prathusha
-
ప్రత్యూష.. పాసా? ఫెయిలా..!
- పాసైయిందంటున్న డేనియల్ కళాశాల యాజమాన్యం - ప్రాక్టికల్స్ మార్కులు లేక ఫెయిల్ లిస్ట్లో చేర్చిన ఇంటర్బోర్డు హైదరాబాద్: సొంత తండ్రి, సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష(పావని) గుర్తుంది కదండీ!. మీడియా, ఎన్జీఓలు, కోర్టుతో పాటు సీఎం కేసీఆర్ చొరవతో పునర్జన్మ పొందిన ప్రత్యూషను అయోమయం చుట్టుముట్టింది. ఈ ఏడాది ఇంటర్ వొకేషనల్ కోర్సు పూర్తి చేసి బిఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరాలన్న ప్రత్యూష కోరికపై అయోమయం నెలకొంది. శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమె అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులతో పాసైనప్పటికి, ఆమెకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించిన సెయింట్డేనియల్ వొకేషనల్ కళాశాల ఆ వివరాలను సకాలంలో ఇంటర్బోర్డుకు పంపలేదు. ఈ క్రమంలో ఇంటర్ ఫలితాల్లో ప్రత్యూష హాల్ టికెట్ నెంబర్ కొట్టి ఫలితాలు చూడగా ఫెయిలైనట్లు వచ్చింది. ఈ విషయమై ప్రత్యూషను సాక్షి ప్రతినిధి ఫోన్లో సంప్రదించగా, తాను ప్రాక్టికల్స్తో పాటు, అన్ని పరీక్షలు బాగా రాశానని తెలిపింది. ఈ విషయమై డేనియల్ కళాశాల ప్రతినిధి విజయను ప్రశిస్తే.. ప్రత్యూషకు రెండు హాల్ టికెట్ నెంబర్లున్నాయని, ప్రాక్టికల్స్ తమ వద్ద, రాత పరీక్షలు నారాయణ కళాశాలలో రాసిందని పేర్కొన్నారు. తమ వద్ద నిర్వహించిన ప్రాక్టికల్స్లో పాసైందని, ఈ మార్కుల వివరాలు ఇంటర్ బోర్డుకు అందజేస్తామని ఆమె చెప్పారు. -
అధైర్యపడొద్దు... అండగా ఉంటా
-
అధైర్యపడొద్దు... అండగా ఉంటా
* సవతితల్లి చిత్రహింసల్లో గాయపడ్డ ప్రత్యూషకు సీఎం హామీ * భార్య, కూతురుతో కలసి ఆసుపత్రిలో పరామర్శ * హాస్టల్ వసతి కల్పిస్తా, బాగా చదువుకో.. సెలవుల్లో మా ఇంటికి రా.. * ఇల్లు కట్టించి నా సొంత ఖర్చులతో పెళ్లి జరిపిస్తా: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘ఎవరూ లేరని బాధపడొద్దు. జరిగిన దానిని పీడ కలలా మర్చిపో. నీకు నేనున్నాను. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక నా ఇంటికి రా. నీకు మంచి హాస్టల్లో వసతి కల్పించి చదువు చెప్పిస్తా. సెలవుల్లో వచ్చి మా ఇంట్లోనే ఉండు. నీకు నా కూతురు (నిజామాబాద్ ఎంపీ కవిత) తోడుగా ఉంటుంది. సొంత బిడ్డలా చూసుకుంటా. ఎంత ఖర్చయినా నీ ఆరోగ్యం బాగయ్యే వరకు ప్రభుత్వమే చూసుకుంటుంది. భవిష్యత్తులో నీ చదువుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. నీకు ఇల్లు కట్టించి ఇస్తా. మంచి అబ్బాయిని చూసి నా సొంత ఖర్చులతో నీ పెళ్లి జరిపిస్తా’ అంటూ ప్రత్యూషకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు భరోసా ఇచ్చారు. ఆస్తి కోసం కన్నతండ్రి రమేశ్, సవతి తల్లి చాముండేశ్వరి పెట్టిన చిత్రహింసల్లో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం హైదరాబాద్ సరూర్నగర్లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను కేసీఆర్ శనివారం సాయంత్రం కుటుంబ సమేతంగా పరామర్శించారు. భార్య శోభారాణి, కూతురు కవితతో కలసి ఆసుపత్రికి చేరుకున్న కేసీఆర్...ప్రత్యూషతో మాట్లాడారు. ‘జీవితంలో కష్టాలు వస్తాయి. వాటిని ఎదుర్కొని నిలబడాలి. జీవితం ఇంకా చాలా వుంది. కొత్త జీవితం ప్రారంభించి నిలదొక్కుకోవాలి. బాగా చదివి పైకిరావాలి. రేపు నీలాగా ఇంకా ఎవరికైనా కష్టం వస్తే ఆదుకునే పరిస్థితిలో నువ్వుండాలి. నీకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నాడనే ధైర్యంతో ఉండు. నీకు పోలీసు కాపలా పెట్టిస్తా. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా నిన్ను చూసుకుంటడు’ అంటూ ప్రత్యూషకు కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రత్యూషకు పండ్ల బుట్టతోపాటు చేతి ఖర్చుల కోసం కొంత నగదు కూడా అందించారు. వాళ్లను బయటకు రానీయొద్దు: ప్రత్యూష ఇంకా ఏమైనా చెప్పదల్చుకున్నావా అని సీఎం అడగ్గా భావోద్వేగానికి గురైన ప్రత్యూష...తనను ఈ స్థితికి తెచ్చిన సవతి తల్లి, తండ్రిని జైల్లోంచి బయటకు రానీయొద్దని కేసీఆర్ను వేడుకుంది. ‘వాళ్లిద్దరూ కొడుతున్నట్లు ఇంకా కలలు వస్తూనే ఉన్నాయి. వారంటేనే భయమేస్తోంది’ అని ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి కేసీఆర్ స్పందిస్తూ ‘ఇకపై నీకేమీ కాదు. అన్నింటికీ నేనున్నా’ అని భరోసా ఇచ్చారు. ప్రత్యూషను చిత్ర హింసలు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. డిశ్చార్జి అయ్యాక ఇంటికి తీసుకెళ్తా... ప్రత్యూషను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశాక తన ఇంటికి తీసుకెళ్తానని కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రకటించారు. ఆసుపత్రి నిర్వాహకులు రవీంద్రనాథ్తోపాటు ప్రత్యూషకు వైద్యం అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడిన సీఎం ఆమె ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ప్రమాదకర పరిస్థితి నుంచి బయట పడినా ఇంకా నీరసంగానే ఉందని వైద్యులు ఈ సందర్భంగా కేసీఆర్కు వివరించగా మరో వారంపాటు చికిత్స అందించి పూర్తిగా కోలుకున్నాకే డిశ్చార్జి చేయాలని వైద్యులకు సూచించారు. ప్రత్యూష ఆరోగ్యం, భద్రత వ్యవహారాలను చూడాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్రావు, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ను సీఎం ఆదేశించారు. ఇంట్లో భయంకర పరిస్థితులు ఉండటం వల్ల ప్రత్యూష చదువుకోలేక పోయిందని...ఆమె కోరిక మేరకు బీఎస్సీ నర్సింగ్ చదివిస్తానని సీఎం హామీ ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని ఆశీర్వదించారు. సీఎం వెంట ఆస్పత్రికి వెళ్లిన వారిలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ సుమన్ , జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్, పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు ఉన్నారు. -
ప్రత్యూష పెదనాన్నను కోర్టులో హాజరుపరచండి
హైదరాబాద్ : సవతి తల్లి, కన్నతండ్రి చేతుల్లో తీవ్ర హింసకు గురైన ప్రత్యూష కేసుకు సంబంధించిన నివేదికను పోలీసులు గురువారం హైకోర్టుకు సమర్పించారు. ప్రస్తుతం ప్రత్యూష కోలుకుంటుందని, ఆమె శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితి మెరుగు పడిందని, పరారైన తండ్రి రమేష్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. కాగా ఈ కేసులో సరైన సమయంలో స్పందించిన ఎల్బీనగర్ పోలీసులు, వైద్యం అందించిన గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యాన్ని హైకోర్టు ఈ సందర్భంగా అభినందించింది. అలాగే ప్రత్యూష ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎక్కడుంటుందో తెలుసుకోవాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల్లో ఉండేందుకు ప్రత్యూష అంగీకరిస్తే సదుపాయాలు కల్పిస్తామని హైకోర్టు తెలిపింది. ఆమెతో మాట్లాడి నివేదిక సమర్పించాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది. అలాగే ప్రత్యూష పెదనాన్నను శుక్రవారం కోర్టులో హాజరు పరచాలని కోర్టు సూచించింది. మరోవైపు ప్రత్యూష తండ్రి రమేష్ ను గతరాత్రి ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి ఇవాళ కోర్టులో హాజరు పరిచిన విషయం తెలిసిందే. -
కోలుకుంటున్న ప్రత్యూష
బాగా చదువుకుని నర్సు కావాలని ఉంది బంధువుల ఇంటికి మాత్రం వెళ్లను ఎవరైనా సాయమందించాలని ప్రత్యూష విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష క్రమంగా కోలుకుంటోంది. గత వారం రోజుల నుంచి హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను బుధవారం జనరల్ వార్డుకు తరలించారు. ఎల్బీనగర్ సీఐ శ్రీనివాస్రెడ్డి ఆమె ఆరోగ్యపరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కాగా, తను ఇప్పటికే నర్సింగ్ పూర్తి చేశానని, నర్సు కావాలని ఉందని, ఎవరైనా సాయమందిస్తే ఉన్నత చదువులు చదువుకుంటానని ప్రత్యూష పేర్కొంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక బంధువుల ఇంటికి వెళ్లనని, స్టేట్హోంలో ఉంటానంది. బతికి బయటపడతాననుకోలేదు.. తన పిన్ని వేధింపులకు గురిచేసిన వైనాన్ని ప్రత్యూష ‘సాక్షి’కి వివరించింది. ఆమె చేతిలో నుంచి బతికి బయటపడతాననుకోలేదని ఆమె పేర్కొంది. ‘2010లో అమ్మ చనిపోయినప్పటి నుంచి స్టేట్హోంలో ఉంటూ పదోతరగతి, వొకేషనల్ పూర్తి చేశాను. ఆ తర్వాత నాన్న వచ్చి బలవంతంగా ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ మా పిన్ని ప్రతి రోజూ చిత్రహింసలు పెట్టేది. రోజూ కళ్లు, నోటిలో ఫినాయిల్, యాసిడ్, హిట్, ఉప్పు కుక్కేది. మింగకపోతే ఇనుప రాడ్లతో కొట్టేది’ అని వాపోయింది. తనకు మతిస్థిమితం లేదని ముద్ర వేసి వేధించేదని చెప్పింది. బంధువులు వస్తే తనను గదిలో బంధించి కాలేజీకి వెళ్లిందని చెప్పేదని పేర్కొంది. ఒకట్రెండు సార్లు తప్పిం చుకునే ప్రయత్నం చేస్తే ఎవరో ఒకరు తీసుకెళ్లి ఇంట్లో అప్పగించేవారని, దీంతో తన పిన్ని మరింత చిత్రహింసలకు గురిచేసేదని చెప్పింది. -
ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడంలేదు: ప్రత్యూష
-
ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడంలేదు: ప్రత్యూష
హైదరాబాద్ : ఎల్బీనగర్లో సవతి తల్లి వేధింపులతో తీవ్రగాయాలపాలైన ప్రత్యూష(16) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తాను ఎక్కడికి వెళ్లాలో తేల్చుకోలేని ఆయోమయ పరిస్థితిలో ఉంది. నగరంలోని సాగర్ ప్రధాన రహదారిలో ఉన్న అవేర్ గ్లోబల్ ఆప్పత్రిలో చికిత్స పొందుతున్న ప్ర్యత్యూష కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. తనకు పునరావాసం కల్పించి చదువుకోవడానికి అవకాశం కల్పించాలని బాధితురాలు ప్రత్యూష కోరుతోంది. తనను అంతం చేయడానికి పిన్ని, తండ్రి కుట్రపన్నారని ఆరోపించింది. తనను చూసేందుకు ఇప్పటి వరకు ఏ ఒక్కరూ రాలేదని ప్రత్యూష బాధపడుతోంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు తనకు ఇష్టం లేదని అంటోంది. న్యాయమూర్తి జస్టిస్ కోదండరాం మీడియా కథనాలపై స్పందించి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబా సాహెబ్ బోసాలేకు లేఖ రాయడంతో రెండు రోజుల క్రితమే ప్రత్యూష కేసును సుమోటోగా హైకోర్టు స్వీకరించిన విషయం విదితమే. కాసేపట్లో ప్రత్యూష కేసు హైకోర్టులో విచారణకు రానుంది.