Rashtriya Janata Dal(RJD)
-
లోక్సభ బరిలో లాలూ ఇద్దరు కుమార్తెలు?
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన ఏడుగురు కుమార్తెల్లో ఇద్దరిని రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు రంగం సిద్ధమయింది. ఆర్జేడీ టిక్కెట్పై మిసా భారతిని పాటలీపుత్ర నుంచి, రోహిణీ ఆచార్యను సరన్ నుంచి బరిలోకి దించుతారని వార్తలు వస్తున్నాయి. పాటలీపుత్ర నియోజకవర్గంలో ఆర్జేడీ టిక్కెట్పై పోటీ చేసేందుకు ఇప్పటికే రిత్లాల్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే పట్నాలోని మాజీ సీఎం రబ్డీదేవి నివాసానికి పలు పర్యాయాలు వచ్చినట్లు కూడా మీడియా అంటోంది. దీంతో, పాటలీపుత్ర నుంచి ఇద్దరిలో ఎవరిని పోటీకి నిలపాలనే విషయంలో కొంత సందిగ్ధం కొనసాగుతున్నట్లు సమాచారం. -
ఇండియా కంటే 'భారత్' మేలు: లాలూ ప్రసాద్ యాదవ్
పాట్నా: సెప్టెంబర్ 9,10 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సు నేపథ్యంలో రాష్ట్రపతి భావం నుంచి అందిన డిన్నర్ ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి ప్రతిపక్షాలు. కానీ చాలా సంవత్సరాల క్రితమే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇండియా, భారత్ మధ్య వ్యత్యాసమేమిటో చెప్పారు. ఇండియాను భారత్గా మారుస్తూ కేంద్రం చేస్తోన్న ప్రయత్నాన్ని ఇండియా కూటమి తీవ్ర స్థాయిలో విభేదిస్తోంది. కానీ ఇండియా కూటమిలో కీలక భాగస్వామి అయిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చాలా కాలం క్రితమే ఇండియా భారత్ మధ్య తేడా ఏమిటో వివరిస్తూ.. ఒక రకంగా ఇండియా కంటే 'భారత్' మేలని అన్నారు. ఒక మీడియా సంస్థకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. ఇండియా భారత్ వివాదం తాజాగా రాజకీయ వర్గాల్లో అగ్గి రాజేయడంలో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో లాలూ ప్రసాద్ యాదవ్ వేపపుల్లతో పండ్లు తోముకుంటూ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధి 'ఢిల్లీలో వేపపుల్లలు దొరుకుతాయా? అనడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఢిల్లీ ఇండియాలో భాగమని.. ఇండియాలో వేప పుల్లలు దొరకవు.. కానీ బీహార్ భారత్ కిందకు వస్తుందని భారత్ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని ఇక్కడ అన్నీ దొరుకుతాయని అన్నారు. INDIA और भारत में अंतर लालू यादव मोदी जी के फूल सपोर्ट में pic.twitter.com/YPnVNKuGJ7 — Raja Babu (@GaurangBhardwa1) September 6, 2023 ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అంటే తప్పేంటి? సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు సరికావన్నారు తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ అన్ని ధర్మాలను సంరక్షించాలి కానీ అవమానించకూడదన్నారు. ఉదయనిధి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ, ఖర్గేలు స్పందించాలన్నారు. భారత్ పేరుపై అంత రాద్దాంత ఎందుకు? అని ప్రకాశ్ జవదేకర్ ప్రశ్నించారు. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అంటే వచ్చిన నష్టం ఏంటి అని, ఎప్పట్నుంచో భారత్ మాతాకీ జై అంటున్నామన్నారు. ఇది కూడా చదవండి: పార్లమెంట్ కొత్త భవనంలోనే ప్రత్యేక సమావేశాలు -
‘ఇండియాలో పరిస్థితులు బాగాలేవు’.. ఆర్జేడీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) సీనియర్ నాయకుడు, బిహార్ మాజీ మంత్రి అబ్దుల్ బారీ సిద్దిఖీ తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. భారత్లో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని, విదేశాల్లోనే స్థిరపడాలని తన పిల్లలకు చెప్పానంటూ వారం క్రితం ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘‘నా కుమారుడు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. కుమార్తె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువు పూర్తిచేసింది. అక్కడే ఉద్యోగాలు వెతుక్కోవాలని, సాధ్యమైతే అక్కడే స్థిరపడి, పౌరసత్వం కూడా సంపాదించుకోవాలని చెప్పాను. ఎందుకంటే భారత్లో పరిస్థితులు బాగాలేవు. వారు ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుంటారో లేదో తెలియదు. ఒక తండ్రి తన పిల్లలకు ఇలాంటి మాటలు చెప్పాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోండి’’ అని సిద్దిఖీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ బిహార్ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ ఖండించారు. సిద్దిఖీ లాంటి వ్యక్తులు జాతి వ్యతిరేక అజెండాను మోస్తున్నారని మండిపడ్డారు. దేశం పట్ల, రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని సిద్దిఖీ కుటుంబంతో సహా పాకిస్తాన్కు వెళ్లిపోవాలన్నారు. ఈ దేశం ఎవరి జాగీరూ కాదంటూ దీనిపై సిద్దిఖీ ఆగ్రహం వెలిబుచ్చారు. -
బీజేపీ నాయకులకు సరైన సమయంలో బదులిస్తా
పట్నా: బిహార్లో మళ్లీ జంగిల్ రాజ్ వచ్చిందంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఖండించారు. బీజేపీ నాయకులకు సరైన సమాధానం ఇస్తానని అన్నారు. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్తో సమావేశం కావడంపై నితీశ్ స్పందించారు. ఆయనను తన పెద్దన్నగా భావిస్తానని చెప్పారు. మరోవైపు, బిహార్లో కొత్త ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆర్జేడీ నేత, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నితీశ్కు వెన్నుపోటు అలవాటే: బీజేపీ
పట్నా: ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న బిహార్ సీఎం నితీశ్ కుమార్కు వెన్నుపోటు రాజకీయాలు అలవాటేనని బీజేపీ ఆరోపించింది. ఆర్జేడీతో తాజాగా పొత్తు పెట్టుకోవడం ద్వారా బిహార్ను అశాంతి, అవినీతి అగాథంలోకి నితీశ్ నెట్టివేస్తున్నారని విమర్శించింది. వేగంగా మారిన సమీకరణాల నేపథ్యంలో మంగళవారం పట్నాలో బీజేపీ కోర్కమిటీ సమావేశమైంది. నితీశ్ నిర్ణయాలను నిరసిస్తూ బుధవారం అన్ని జిల్లాల్లో మహాధర్నాలు చేపడతామని, బుధవారం బ్లాక్ స్థాయిలో నిరసనలకు దిగుతామని అనంతరం ఒక ప్రకటనలో తెలిపింది. నితీశ్కు తెలియకుండానే ఆర్సీపీ సింగ్కు కేంద్రం కేబినెట్లోకి తీసుకుందంటూ నితీశ్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ ట్వీట్ చేశారు. 2024లో బీజేపీ తిరుగులేని మెజారిటీ సాధించి అధికారంలోకి వస్తుందన్నారు. నితీశ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం కనౌజ్: బిహార్లో బీజేపీతో బంధాన్ని తెంచుకున్నట్లు ప్రకటించిన నితీశ్ కుమార్ను సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అభినందించారు. ‘నితీశ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. జరగబోయే మంచికి ఇది శుభసూచకం’ అని అఖిలేశ్ అన్నారు. ‘ఆనాడు స్వాతంత్య్ర సమరయోధులు ఆగస్ట్ 9న క్విట్ ఇండియా నినాదం వినిపించారు. అదే తేదీన నితీశ్ బీజేపీ భాగో( బీజేపీ నుంచి దూరంగా వెళ్దాం) అంటూ నినదించారు. బిహార్లో మాదిరే మిగతా రాష్ట్రాల్లోనూ రాజకీయ పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా నిలబడాలి’ అని అన్నారు. చదవండి: (Nitish Kumar: తొలుత ఇంజనీర్గా..) -
ద్రౌపది ముర్ముపై తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక విపక్షలా అభ్యర్థగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. కాగా, ఈ ఎన్నికలకు జూలై 18న ఓటింగ్ నిర్వహిస్తారు. జూలై 21న ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా.. అధికార బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడంపై ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తేజస్వీ యాదవ్ ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి భవనంలో విగ్రహం ఉండాల్సిన అవసరం లేదు. ఎన్డీయే మద్దతున్న రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఇప్పటి వరకు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించలేదు. కనీసం అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత కూడా ఆమె మాట్లాడలేదు. అందుకే రాష్ట్రపతి భవన్లో ‘విగ్రహం’ అవసరం లేదంటూ ఆమెపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా మాత్రం మాట్లాడటం అందరూ చూసే ఉంటారని వ్యాఖ్యానించారు. కాగా, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తేజస్వీ యాదవ్ ఇప్పటికే.. మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఇక, ద్రౌపది ముర్ము ఎంపికపై ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ కుమార్ కూడా విమర్శలు చేశారు. #WATCH | You don't need a 'Murti' (statue) in Rashtrapati Bhawan...You must have heard Yashwant Sinha Ji speaking, but not Centre's Presidential candidate... not a single presser by her since her candidature was announced: Tejashwi Yadav, RJD (16.07) pic.twitter.com/VKn38nNi9r — ANI (@ANI) July 17, 2022 ఇది కూడా చదవండి: వ్యవ'సాయం'పై..అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు -
Lalu Prasad Yadav: లాలూ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం
న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆయన శరీరంలో కదలికలు లేవని తనయుడు తేజస్వీ యాదవ్ తెలిపారు. ఇప్పటి వరకు వైద్యులు చాలా మందులు ఇచ్చారని, అయినా ఎలాంటి పురోగతి లేదని చెప్పారు. వైద్యులు మరోసారి పరిశీలించిన తర్వాత ఏం చేయాలనే దానిపై తేజస్వీ యాదవ్ నిర్ణయం తీసుకుంటామన్నారు. లాలూ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోతే సింగపూర్ తీసుకెళ్తామని తేజస్వి యాదవ్ ఇది వరకే వెల్లడించారు. ఇంట్లో మెట్లపై నుంచి కిందపడిన సమయంలో లాలూకు మూడు చోట్ల గాయాలయ్యాయి. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం ఆయనను ఎయిర్ అంబులెన్స్లో ఢిల్లీ ఎయిమ్స్కు తరలించారు. లాలూ పరిస్థితి విషమించిన నేపథ్యంలో పలువురు బిహార్ మంత్రులు, రాజకీయ ప్రముఖులు ఢిల్లీ ఎయిమ్స్కు చేరుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడారు. లాలూ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చదవండి: (Corona Updates: భారత్లో భారీగా పెరిగిన కరోనా కేసులు) -
Munni Devi: ఇస్త్రీ చేసే మున్ని ఎంఎల్సి అయ్యింది
బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసి జీవించే 40 ఏళ్ళ మున్నీ రజక్ ఎం.ఎల్.సి. అయ్యింది. అందుకు కారణం ఆమె గట్టిగా మాట్లాడగలగడం. పెద్దగా అరవగలగడం. లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గొనే ర్యాలీల్లో ఆమె గొంతు చించుకుని నినాదాలు చేస్తుంది. ధర్నాల్లో ముందు వరుసలో కూచుని టీవీలకు బైట్లు ఇస్తుంది. ఎన్డిఏ గవర్నమెంట్ను విమర్శిస్తూ ధైర్యంగా పాటలు పాడుతుంది. ఇవన్నీ ఆర్.జె.డి నేత లాలూను మెప్పించాయి. ఆమెను నిజమైన కార్యకర్తగా గుర్తించి తమ పార్టీ తరఫున ఎం.ఎల్.సి.ని చేశాడు. 75 మంది సభ్యుల విధాన పరిషత్లో కూచోబోతున్న మున్నీ రాజకీయాల మురికిని కూడా వదలగొడతానంటోంది. కొన్ని ఘటనలు కొందరి మేలుకు జరుగుతాయి. 2019. జుడీషియల్ కస్టడీలో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతున్నారు. బయటంతా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు. రాంచీకి 300 కిలోమీటర్ల దూరం ఉన్న భక్తియార్పూర్లో అక్కడి రైల్వేస్టేషన్ పక్కన ఇస్త్రీ బండి పెట్టుకుని జీవించే మున్నీ అంత దూరం నుంచి రాంచీకి లాలూని చూడటానికి వచ్చింది. కాని సెక్యూరిటీ వాళ్లు ఆమెను లోపలకు వదల్లేదు. దాంతో ఆమె టీవీ కెమెరాల ముందు పెద్దపెద్దగా ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ‘నా దేవుడు లాలూని అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తారా...’ అంటూ లాలూకు మద్దతుగా విపరీతంగా మాట్లాడింది. ఇది లాలూ కంట పడింది. ఆయన మెచ్చాడు. కట్ చేస్తే – భక్తియార్పూర్లో నడుచుకుంటూ వెళుతున్న మున్నీ పక్కనే మొన్నటి జూన్ మొదటి వారంలో ఒక జిప్సీ ఆగింది. ‘ఎక్కు’ అన్నారు అందులో ఉన్నవారు. బిహార్లో అధికారంలో ఉన్నది జె.డి.యు, బిజెపి అలెయెన్స్ ప్రభుత్వం. తాను ఆర్.జె.డి కార్యకర్త. పోలీసులు కాదుకదా అని భయపడింది. కాదు తమ పార్టీ వాళ్లే. అక్కడికి గంట దూరంలో ఉన్న పాట్నాలో రబ్రీదేవి బంగ్లాకు తీసుకెళ్లారు. లోపల రబ్రీ దేవి, పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ ఉన్నారు. ‘లాలూగారు నిన్ను ఎం.ఎల్.సి చేయడానికి నిశ్చయించుకున్నారు’ అని వారు తెలిపితే మున్నీకి మాట రాలేదు. కృతజ్ఞతలు చెప్పి బయట పడింది. ఈ విషయం రాష్ట్రమంతా చర్చనీయాంశం అయ్యింది. అయితే ‘అయినప్పుడు చూద్దాం’ అని కొందరు అనుకున్నారు. మరోవైపు పార్టీలో రజక వర్గానికే చెందిన మరొక నాయకుడు చురుగ్గా పని చేస్తున్నాడు. రజకులలో ఇవ్వాలనుకుంటే అతనికే ఇస్తారని ఊహించారు. కాని అంచనాలు తారుమారయ్యాయి. జూన్ 20న జరగనున్న ఎం.ఎల్.సి. ఎన్నికల్లో ఆర్.జె.డి. తరఫున పోటీ లేకుండానే గెలిచింది మున్నీ రజక్. ముగ్గురు పిల్లల తల్లి మున్నీ ముగ్గురు పిల్లల తల్లి. భర్త అవదేశ్ రజక్ కూడా వృత్తి పనే చేస్తున్నాడు. వీరికి భక్తియార్పూర్లోని రైల్వేస్టేషన్ పక్కనే ఉండే ఇస్త్రీ బండి ఆధారం. అయితే గత పదేళ్లుగా మున్నీ ఆర్.జె.డి. కార్యకర్తగా మారింది. ఆమె పాటలు పాడగలదు. పార్టీ సభలకు స్టేజ్ మీద పాటలు పాడుతుంది. అంతేకాదు లోకల్ టీవీ చానల్స్లో ఆమె పార్టీ విధానాలకు పెద్ద పెద్దగా అరిచి చెప్తుంది. నితీష్ ప్రభుత్వాన్ని బాగా తిట్టి పోస్తుంది. ఇవన్నీ పార్టీని ఆకర్షించాయి. ‘అట్టడుగు స్థాయి కార్యకర్తలను లాలూ అభిమానిస్తారని చెప్పడానికి, ఆ స్థాయి వారికి కూడా పదవులు దక్కుతాయని చెప్పడానికి మున్నీ ఎంపిక ఒక ఉదాహరణ’ అని ఆర్.జె.డి. నేతలు అంటున్నారు. మున్నీ చాలా ఉత్సాహంగా పని చేయాలనుకుంటోంది. ప్రతిపక్షంలో గట్టిగా మాట్లాడేవాళ్లదే పైచేయి కాబట్టి విధాన పరిషత్లో ఆమె విమర్శలు అధికార పార్టీని ఇరుకున పెట్టడం ఖాయమని కొందరు విశ్లేషిస్తున్నారు. మున్నీ రజక్ గురించి మున్ముందు మనం మరిన్ని విశేషాలు వినడంలో ఆశ్చర్యం లేదు. -
ఆర్జేడీలో ఎల్జేడీ విలీనం
న్యూఢిల్లీ: బిహార్కు చెందిన కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ (74) తన నేతృత్వంలోని లోక్తాంత్రిక్ జనతాదళ్ (ఎల్జేడీ)ను రాష్ట్రీయ జనతాదళ్లో విలీనం చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాల్లో ఐక్యత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం ఆయన తెలిపారు. బీజేపీని దీటుగా ఎదుర్కోగల సత్తా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్కు ఉందన్నారు. 1997లో దాణా కుంభకోణం బయటపడ్డాక జనతాదళ్లో విభేదాల నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీని స్థాపించారు. అప్పట్లో జనతాదళ్లో లాలూకు గట్టి పోటీ ఇచ్చే నేతగా శరద్ యాదవ్ ఉండేవారు. 2005లో ఆర్జేడీ పాలనకు చరమగీతం పాడేందుకు శరద్ యాదవ్, నితీశ్కుమార్ ఏకమయ్యారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ–ఆర్జేడీ అలయెన్స్ ఏర్పాటులో శరద్యాదవ్ కీలకంగా వ్యవహరించారు. తర్వాత శరద్ యాదవ్ వేరు కుంపటి పెట్టుకున్నాక ఎల్జేడీ పెద్దగా ఎదగలేకపోయింది. అనారోగ్యం తదితర కారణాల వల్ల పార్టీ శ్రేణులకు మరో ప్రత్యామ్నాయం చూపేందుకే ఆయన విలీనం వైపు అడుగులు వేసినట్లు భావిస్తున్నారు. -
లాలూ రాజీనామా వార్తలపై స్పందించిన రబ్రీదేవీ
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) జాతీయ అధ్యక్ష పదవి నుంచి లాలూప్రసాద్ యాదవ్ తప్పుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవీ ఖండించారు. ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దని శుక్రవారం తేల్చిచెప్పారు. లాలూ తమ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతారని ఆర్జేడీ ఎమ్మెల్యే ఒకరు వెల్లడించారు. లాలూ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఆయన కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ప్రతాప్ యాదవ్ పోటీపడుతున్నట్లు బిహార్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గుండె, మూత్రపిండాల సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలూప్రసాద్ యాదవ్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. (చదవండి: 'జడ్' కేటగిరి భద్రతను తిరస్కరించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ) -
క్షీణిస్తున్న లాలూ ఆరోగ్యం
రాంచీ: రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్(72) ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో శనివారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ వివిధ ఆరోగ్య సమస్యలతో రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. ‘ఆయనకు న్యుమోనియా సోకింది. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్కు తరలించాలని నిర్ణయించాం. ఎయిమ్స్ నిపుణులను ఇప్పటికే సంప్రదించాం. 8 మంది సభ్యులతో కూడిన కమిటీ నుంచి నివేదిక అందిన వెంటనే ఢిల్లీకి తీసుకెళ్తాం’ అని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్ శనివారం సాయంత్రం తెలిపారు. అధికారులు, లాలూ కుటుంబసభ్యులు ఢిల్లీకి తరలించేందుకు ప్రత్యేకంగా ఎయిర్ అంబులెన్సును ఏర్పాటు చేశారని కూడా ఆయన వెల్లడించారు. లాలూను ఢిల్లీకి తరలించేందుకు రాంచీ జైలు అధికారులు సీబీఐ కోర్టు అనుమతి తీసుకున్నారు. లాలూ ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిసిన భార్య రబ్రీదేవి, కూతురు మిసా భారతి, కుమారులు తేజ్ ప్రతాప్, తేజస్వి శుక్రవారం రాత్రి ఆయనను కలుసుకున్నారు. అనంతరం తేజస్వీ యాదవ్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్తో భేటీ అయి, తమ తండ్రికి మెరుగైన వైద్యం అందించేందుకు సాయం అర్థించారు. రిమ్స్లో ఉండగా లాలూ జైలు నిబంధనలను అతిక్రమించారన్న కేసుపై జార్ఖండ్ హైకోర్టు విచారణ జరిపింది. ఈ విషయంలో ఆస్పత్రి యంత్రాంగం, జైలు అధికారులు వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. -
నితీష్ కొత్త సర్కారుకు రెండు రోజులే.. అప్పుడే వివాదం
పట్నా: బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన రెండు రోజుల్లోనే వివాదం చెలరేగింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మెవాలాల్ చౌదరిని మంత్రివర్గంలోకి తీసుకోవడమే ఈ వివాదానికి కారణం. గతంలో మెవాలాల్ భాగల్పూర్ వ్యవసాయ వర్సిటీకి వైస్ చాన్సలర్గా పని చేశారు. ఆయన హయాంలో వర్సిటీ పరిధిలో నిర్మించిన పలు భవనాల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వినిపించాయి. దీంతో పాటు 2017లో లంచం తీసుకుని అర్హతలేని వారిని యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్ శాస్త్రవేత్తలుగా నియమించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే బిహార్లో కొత్తగా ఏర్పాటైన ఎన్డీయే సర్కార్ ఆయనకు విద్యాశాఖ మంత్రిగా అవకాశం కల్పించింది. అవినీతికి పాల్పడిన వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారంటూ ప్రతిపక్ష ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదల్) మండిపడింది. ఈ మేరకు తేజస్వీ యాదవ్ ట్వీట్ చేశారు. ఒక్క ముస్లిం వ్యక్తికి కూడా మంత్రి అయ్యే అవకాశం ఇవ్వలేదని.. తన సీఎం పదవిని కాపాడుకోవడం కోసమే అవినీతిపరులకు నితీష్ పదవులు కట్టబెడుతున్నారని తేజస్వీ ఆరోపించారు. పది లక్షల ఉద్యోగాలు ఇస్తానని తాను చెప్తే అందుకు విరుద్ధంగా నితీష్ ప్రభుత్వం మెవాలాల్ను మంత్రిని చేసి అవినీతిని ప్రోత్సహిస్తుందని ఆయన మండిపడ్డారు. ఈ ఆరోపణలను మెవాలాల్ తోసిపుచ్చారు. ఈ అంశాలపై విచారణ కొనసాగుతోందని, దీనితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కోర్టులో తనపై ఎలాంటి పెండింగ్ కేసులు లేవన్నారు. తనపై ఎలాంటి చార్జిషీట్ దాఖలు చేయలేదని.. తనపై కేసులున్నట్లు ఎన్నికల అఫిడవిట్లో ఎక్కడా పేర్కొనలేదని ఆయన వివరణ ఇచ్చారు. అవినీతి పరుడైన తేజస్వీ యాదవ్కు ఇతరులను విమర్శించే అర్హత లేదన్నారు. చాలా మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలపై అవినీతి కేసులున్న విషయాన్ని ఈ సందర్భంగా మెవాలాల్ గుర్తుచేశారు. ఈ కేసుకు సంబంధించి 2017లో తన మేనల్లుడు అరెస్టయ్యాడన్న తేజస్వి ఆరోపణలను ఆయన ఖండించారు. అప్పటి రాష్ట్ర గవర్నర్ రామ్నాథ్ కోవింద్ ఈ అంశంపై దర్యాప్తుకు ఆదేశించారని, తమపై ఎలాంటి కేసులు నమోదు కాలేదన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని మెవాలాల్ హెచ్చరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెవాలాల్ చౌదరి తారాపూర్ నియోజకవర్గం నుంచి జేడీయూ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2017లో జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన మెవాలాల్ తర్వాతి కాలంలో మళ్లీ పార్టీలోకి వచ్చారు. (చదవండి: బిహార్ అసెంబ్లీలో నేర చరితులెక్కువ!) -
ఆటవిక రాజ్య యువరాజు
దర్భంగ/ముజఫర్పూర్/పట్నా: బిహార్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం బుధవారం విపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) లక్ష్యంగా సాగింది. ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ను ‘ఆటవిక రాజ్య యువరాజు(జంగిల్రాజ్ కే యువరాజ్)’ అంటూ ప్రధాని ఎద్దేవా చేశారు. బిహార్ బీమారు రాష్ట్రంగా మారడానికి కారణమైన ఆర్జేడీకి మళ్లీ అధికారమిస్తే కరోనాతో పాటు మరో మహమ్మారిని ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలను ప్రధాని హెచ్చరించారు. ఆర్జేడీ చేసిన 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల హామీని ఎద్దేవా చేస్తూ.. ‘ప్రభుత్వ ఉద్యోగాల విషయం మర్చిపోండి. వాళ్లు గెలిస్తే ప్రైవేటు ఉద్యోగాలు కూడా పోతాయి. బలవంతపు వసూళ్లకు భయపడి కంపెనీలను మూసేసుకుంటారు. ఆ పార్టీకి ఇక్కడ కిడ్నాప్లపై కాపీరైట్ ఉంది’ అన్నారు. బిహార్ను దుష్పరిపాలన నుంచి సుపరిపాలన వైపు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నడిపించారని ప్రశంసించారు. జేడీయూ నేత నితీశ్ను ‘ప్రస్తుత, భవిష్యత్ ముఖ్యమంత్రి’ అంటూ సంబోధించారు. నితీశ్ పాలనలో బిహార్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. దర్భంగ సభలో మాట్లాడుతూ సీతామాత జన్మించిన మిథిలకు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ‘అయోధ్యలో రామాలయ నిర్మాణం కూడా ప్రారంభమైంది. ఇన్నాళ్లూ రామాలయ నిర్మాణం ఎందుకు చేపట్టలేదని విమర్శించిన వారంతా.. ఇప్పుడు తప్పని సరై మా నిర్ణయానికి చప్పట్లు కొడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. బిహార్ అభివృద్ధి కోసం కేంద్రం కేటాయించిన నిధుల వైపు రాష్ట్రాభివృద్ధిని కోరుకోని దురాశాపూరిత శక్తులు ఆశగా చూస్తున్నాయని వ్యాఖ్యానించారు. లాలు ప్రసాద్, రబ్రీదేవీల ఆర్జేడీ పాలనలో చోటు చేసుకున్న కుల ఘర్షణలను ప్రధాని గుర్తు చేశారు. అబద్ధాలు, మోసం, గందరగోళంతో కూడిన విధానాలు వారివని ఆరోపించారు. ప్రతీ ప్రసంగం ప్రారంభంలో ప్రధాని స్థానిక మాండలికంలో మాట్లాడి, స్థానికులైన మహనీయులను గుర్తు చేసి సభికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దర్భంగలో మైథిలి కవి విద్యాపతిని గుర్తు చేశారు. -
ఆర్జేడీకి 144, కాంగ్రెస్కు 70 సీట్లు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బహుళ పార్టీల మహాకూటమిలో సీట్ల పంపకం శనివారం దాదాపు పూర్తయ్యింది. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) చీఫ్ తేజస్వీ యాదవ్ను కూటమి నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీట్ల పంపకంలోనూ ఆ పార్టీకే అగ్రస్థానం దక్కింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా, ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేయనుంది. కాంగ్రెస్కు 70 సీట్లు, సీపీఐ(ఎంఎల్)కు 19, సీపీఐకి 6, సీపీఎంకు 4 సీట్లు కేటాయించారు. వాల్మీకీ నగర్ లోక్సభ స్థానానికి నవంబర్ 7న జరగనున్న ఉలప ఎన్నికలో మహా కూటమి తరపున కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని నిలిపేలా ఒప్పందం కుదిరింది. తమ పార్టీకి దక్కిన 144 సీట్లలో కొన్ని స్థానాలను వికాశీల్ ఇన్సాస్ పార్టీకి(వీఐపీ), జేఎంఎంకు కేటాయిస్తామని ఆర్జేడీ ప్రకటించింది. సీట్ల పంపకంలో తీమకు అన్యాయం జరిగింది, ఇతర పార్టీల నేతలు వెన్నుపోటు పొడిచారని, మహా కూటమి నుంచి తాము తప్పుకుంటున్నట్లు వికాశీల్ ఇన్సాస్ పార్టీ అధినేత ముకేశ్ సాహ్నీ ప్రకటించారు. బిహార్ బీఎస్పీ చీఫ్ రాజీనామా బీఎస్పీ అధినేత మాయావతికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ బిహార్ శాఖ అధ్యక్షుడు భరత్ బింద్ శనివారం బీఎస్పీకి రాజీనామా చేసి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో చేరారు. ఆర్జేడీ నేత తేజస్వీ ఆయనకు పార్టీ సభ్యత్వం అందజేశారు. సరికొత్త బిహార్ నిర్మాణానికి, యువజన వ్యతిరేకి అయిన ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి భరత్ తమ పార్టీలో చేరారని తేజస్వీ ట్వీట్చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీ, జనతాంత్రిక్ పార్టీ(సోషలిస్టు) కలిసి మహాకూటమిగా ఏర్పడి బరిలో దిగడం తెల్సిందే. -
ఆర్జేడీ శాసనమండలి అభ్యర్థులు వీరే
పట్నా : బీహార్లో త్వరలో జరగనున్న శాసనమండలి ఎన్నికలకు సంబంధించి రాష్ట్రీయ జనతాదళ్( ఆర్జేడీ) బుధవారం ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. వారిలో బిస్కోమోన్ చైర్మన్ సునీల్ సింగ్, బీఎన్ కాలేజీ ప్రొఫెసర్ రామ్ బాలి చంద్రవన్షీ, ముంబైకి చెందిన వ్యాపారవేత్త ఫరూఖ్ షేక్లు ఉన్నారు.అంతకుముందు మంగళవారం వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలతో పాటు ఆర్జేడీకి చెందిన రాధా చరణ్ షా, సంజయ్ ప్రసాద్, దిలీప్ రాయ్, ఎండి కమర్ ఆలమ్, రణ్విజయ్ కుమార్ సింగ్లు పార్టీకి రాజీనామా చేసి జేడీయులో చేరడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకేత్తించింది. మరోవైపు జేడీయూ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గులామ్ కౌస్, కుముద్ వర్మ, బీష్మ్ సాహ్నిలను ఎంపిక చేశారు. బీహార్ శాసనడమండలిలో మొత్తం 75 సీట్లు ఉండగా అందులో 63 ఎన్నికల ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 12 నామినేటెడ్ పదవులుగా ఉన్నాయి. జూలై 6న బీహార్లోని తొమ్మిది శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.(ఆ రాజవంశం ప్రతిపక్షంతో సమానం కాదు) -
ఢిల్లీ బరిలో ఆర్జేడీ
న్యూఢిల్లీ: లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారి బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ కూటమిలోని ఆర్జేడీ 10 శాతం సీట్లు కావాలని డిమాండ్ చేసినప్పటికీ.. చివరకు నాలుగింటితో సరిపెట్టుకుంది. అభ్యర్థుల పేర్లను సోమవారం విడుదల చేయనుంది. ఢిల్లీ ఎన్నికలకు నామినేషన్ పత్రాల దాఖలు మంగళవారంతో ముగియనుంది. -
ఎన్నికల వేళ.. తేజ్ప్రతాప్ సంచలన నిర్ణయం
పట్నా: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్జేడీ విద్యార్థి విభాగం అధ్యక్ష పదవికి గురువారం ఆయన రాజీనామా చేశారు. ఈ విషయాన్ని తేజ్ప్రతాప్ ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే రాజీనామాకు గల కారణాలు తెలియలేదు. ఎవరి పేరు ప్రస్తావించకుండా ‘అమాయకులే నన్ను అమాయకుడని అనుకుంటారు. కానీ గ్రౌండ్ లెవల్లో అందరి గురించి, అన్ని విషయాలు తెలుసు’అంటూ ట్వీట్ చేశారు. (చదవండి: ‘విడాకుల యుద్ధం.. భారతం కన్నా పెద్దది’) దాణా కుంభకోణంలో లాలూ జైలులో ఉండటంతో ప్రస్తుతం తేజ్ప్రతాప్ సోదరుడు తేజస్వీ యాదవ్ పార్టీ బాధ్యతలు చేపట్టారు. గతంలో పార్టీ నాయకులు తనను పట్టించుకోవడం లేదని తేజ్ప్రతాప్ యాదవ్ బాహాటంగానే ప్రకటించారు కూడా. ఇలా చెబుతూనే తన సోదరుడికి తనకు ఎలాంటి విబేధాలు లేవని తన తమ్ముడు తన హృదయానికి దగ్గరగా ఉంటారని చెప్పారు. తేజస్వీ యాదవ్ కూడా తన అన్నే తనకు మార్గదర్శకుడని తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్న తేజ్ప్రతాప్ ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. (‘ప్రాణభయం ఉంది.. రక్షణ కల్పించండి’) -
నితీష్ కుట్రను బయటపెడ్తా: లాలూ
పాట్నా: తమ పార్టీని చీల్చేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ కుట్రచేశారని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్ ఆరోపించారు. మైనారిటీలో ఉన్న తన ప్రభుత్వాన్న కాపాడుకునేందుకు నితీష్ తమ పార్టీ ఎమ్మెల్యేలపై కన్నేశారని పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలకు పదవులు ఆశ చూపి ఆర్జేడీని చీల్చేందుకు కుట్ర చేశారని అన్నారు. ఇందులో అసెంబ్లీ స్పీకర్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. నితీష్ కుట్రను బట్టబయలు చేస్తామని ప్రకటించారు. అయితే తిరుగుబావుటా ఎగురువేసిన వారిలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలోకి తిరిగి వచ్చారు. దీంతో వెనక్కి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య 9కి పెరిగింది. ఈ రోజు లాలూ నివాసంలో జరిగిన ఆర్జేడీ లెజిస్లేటర్ల సమావేశానికి మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేల్లో 13 మంది నిన్న తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అయితే అత్యంత నాటకీయంగా వారిలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ తర్వాత కొద్దిసేపటికే తాము వేరుకుంపటి వర్గంలో లేమని స్పష్టం చేశారు. లాలూ ఆరోపణలను నితీష్ తోసిపుచ్చారు. ఆర్జేడీ ఎమ్మెల్యేలు జేడీ(యూ)లోకి వస్తే స్వాగతిస్తామని చెప్పారు. -
లాలూ ఆర్జేడీలో చీలిక
13 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు జేడీ(యూ) సర్కారుకు జైకొడుతూ స్పీకర్కు లేఖ కొద్దిసేపటికే సొంతగూటికి ఆరుగురు ఎమ్మెల్యేలు పాట్నా: లోక్సభ ఎన్నికలకు ముందు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీలిపోరుుంది. పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేల్లో 13 మంది తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. జనతాదళ్ (యూ) నేతృత్వంలోని నితీశ్కుమార్ ప్రభుత్వానికి జై కొట్టారు. మైనారిటీ వర్గానికి చెందిన ఐదుగురితో పాటు వీరంతా సోమవారం ఎమ్మెల్యే సామ్రాట్ చౌదరి నివాసంలో సమావేశమయ్యూరు. ఆర్జేడీని వీడి నితీశ్ సర్కారుకు మద్దతు ప్రకటిస్తున్నట్టుగా తెలియజేస్తూ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరికి ఓ లేఖ రాశారు. స్పీకర్కు లేఖ రాసిన విషయూన్ని ఎమ్మెల్యే ఇక్బాల్ అన్సారీ ధ్రువీకరించారు. అరుుతే అత్యంత నాటకీయంగా వారిలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ తర్వాత కొద్దిసేపటికే తాము వేరుకుంపటి వర్గంలో లేమని స్పష్టం చేశారు. సామ్రాట్ చౌదరి, జావెద్ ఇక్బాల్ అన్సారీతో పాటు రాఘవేంద్ర ప్రతాప్సింగ్, దుర్గాప్రసాద్ సింగ్, లలిత్ యూదవ్, అనిరుధ్ కుమార్, జితేంద్ర రాయ్, అక్తర్-ఉల్-ఇస్లాం సాహీన్, అక్తర్-ఉల్-ఇమాన్, అబ్దుల్ గఫూర్, ఫయూజ్, రామ్ లఖన్ రామ్ రమణ్, చంద్రశేఖర్ల సంతకాలతో కూడిన లేఖ అసెంబ్లీకి చేరింది. దీంతో మధ్యంతర ఏర్పాటు కింద వారు ప్రత్యేక బృందంగా కూర్చునేందుకు అనుమతి ఇచ్చినట్లు అసెంబ్లీ నోటిఫికేషన్ ఒకటి తెలిపింది. అరుుతే కొద్దిసేపటికే ఆర్జేడీ శాసనసభాపక్ష నేత అబ్దుల్ బారి సిద్దిఖీతో కలిసి ఆరుగురు ఎమ్మెల్యేలు మీడియూతో మాట్లాడారు. ఆర్జేడీ నుంచి బయటికొచ్చి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిసి తామెలాంటి లేఖపైనా సంతకాలు చేయలేదని వారు విలేకరులకు చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో సావధాన తీర్మానం వంటి ఇతర ప్రయోజనాల కోసం ఆ సంతకాలు తీసుకున్నట్టు అబ్దుల్ గఫూర్ పేర్కొన్నారు. లలిత్యూదవ్, ఫయూజ్ అహ్మద్, దుర్గాప్రసాద్ సింగ్, చంద్రశేఖర్, ఇస్లాం సాహీన్లు ఆర్జేడీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. పార్టీలో చీలిక వార్తలను విన్నానని, ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నానని లాలూ ఢిల్లీలో విలేకరులకు చెప్పారు. బీజేపీతో పొత్తుకు ఎల్జేపీ సై! న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కారణంగా గతంలో ఎన్డీఏకి దూరమైన లోక్జన్శక్తి పార్టీ (ఎల్జేపీ) ఇప్పుడు మళ్లీ బీజేపీతో ఎన్నికల పొత్తుకు ఆసక్తిగా ఉందనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి. ఆ పార్టీ అధినేత రామ్విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యలు కూడా అందుకు బలం చేకూరుస్తున్నాయి. గుజరాత్ మతఘర్షణలకు సంబంధించి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి కోర్టులు క్లీన్చిట్ ఇచ్చిన తర్వాత ఇక సమస్యల్లేవని ఆయన సోమవారం నాడిక్కడ వ్యాఖ్యానించారు. అయితే బీజేపీతో పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు కచ్చితమైన సమాధానం చెప్పడానికి నిరాకరించారు. అయితే సీట్ల కేటాయిం పులో కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు ఊగిసలాట ప్రదర్శించడంతో అసంతృప్తితో ఉన్న ఎల్జేపీ ఇప్పుడు బీజేపీ వైపు చూస్తోందని సమాచారం. -
నిలువునా చీలిన లాలూ పార్టీ