Sakshi News Paper
-
‘సాక్షి’పై సర్కారు అక్కసు
సాక్షి, అమరావతి: ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం నినదిస్తున్న ‘సాక్షి’ పత్రికపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ ప్రజావ్యతి రేక విధానాలను నిలదీస్తున్న ‘సాక్షి’ పత్రికపై అక్రమ కేసులకు తెగబడుతోంది. రెడ్బుక్ కుట్రలో తాజా అంకంగా.. కేసు నమోదు చేయాలని రియ ల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)ను ఆదేశిస్తూ ప్రభుత్వం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ‘వాట్సాప్ గవర్నెన్స్’ విధానం పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ‘మన మిత్ర’ యాప్ ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించేదిగా ఉందని పలువురు నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని పలువురు ప్రశ్నించారు కూడా. ఈ నేపథ్యంలో.. ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కు పరిరక్షణకు బాధ్యతాయుతమైన మీడియా సంస్థగా సాక్షి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ స్పందించింది. ‘మన మిత్ర.. మరో మారీచుడు’ శీర్షికన గతనెల 3న ఓ కథనాన్ని ప్రచురించింది. గతంలో 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ అంశాలను కూడా ఇందులో ప్రస్తావించింది. ఆ కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే అమాంతంగా పెరిగిపోతున్న సోషల్ మీడియా వేధింపులు, సైబర్ నేరాలు బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో తమ వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం వాటిల్లే పరిస్థితి తలెత్తడం అందర్నీ ఆందోళనపరిచింది. కానీ, ఆ కథనం ప్రభుత్వ పెద్దలకు కంటగింపుగా మారింది. ‘సాక్షి’ పత్రికపై కేసు నమోదు చేసి వేధింపులకు పాల్పడాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసు వేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. -
గుండెపోటుతో ‘సాక్షి’ ఉద్యోగి మృతి
ఖైరతాబాద్(హైదరాబాద్): గుండెపోటుతో సాక్షి దినపత్రికలో పనిచేస్తున్న ఉద్యోగి మృతి చెందిన సంఘటన ఖైరతాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లా యలమంచిలి ప్రాంతానికి చెందిన పి.శేషాచలపతిరావు(55) కుటుంబ సమేతంగా హైదరాబాద్ నగరానికి విచ్చేసి అల్వాల్లో నివాసముంటూ బంజారాహిల్స్లోని సాక్షి దినపత్రిక కార్యాలయంలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్నారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఎదురుగా ఉన్న బస్టాప్లో బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురికావడంతో బస్టాప్లోని ఫుట్పాత్పై పడిపోయాడు. అచేతనంగా పడి ఉన్న ఆయనను ప్రయాణికులు గమనించి 100 డయల్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్ఐ అమర్నాథ్, ఏఎస్ఐ శ్రీరాములు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. వివరాల కోసం ఆరా తీయగా బ్యాగులో సాక్షి దినపత్రిక ఐడీ కార్డు, బస్ పాస్ లభించాయి. దీంతో కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి, వారంతా వైజాగ్కు వెళ్లినట్లు తెలుసుకొని భార్య, బావమరిది, వదినకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
అసెంబ్లీలో అప్పు లపై కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల | మధ్య వాగ్వాదం
-
దూసుకెళ్తున్న సాక్షి
-
దేశంలో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికల్లో ఎనిమిదో స్థానంలో ‘సాక్షి’
సాక్షి, అమరావతి: ‘సత్యమేవ జయతే’ నినాదంతో తెలుగు నేలపై 2008 మార్చి 23వతేదీన ప్రారంభమైన ‘సాక్షి’ పత్రిక ప్రస్థానం దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతోంది. ఉన్నది ఉన్నట్టుగా.. నాణానికి రెండో వైపు వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న ‘సాక్షి’ అశేష పాఠకాదరణతో తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తోంది. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ నిర్వహించిన ఆడిటింగ్లో నిత్యం 12,47,492 కాపీలతో (15,480 వేరియంట్ సహా) దేశంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దిన పత్రికల్లో ‘సాక్షి’ ఎనిమిదో స్థానంలో నిలిచింది.ఆంధ్రప్రదేశ్లో 8,66,582, తెలంగాణలో 3,71,947, బెంగళూరు, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ మెట్రో ఎడిషన్లలో 8,963 సర్క్యులేషన్తో ‘సాక్షి’ పాఠకాదరణలో దూసుకెళ్తున్నట్లు ఏబీసీ వెల్లడించింది. తొలి మూడు స్థానాల్లో హిందీ పత్రికలుతాజాగా ఏబీసీ నిర్వహించిన ఆడిటింగ్లో హిందీ పత్రికలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. దైనిక్ భాస్కర్ (హిందీ) పత్రిక 30,73,304 సర్క్యులేషన్తో అగ్రస్థానంలో నిలిచింది. 24,42,728 సర్క్యులేషన్తో దైనిక్ జాగరణ్ (హిందీ) రెండో స్థానంలో నిలవగా.. అమర్ ఉజాలా (హిందీ) 17,05,529 సర్క్యులేషన్తో మూడో స్థానంలో ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా (ఇంగ్లీష్) నాలుగో స్థానంలో నిలిచింది. -
‘సాక్షి’పై కక్ష.. అవినీతిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులా?: వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: సాక్షి పత్రికపై చంద్రబాబు సర్కార్ కక్షసాధింపు చర్యలపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. విజయవాడ వరదల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. వరదల్లో అవినీతి చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు.ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. పేదలకు, నష్టపోయిన వారికోసం వచ్చిన విరాళాల్లోనూ అవినీతి చేశారని.. ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ, ప్రజాసంఘాలపై ఎదురుదాడి చేశారంటూ దుయ్యబట్టారు.‘‘మీడియా స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వం భంగం కలిగిస్తోంది. సాక్షి పత్రిక, ఎడిటర్ మురళిపై కేసులు పెట్టడం దుర్మార్గం. సాక్షి టీవీని ఆపేయాలంటూ సాక్షాత్తూ మంత్రులే పిలిచి వార్నింగ్ ఇస్తున్నారు. ప్రజాగొంతుకను నొక్కేయాలని కూటమి నేతలు చూస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా నిరంతరం మేం ప్రజల పక్షాన పోరాడతాం. మీడియాపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తేయాలి’’ అని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు.సాక్షిని టార్గెట్ చేయడం సరికాదు: మేయర్ రాయన భాగ్యలక్ష్మివరదల్లో అవినీతి జరిగిందని అందరికీ తెలుసు. ఎంతో కొంత అవినీతి జరగకుండా ఎలా సాధ్యమని సాక్షాత్తూ సీఎం చంద్రబాబే చెబుతున్నారు. వరదల్లో ఎంత ఖర్చుపెట్టారా లెక్కలిచ్చింది కూడా వాళ్లే. ఎన్యుమరేషన్ జరగలేదని వరద బాధితులు గగ్గోలు పెడుతున్నారు. కలెక్టరేట్ వద్ద నిత్యం వందల్లో బాధితులు ధర్నాలు చేస్తున్నారు. పత్రికా స్వేచ్ఛ లేకుండా అణగదొక్కాలని చూస్తున్నారు. ప్రజలకు నిజం తెలియజేసే ఏకైక మీడియా సాక్షి మాత్రమే. సాక్షి మీడియాను టార్గెట్ చేయడం సరికాదు.చంద్రబాబు నియంతృత్వానికి ఇది నిదర్శనం: మల్లాది విష్ణు రాష్ట్రంలో ప్రజలపక్షం , ప్రతిపక్షం ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది. సాక్షి పత్రికపై ప్రైవేట్ వ్యక్తులతో కేసులు పెట్టించడం పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు. ప్రభుత్వ రాక్షసత్వానికి..నియంతృత్వానికి ఇది నిదర్శనం. గత ఐదేళ్లలో వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియాలో ఎన్నో అసత్య కథనాలు ప్రచురించారు. గతంలో ఏనాడైనా ఇలాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడ్డామా?. పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేయించి కేసులు పెట్టించామా?. తప్పుడు ఆరోపణలపై సాక్షి పత్రిక ద్వారా వాస్తవాలను తెలియజేశాం. సాక్షి లేకపోతే ఏపీలో ప్రజలకు నిజాలు.. వాస్తవాలు తెలిసే పరిస్థితి ఉండదుప్రశ్నించే వారి గొంతు నొక్కేస్తున్నారు: వెల్లంపల్లి శ్రీనివాస్కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కక్ష సాధింపు పెరిగిపోయింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కేస్తున్నారు. సాక్షి పత్రికపై కేసు పెట్టడం అమానుషం. మీ తప్పులను ఎత్తిచూపిస్తున్నందుకు ప్రైవేట్ కేసులు వేయడం సరికాదు. కేబుల్ టీవీలో సాక్షి ప్రసారాలను నిలిపివేశారు. వరదల్లో అనేక మంది నష్టపోయారు. వరద బాధితులకు అండగా నిలిచిన సాక్షిపై కేసులు పెట్టడం దుర్మార్గం. తక్షణమే సాక్షిపై పెట్టిన కేసులు ఎత్తేయాలి. -
సాక్షి పత్రికపై కేసులు.. సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషణ
-
KSR Live Show: ప్రకటనల ఆరోపణలపై చంద్రబాబుకు దిమ్మదిరిగేలా కౌంటర్..
-
హైకోర్టు సాక్షిగా తేలిపోయిన ‘ఈనాడు’ అసత్య ఆరోపణలు
సాక్షి, అమరావతి: ‘సాక్షి’ దినపత్రిక తన సర్కులేషన్ పెంచుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ‘ఈనాడు’ అడ్డగోలుగా చేస్తూ వచ్చిన ఆరోపణలు అసత్యమని ఢిల్లీ హైకోర్టు సాక్షిగా తేలిపోయాయి. వలంటీర్లు విస్తృత సర్క్యులేషన్ కలిగిన ఏ దినపత్రికనైనా కొనుగోలు చేయవచ్చంటూ ప్రభుత్వం జీవో జారీ చేయగా దీనివల్ల సాక్షి సర్క్యులేషన్ ఆమాంతం పెరిగిపోయిందంటూ ఈనాడు ప్రమాణపూర్వకంగా చెప్పిన మాటలు, శుద్ధ అబద్ధమని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్ (ఏబీసీ) ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన గణాంకాలు వెల్లడించాయి. ప్రభుత్వ జీవో వల్ల సాక్షి నిజంగానే లబ్ధి పొంది ఉంటే ఆ పత్రిక సర్క్యులేషన్ మిమ్మల్ని దాటిపోయి ఉండాలి కదా? మరి ఏబీసీ గణాంకాలు మరో రకంగా ఉన్నాయి కదా? అంటూ హైకోర్టు ధర్మాసనం సూటిగా సంధించిన ప్రశ్నలకు ఈనాడు వద్ద సమాధానమే లేకుండా పోయింది. సాక్షి సర్క్యులేషన్ విషయంలో తన ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో చేసేదేమీ లేక ఈనాడు వెనక్కి తగ్గింది. హైకోర్టు సైతం సాక్షి సర్క్యులేషన్ గణాంకాలను ప్రచురించేందుకు అనుమతినిచ్చింది. దీంతో చేసేదేమీ లేక సాక్షి సర్క్యులేషన్ గణాంకాలను ప్రచురించకుండా ఏబీసీని నిరోధించాలంటూ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాన్ని ఈనాడు ఉపసంహరించుకుంది. విస్తృత సర్క్యులేషన్ ఉన్న ఏ దినపత్రికనైనా కొనుక్కునేందుకు వలంటీర్లకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ ఈనాడు దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యంలో తదుపరి విచారణను ఏప్రిల్ 25కి వాయిదా వేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ మన్మోహన్, న్యాయమూర్తి జస్టిస్ మన్మీత్ ప్రతీమ్ సింగ్ ఆరోరా ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
జనసేనకు షాకిచ్చిన హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్.. వైఎస్సార్సీపీలో చేరిక
-
ఏపీ విద్యా వ్యవస్థ దేశానికే రోల్ మోడల్..
-
‘సాక్షి’లో ఏం రాశారు..?
కౌటాల(సిర్పూర్): కౌటాల మండలంలో బుధవారం సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కుమురం భీం చౌరస్తాలో గల ఓ టీస్టాల్లో ఆయన కాసేపు సాక్షి పేపర్ చదివా రు. ప్రతిరోజూ దినపత్రికలు చదవడం అలవాటని ఆయన తెలిపారు. అనంతరం స్థానికులు, కార్యకర్తలతో మాట్లాడారు. వ్యాపారం ఎలా ఉందని టీస్టాల్ యజమాని శర్మను అడిగి తెలుసుకున్నారు. తనకు ఇల్లు లేదని, ప్రభుత్వం నుంచి మంజూరు చేయించాలని శర్మ కోరడంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. -
నాకు మాస్టర్ గా జీవితం ఇచ్చింది రాకేష్ మాస్టర్
-
చరణ్ అన్న క్యూట్ గ ఉంటాడు..
-
సుఖేష్ చంద్రశేఖర్ చాట్స్పై స్పందించిన కవిత
-
ప్రభాస్,ఎన్టీఆర్,చరణ్,బన్నీ వెనుక పడుతున్నబాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్
-
‘సాక్షి’ రక్తదాన శిబిరానికి విశేష స్పందన
లబ్బీపేట(విజయవాడతూర్పు): సాక్షి దినపత్రిక 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆటోనగర్లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సహకారంతో ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు. సాక్షి సిబ్బందితోపాటు శ్రేయోభిలాషులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. సాక్షి 15వ వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు. సాక్షి సిబ్బందితోపాటు విజయవాడ వన్టౌన్లోని కేబీఎన్ కళాశాల విద్యార్థులు, అజిత్సింగ్నగర్, సత్యనారాయణపురం, పటమట, ఆటోనగర్ తదితర ప్రాంతాలకు చెందిన శ్రేయోభిలాషులు కలిపి మొత్తం 60 మంది రక్తదానం చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రక్తదాన శిబిరం మధ్యాహ్నం 2 గంటల వరకూ కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని సాక్షి బ్రాంచి మేనేజర్ ఆర్.యశోదరాజ్, క్లస్టర్ ఇన్చార్జి ఎన్.వెంకటరెడ్డి, బ్యూరో ఇన్చార్జి ఒ.వెంకట్రామిరెడ్డి పర్యవేక్షించారు. విశాఖ ఆర్కే బీచ్లో చెత్త, వ్యర్థాలు సేకరిస్తున్న సాక్షి సిబ్బంది విశాఖలో ఆర్కే బీచ్ను శుభ్రం చేసిన ‘సాక్షి’ సిబ్బంది బీచ్రోడ్డు: ‘సాక్షి’ దినపత్రిక 15వ వార్షికోత్సవం సందర్భంగా విశాఖపట్నం యూనిట్ ఆధ్వర్యాన ఆర్కే బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ‘సాక్షి’ అడ్మినిస్ట్రేటివ్, ఎడిటోరియల్, రిపోర్టింగ్, యాడ్స్, సర్క్యులేషన్, టీవీ తదితర విభాగాలకు చెందిన సిబ్బంది గురువారం బీచ్లో చెత్త, వ్యర్థాలు సేకరించి జీవీఎంసీ పారిశుధ్య సిబ్బందికి అందించారు. విశాఖ సాగరతీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మరింత అందంగా ఉంటుందని, పర్యాటకులను ఆకర్షిస్తుందని ఈ సందర్భంగా విశాఖపట్నం యూనిట్ బ్రాంచి మేనేజర్ చంద్రరావు అన్నారు. -
‘ఏదైనా పత్రిక కొనుగోలుకు ఆర్థిక సాయం’ జీవోలను రద్దు చేయండి
సాక్షి, అమరావతి: విస్తృత సర్కులేషన్ ఉన్న ఏదైనా ఓ దినపత్రికను కొనుగోలు చేసేందుకు గ్రామ, వార్డు వలంటీర్, సెక్రటేరియట్లకు నెలకు రూ.200 మేర ఆర్థిక సాయాన్ని అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈనాడు) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ జీవోలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరింది. వలంటీర్లు, సెక్రటేరియట్ల ‘సాక్షి’ దినపత్రిక కోనుగోళ్లను పరిగణనలోకి తీసుకోకుండా ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్ (ఏబీసీ)ను ఆదేశించడంతో పాటు నిర్దిష్ట కాలాల్లో సాక్షి పత్రికకు ఇచ్చిన సర్కులేషన్ సర్టిఫికేషన్ను పునః సమీక్షించాలని కూడా ఏబీసీని ఆదేశించాలంటూ ఉషోదయ డైరెక్టర్ ఐ.వెంకట్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో పలు ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులను, ఏబీసీ సెక్రటరీ జనరల్తో పాటు వ్యక్తిగత హోదాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డిలతో పాటు వారికి చెందిన కంపెనీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై గురువారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం విచారించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, మధ్యంతర ఉత్తర్వుల జారీపై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 14న మధ్యంతర ఉత్తర్వులపై తమ నిర్ణయాన్ని వెలువరిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ లోపు ప్రధాన వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న పలు ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులకు, ఏబీసీ సెక్రటరీ జనరల్తో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి తదితరులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను 14వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఈనాడు న్యాయవాదుల అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ తోసిపుచ్చారు. జీవోలో ఎక్కడా కూడా ప్రభుత్వం సాక్షి దినపత్రికను మాత్రమే కొనాలని చెప్పలేదన్నారు. విస్తృత సర్కులేషన్ ఉన్న ఏ పత్రికనైనా కొనుగోలు చేసే వెసులుబాటు వలంటీర్లకు ఇచ్చిందన్నారు. -
గరం గరం వార్తలు @08:30 Pm 07 డిసెంబర్ 2022
-
ముగిసిన మునుగోడు ఉపఎన్నికల ప్రచారం
-
వైఎస్ఆర్ జిల్లాలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు
-
తెలంగాణ రాజ్ భవన్ లో బతుకమ్మ సంబరాలు
-
ఫొటోగ్రఫీ పోటీల్లో ‘సాక్షి’కి ఆరు బహుమతులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల ఫలితాలను గురువారం ప్రకటించారు. ఇందులో బంగారు తెలంగాణ విభాగంలో సాక్షి దినపత్రిక సూర్యాపేట ఫొటో జర్నలిస్టు అనమల యాకయ్యకు ద్వితీయ బహుమతి, పల్లె, పట్టణ ప్రగతి విభాగంలో సాక్షి హైదరాబాద్ సీనియర్ ఫొటో జర్నలిస్టు ఎన్.రాజేశ్రెడ్డి, ఇదే విభాగంలో సిద్దిపేట సాక్షి ఫొటో జర్నలిస్టు సతీశ్లకు కన్సోలేషన్ బహుమతి, అలాగే ఉత్తమ వార్తా చిత్రం విభాగంలో సాక్షి సంగారెడ్డి జిల్లా ఫొటో జర్నలిస్టు బి.శివప్రసాద్కు తృతీయ బహుమతి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో సాక్షి దినపత్రిక మహబూబ్నగర్ జిల్లా సీనియర్ ఫొటో జర్నలిస్టు వి.భాస్కర్ ఆచారికి తృతీయ బహుమతి, ఇదే విభాగంలో సాక్షి యాదాద్రి ఫొటో జర్నలిస్టు కె.శివకుమార్కు కన్సోలేషన్ బహుమతి లభించింది. సమాచార, పౌరసంబంధాల శాఖ వివిధ విభాగాల్లో పోటీలకు జూలై 9న ఎంట్రీలను ఆహ్వానించింది. దీనికి స్పందనగా 96 మంది మొత్తం 1,200 ఫొటోలను ఈ పోటీలకు పంపారు. జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాల రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం.నాగరాజు, సీనియర్ జర్నలిస్టు డాక్టర్ గోవిందరాజు చక్రధర్, హిందూ దినపత్రిక మాజీ చీఫ్ ఫొటోగ్రాఫర్ హెచ్. సతీష్ సభ్యులుగా ఉన్న కమిటీ విజేతలను ఎంపిక చేసింది. మొదటి బహుమతి కింద రూ. 20,000, ద్వితీయ బహుమతికి రూ.15,000, తృతీయ బహుమతికి 10,000, కన్సోలేషన్ బహుమతికి రూ.5,000 నగదు అలాగే జ్ఞాపిక, సర్టిఫికెట్ అందచేస్తారు. ఈనెల 25న విజేతలకు బహుమతులను అందచేస్తామని సమాచార, పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చెప్పాడంటే చేస్తాడంతే..!!
-
ప్రభుత్వ పాఠశాలలపై ఎల్లోమీడియా తప్పుడు కథనాలు రాసింది
-
హైదరాబాద్ రాంగోపాల్ పేట్ తకీల పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
-
ఏపీ,తెలంగాణ స్పీడ్ న్యూస్@7:00 PM - 23 ఫిబ్రవరి 2022
-
అంతా నిమిషాల్లోనే...
-
బాలిక దీనస్థితిపై కేటీఆర్ స్పందన
సాక్షి, మునుగోడు: తల్లిదండ్రులతో పాటు సోదరుడిని కోల్పోయి అనాథగా మిగిలిన పన్నెండేళ్ల బాలిక వందనను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ను ఆదేశించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చొల్లేడు గ్రామానికి చెందిన బొడ్డు అంజయ్య రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోగా.. అతడి కుమారుడు ఏడాది క్రితం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణ పాలయ్యాడు. భర్త, కుమారుడిని కోల్పోయిన పద్మ అనారోగ్యం బారినపడి ఇటీవల కన్నుమూసింది. దీంతో ఆమె కుమార్తె వందన ఒంటరిదైంది. ఆ బాలిక దీనగాథను ‘‘నాకు దిక్కెవరు దేవుడా’’ అనే శీర్షికన గత సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురితమైంది. చదవండి: (నాకు దిక్కెవరు దేవుడా?) ఆ వార్త క్లిప్పింగ్ను సంస్థాన్ నారాయణపురానికి చెందిన గంధమల్ల సతీష్ ట్విట్టర్లో పోస్టు చేశాడు. దాన్ని చూసిన మంత్రి కేటీఆర్ ఆ బాలికకు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. దీంతో కలెక్టర్ మంగళవారం జిల్లా సంక్షేమ అధికారిణి సుభద్రని అనాథ బాలికను పరామర్శించి స్థితిగతులు తెలుసుకోవాలని ఆదేశించారు. అందుకు ఆమె వెంటనే గ్రామానికి చేరుకుని వందనని పరామర్శించి తల్లి దశదిన కరమ్మ అనంతరం చిల్డ్రన్స్ వెల్ఫేర్ సెంటర్కు తరలిస్తామని తెలిపారు. ఇతర వసతుల ఏర్పాట్లపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని, అప్పటి వరకు బంధువులు, గ్రామస్తులు బాలికకు అండగా ఉండాలని కోరారు. తక్షణ సాయంగా రూ.30వేల నగదును ఆ బాలికకు అందించారు. ఆమె వెంట సీడీపీఓ కవిత, ఏసీడీపీఓ వెంకటమ్మ, సూపర్వైజర్ జ్యోతి తదితరులు ఉన్నారు. -
వార్తా పత్రికలు శుభ్రమైనవి..
-
‘సాక్షి’ శానిటైజ్ చేసి...
సాక్షి, హైదరాబాద్ : వార్తాపత్రికల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు, వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు. వార్తాపత్రికల విషయంలో కొందరు పనికట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిజానికి పత్రికల వల్ల వైరస్ వ్యాప్తి అన్నది జరగదు. అయినప్పటికీ పత్రిక ప్రచురణలో సాక్షి మరిన్ని జాగ్రత్తలు చేపట్టింది. పత్రిక ముద్రణ ప్రక్రియలో అడుగడుగునా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. ఎక్కడా నిర్లక్ష్యం దొర్లకుండా, తమపై ప్రజలకున్న విశ్వాసాన్ని కాపాడుకుంటూ పూర్తి రక్షణ, ఆరోగ్యకరమైన వాతావరణంలో పత్రికలను ముద్రిస్తోంది. ముద్రణ నుంచి ప్యాకింగ్ వరకు ప్రతి అడుగులో జాగ్రత్తలు పాటిస్తూ పత్రికలపై ప్రత్యేకమైన ఏర్పాట్ల మధ్య శానిటైజర్ స్ప్రే వెదజల్లుతోంది. పాఠకులకు ఎలాంటి అనుమానాలకు తావులేకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించడానికి వార్తాపత్రికల నిరంతర సరఫరా అత్యవసరమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వార్తా పత్రికలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ క్లిష్ట సమయంలో తప్పుడు వార్తలను నిరోధించాలన్నా, ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించడానికి వార్తా పత్రికలు ప్రధాన పాత్ర పోషిస్తాయని కేంద్రం పేర్కొంది. వార్తా పత్రికలు శుభ్రమైనవి.. వైరస్ ఉండదు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. వార్తా పత్రిక, మ్యాగజైన్, ప్రింట్ చేసిన లేఖ, ప్యాకేజీల ద్వారా వ్యాపిస్తున్నట్లు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారమూ లేదని ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ (ఐఎన్ఎంఏ) ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్, సీఈవో ఎర్ల్జే విల్కిన్సన్ స్పష్టం చేస్తున్నారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన డాక్టర్లు, శాస్త్రవేత్తలందరి అభిప్రాయమూ ఇదేనని ఆయన తెలిపారు. కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న అపోహ చాలా చోట్ల కనిపిస్తోందని, సైన్స్ పరంగా ఇందులో వాస్తవాలేమిటో తెలియజేయాల్సిందిగా కొంతకాలంగా ఐఎన్ఎంఏను కోరుతున్నారని ఆయన చెప్పారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు పలు అంతర్జాతీయ పరిశోధన సంస్థలు జరిపిన పరిశోధనలు కూడా వార్తా పత్రికల ద్వారా కరోనా వ్యాప్తి చెందదని ఇప్పటికే స్పష్టంచేశాయని ఆయన తెలిపారు. కరోనా కేసులున్న ఏ ప్రాంతంలోనైనా వార్తా పత్రికలు, మ్యాగజైన్లతో కూడిన ప్యాకేజీలను తీసుకోవడం, చదవడం వల్ల ఎలాంటి ముప్పూ ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కరోనా వైరస్ సోకిన వ్యక్తి వార్తా పత్రికలను ముట్టుకున్నా అతడి నుంచి కాగితంపైకి వైరస్ సోకదని, వార్తా పత్రికల రవాణా ద్వారా కూడా సమస్య ఏమీ ఉండదని స్పష్టంగా తెలిపింది. బీబీసీ మాట కూడా ఇదే.. ఈ నెల 10వ తేదీ బీబీసీ రేడియో జాన్ ఇన్నెస్ సెంటర్లోని వైరాలజిస్ట్ జార్జ్ లొమోనోస్సాఫ్తో ఒక ఇంటర్వ్యూ ప్రసారం చేస్తూ.. వార్తా పత్రికలు చాలా శుభ్రమైనవి అని స్పష్టం చేశారు. ప్రింటింగ్ కోసం వాడే సిరా, ప్రింటింగ్ జరిగే పద్ధతి తదితర కారణాల వల్ల వార్తా పత్రికల ఉపరితలంపై వైరస్ ఉండే అవకాశాలు అత్యల్పమని ఆయన తెలిపారు. వివిధ ఉపరితలాలపై కరోనా వైరస్ (సార్స్–సీఓవీ2) ఎంత కాలం ఉంటుందన్నదానిపై ఇటీవలే ఒక పరిశోధన జరిగిందని, దాని ప్రకారం వార్తా పత్రికలపై వైరస్ ఉండే అవకాశమే లేదని స్పష్టమైందని ఐఎన్ఎంఏ సీఈవో ఎర్ల్ జే విల్కిన్సన్ తెలిపారు. మొత్తమ్మీద చూస్తే వార్తా పత్రికల ద్వారా కరోనా వ్యాపించిన సంఘటన ఇప్పటివరకూ ఒక్కటి కూడా నమోదు కాలేదు. వాడే సిరా, ప్రింటింగ్ పద్ధతుల కారణంగా మిగిలిన వాటికంటే వార్తా పత్రికలు ఎంతో శుభ్రంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా వార్తా పత్రికల ప్రచురణ కర్తలు ప్రింటింగ్, పంపిణీ జరిగే చోట, న్యూస్స్టాండ్లలో, ఇళ్లకు చేరే సమయంలోనూ పలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారని ఎర్ల్ జే. విల్కిన్సన్ తెలిపారు. -
5 నిమిషాలు.. 25 వార్తలు@4PM
-
హేట్సాఫ్ టు సాక్షి
సాక్షి, రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరానికి చెందిన సవితాల సుబ్బలక్ష్మి పేరు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైంది. బీకామ్ కంప్యూటర్స్ పూర్తి చేసిన ఆమె ఒక ప్రై వేట్ సంస్థలో చిరుద్యోగి. తండ్రి వేణుగోపాలకృష్ణ మరణంతో తల్లితో కలసి ఉంటున్నారు. సుబ్బలక్ష్మికి మొదటినుంచీ ’సాక్షి’ దినపత్రిక అంటే ఇష్టం. అందులోనూ ఫ్యామిలీ పేజీల్లో ప్రచురితమయ్యే వెజ్, నాన్వెజ్ కర్రీల వివరాలు చదివి, ఆ క్లిప్పింగులను భద్రపరిచేవారు. ఈవిధంగా 2010 అక్టోబర్ నుంచి 2018 డిసెంబర్ వరకూ ’సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వంటకాలకు సంబంధించిన క్లిప్పింగులను పదిలపరచి, బైండింగ్ చేయించారు. ఈ సేకరణకు గానూ ఆమె పేరు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైంది. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా ఆమె ఆదివారం వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ’సాక్షి’ దినపత్రికలో ప్రచురితమవుతున్న ’వింతలు – విచిత్రాలు’ శీర్షికకు సంబంధించిన క్లిప్పింగులను కూడా పదిలపరిచానని, త్వరలో మరో మూడు బుక్ ఆఫ్ రికార్డుల్లో తన పేరు నమోదు కానున్నదని సుబ్బలక్ష్మికి తెలిపారు. పరోక్షంగా తనకు గుర్తింపు తీసుకువచ్చిన ’సాక్షి’కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
అభిమానానికి ‘సాక్షి’
గుర్రంకొండ: ఆయన యాచకుడు. సాక్షి దినపత్రిక చదవందే తృప్తి ఉండదు. భిక్షాటన చేసిన చిల్లరతోనే పేపర్ కొంటాడు. పత్రిక ఆసాంతం చదవిన తరువాతే తన దినచర్య ప్రారంభిస్తాడు. వైఎస్ఆర్, జగన్పై అభిమానమే పత్రికపై మమకారం పెంచిందని తెలిపాడు. మండలంలోని చెర్లోపల్లెకు చెందిన ధర్మయ్య (80) యాచనతోనే జీవిస్తుంటాడు. రెడ్డెమ్మ దేవస్థానం లేదా ఖాళీ జాగాల్లో ఎక్కడ చల్లగా ఉంటే అక్కడ సేదదీరుతుంటాడు. రెడ్డెమ్మ కొండకు వచ్చే భక్తులు, స్థానికులు ఇచ్చే కాసులతో కడుపు నింపుకుంటాడు. యాచనతో జీవిస్తున్న అతడు తన చిన్న కోరికలను అణిచేసుకోవడం లేదు. ఉదయం లేవగానే సాక్షి దినపత్రిక చదవడం అలవాటు. వైఎస్సార్, జగన్ అంటే వీరాభిమానం ఉన్న అతడు దాతలు ఇచ్చే చిల్లరతోనే సాక్షి దినపద్రిక కొంటాడు. గ్రామంలోని ఏదో ఇంటిమెట్లపై కూర్చుని నింపాదిగా పత్రికలోని అన్ని విషయాలు చదువుతాడు. ఆ తర్వాతే తన దినచర్యలో భాగమైన భిక్షాటనకు బయల్దేరతాడు. ఇంతకు ముందు పత్రికను అక్కడా, ఇక్కడా చదివేవాడినని.. అయితే మూడేళ్లుగా సాక్షి పత్రికను కొని చదవడం అలవాటు చేసుకున్నట్లు తెలిపాడు. సాక్షి చదవకుంటే వెలితిగా ఉంటుందని, వార్తలు చదివిన తర్వాతే తన పని ప్రారంభిస్తానని చెప్పాడు. -
‘సాక్షి’కి ప్రకటనల జారీలో ప్రభుత్వ వివక్ష...
సాక్షి, అమరావతి: సాక్షి దినపత్రికకు ప్రచార ప్రకటనల జారీలో రాష్ట్ర ప్రభుత్వం వివక్షకు పాల్పడడాన్ని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పుపట్టింది. ఆ రెండు పత్రికలకు (ఈనాడు, ఆంధ్రజ్యోతి) అత్యధిక బిజినెస్ను కల్పించారని, అయితే భారీ సర్క్యులేషన్ గల సాక్షి పత్రికకు మాత్రం అతి తక్కువ బిజినెస్ను కల్పించారని, ఇందులోనే వివక్ష కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని పేర్కొంది. ఇందుకు కారణాలు ఏమిటో తెలియజేయాలని, ఒక విధానం లేకుండా ప్రచార ప్రకటనలు ఎలా జారీ చేశారో సమాధానం చెప్పాల్సిందిగా సమాచార శాఖను కాగ్ కోరింది. దీనిపై సమాచార శాఖ కమిషనర్ కాగ్కు లిఖిత పూర్వక సమాధానమిస్తూ.. ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయం ఆదేశాల మేరకే ఆ రెండు పత్రికలకు ఎక్కువ బిజినెస్ కల్పించామని, సాక్షికి తక్కువ కల్పించడానికి కూడా వారి ఆదేశాలే కారణమని స్పష్టం చేశారు. దీనిపై సంతృప్తి చెందని కాగ్.. సరైన సమాధానం చెప్పాల్సిందిగా మరోసారి కోరింది. దీనిపై కూడా సమాచార శాఖ కమిషనర్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తూ సీఎం, ఆయన కార్యాలయం ఆదేశాల మేరకే పనిచేశామని, అంత పెద్దస్థాయిలో ఆదేశాలను అమలు చేయడం తప్ప చేసేదేమీ ఉండదని పేర్కొన్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2017–18 వరకు సమాచార శాఖ జారీ చేసిన ప్రచార ప్రకటనలపై కాగ్ నివేదికను రూపొందించింది. మూడేళ్లలో సమాచార శాఖ ప్రచార ప్రకటనలకు 125.42 కోట్ల రూపాయలను వ్యయం చేసిందని, ఇందులో 44 శాతం అంటే 54.04 కోట్ల రూపాయల మేర ఆ రెండు పత్రికలకే (ఈనాడు, ఆంధ్రజ్యోతి) ప్రయోజనం కలిగించిందని కాగ్ ఎత్తి చూపింది. అత్యధిక సర్క్యులేషన్ గల సాక్షి పత్రికకు కేవలం 8.99 కోట్ల రూపాయల బిజినెస్ను మాత్రమే ఇచ్చారని, తక్కువ సర్క్యులేషన్ గల ఆంధ్రజ్యోతికి భారీ బిజినెస్ ఎలా కల్పించారని ప్రశ్నించింది. ప్రకటనల జారీలో సహజ న్యాయాన్ని, పారదర్శకతను పాటించలేదని కాగ్ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని తేటతెల్లమైందని పేర్కొంది. -
సాక్షికి మరో అరుదైన ఘనత
-
‘సాక్షి’కి అరుదైన ఘనత
తెలుగువారి మనస్సాక్షి.. ‘సాక్షి’మరో అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ కలర్ క్వాలిటీ క్లబ్ (ఐసీక్యూసీ) నిర్వహించిన కలర్ కాంపిటీషన్లో విజయ పతాకం ఎగురవేసింది. వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్పేపర్స్ అండ్ న్యూస్ పబ్లిషర్స్, వాన్–ఇఫ్రా రెండేళ్లకోసారి వార్తాపత్రికల కలర్ ప్రింటింగ్ నాణ్యతపై ప్రపంచవ్యాప్తంగా పోటీ నిర్వహిస్తుంది. 2018–2020కి సంబంధించి నిర్వహించిన పోటీలో సాక్షికి చెందిన 22 యూనిట్లు విజయం సాధించాయి. ఇందుకు సంబంధించిన క్లబ్ సభ్యత్వ పత్రాలను బుధవారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో సాక్షి 22 యూనిట్లకు చెందిన ప్రతినిధులు అందుకున్నారు. -
మెట్రో స్టేషన్లలో ‘సాక్షి’
-
మెట్రో స్టేషన్లలో ‘సాక్షి’
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు ప్రతినిత్యం సాక్షి దినపత్రిక అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న 24 మెట్రో కేంద్రాలలో ప్రయాణికుల కోసం ఇకనుంచి ప్రతిరోజూ సాక్షి దినపత్రిక అందుబాటులో ఉంచే కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలైంది. అమీర్పేట మెట్రో స్టేషన్లో ఏర్పాటుచేసిన తొలి "సాక్షి స్టాల్"ను ఆయన ప్రారంభించారు. బుధవారం నుంచి అన్ని మెట్రో కేంద్రాల్లో సాక్షి దినపత్రిక ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. అందుకోసం మెట్రో స్టేషన్లలోని ఫ్లాట్ఫామ్స్కు ఇరువైపుల సాక్షి స్టాల్స్ ఏర్పాటుచేశారు. ప్రతిరోజూ మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్న వేలాదిమందికి సాక్షి దినపత్రికను అందుబాటులో తేవడం శుభపరిణామమని ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి అభినందించారు. అమీర్పేట మెట్రో స్టేషన్లో ప్రారంభమైన తొలి స్టాల్ నుంచి సాక్షి అడ్వర్టయిజింగ్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ కేఆర్పీ రెడ్డి చేతుల మీదుగా ‘సాక్షి’ ప్రతిని అందుకుని ఈ సరికొత్త ప్రయోగానికి ఎన్వీఎస్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె రామచంద్రమూర్తి, డైరెక్టర్ కార్పొరేట్ అఫేర్స్ రాణిరెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ వై ఈశ్వరప్రసాద రెడ్డి, అడ్వర్టయిజింగ్ అండ్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ కమల్ కిషోర్ రెడ్డి, ఎల్ అండ్ టీ ప్రతినిధి సారికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.