qualified institutional placement
-
రూ.4,789 కోట్లు నిధుల సమీకరణ
ప్రయివేట్ రంగ కంపెనీ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్(ABFRL) నిధుల సమీకరణ చేపట్టనుంది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(QIP), ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా మొత్తం రూ.4,789 కోట్లు అందుకునే యోచనలో ఉంది. వృద్ధి వ్యూహాలకు పెట్టుబడులను సమకూర్చుకునే ప్రణాళికలో భాగంగా బోర్డు ఇందుకు ఆమోదముద్ర వేసినట్లు కంపెనీ పేర్కొంది. దీనిలో భాగంగా ప్రమోటర్ సంస్థ పిలానీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్కు రూ. 1,298 కోట్లు, ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్కు రూ. 1,081 కోట్లు విలువైన ప్రిఫరెన్షియల్ షేర్ల జారీకి బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా క్విప్ ద్వారా మరో రూ. 2,500 కోట్ల సమీకరణ(funds)కు సైతం బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2024 సెపె్టంబర్ 19న నిర్వహించిన సాధారణ వార్షిక సమావేశంలో వాటాదారులు అనుమతించిన నిధుల సమీకరణ ప్రతిపాదనకు తాజాగా బోర్డు మరోసారి ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది చివరిలోగా కంపెనీ మదురా ఫ్యాషన్ అండ్ లైఫ్స్టైల్ బిజినెస్ను కొత్తగా ఏర్పాటు చేసిన ఆదిత్య బిర్లా లైఫ్స్టైల్ బ్రాండ్స్కింద విడదీయనుంది.ఇదీ చదవండి: త్రైమాసిక ఫలితాలు డీలా.. కంపెనీ షేర్ల నేలచూపులుయాక్సిస్ బ్యాంక్ లాభం ప్లస్ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్(Axis Bank) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 6,304 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 6,071 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 33,516 కోట్ల నుంచి రూ. 36,926 కోట్లకు ఎగసింది. వడ్డీ ఆదాయం రూ. 27,961 కోట్ల నుంచి రూ. 30,954 కోట్లకు బలపడింది. నికర వడ్డీ ఆదాయం 9 శాతం వృద్ధితో రూ. 13,483 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 0.08 శాతం తగ్గి 3.93 శాతానికి చేరాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 1,028 కోట్ల నుంచి రూ. 2,156 కోట్లకు ఎగశాయి. స్థూల స్లిప్పేజీలు రూ. 4,923 కోట్ల నుంచి రూ. 5,432 కోట్లకు పెరిగాయి. దీంతో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.44 శాతం నుంచి 1.46 శాతానికి స్వల్పంగా పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి 17.01 శాతంగా నమోదైంది. కాగా.. క్యూ3లో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 6,491 కోట్ల నుంచి రూ. 6,742 కోట్లకు పుంజుకుంది. -
క్విప్.. కొత్త రికార్డ్!
ఈ ఏడాది స్టాక్ మార్కెట్ల దూకుడుతో నిధుల సమీకరణ కూడా రికార్డుల మోత మోగిస్తోంది. ఒకపక్క పబ్లిక్ ఇష్యూల (ఐపీఓ) వరదతో కంపెనీలు లిస్టింగ్ గంట మోగిస్తుంటే... మరోపక్క, లిస్టెడ్ కంపెనీలు సైతం తగ్గేదేలే అంటున్నాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్విప్) మార్గంలో వేల కోట్లను సమీకరించడం ద్వారా విస్తరణ, ఇతరత్రా అవసరాలను తీర్చుకుంటున్నాయి. ఈ ఏడాది క్విప్ ఇష్యూల బాట పడుతున్న లిస్టెడ్ కంపెనీల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. నవంబర్ నాటికి దాదాపు 75 కంపెనీలు ఇప్పటికే రూ.1,0,2000 కోట్లను సమీకరించాయి. దీంతో 2020 నాటి రూ.80,800 కోట్ల సమీకరణ రికార్డును బ్రేక్ చేసింది. భారీగా సమీకరిస్తున్న ఈ నిధులను కార్పొరేట్ కంపెనీలు తమ బ్యాలెన్స్ షీట్లను బలోపేతం చేసుకోవడానికి, ప్లాంట్ల విస్తరణ తదితర అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నాయి. ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో రూ.8,500 కోట్లు, కేఈఐ ఇండస్ట్రీస్ రూ.2,000 కోట్లు చొప్పున తాజాగా సమీకరించాయి. సెప్టెంబర్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా రూ.5,000 కోట్ల క్విప్ ఇష్యూను పూర్తి చేసింది. జూలైలో మెటల్–మైనింగ్ దిగ్గజం వేదాంత రూ.8,500 కోట్లను క్విప్ రూట్లో సమీకరించడం తెలిసిందే. వేదాంత ఈ నిధులను రుణ భారం తగ్గించుకోవడం కోసం వినియోగించుకుంది. అదే నెలలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ రూ.8,373 కోట్ల క్విప్ నిధులను దక్కించుకుంది. విద్యుత్ ట్రాన్స్మిషన్ కార్యకలాపాల విస్తరణ, స్మార్ట్ మీటరింగ్, రుణాల తిరిగి చెల్లింపు కోసం వీటిని వెచి్చంచనుంది. మరిన్ని కంపెనీలు క్విప్ బాటలో ఉండటంతో మొత్తంమీద ఈ ఏడాది క్విప్ సమీకరణ మరింత ఎగబాకే అవకాశాలున్నాయి.నిధులతో రెడీ... దేశీ కార్పొరేట్ దిగ్గజాలు కొత్త ప్లాంట్ల ఏర్పాటుతో పాటు ఇతర కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా భారీగా విస్తరించే ప్రణాళికల్లో ఉన్నాయి. తద్వారా పోటీ కంపెనీలతో తలపడేందుకు, మార్కెట్ వాటాను పెంచుకునేందుకు నిధులను సిద్ధం చేసుకుంటున్నాయని కోటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్కు చెందిన క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ వి. జయశంకర్ పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ సెప్టెంబర్లో రూ.1,500 కోట్ల క్విప్ ఇష్యూకు రాగా, మరో రియల్టీ దిగ్గజం ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్టŠస్ క్విప్ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించింది. ఏప్రిల్లో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కూడా విస్తరణ ప్రణాళికల కోసం రూ.5,000 కోట్ల క్విప్ నిధులను ఖాతాలో వేసుకుంది. ఇలా భారీ మొత్తాన్ని దక్కించుకున్న కంపెనీల్లో స్వాన్ ఎనర్జీ (రూ.3,319 కోట్లు), మాక్రోటెక్ డెవలపర్స్ (రూ.3,282 కోట్లు), యూనియన్ బ్యాంక్ (రూ.3,000 కోట్లు), కోఫోర్జ్ (రూ.2,240 కోట్లు) కొన్ని. ‘వేల్యుయేషన్స్ సానుకూలంగా ఉండటం, పటిష్టమైన సెకండరీ మార్కెట్లతో పాటు పెట్టుబడులకు ఇన్వెస్టర్లు క్యూ కడుతుండటం వంటి అంశాలు లిస్టెడ్ కంపెనీల క్విప్ జోరుకు ప్రధాన కారణం. కొత్త ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రుణ భారాన్ని తగ్గించుకోవడం కోసం ఈ నిధులను ఖర్చు చేస్తున్నాయి. మూలధన అవసరాల కోసం చాలా లిస్టెడ్ కంపెనీలు ఇదే రూట్ను ఆశ్రయిస్తున్నాయి’ అని ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్కు చెందిన ఈక్విటీ విభాగం హెడ్ దీపక్ కౌశిక్ చెప్పారు. ఏంజెల్ వన్, శ్యామ్ మెటాలిక్స్, టెక్నో ఎలక్ట్రిక్, లాయిడ్స్ మెటల్స్, క్రాఫ్టŠస్మన్ ఆటోమేషన్, చాలెట్ హోల్స్, స్టెరిలైట్ టెక్నాలజీస్ వంటివి కంపెనీలు గడిచిన కొద్ది నెలల్లో రూ.1,000–1,500 కోట్ల స్థాయిలో క్విప్ నిధులను సమీకరించాయి.క్విప్ అంటే... ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీలు నిధులను సమీకరించే సాధనాల్లో క్విప్ కూడా ఒకటి. అర్హతగల సంస్థాగత బయ్యర్లకు (క్యూఐబీ) ఈక్విటీ షేర్లను, పూర్తిగా–పాక్షికంగా షేర్లుగా మార్చుకోగల డిబెంచర్లు లేదా ఇతరత్రా సెక్యూరిటీలను జారీ చేయడం ద్వారా కంపెనీలు నిధులను సమకూర్చుకోవడానికి ‘క్విప్’ వీలు కలి్పస్తుంది. క్యాపిటల్ మార్కెట్ పెట్టుబడుల్లో విశేష అనుభవం గల, ఆరి్థకంగా బలమైన సంస్థాగత ఇన్వెస్టర్లను సెబీ క్యూఐబీలుగా నిర్దేశించింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఎఫ్పీవో యోచన లేదు: పతంజలి ఫుడ్స్
న్యూఢిల్లీ: కంపెనీలో పబ్లిక్ వాటాను పెంచేందుకు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్కి (ఎఫ్పీవో) వచ్చే యోచనేదీ లేదని స్టాక్ ఎక్సే్చంజీలకు పతంజలి ఫుడ్స్ తెలిపింది. అయితే, ఆఫర్ ఫర్ సేల్, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) వంటి మార్గాలు పరిశీలిస్తున్నట్లు వివరించింది. పతంజలి ఫుడ్స్లో తమ వాటాలను నిర్దేశిత స్థాయిలోపునకు తగ్గించుకోనందుకు గాను 21 ప్రమోటర్ సంస్థల షేర్లను స్టాక్ ఎక్సే్చంజీలు స్తంభింపచేసిన సంగతి తెలిసిందే. దివాలా తీసిన రుచి సోయా ఇండస్ట్రీస్ను 2019లో పతంజలి గ్రూప్ కొనుగోలు చేసింది. అప్పట్లో గ్రూప్నకు 98.87 శాతం వాటాలు ఉండేవి. తర్వాత ఎఫ్పీవోకి వచ్చాక పబ్లిక్ వాటా 19.18 శాతానికి పెరగ్గా.. ప్రమోటర్ల వాటా 80.82 శాతానికి తగ్గింది. నిబంధనల ప్రకారం 2022 డిసెంబర్ 18 నాటికి పబ్లిక్ వాటాను 25 శాతానికి చేర్చాల్సి ఉన్నప్పటికీ అలా చేయకపోవడంతో ప్రమోటర్ల షేర్లను స్టాక్ ఎక్సే్చంజీలు స్తంభింపచేశాయి. -
33 శాతం తగ్గిన సిండికేట్ నికరలాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ సిండికేట్ బ్యాంక్ సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక నికరలాభంలో 33 శాతం క్షీణత నమోదయ్యింది. గతేడాది ఇదే కాలానికి రూ. 470 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ. 316 కోట్లకు తగ్గింది. పెరిగిన నిరర్థక ఆస్తులకు అదనంగా రూ. 220 కోట్లు ప్రొవిజనింగ్ కేటాయింపులు చేయడంతో లాభం తగ్గడానికి ప్రధాన కారణంగా సిండికేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆంజనేయ ప్రసాద్ పేర్కొన్నారు. సమీక్షా కాలంలో స్థూల నిరర్థక ఆస్తులు రూ. 4,472 కోట్ల నుంచి రూ. 6,049 కోట్లకు పెరిగాయి. ఇందులో ఎనిమిది అకౌంట్లకు సంబంధించి రూ. 800 కోట్ల రుణాలు పునర్వ్యవస్థీకరణ ఆలస్యం కావడంతో ఈ త్రైమాసికంలో ఎన్పీఏలుగా చూపించడం జరిగిందని, ఈ మొత్తం తృతీయ త్రైమాసికంలో తగ్గుతాయన్నారు. ప్రస్తుతం 3.43%గా ఉన్న స్థూల ఎన్పీఏలను మార్చినాటికి 3%కి పరిమితం చేయాలనేది లక్ష్యమని తెలిపారు. రూ.4.75 లక్షల కోట్ల వ్యాపార లక్ష్యం ఈ మార్చి నాటికి వ్యాపారం రూ. 4.75 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు. సమీక్షా కాలంలో వ్యాపారం 20 శాతం వృద్ధితో రూ. 4.15 లక్షల కోట్లకు చేరిందన్నారు. నికర వడ్డీ ఆదాయం స్థిరంగా 2,774 కోట్లుగా ఉండగా, ఇతర ఆదాయం 57 శాతం వృద్ధితో రూ.893 కోట్లుగా నమోదయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 531 శాఖల ద్వారా రూ. 38,095 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేశామని, మార్చినాటికి ఈ మొత్తం రూ. 50,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. డిసెంబర్లోగా 1,600 కోట్ల సమీకరణ వ్యాపార విస్తరణకు వివిధ మార్గాల ద్వారా రూ. 3,250 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, డిసెంబర్లోగా రూ.1,600 కోట్లు సేకరించనున్నట్లు ఆంజనేయ ప్రసాద్ వెల్లడించారు. క్యాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్(క్యూఐపీ) ద్వారా రూ. 1,100 కోట్ల సమీకరించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని, ఇది కాకుండా టైర్2 బాండ్స్ ద్వారా రూ.1,150 కోట్లు, టైర్ 1 బ్యాండ్స్ జారీ ద్వారా రూ.1,000 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపారు. గతేడాది సుమారు 4,000 మంది సిబ్బందిని నియమించుకోగా.. ఈ ఏడాది మరో 5,000 మందిని నియమించుకోనున్నట్లు ప్రసాద్ తెలిపారు. -
క్విప్ ఇష్యూలకు బ్యాంకులు రెడీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలు స్టేట్బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ సహా పలు బ్యాంకులు అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)ని చేపట్టనున్నాయి. తద్వారా రూ. 15,000 కోట్లకుపైగా పెట్టుబడులను సమీకరించాలని భావిస్తున్నాయి. క్విప్ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధపడుతున్న జాబితాలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ), దేనా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ సైతం ఉన్నాయి. ఈ బాటలో మరికొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు నిధుల సమీకరణకు వీలుగా ఆయా బోర్డుల అనుమతిని కోరనున్నాయి. రానున్న జనవరి-మార్చి క్వార్టర్లో క్విప్ ద్వారా స్టేట్బ్యాంక్ రూ. 9,576 కోట్లను సమీకరించాలని ప్రణాళికలు వేసింది. ఇందుకు ఇప్పటికే ప్రభుత్వ అనుమతిని కూడా పొందింది. ఇక ఐడీబీఐ బ్యాంక్ రూ. 1,200 కోట్లను, దేనా బ్యాంక్ రూ. 800 కోట్లను సమీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే విధంగా షేర్ల అమ్మకం ద్వారా ఐవోబీ రూ. 350 కోట్లు, అలహాబాద్ బ్యాంక్ రూ. 320 కోట్లను అందుకోవాలని చూస్తున్నాయి. కాగా, 2013లో క్విప్ల ద్వారా దేశీయ కంపెనీలు రూ. 12,000 కోట్లను సమీకరించాయి. -
క్విప్ ఇష్యూలకు బ్యాంకులు రెడీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలు స్టేట్బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ సహా పలు బ్యాంకులు అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)ని చేపట్టనున్నాయి. తద్వారా రూ. 15,000 కోట్లకుపైగా పెట్టుబడులను సమీకరించాలని భావిస్తున్నాయి. క్విప్ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధపడుతున్న జాబితాలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ), దేనా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ సైతం ఉన్నాయి. ఈ బాటలో మరికొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు నిధుల సమీకరణకు వీలుగా ఆయా బోర్డుల అనుమతిని కోరనున్నాయి. రానున్న జనవరి-మార్చి క్వార్టర్లో క్విప్ ద్వారా స్టేట్బ్యాంక్ రూ. 9,576 కోట్లను సమీకరించాలని ప్రణాళికలు వేసింది. ఇందుకు ఇప్పటికే ప్రభుత్వ అనుమతిని కూడా పొందింది. ఇక ఐడీబీఐ బ్యాంక్ రూ. 1,200 కోట్లను, దేనా బ్యాంక్ రూ. 800 కోట్లను సమీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే విధంగా షేర్ల అమ్మకం ద్వారా ఐవోబీ రూ. 350 కోట్లు, అలహాబాద్ బ్యాంక్ రూ. 320 కోట్లను అందుకోవాలని చూస్తున్నాయి. కాగా, 2013లో క్విప్ల ద్వారా దేశీయ కంపెనీలు రూ. 12,000 కోట్లను సమీకరించాయి.