prime minister of Pakistan
-
Pakistan General Elections 2024: పాక్ ప్రధానిగా షహబాజ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పీఎంఎల్–ఎన్ నేత షెహబాజ్ షరీఫ్(72) ఎన్నికయ్యారు. నూతన ప్రధానిని ఎన్నుకోవడానికి పాకిస్తాన్ పార్లమెంట్లో ఆదివారం ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 336 ఓట్లకు గాను çషహబాజ్ షరీఫ్కు 201 ఓట్లు లభించాయి. ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ అభ్యర్థి ఒమర్ అయూబ్ ఖాన్కు కేవలం 92 ఓట్లు దక్కాయి. షెహబాజ్ షరీఫ్కు సాధారణ మెజార్టీ కంటే 32 ఓట్లు అధికంగా లభించడం విశేషం. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పారీ్ట(పీపీపీ) సంకీర్ణ ప్రభుత్వానికి ఆయన నాయకత్వం వహించబోతున్నారు. పీఎంఎల్–ఎన్, పీపీపీ కూటమికి ముత్తహిదా ఖ్వామీ మూవ్మెంట్, పాకిస్తాన్ ముస్లిం లీగ్(క్యూ), బలూచిస్తాన్ అవామీ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్(జెడ్), ఇస్తెఖామ్–ఇ–పాకిస్తాన్ పార్టీ, నేషనల్ పార్టీ మద్దతిస్తున్నాయి. షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ 24వ ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు పార్లమెంట్ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్ ప్రకటించారు. షహబాజ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన 2022 ఏప్రిల్ నుంచి 2023 ఆగస్టు వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఓటింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులైన కొందరు ఎంపీలు సభలో అలజడి సృష్టించారు. అనంతరం షహబాజ్ మాట్లాడుతూ కశ్మీర్పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. కశ్మీరీల, పాలస్తీనియన్ల స్వాతంత్య్రం కోసం ఒక్కటి కావాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. వారి స్వేచ్ఛను కోరుతూ పార్లమెంట్లో తీర్మానం చేయాలన్నారు. -
పార్లమెంట్ విశ్వాసం పొందిన పాక్ పీఎం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం పార్లమెంట్లోని దిగువసభ నేషనల్ అసెంబ్లీ విశ్వాసం పొందారు. మొత్తం 342 మంది సభ్యులకుగాను 180 మంది షరీఫ్ నాయకత్వంపై విశ్వాసం ప్రకటించారు. షరీఫ్ ప్రభుత్వం, న్యాయ వ్యవస్థకు మధ్య ఇటీవలి కాలంలో ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న సమయంలో ఈ పరిణామం సంభవించింది. గత ఏడాది అధికారంలోకి వచ్చిన సమయంలో షరీఫ్కు 174 మంది సభ్యులు మాత్రమే మద్దతు తెలపడం గమనార్హం. పంజాబ్, ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్స్ అసెంబ్లీలకు ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ)కి అవసరమైన నిధుల కేటాయింపునకు సంబంధించిన బిల్లును నేషనల్ అసెంబ్లీ ఇటీవల తిరస్కరించిన నేపథ్యంలో షరీఫ్ ప్రభుత్వం బలనిరూపణకు సిద్ధమయింది. వెంటనే పార్లమెంట్ ఎన్నికలు జరపాలంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐ పార్టీ గట్టిగా పట్టుబడుతోంది. -
పాక్ పీఠం షాబాజ్కు! ఇమ్రాన్ ఖాన్ ఏమంటున్నారు?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజకీయాలు మరిన్ని మలుపులు తిరుగుతున్నాయి. ప్రధానిగా పీఎంఎల్ (ఎన్) అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ (70) ఎన్నికకు రంగం సిద్ధమైంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన, తాజా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ తరఫున షా మహ్మద్ ఖురేషీ ఆదివారం నామినేషన్లు వేశారు. అయితే పలు కేసులున్న షాబాజ్ నామినేషన్ను తిరస్కరించాలన్న పీటీఐ డిమాండ్ను సభాపతి తోసిపుచ్చారు. దాంతో సోమవారం తమ ఎంపీలంతా రాజీనామా చేస్తారని పీటీఐ సీనియర్ నేత బాబర్ అవాన్ ప్రకటించారు. ఇమ్రాన్ నివాసంలో జరిగిన పీటీఐ కోర్ కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకు చెప్పారు. ప్రధానిగా షాబాజ్ను అంగీకరించేది లేదని ఇమ్రాన్ తేల్చి చెప్పారు. కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటానికి తెర తీస్తామన్నారు. దేశం కోసం మరో స్వాతంత్య్ర పోరాటం నేటి నుంచి మొదలవుతుందంటూ ట్వీట్ చేశారు. ‘‘కొత్తగా కొలువుదీరేది విదేశీ ప్రభుత్వమే. ఈ పరిణామాన్ని వ్యతిరేకిస్తూ వీధుల్లోకొచ్చి నిరసన తెలపండి’’ అని పీటీఐ కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధానిని ఎన్నుకునేందుకు జాతీయ అసెంబ్లీ సోమవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశం కానుంది. 342 మంది సభ్యులున్న సభలో ప్రధానిగా ఎన్నికవాలంటే 172 మంది మద్దతు అవసరం. ప్రస్తుత సభ కాల పరిమితి 2023 ఆగస్టుతో ముగియనుంది. షాబాజ్కు సవాలే పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడైన షాబాజ్ మూడుసార్లు పంజాబ్ ప్రావిన్స్ సీఎంగా కూడా పని చేశారు. మనీ లాండరింగ్ కేసుల్లో షాబాజ్, ఆయన కుమారుడు హంజా 2019లో అరెస్టయ్యారు. పీఠమెక్కాక కలగూర గంపలాంటి విపక్షాలను ఏడాదికి పైగా ఒక్కతాటిపై నడపడం ఆయనకు సవాలేనంటున్నారు. ఇమ్రాన్ను అరెస్టు చేస్తారన్న వార్తల నేపథ్యంలో, ‘‘ప్రతీకార రాజకీయాలుండబోవు. అయితే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’ అంటూ షాబాజ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్, మాజీ మంత్రులు తదితరులు దేశం విడిచి పోకుండా ఆదేశించాలంటూ ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉన్నతాధికారులెవరూ దేశం వదలొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. -
అధ్యక్షుడు అరీఫ్ తొలగింపు..
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ గద్దె దిగిపోవడానికి సమయం దగ్గరకొస్తోంది. సుప్రీం కోర్టు నిర్ణయంతో శనివారం ఉదయం 10 గంటలకు పార్లమెంటులోని దిగువ సభ జాతీయ అసెంబ్లీలో ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. సభలో మెజార్టీ లేకపోయినప్పటికీ ఆఖరి బాల్ వరకు పోరాడుతానంటూ ఇమ్రాన్ ఇంకా మేకపోతు గాంభీర్యాన్నే ప్రదర్శిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్లో ప్రతిపక్షాలు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. విపక్షాలన్నీ చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చాయి. అవిశ్వాస తీర్మానం నెగ్గలేక ఇమ్రాన్ గద్దె దిగిపోతే అధ్యక్షుడు అరిఫ్ అల్వీని తొలగించడానికి ప్రణాళికలు రూపొందించాయి. అదే విధంగా యూకేలో ప్రవాసానికి వెళ్లిపోయిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ని తిరిగి పాక్కి తేవాలని భావిస్తున్నాయి. పాకిస్తాన్ ముస్లింమ్ లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) అధ్యక్షుడు, జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు షెబాజ్ షరీఫ్ (70) కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రమాణ స్వీకారమయ్యాక ఆయన ప్రభుత్వ ప్రాధాన్యాల గురించి వెల్లడించే అవకాశాలున్నాయని ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ ఒక నివేదికలో వెల్లడించింది. మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్కు వ్యతిరేకంగా విపక్షాల అవిశ్వాస తీర్మానం వెనుక విదేశీ కుట్ర దాగి ఉందన్న ఆరోపణలపై విచారణ జరపడానికి ప్రభుత్వం. రిటైర్డ్ లెఫ్ట్నెంట్ జనరల్ తారిక్ ఖాన్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఇమ్రాన్ఖాన్ నేతృత్వంలో శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీధుల్లో నిరసన తెలపండి: ఇమ్రాన్ పాకిస్తాన్లో ‘దిగుమతి అయిన ప్రభుత్వాన్ని’ ఎంతమాత్రం అంగీకరించబోనని ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం తేల్చిచెప్పారు. తనపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విదేశాల నుంచి వచ్చిన ‘బెదిరింపు లేఖ’ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. శనివారం అవిశ్వాస పరీక్ష ఎదుర్కోబోతున్న ఇమ్రాన్ పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆదివారం సాయంత్రం తనతో కలిసి వీధుల్లో నిరసన తెలపాలని మద్దతుదారులకు సూచించారు. దీన్నిబట్టి పదవి నుంచి దిగిపోక తప్పదన్న నిర్ణయానికి ఆయన వచ్చి నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి, పదవి నుంచి తప్పుకున్న తొలి పాక్ ప్రధానిగా చరిత్రకెక్కుతారు. -
ఇమ్రాన్ యార్కర్..: పాక్లో రాజకీయ సంక్షోభం...
నెల రోజులుగా పదవీ గండం ఎందుర్కొంటున్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (69) కీలక సమయంలో తనలోని కెప్టెన్ను పూర్తిస్థాయిలో బయటికి తీశారు. అవిశ్వాస తీర్మానంపై డిప్యూటీ స్పీకర్తో పదునైన యార్కర్ వేయించారు. ఆ తీర్మానం చెల్లదనే నిర్ణయంతో విపక్షాలను డిప్యూటీ స్పీకర్ క్లీన్బౌల్డ్ చేయగానే జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసి ఇన్నింగ్స్ను ముందుగానే డిక్లేర్ చేసేశారు. అందుకు అధ్యక్షుడు ఆమోదముద్ర వేయడంతో దేశంలో ముందస్తు ఎన్నికల నగారా మోగింది. ఇదంతా రాజ్యాంగ విరుద్ధమంటూ విపక్షాలు మండిపడ్డాయి. ఇమ్రాన్ యార్కర్ను నో బాల్గా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరగబోయే విచారణపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ఇస్లామాబాద్: పాకిస్థాన్లో రాజకీయ సంక్షోభం కీలక మలుపు తిరిగింది. ఇమ్రాన్ఖాన్పై విపక్షాలిచ్చిన అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకునేందుకు ఆదివారం జరిగిన జాతీయ అసెంబ్లీ కీలక సమావేశం అనూహ్య పరిణామాలకు వేదికైంది. డజనుకు పైగా అధికార పార్టీ సభ్యులు కూడా తీర్మానానికి మద్దతివ్వడంతో ఇప్పటికే మైనారిటీలో పడిన ఇమ్రాన్ ప్రభుత్వం బలపరీక్షలో ఓడటం లాంఛనమేనని అంతా భావించారు. స్పీకర్ అసద్ ఖైజర్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించవచ్చన్న అనుమానంతో సమావేశం మొదలవగానే విపక్షాలు ఆయనపై అవిశ్వాస నోటీసు కూడా ఇచ్చాయి. దాంతో సమావేశానికి అధ్యక్షత వహించిన డిప్యూటీ స్పీకర్ ఖాసిం ఖాన్ సూరి, తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించి విపక్షాలకు ఊహించని షాకిచ్చారు. ‘‘తీర్మానం దేశ రాజ్యాంగానికి, నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. కానీ అదలా లేదని న్యాయ మంత్రి స్పష్టంగా చెప్పారు. అది విదేశీ కుట్రలో భాగంగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. అందుకే తీర్మానాన్ని తిరస్కరిస్తున్నా’’ అని ప్రకటించారు. ఆ వెంటనే సభను వాయిదా వేశారు. దీనిపై విపక్షాలన్నీ భగ్గుమన్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ దుయ్యబట్టాయి. నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేదాకా సభను వీడేది లేదన్నాయి. సభలో గలాభా జరుగుతండగానే ఇమ్రాన్ హుటాహుటిన అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీని కలిసి జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయడం, అందుకు ఆయన ఆమోదముద్ర వేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇమ్రాన్ ఇచ్చిన వరుస షాకులతో నోరెళ్లబెట్టడం విపక్షాల వంతైంది. పాక్ చరిత్రలో ఇప్పటిదాకా ఏ ప్రధానీ పూర్తికాలం పాటు పదవిలో కొనసాగలేదు. షెడ్యూల్ ప్రకారం పాక్లో 2023 ఆగస్టులో ఎన్ని కలు జరగాల్సి ఉంది. ఇమ్రాన్ 2018 ఆగస్టు 18న దేశ 22వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. విదేశీ కుట్ర భగ్నం: ఇమ్రాన్ జాతీయ అసెంబ్లీ రద్దు సిఫార్సు అనంతరం ఇమ్రాన్ జాతిని ఉద్దేశించి క్లుప్తంగా ప్రసంగించారు. అవిశ్వాస తీర్మానం ముసుగులో ప్రభుత్వాన్ని మార్చేందుకు జరిగిన విదేశీ కుట్రను విజయవంతంగా అడ్డుకున్నట్టు ప్రకటించారు. దేశ భవితవ్యాన్ని అవినీతి శక్తులు నిర్ణయించలేవన్నారు. ఎన్నికలకు సిద్ధమవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అవిశ్వాస తీర్మానం నిజానికి విదేశీ కుట్రలో భాగమని అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ ఆరోపించారు. తీర్మానం నెగ్గి ప్రభుత్వం పడిపోగానే ఇమ్రాన్ను అరెస్టు చేయడానికి కుట్ర జరిగిందన్నారు. దాన్ని భగ్నం చేశామని, 90 రోజుల్లోపు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ఇమ్రాన్ 15 రోజుల పాటు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారన్నారు. ఈ పరిణామాలతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని సైన్యం అధికార ప్రతినిధి బాబర్ ఇఫ్తికర్ ప్రకటించారు. అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్కు సుప్రీం నోటీసులు జాతీయ అసెంబ్లీ రద్దును విపక్షాలన్నీ తీవ్రంగా ఖండించాయి. ఇమ్రాన్ను దేశద్రోహి అంటూ విపక్ష నేతలు షాబాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో జర్దారీ, మరియం ఔరంగజేబ్ తదితరులు దుమ్మెత్తిపోశారు. పిరికి నిర్ణయాల ద్వారా తన తప్పిదాలను పరోక్షంగా అంగీకరించారని దుయ్యబట్టారు. డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ విపక్షాలు సుప్రీంకోర్టులో సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశాయి. అత్యవసరంగా విచారణకు స్వీకరించి తక్షనం తీర్పు వెల్లడించాలని కోరాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అసాధారణ రీతిలో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైంది. మొత్తం ఉదంతంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బందియాల్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. జాతీయ అసెంబ్లీ రద్దు విషయంలో అధ్యక్షుడు, ప్రధాని తీసుకున్న నిర్ణయాలు తమ తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్ తదితరులకు నోటీసులు జారీ చేసి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈలోపు ఎలాంటి రాజ్యాంగవిరుద్ధ చర్యలకూ పాల్పడొద్దని ఇరు వర్గాలనూ ఆదేశించింది. రాజ్యాంగ విరుద్ధమే: నిపుణులు డిప్యూటీ స్పీకర్ చర్య, జాతీయ అసెంబ్లీ రద్దుకు ఇమ్రాన్ సిఫార్సు రెండూ రాజ్యంగ విరుద్ధమేనని పాక్ న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకు ఆర్టికల్ 6 ప్రకారం వారిద్దరిపై న్యాయ విచారణ జరిగే చాన్సుందని సుప్రీంకోర్టు బార్ అధ్యక్షుడు అషన్ భూన్ అన్నారు. మైనారిటీలో పడటమే గాక పార్లమెంటులో అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న ప్రధానికి సభ రద్దుకు సిఫార్సు చేసే అధికారం ఉండదని ప్రముఖ న్యాయ నిపుణుడు, కేంద్ర మాజీ మంత్రి అభిషేక్ మను సింఘ్వి కూడా అభిప్రాయపడ్డారు. మరోవైపు పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్ చౌధరి సర్వర్ను ఇమ్రాన్ బర్తరఫ్ చేశారు. అవిశ్వాసం నుంచి అవిశ్వాసం దాకా... 2021లో ఇమ్రాన్ తొలిసారి అవిశ్వాస పరీక్ష గట్టెక్కిన నాటి నుంచి జాతీయ అసెంబ్లీ రద్దు దాకా పాకిస్థాన్లో జరిగిన కీలక రాజకీయ పరిణామాలు... ► 2021 మార్చి 3: సెనేట్ ఎన్నికల్లో ఆర్థిక మంత్రి అబ్దుల్ హఫీజ్పై విపక్ష నేత యూసుఫ్ రజా గిలానీ నెగ్గడంతో తొలిసారి అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న ఇమ్రాన్ ప్రభుత్వం ► మార్చి 6: అవిశ్వాస పరీక్షను నెగ్గిన ఇమ్రాన్ ► 2022 మార్చి 8: ద్రవ్యోల్బణం అదుపులో విఫలమయ్యారంటూ ఇమ్రాన్పై మరోసారి విపక్షాల అవిశ్వాస తీర్మానం ► మార్చి 19: విపక్ష కూటమికి మద్దతు ప్రకటించిన పలువురు అధికార పీటీఐ ఎంపీలకు ఇమ్రాన్ షోకాజ్ నోటీసులు ► మార్చి 25: అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించకుండానే సభను వాయిదా వేసిన స్పీకర్ ► మార్చి 27: తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నాయని ఇమ్రాన్ ఆరోపణ ► మార్చి 28: జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విపక్ష నేత షాబాజ్ షరీఫ్ ► మార్చి 30: కీలక భాగస్వామ్య పక్షం విపక్షాలతో చేతులు కలపడంతో మెజారిటీ కోల్పోయిన ఇమ్రాన్ ప్రభుత్వం ► ఏప్రిల్ 1: తనకు ప్రాణహాని ఉందని ఇమ్రాన్ ఆరోపణ ► ఏప్రిల్ 3: అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన డిప్యూటీ స్పీకర్ ఖసీం సూరి. జాతీయ అసెంబ్లీ రద్దుకు ఇమ్రాన్ సిఫార్సు, అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదం. వారి నిర్ణయాలు తమ విచారణకు లోబడి ఉంటాయన్న సుప్రీంకోర్టు. -
‘అవిశ్వాస’ పరీక్షలో ఇమ్రాన్ నెగ్గేనా?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్లో ఆదివారం ఓటింగ్ జరుగనుంది. తక్షణ రాజీనామా, అవిశ్వాసాన్ని ఎదుర్కోవడం, ఎన్నికలకు వెళ్లడమనే మూడు ఆప్షన్లను ప్రత్యర్థులు తనకిచ్చారని ఇమ్రాన్ శనివారం చెప్పారు. వారెవరన్నది బయట పెట్టలేదు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని, చివరి క్షణం దాకా పోరాడతానని స్పష్టం చేశారు. కొందరు ద్రోహులు తమ కూటమిని వీడి విపక్షాలతో చేతులు కలిపారని మండిపడ్డారు. ఎంపీలను సంతల్లో మేకల్లా కొనేస్తున్నారని ధ్వజమెత్తారు. విదేశీ కుట్రకు స్వదేశీ నేతలు వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన లాయర్లతో మాట్లాడానని, ద్రోహులను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. యువత నిశ్శబ్దం వీడాలని కోరారు. ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానం వీగిపోవాలంటే ఆయనకు అనుకూలంగా 172 మంది ఎంపీలు ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ, తమకు 175 మంది సభ్యుల మద్దతు ఉందని ప్రతిపక్ష కూటమి చెబుతోంది. -
ఇమ్రాన్కు విషమ పరీక్ష
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం విషమ పరీక్ష ఎదుర్కొంటోంది. ప్రతిపక్ష పీఎంఎల్–ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ సోమవారం ఇమ్రాన్ ప్రభుత్వంపై పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానానికి అనుమతించాలని కోరుతూ ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అంతకుముందు సభ ఆమోదించింది. దీంతో, ప్రభుత్వంపై సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. పీఎంఎల్ నేత షెహబాజ్ మాట్లాడుతూ. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 95 ప్రకారం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విశ్వాసం లేదని సభ తీర్మానించింది. క్లాజ్–4 ప్రకారం ఇమ్రాన్కు పదవిలో ఉండే అర్హత లేదు’అని పేర్కొన్నారు. అనంతరం స్పీకర్ సభను 31వ తేదీకి ప్రొరోగ్ చేశారు. కాగా, నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానంపై సభలో ఓటింగ్ పెట్టేందుకు 3నుంచి 7 రోజుల వరకు గడువుంటుంది. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుండటంతో అవిశ్వాసంపై ఓటింగ్ మార్చి 4వ తేదీన జరిగే అవకాశాలున్నాయి. పార్లమెంట్లో మొత్తం సభ్యులు 342 మంది కాగా, అవిశ్వాసం గట్టెక్కేందుకు ఇమ్రాన్కు 172 మంది సభ్యుల మద్దతు అవసరముంది. అధికార పీటీఐకి 155 మంది సభ్యులుండగా, నాలుగు మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వానికి మొత్తం 179 మంది సభ్యుల బలముంది. అయితే, ఇమ్రాన్ సొంత పీటీఐ పార్టీకి చెందిన సుమారు 25 మందితోపాటు అధికార సంకీర్ణ కూటమిలోని 23 మంది సభ్యులు ధిక్కార స్వరం వినిపించడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. -
ఉగ్రమూకకు దాసోహమైన పాకిస్తాన్
రహదారుల్ని దిగ్బంధించడం, రాజధానిని ముట్టడించడం ఘర్షణలకు దిగడం, పోలీసుల్ని కిడ్నాప్ చేయడం హింసా మార్గంలోనే డిమాండ్లను సాధించడం మొదట్నుంచి ఇదే వారి పని. మత మౌఢ్యంతో రెచ్చిపోయే ఆ సంస్థను కట్టడి చేయకుండా, వారు చెప్పినట్టుగా తలూపుతున్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ టీఎల్పీపై నిషేధం ఎత్తివేయడంతో ఏం జరగబోతోంది? పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ ఉగ్రవాద మూకలకు దాసోహమన్నారు. ఇస్లాం ఉగ్రవాద సంస్థ తెహ్రీక్–ఇ–లబ్బాయిక్ పాకిస్తాన్ (టీఎల్పీ)పై నిషే«ధాన్ని ఎత్తేశారు. పాకిస్తాన్లో అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ముద్ర వేసే నాలుగో షెడ్యూల్ నుంచి టీఎల్పీని తొలగిస్తూ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పాకిస్తాన్ కేబినెట్ ఉగ్రవాద నిరోధక చట్టం, 1997 ద్వారా టీఎల్పీపై విధించిన నిషేధాన్ని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫారసుల మేరకు ఎత్తివేస్తున్నట్టు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. గతకొద్ది రోజులుగా టీఎల్పీ చేస్తున్న ఆందోళనలకు ఇమ్రాన్ ప్రభుత్వం తలవంచింది. ఉగ్రవాదుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇమ్రాన్ వా రికి మోకరిల్లడంతో పరిణామాలు ఎలా ఉంటాయోనన్న భయాందోళనలు సర్వత్రా నెలకొన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో లాహోర్లో రోడ్లను దిగ్బంధించిన టీఎల్పీ కార్యకర్తలు(ఫైల్) (ఇన్సెట్ రిజ్వీ) ఎందుకీ ఆందోళనలు గతకొద్ది నెలలుగా పాకిస్తాన్లో టీఎల్పీ హింసను రాజేస్తోంది. ప్రధాన నగరాలను ముట్టడిస్తూ ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని హడలెత్తిస్తోంది. మహమ్మద్ ప్రవక్తను అవమానించేలా ఫ్రాన్స్కు చెందిన పత్రిక చార్లీ హెబ్డో ఆయన కేరికేచర్లు ప్రచురించడంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. 2015 ఇస్లాం అతివాదులు చార్లీ హెబ్డో కార్యాలయంపై దాడి చేసి 12 మందిని కాల్చిచంపారు. నిందితులకు శిక్ష ఖరారయ్యే దశలో గత ఏడాది ఆ మ్యాగజైన్ పాత కేరికేచర్లను తిరిగి ప్రచురిస్తామని ప్రకటించింది. దీంతో పాక్లో నిరసనలు భగ్గుమన్నాయి. టీఎల్పీ చీటికి మాటికి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ ఉండడంతో ఈ ఏడాది ఏప్రిల్లో ప్రభుత్వం టీఎల్పీపై ఉగ్రవాద సంస్థగా ముద్ర వేసి పార్టీ చీఫ్ సాద్ రిజ్విని అరెస్ట్ చేసింది. వీరి డిమాండ్లను పాక్ ప్రభుత్వం తిరస్కరించడంతో రోడ్డెక్కిన టీఎల్పీ కార్యకర్తలు అక్టోబరు చివరి వారంలో ప్రధాన నగరాలను దిగ్బంధించారు. ఇస్లామాబాద్, రావల్పిండిలకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు లేకుండా హైవేలను దిగ్బంధించారు. హింసను నిరోధించడానికి పాక్ ప్రభుత్వం వాళ్ల డిమాండ్లు అన్నింటికి అంగీకరించకుండా మధ్యేమార్గంగా అరెస్టయిన టీఎల్పీ సభ్యులు 2 వేల మందిని ఇటీవల జైళ్ల నుంచి విడుదల చేసింది. అయినా ఆ సంస్థ పట్టు వీడలేదు. పాక్లో ఫ్రాన్స్ రాయబారిని బహిష్కరించాలని, టీఎల్పీ చీఫ్ సాద్ హుస్సేన్ రిజ్విని విడుదల చేయాలని, తమపై ఉగ్రవాద సంస్థ ముద్రను తొలగించాలని , రాజకీయ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తూ గుర్తింపునివ్వాలన్న డిమాండ్లతో హింసకు దిగింది. గత వారంలో లాహోర్ నుంచి ఇస్లామాబాద్కి లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్కు వేలసంఖ్యలో మద్దతుదారులు పోటెత్తడంతో ప్రభుత్వం రాజీ కొచ్చింది. మతపెద్దలను రంగంలోకి దింపి.. సంప్రదింపుల ద్వారా రాజీ కుదుర్చుకుంది. దాంతో టీఎల్పీ రాజధాని ముట్టడిని విరమించుకుంది. ఇటీవల టీఎల్పీ సృష్టించిన విధ్వంసంలో 21 మంది మరణించగా, అందులో 10 మంది పోలీసులే. పరిణామాలు ఎటు దారి తీస్తాయి ? టీఎల్పీకి పూర్తి స్థాయిలో ఇమ్రాన్ ప్రభుత్వం మోకరిల్లడంపై పాక్ మేధోవర్గంలోనూ, అంతర్జాతీయంగా ఆందోళనలు నెలకొంటున్నాయి. ఈ సంస్థ ఏర్పాటయ్యాక హింసామార్గంలోనే ప్రభుత్వాన్ని కనీసం ఏడుసార్లు దారిలోకి తెచ్చుకుంది. అయిదేళ్లలో ఏడుసార్లు అతి పెద్ద నిరసన కార్యక్రమాలకు దిగింది. మరోసారి టీఎల్పీ ప్రధాన డిమాండ్లన్నింటికీ ప్రభుత్వం అంగీకరించడంతో ప్రతిపక్ష పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ప్రధాని ఇమ్రాన్పై విరుచుకుపడింది. టీఎల్పీ చెప్పుచేతల్లోకి ప్రభుత్వం వెళ్లిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. మీడియా కూడా ఇమ్రాన్కు వ్యతిరేకంగా కథనాలు ప్రచురిస్తోంది. దేశం అప్పుల ఊబిలో కూరుకుపోవడం, ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోవడం, ఐఎస్ఐ కొత్త చీఫ్ నియామకం వంటి చర్యలతో ఇప్పటికే ఇమ్రాన్ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. టీఎల్పీపై నిషేధాన్ని ఎత్తివేస్తే ఆ సంస్థ సానుభూతిపరుల మద్దతు లభిస్తుందన్న ఉద్దేశంలో ప్రభుత్వం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పొరుగున ఉన్న అఫ్గానిస్తాన్లో తాలిబన్ల రాజ్యమేలుతూ ఉండడం పాక్ కూడా అదే మార్గంలో ఉగ్రవాదులకు బహిరంగంగానే మద్దతు పలుకుతూ ఉండడంతో పరిస్థితులు ఎటువైపు తిరుగుతాయోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఏమిటీ టీఎల్పీ ? తెహ్రీక్–ఇ–లబ్బాయిక్ అంటే మహమ్మద్ ప్రవక్త అనుచరుల ఉద్యమం (బరేల్వి) అని అర్థం. ఇస్లాంను దూషించేవారిని కఠినంగా శిక్షించడం, దీనికి సంబంధించిన చట్టాలను పకడ్బందీగా అమలయ్యేలా చూడడానికే ఈ సంస్థ పుట్టుకొచ్చింది. పాకిస్తాన్లో సగం మంది ప్రజల్లో బరేల్వి ఉద్యమం పట్ల మద్దతు ఉంది. సూఫీ సంప్రదాయాలతో కూడిన ఇస్లాంను వ్యాప్తి చేయడమే వీరి ఉద్దేశం. పాకిస్తాన్లోని దైవదూషణకి సంబంధించిన చట్టాలను సంస్కరించాలని ప్రయత్నించిన పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్ని పోలీసు గార్డ్ ముంతాజ్ ఖాద్రి 2011లో దారుణంగా హతమార్చాడు. ఖాద్రిని జైలు నుంచి విడుదల చెయ్యాలన్న డిమాండ్తో 2015లో లాహోర్ మసీదులోని మతబోధకుడు ఖాదిమ్ హుస్సేన్ రిజ్వి ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఖాద్రికి ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేయడంతో అతని అంతిమ యాత్రలో తెహ్రీక్–ఇ–లబ్బాయిక్ పాకిస్తాన్ పేరుతో రాజకీయ పార్టీగా అవతరించింది. వేలాది మంది ఇస్లాం అతివాదులు ఈ పార్టీలో చేరారు. 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన టీఎల్పీ సింధ్ ప్రావిన్స్లో రెండు స్థానాలను గెలుచుకుంది. గత ఏడాది నవంబర్లో ఖాదిమ్ అనారోగ్యంతో మరణించగా అతని కుమారుడు సాద్ రిజ్వి టీఎల్పీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
భారత్తో వాణిజ్యం ఇప్పట్లో లేనట్టే
ఇస్లామాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో భారత్తో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించలేమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. భారత్ నుంచి పత్తి, చక్కెర దిగుమతులు చేసుకోవాలంటూ ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ(ఈసీసీ) చేసిన సిఫారసుల అమలును వాయిదా వేశారు. కేబినెట్ సహచరులతో చర్చించాక ఇమ్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు డాన్ పత్రిక తెలిపింది. భారత్తో ఇప్పట్లో వాణిజ్య సంబంధాలు పెట్టుకోవడం కుదరదని వాణిజ్య శాఖకు, ఆర్థిక బృందానికి ఇమ్రాన్ తెలిపారు. దుస్తులు, చక్కెరను తక్కువ ధరకి దిగుమతి చేసుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలన్నారు. పాక్ ఆర్థిక, వాణిజ్య రంగాలను బలోపేతం చేయడానికి కసరత్తు చేస్తున్న ఈసీసీ కొన్ని వేల ప్రతిపాదనలు పరిశీలించాక భారత్ నుంచి పత్తి, దుస్తులు, చక్కెర దిగుమతి చేసుకోవాలంటూ సిఫారసులు చేసింది. ఆ సిఫారసుల్ని ఆమోదించడానికి కేబినెట్కు పంపింది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదంటూ పాకిస్తాన్ కేబినెట్ ఆ సిఫారసుల్ని తోసిపుచ్చింది. జమ్మూకశ్మీర్ స్వతంత్రప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ 2019లో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆ దేశంతో ఏ రకమైన సంబంధాలు పునరుద్ధరించబోమని పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి చెప్పారు. మరోవైపు భారత్ కూడా అంతే గట్టిగా పాక్కు వార్నింగ్లు ఇచ్చింది. పాక్ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్ర సంస్థల్ని కట్టడి చేసే వరకు తాము కూడా ఎలాంటి బంధాల్ని కొనసాగించమని భారత్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. గత ఏడాది కరోనా సంక్షోభం సమయంలో భారత్ నుంచి దిగుమతయ్యే మందులు, వాటి తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలపై ఉన్న ఆంక్షల్ని పాక్ ఎత్తేసింది. -
ముషారఫ్కు పాక్ ప్రభుత్వం మద్దతు
ఇస్లామాబాద్: దేశద్రోహం కేసులో ఉరిశిక్ష పడ్డ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు మద్దతివ్వాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై చర్చించేందుకు బుధవారం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ కోర్ కమిటీతో అత్యవసర సమావేశం అయ్యారు. ఆశ్చర్యమేంటంటే ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్షంలో ఉండగా ముషారఫ్ రాజద్రోహం కేసుకు ఇమ్రాన్ ఖాన్ మద్దతు తెలపగా, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. కాగా, ముషారఫ్కు మద్దతుగా ఆర్మీ కూడా నిలుస్తోంది. మాజీ సైనికాధ్యక్షుడైన ముషారఫ్.. ఎప్పటికీ ద్రోహి కాదని, కోర్టు తీర్పును ఖండిస్తున్నట్లు ప్రకటించింది. -
మలాలా 'మనసులో మాట'
-
మలాలా 'మనసులో మాట'
పాకిస్థాన్లో బాలికల విద్య కోసం తాలిబాన్ల తుపాకీ గుళ్లకు సైతం ఎదురు నిలిచిన ప్రపంచ వ్యాప్తంగా పలువురి మన్ననలు అందుకున్న మలాలా యూసఫ్ జాయ్ గురువారం తన మనసులోని మాటను బయట పెట్టారు. తనకు పాకిస్థాన్ ప్రధాని పీఠం అధిష్టించాలని ఉందని తెలిపారు. గురువారం న్యూయార్క్లో ఆహ్వానితులను ఉద్దేశించి ప్రసంగిస్తూ...పాక్ ప్రధాని అయితే దేశాన్ని రక్షించ వచ్చన్నారు. అలాగే విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించ వచ్చని తెలిపారు. దానితోపాటు విదేశీ వ్యవహారాలపై కేంద్రీకరించ వచ్చని చెప్పారు. గతంలో పాకిస్థాన్లోని స్వాత్ ప్రాంతంలో మింగొర్కు చెందిన మలాలాతోపాటు పాఠశాలకు వెళ్తున్న విద్యార్థుల బస్సుపై తాలిబన్లు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో మలాలా తలకు తీవ్ర గాయమైంది. దాంతో ఆమెను ప్రత్యేక వైద్య చికిత్స కోసం బ్రిటన్ తరలించారు. అక్కడ మలాలా ఆరోగ్యం కుదుటపడింది. మలాలా బ్రిటన్లో ఉంటూ పాకిస్థాన్లో తాలిబన్ల అనుసరిస్తున్న వైఖరితోపాటు బాలికల విద్యపై వారి అవలంభిస్తున్న చర్యలను ప్రచారం ద్వారా ఎండగడుతోంది. మనవ హక్కుల కోసం పోరాడే వారికి ఐరోపా యూనియన్ పార్లమెంట్ అందించే షకరోవా ప్రతిష్టాత్మక పురస్కారానికి మలాలా గురువారం ఎంపికైన విషయం తెలిసిందే.