషయం. సంక్రాంతి పర్వ దినాలలో భాగంగా కోన సీమ ప్రాంతంలో నిర్వహించే ప్రభల తీర్థాలు అత్యంత విశిష్టమైనవే కాక 400 సంవత్సరాల చరిత్ర కలిగినవి. ఈ ఏడాది ఢిల్లీలో జరిగే ప్రధాన గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ప్రభల తీర్థం’ ఇతివృత్తంగా తయారుచేసిన శకటాన్ని ప్రదర్శిస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం, జగ్గన్నతోటలో నిర్వహించే ప్రభల తీర్థం కోనసీమలో అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక వేడుక. క్రీ.శ 17వ శతాబ్దంలో ప్రభల తీర్థాన్ని ప్రారంభించారని అంటారు. 11 గ్రామాల నుండి వచ్చిన ఏకాదశ రుద్రులు ఇక్కడ కొలువై ఉంటారని ప్రతీతి. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభల తీర్థం విశిష్టతను కొనియాడుతూ నిర్వాహకులకు లేఖను రాశారు. సంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధలతో వెదురు, తాటి కర్రలను, రంగు రంగుల కొత్త బట్టలు, నూలుదారాలను, కొబ్బరి తాళ్ళను, రంగు కాగితాలను, నెమలి పింఛాలను ఉపయోగించి ఒక అందమైన ప్రభను తయారు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆయా గ్రామాల నుండి ఉత్సవ ప్రదేశానికి అంగరంగ వైభవంగా భుజాలపై ఆ ప్రభలను మోసుకువస్తారు. కుల మతాలకు అతీతంగా ఈ తీర్థానికి భక్తులు హాజరవ్వడం విశేషం. ప్రతియేటా సంక్రాంతి పర్వదినాల్లో కనుమ నాడు ఈ తీర్థాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కోనసీమ వ్యాప్తంగా దాదాపు 200 గ్రామాల్లో ప్రభల తీర్థాలను నిర్వహిస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలోనే కాక కృష్ణా జిల్లాలోనూ ప్రభల సంప్రదాయం ఉన్నది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశ, విదేశాలలో ఎక్కడ ఉన్నా... సంక్రాంతి సమయానికి మాత్రం వారి వారి స్వగ్రామాలకు చేరుకొని, ప్రభల తీర్థా లలో పాల్గొంటారు. మేళ తాళాలు, సంప్రదాయ నృత్యాల నడుమ బాణసంచా కాలుస్తూ సంప్రదాయ సంగీత వాద్యాలు, ‘గరగ’ జానపద కళారూపం వంటివాటిని ప్రదర్శిస్తూ వేడుకలు చేసుకుంటారు. సంప్రదాయ కళలకు, వాటినే నమ్ముకుని జీవిస్తున్న కళాకారులకు ఈ ఉత్సవాలు ప్రోత్సాహం ఇస్తాయి. చిన్న చిన్న బొమ్మలు, జీళ్ళు, కర్జూరం, గృహోపకరణాలు వంటివాటిని అమ్ముకుని జీవించే అనేక మంది చిరు వ్యాపారులకు ఆర్థికంగా చేయూత ఇస్తున్నాయి ఈ తీర్థాలు. ప్రభల తీర్థ మహోత్సవాల్లో కొలువుదీరే ప్రభలలో వాకల గురువు (52 అడుగుల ఎత్తు), తొండవరం (51 అడుగుల ఎత్తు) ప్రభలు రాష్ట్రంలోనే అత్యంత ఎల్తైన ప్రభలుగా గుర్తింపబడ్డాయి. ఇంత ఎల్తైనప్రభలను తయారు చేయడం, వాటిని గ్రామస్థులు తమ భుజస్కంధాలపై ఎత్తుకుని కొబ్బరి, వరి పొలాలు, కాలువలు దాటుకుంటూ తీర్థం జరిగే ప్రదేశానికి తీసుకురావడం ఎంతో శ్రమతో కూడిన పని. పెద్ద ప్రభలకు బాసటగా పిల్ల ప్రభలను కొలువుదీరుస్తారు. వీటిని స్వయంగా 10 నుండి 15 ఏళ్ల వయసు ఉన్న చిన్నారులు తయారు చేస్తారు. సమాజంలో శాంతి, లోక కల్యాణం కోసం ప్రజలు ఏకాదశ రుద్రులను ప్రార్థిస్తారు. రైతులను సంఘటితం చేసేందుకు, వారి ఐక్యతను పెంపొందించేందుకు ఇవి ఉపయోగపడతాయని భావి స్తారు. ఇంతటి సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన ప్రభల తీర్థాలను ప్రతిబింబిస్తూ... గణతంత్ర దినోత్సవంలో ప్రదర్శించ తలపెట్టిన రాష్ట్ర శకటం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. శకటం ముందు భాగంలో కోనసీమ జిల్లాలో సంక్రాంతి పర్వదినాల సందర్భంగా అలంకరించినట్లుగా ఉన్న ఒక గూడు ఎడ్ల బండిపై రైతు కుటుంబం ప్రయాణిస్తున్నట్లుగా చిత్రించారు. అలాగే కోనసీమ ప్రకృతి అందాలను ప్రతిబింబించే విధంగా వరి పొలం గట్టుపై ఈ బండి వెళుతున్నట్లుగాను, వరి ధాన్యాన్నీ, ఈ ప్రాంతంలో పండే కొన్ని కూరగాయలను, పొలాలను కూడా చిత్రించారు. దాని వెనుకే శోభాయమానంగా అలంకరించిన ప్రభలను, బోయీలు మోస్తున్న పల్లకీని ప్రదర్శిస్తున్నారు. ప్రభలను రైతులు పూజించే విధానాన్నీ, కోనసీమలో సంప్రదాయ ‘గరగ నృత్యం’ విశిష్ట తనూ తెలిపేవిధంగా ప్రదర్శన ఉంటుంది. వెనుక భాగంలో కోనసీమ కొంగుబంగారం కొబ్బరి చెట్లు ఎటూ ఉంటాయనుకోండి! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ శకటం ప్రదర్శించడం ద్వారా తెలుగు ప్రజల సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేసింది. తద్వారా రైతు పండుగకు అగ్రతాంబూలం ఇచ్చింది. (క్లిక్ చేయండి: సకల శక్తుల సాధన సబ్ప్లాన్) - నేలపూడి స్టాలిన్ బాబు సామాజిక రాజకీయ విశ్లేషకులు -
ఢిల్లీకి కోనసీమ ‘ప్రభ’.. ప్రభుత్వానికి కోనసీమ వాసుల కృతజ్ఞతలు
కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్ ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ‘డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ’ తన సంస్కృతి సంప్రదాయాలతో మరోసారి జాతీయస్థాయి ఖ్యాతినార్జించనుంది. అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే తీర్థానికి వచ్చే ఏకాదశ రుద్రుల ప్రభల నమూనా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని కర్తవ్యపథ్లో రాష్ట్ర శకటంపై కొలువుదీరనుంది. –సాక్షి అమలాపురం తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన సంక్రాంతి పండుగ కనుమ రోజు జరిగే జగ్గన్నతోట తీర్థానికి 11 గ్రామాలకు చెందిన ప్రభలు వస్తాయి. ప్రభ మీదనే పరమేశ్వరుని ఉత్సవ విగ్రహాలు ఉంచి ఊరేగింపుగా తీర్థాలకు తీసుకువస్తారు. దీనికి 450 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రభలపై పరమేశ్వరుని ప్రతిరూపాలు ఇక్కడకు వచ్చి లోక కళ్యాణార్థం చర్చలు జరుపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అరుదైన గుర్తింపు గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివ కేశవ యూత్ సభ్యులు ఈ తీర్థ విశేషాలను దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తూ 2020లో మెయిల్ చేశారు. మోదీ తీర్థం ప్రాశస్త్యాన్ని అభినందించారు. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్కు వెళ్లే రాష్ట్ర ప్రభుత్వ శకటంపై జగ్గన్నతోట తీర్థానికి వచ్చే ఏకాదశ రుద్రులను ప్రదర్శనకు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించినట్టయ్యింది. ప్రభుత్వ నిర్ణయానికి కోనసీమ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమలోని పంట కాలువలు, వరి చేలు, కొబ్బరి తోటలు, రహదారుల మీదుగా ఊరేగే ప్రభలు ఈ ఏడాది ఢిల్లీలోని గణతంత్ర దినోత్సవ పరేడ్లో రాష్ట్ర శకటంపై ఊరేగనున్నాయి. చదవండి: రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్లో ఏపీ ప్రభల తీర్థ శకటం ముచ్చట గొల్పుతున్న ఏకాదశ రుద్రులు పరేడ్ శకటంపై ఉంచే ప్రభలను తాటి శూలం, టేకు చెక్క, మర్రి ఊడలు, వెదురు బొంగులతో సంప్రదాయ బద్ధంగా తయారు చేశారు. రంగు రంగుల నూలుదారాలు (కంకర్లు), కొత్త వస్త్రాలు, నెమలి పింఛాలతో అలంకరించారు. శకటానికి మూడు వైపులా మూడు చొప్పున తొమ్మిది చిన్న ప్రభలు, శకటం మధ్యలో రెండు పెద్ద ప్రభలు నిర్మించారు. కొబ్బరి చెట్లు, మేళతాళాలు, గరగ నృత్యకారులు, వేదపండితులు, పల్లకీ, దానిని మోస్తున్న కార్మికుల బొమ్మలు, తీర్థానికి గూడెడ్ల బండ్ల మీద వచ్చే వారి నమూనాలతో శకటాన్ని తీర్చిదిద్దారు. వరి కుచ్చులు, గుమ్మడి కాయలు, ఇతర కూరగాయలతో అలంకరించారు. గరగ ప్రదర్శనకు అవకాశం పరేడ్లో ప్రదర్శనకు అంబాజీపేట మండలం ముక్కామలకు చెందిన పసుపులేటి నాగబాబు గరగ బృందం ఎంపికైంది. ఈ బృందంలో సుమారు 24 మంది ఉన్నారు. గతంలో నాగపూర్ కల్చరల్ సెంటర్ ద్వారా ఈ బృందం 15 సార్లు పరేడ్లో పాల్గొంది. అయితే ఈసారి ప్రభల తీర్థం శకటం ప్రదర్శన సందర్భంగా ఈ బృందానికి నేరుగా పాల్గొనే అవకాశం లభించింది. మన ప్రాంతానికి దక్కిన గుర్తింపు ప్రభల తీర్థం అంటే మన సంప్రదాయం. రిపబ్లిక్ డే పరేడ్లో ఏకదశ రుద్రుల కొలువు దీరడం అంటే అది మన తీర్థానికి, మన ప్రాంతానికి దక్కిన గుర్తింపు. ఆ తీర్థంలో మాది ముఖ్యపాత్ర కావడం మా పూర్వ జన్మసుకృతం. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – పూజ్యం శ్రీనివాస్, అర్చకుడు స్వతంత్రంగా తొలిసారి గతంలో పలుమార్లు రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్నాం. రాష్ట్రపతులు శంకర్ దయాళ్ శర్మ, వెంకటరామన్, అబ్దుల్ కలాం, ప్రతిభాపాటిల్, ప్రధానులు రాజీవ్గాంధీ, పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్ ముందు మా ప్రదర్శన జరిగింది. కోనసీమ ప్రభలు పరేడ్కు వెళుతున్నందున స్వతంత్రంగా తొలిసారి మా బృందం ప్రదర్శనకు సిద్ధమైంది. – పసుపులేటి నాగబాబు, గరగ బృందం గురువు -
రిపబ్లిక్ డే పరేడ్లో ఏపీ శకటం ప్రబల తీర్థం
న్యూఢిల్లీ: జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు.. ఈసారి ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక అయ్యింది. అనేక రాష్ట్రాల పోటీ మధ్యలో ఏపీ శకటం ప్రబల తీర్థం పరేడ్కు ఎంపికైంది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు మొత్తం 17 శకటాలు ఎంపికయ్యాయి. కోనసీమలో ప్రబలతీర్ధం పేరుతో.. సంక్రాంతి ఉత్సవం ఇతివృత్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ శకటం ఈ అవకాశం దక్కించుకుంది. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ కార్యాలయం వెల్లడించింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మకర సంక్రాంతి సందర్భంగా వీటిని ప్రదర్శిస్తారని.. సంప్రదాయానికి అద్దం పట్టే విధంగా ప్రబల తీర్థం శకటం ఉందని తెలిపింది. గ్రీన్ హరిత విప్లవానికి ఇది ఉదాహరణగా పేర్కొంది. ఏపీ దేశానికి అన్నపూర్ణ, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించింది. కాగా విలువైన సంస్కృతికి నిలయం ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాల నుంచి రిపబ్లిక్ డే పరేడ్కు శకటాలను కేంద్రం ఎంపిక చేస్తుంది. దక్షిణ భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, రాష్ట్రాలకు అవకాశం వచ్చింది. సాక్షి, ఢిల్లీ: రైతే రారాజు అనే ఇతివృత్తంతో రూపొందించిన శకటం.. ప్రభల తీర్థం అని రాజ్యసభ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కోనసీమ ప్రబల తీర్థం రిపబ్లిక్ డే వేడుకలకు ఎంపికైందని, 400 ఏళ్ల విశిష్ట చరిత్ర ఉన్న సంస్కృతికి ప్రబల తీర్థం ఒక నిరద్శనమని పేర్కొన్నారాయన. చదవండి: AP: దేశంలో పెద్ద మంచినీటి సరస్సు మన రాష్ట్రంలోనే.. ప్రత్యేకతలివే! -
నేడు జగ్గన్నతోట ప్రభల తీర్థం
అమలాపురం/ అంబాజీపేట: సంక్రాంతంటే.. భోగి మంటలు.. కొత్తవస్త్రాలు.. ధాన్యం కుచ్చులు.. పిండివంటలు.. కోడి పందేలు మాత్రమే కాదు. అబ్బురపరిచే ప్రభల తీర్థాలు కూడా. ఈ తీర్థాలకు పైరు పచ్చని సీమ కోనసీమ వేదికవుతోంది. సంక్రాంతి సమయంలో కోనసీమ వీధుల్లో నడయాడుతున్న ఇంద్రధస్సులా తీర్థాలకు వెళ్లే రంగురంగుల ప్రభలు సీమ అందాలను రెట్టింపు చేస్తాయంటే అతిశయోక్తి కాదేమో. సీమలో జరిగే ప్రభల తీర్థాలకు వందల ఏళ్ల పురాణ చరిత్ర ఉంది. పెద్ద పండగ నాడు మొదలై... ముక్కనుమ, ఆ తరువాత రోజు వరకు కోనసీమ నలుమూలల సుమారు 90 వరకు ప్రభల తీర్థాలు జరుగుతాయి. వీటిని చూసేందుకు స్థానికులు.. జిల్లా వాసులే కాదు.. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తుల తరలివస్తారు. ఇక్కడ జరిగే ప్రభల తీర్థాలు రాజులు.. బ్రిటిష్ పాలనల్లో సైతం నిరాటంకంగా కొనసాగాయి. అయితే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కారణంగా ఈసారి ఆంక్షల నడుమ ప్రభల తీర్థాలు జరగనున్నాయి. చదవండి: పలకరింపే పులకరింపైతే.. ప్రతిరోజూ పండగే ఏకాదశ రుద్రుల కొలువు అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట తీర్థానికి ఐదు శతాబ్ధాల చరిత్ర ఉంది. నాలుగు గ్రామాల శివారులోని ఒక కొబ్బరితోటలో సాగుతుంది. కనుమపండగ నాడు జరిగే తీర్థంలో మొసలపల్లి భోగేశ్వరస్వామి, గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నకేశవ మల్లేశ్వరస్వామి, వ్యాఘ్రేశ్వరం వ్యాఘ్రేశ్వరస్వామి, కె.పెదపూడి మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనందరామేశ్వరస్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వరస్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామిలు జగ్గన్నతోటలో సమావేశమై లోక కల్యాణార్థం చర్చలు జరుపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా జరిగే సమావేశానికి వ్యాఘ్రేశ్వరస్వామి అధ్యక్షతవహిస్తారు. స్వామివారి ప్రభ తీర్థానికి వచ్చే సమయంలో మిగిలిన ప్రభలను గౌరవ సూచకంగా ఒకసారి పైకెత్తి దింపుతారు. గంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రు ప్రభలు జగ్గన్నతోటను ఆనుకుని ఉండే పెద్ద కౌశికను దాటుకు వచ్చేతీరు ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తుంది. ఇదే మండలం వాకలగరువు, తొండవరం గ్రామంలో ఏటా ఒకరికొకరు పోటీ పడుతూ 42 అడుగులకు పైబడి ఎత్తులో ప్రభలు నిర్మిస్తారు. -
అంగరంగ వైభవంగా ప్రభల తీర్థం
అమలాపురం/ అంబాజీపేట(పి.గన్నవరం): కోనసీమలో ప్రభల తీర్థాలతో సంక్రాంతి, కనుమ పండుగల నాడు ఆధ్యాత్మిక పరవళ్లు తొక్కింది. చిన్న పెద్దా అనే తేడా లేకుండా సీమలో పలు ప్రాంతాల్లో ప్రభల తీర్థాలు నభూతో...అన్నట్టుగా సాగాయి. ముఖ్యంగా కనుమ పండగ నాడు పచ్చని సీమలో రంగురంగులు హద్దుకున్న ప్రభలు కొలువుదీరాయి. ఊరేగింపుగా వెళుతూ వీధులు.. చేలు.. తోటలను పుణీతం చేశాయి. ఈ గ్రామం తిరునాళ్లు చూసినా ఇసుక వేస్తే రాలని జనంతో కిటకిటలాడాయి. సముద్ర ఘోషను తలపించేలా వేలాది మంది భక్తుల ఓంకార నాదాలు..వందల మంది భక్తులు తమ భుజస్కాందాలపై ప్రభులను మోస్తూ ముందుకు సాగారు. బాణా సంచా కాల్పులు.. ప్రభలకు వేలాడదీసిన జేగంటల శబ్దాలతో కోనసీమ వ్యాప్తంగా ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లాయి. కోనసీమలో ఈ తీర్థాలు నాలుగు రోజులపాటు సాగుతాయి. కొత్తపేట తీర్థం బుధవారం జరగగా, గురువారం కనుమ పండుగ రోజున అంబాజీపేట మండలం జగ్గన్నతోట, వాకలగరువు, మామిడికుదురు మండలం కొర్లగుంటతోపాటు సుమారు 60కు పైగా తీర్థాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా కొత్త ప్రాంతాల్లో కూడా ప్రభల తీర్థలు జరిగాయి. తీర్థాలకు కొత్త ప్రభలు కూడా తరలివచ్చాయి. చారిత్రాత్మక ప్రధాన్యత ఉన్న అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట ప్రభల తీర్థం వేడుకలు ఆకాశమే హద్దుగా అన్నట్టుగా జరిగాయి. తీర్థానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. వివిధ రాష్ట్రాలకు చెందినవారు..ఎన్ఆర్ఐలు తీర్థానికి కుటుంబాలతో కలిసి వచ్చారు. సంప్రదాయ వస్త్రధారణలతో యువతులు ప్రభల అందాలతో పోటీ పడ్డారు. వృద్ధులు, యువకులు, మహిళలు అనే తేడా లేకుండా తీర్థానికి వచ్చి సందడి చేశారు. ప్రభల ఊరేగింపు సంప్రదాయ పద్ధతిలో సాగింది. రంగురంగు ప్రభలు ఒకచోట కొలువుదీరిన అందమైన దృశ్యాన్ని తిలకించి భక్తులు పులకరించిపోయారు. తీర్థానికి వ్యాఘ్రేశ్వరం నుంచి వచ్చిన వ్యాఘ్రేశ్వరరావు స్వామి ప్రభ వచ్చినప్పుడు మిగిలిన ప్రభలను గౌరవ సూచకంగా ఒకసారి పైకెత్తి లేపారు. గంగలకుర్రు అగ్రహారం శ్రీ ఉమా పార్వతి సమేత వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నకేశవ మల్లేశ్వరస్వామి ప్రభలు అప్పర కౌశిక దాటుకుని వచ్చే దృశ్యాన్ని వేలాది మంది భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. తీర్థానికి పెద్దవి 11 ప్రభలు కాగా, వాటితోపాటు చిన్నచిన్న ప్రభలు మరో ఎనిమిది వరకు వచ్చాయి. ఉదయం 11 గంటలకు తీర్థానికి ప్రభల రాక ఆరంభమైంది. మధ్యాహ్నం 12.30 గంటలకు గంగలకుర్రు, 1.00 గంట సమయంలో గంగలకుర్రు అగ్రహారం ప్రభులు కౌశిక దాటి వచ్చాయి. కేరళ డప్పు వాయిద్యాలు, మేళ తాళాలు, బాణాసంచా కాల్పులతో గంగలకుర్రు ప్రభ ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. భక్తుల దర్శనానికి కొద్దిసేపు ఉంచి తరువాత వెనకకు తీసుకుని వెళ్లారు. ఎప్పటిలానే సంప్రదాయబద్ధంగా పలు కుటుంబాల వారు గూడు ఎడ్లబండ్లపై తీర్థానికి రావడం పలువురిని ఆకట్టుకుంది. ఆ ప్రభ ఎత్తు 54 అడుగులు: అంబాజీపేట మండలం వాకలగరువులో జరిగే ప్రభల తీర్థం మొత్తం కోనసీమలో జరిగే తీర్థాల్లో హైలెట్గా నిలిచింది. కోనసీమలో ఎక్కడా లేని విధంగా వాకలగరువుకు చెందిన శ్రీ ఉమా సర్వేశ్వరస్వామి ప్రభను భక్తులు 54 అడుగుల ఎత్తున తయారు చేశారు. గత ఏడాది 48 అడుగులు ఉన్న ప్రభను ఈసారి ఏకంగా ఆరు అడుగులు పెంచారు. అదే విధంగా తీర్థానికి వచ్చే తొండవరం ఉమా తొండేశ్వరస్వామి 48 అడుగులు ఎత్తున ఏర్పాటు చేశారు. గత ఏడాది ఇది 46 అడుగులు మాత్రమే. ఈ రెండు ప్రభలు వాకగరువు రావిచెట్టు సెంటరు వద్ద ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున భక్తులు తిలకించారు. ఇదే మండలం చిరతపూడి చిట్టి చెరువు గట్టు వద్ద కూడా ప్రభల తీర్థం జరిగింది. పి.గన్నవరం మండలం గాజులుగుంట, నాగుల్లంక, ఉడిమూడిలోను, వాడ్రేవుపల్లి, కొత్తపేటలో మందపల్లి, అవిడి డ్యామ్ సెంటరు, వాడపాలెం, రావులపాలెం మండలం దేవరపల్లిలో గురువారం ప్రభల తీర్థాలు జరిగాయి. మామిడికుదురు మండలం కొర్లగుంటలో జరిగిన తీర్థంలో 12 ప్రభలు కొలువుదీరాయి. ఇక్కడకు సైతం ప్రభలు పంటచేలు, కాలువులు దాటుకుని వచ్చాయి. అమలాపురం మండలం సాకుర్రు గరువు, బండారులంక, అమలాపురం పట్టణంలో గనికమ్మగుడి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, రాజోలు నియోజకవర్గ పరిధిలో మలికిపురం మండలం కేశనపల్లి, తూర్పుపాలెం, రాజోలు పొదలాడ, ముమ్మిడివరం మండలం పల్లిపాలెం, క్రాప చింతలపూడి, చెయ్యేరు, ఐ.పోలవరం శివారు పెదమడి, ఐ.పోలవరం మండలం గుత్తెనదీవిలల్లో ప్రభలు తీర్థాలు అంగరంగ వైభవంగా సాగాయి. -
కోనసీమలో అంగరంగ వైభవంగా ప్రభల తీర్థం
-
జగ్గన్నతోటలో కొలువు దీరనున్న ఏకరుద్రులు
సాక్షి, కాకినాడ: కోనసీమలో ప్రభల తీర్థం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కనుమ పండగను పురస్కరించుకుని అంబాజీపేట మండలం మొసలిపల్లి శివారు జగ్గన్నతోటలో గురువారం ఏకాదశరుద్రులు కొలువుదీరనున్నారు. ఈ మేరకు పదకొండు గ్రామాల నుంచి ప్రభలు జగ్గన్న తోటకు ఊరేగింపుగా బయలు దేరాయి. ఏకాదశ రుద్రులను చూసేందుకు జనం వేలాదిగా తరలి వస్తున్నారు. కాగా ప్రతియేటా సంక్రాంతి సందర్భంగా కోనసీమలోని జగ్గన్నతోట తదితర ప్రాంతాల్లో ఈ ప్రభల తీర్థాన్ని ఘనంగా నిర్వహిస్తారు. కనుమ నాడు జగ్గన్న తోటలో ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్థం కోసం చర్చిస్తారని ప్రతీతి. సుమారు నాలుగు వందల సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. చదవండి: ప్రభల తీర్థాన్ని తిలకించేందుకు పోటెత్తిన జనం జగ్గన్నతోట ప్రభల తీర్థంపై స్పెషల్ స్టోరీ -
ప్రభల తీర్థాన్ని తిలకించేందుకు పోటెత్తిన జనం
సాక్షి, కాకినాడ: కొత్తపేట ప్రభల తీర్థం అంగరంగ వైభవంగా జరుగుతోంది. రెండురోజులపాటు ఈ వేడకలు జరగనున్నాయి. బుధవారం కొత్తపేటలో ఏకరుద్రులు ఒకేచోట కొలువయ్యాయి. 12 ప్రభలు కొత్తపేట పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం స్థానిక హైస్కూల్ మైదానంకు ప్రభలు చేరుకోగా అక్కడ పెద్ద ఎత్తున బాణసంచాలు పేల్చారు. టపాసుల పేలుళ్లతో కొత్తపేట హోరెత్తిపోయింది. ప్రభల తీర్థాన్ని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది జనాలు తరలిరావటంతో కొత్తపేట వీధులన్నీ కిక్కిరిసిరపోయాయి. కాగా కోనసీమలో అనాదిగా వస్తున్న సంప్రదాయమే ప్రభల తీర్థం. 17వ శతాబ్ధం నుంచి ప్రభల తీర్థం నిర్వహించబడుతుందని చారిత్రాత్మక కథనం. చదవండి: జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని కనుమా! -
కొత్తపేటలో ఘనంగా ప్రభల తీర్థం
-
జగ్గన్నతోటలో వైభవంగా ప్రభలతీర్ధం
అంబాజీ పేట (తూర్పు గోదావరి జిల్లా) : అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో ప్రభలతీర్ధం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. తోటలో కొలువుదీరిన ఏకదశ రుద్రులను దర్శించుకోవడానికి భక్తులు సుదూర ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.