Teacher MLC election
-
ఇంతకన్నా అవమానం ఉపాధ్యాయ లోకానికి ఏమన్నా ఉంటుందా?
ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు ఉపాధ్యాయుల ప్రవర్తన మొత్తం ఉపాధ్యాయ లోకాన్ని తలదించు కునేలా చేసింది. ఈ ఎన్నికల్లో డబ్బు తీసుకుని కొందరు ఉపాధ్యాయులు ఓటు వేయడం ద్వారా పవిత్రమైన వృత్తినే కాక ప్రజాస్వామ్యాన్ని కూడా పరిహాసం చేశారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) ఉపాధ్యాయ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఒక జాతీయ రాజకీయ పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థి ఓటుకు 5 వేల చొప్పున ఒక్కొక్క టీచర్కు పంచారనే ఆరోపణ బలంగా వ్యాప్తి చెందింది.నిజంగా ఈ డబ్బు తీసుకుని ఉపాధ్యాయులు (Teachers) ఓటు వేసి ఉంటే వారిలో ఏ స్థాయిలో నైతిక విలువలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి టీచర్లు రేపటి భావిసమాజాన్ని ఎలా తయారు చేస్తారు? డబ్బులు ఇస్తే తీసుకోవడమే తలవంపులైతే... ఏకంగా ‘మాకు ఐదు వేలు కావాలి, రెండు వేలైతే ఓటు వెయ్యం’ అని బేరసారాలకు టీచర్లు దిగారంటూ వార్తలు వచ్చాయి. ఇంతకన్నా అవమానం ఉపాధ్యాయ లోకానికి ఏమన్నా ఉంటుందా?గత దశాబ్ద కాలంగా తెలంగాణ (Telangana)లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఉన్నవారు కూడా కొందరు రాజకీయ నాయకుల్లాగానే డబ్బులు వసూలు చేయడం, పైరవీలు చేయడం లాంటి పనులతో కోట్లకు పడగెత్తారనే ఆరోపణలూ ఉన్నాయి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర శాసన మండలిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎంతో హుందాతో, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేసేవారన్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.భారత సమాజంలో ఉపాధ్యాయుడి పాత్ర ఎంతో ఉన్నత మైనదీ, గౌరవప్రదమైనదీ! జ్యోతిబా ఫూలే – సావిత్రీబాయి ఫూలే దంపతులు సమాజంలోని మూఢ నమ్మకాలను పారదోలి వెలుగును నింపడానికి ఉపాధ్యాయ వృత్తినే ఆయుధంగా చేసుకున్నారు. కందు కూరి వీరేశలింగం పంతులు వంటివారు సంఘసంస్కర్తగా, విద్యావ్యాపకునిగా చేసిన సేవ ఉపాధ్యాయుని విలువను తెలియచేస్తోంది. సమాజాన్ని మార్చే అద్భుత అవకాశం ఉన్న విద్యారంగంలో నాటి విలువలు అడుగంటాయి. దీనికి కారణం ఒక విధంగా కార్పొరేట్ శక్తులు విద్యారంగంలోకి ప్రవేశించడమే కావచ్చు. విద్యావ్యాపారంలో కోట్లు సంపాదించినవారు రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాజకీయ పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేసి డబ్బును వెదజల్లి గెలవడం ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం.గత సంవత్సరం జరిగిన హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేసిన ఓ వ్యక్తి కోట్లు ఖర్చుపెట్టి, టీచర్లను ఆర్థిక ప్రలోభాలకు గురిచేశారనే ప్రచారం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే!చదవండి: సమ సమాజమా? సంక్షేమ రాజ్యామా?ఈ పరిస్థితులను గమనిస్తుంటే రానున్న కాలాన్ని ఊహించడానికే భయమేస్తోంది. మేధా సంపత్తి, సేవా గుణం, వాక్చాతుర్యం ఉన్న ఉపాధ్యాయ సంఘాల నేతలకు బదులు ఇక డబ్బున్న కార్పొరేట్ విద్యాలయాల మేనేజ్మెంట్లకు చెందినవారే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా గెలుస్తారు కాబోలు! అలా వీరు గెలవకుండా ఉండాలంటే లక్షల రూపాయలు జీతంగా పొందే టీచర్లు... ఐదు, పదివేలకు కక్కుర్తిపడి ఓటును అమ్ముకోకుండా ఓటు వేయడమే మార్గం.– డాక్టర్ కొండి సుధాకర్ రెడ్డి, రిటైర్డ్ సీనియర్ లెక్చరర్ -
బాబు ప్రజా కంటక పాలనకు టీచర్ల చెంపదెబ్బ..‘మాస్టర్’ స్ట్రోక్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టి.. పది నెలలుగా ప్రజా కంటక పాలనతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న టీడీపీ, జనసేన కూటమి పార్టీలకు ఏడాదిలోపే చావుదెబ్బ తగిలింది! అధికార మదంతో విర్రవీగుతున్న కూటమి నేతలకు విజ్ఞులైన ఉపాధ్యాయులు బెత్తంతో బడిత పూజ చేశారు! ప్రజాస్వామ్య విలువలను చాటిచెబుతూ.. కూటమి మోసాలను తిప్పికొడుతూ గుణపాఠం లాంటి తీర్పు ఇచ్చారు. పట్టుమని పది నెలల్లోనే టీడీపీ కూటమి సర్కారుపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయి. సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న రెడ్బుక్ పాలన, ప్రజా కంటక విధానాలకు ఉపాధ్యాయులు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారు. మొత్తం యంత్రాంగాన్ని మోహరించి అధికార బలాన్ని ప్రయోగించినా కూటమి సర్కారు పాచికలు పారలేదు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు అధికారికంగా తమ అభ్యర్ధిగా ప్రకటించిన రఘువర్మ పరాజయం పాలయ్యారు. ప్రతి నియోజకవర్గంలో అధికార పార్టీ తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో బలాన్ని ప్రయోగించినా.. ఓటుకు నోట్లు ఎరవేసినా ఈ సర్కారు పట్ల తమ వ్యతిరేకతను ఉపాధ్యాయులు స్పష్టంగా ఓటు రూపంలో వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్లు ఎన్నికల్లో పాల్గొన్న తీరు, ఫలితం.. ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత నెలకొందో స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల్లో హామీలిచ్చి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలను మోసగించిందని మండిపడుతున్నారు. కూటమి అభ్యర్థి రఘువర్మ గెలుపు కోసం కృషి చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వెబెక్స్ ద్వారా స్వయంగా ఆదేశాలు జారీ చేస్తూ వచ్చినా భంగపాటు తప్పలేదు. ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసికట్టుగా తమ అభ్యర్ధిగా ప్రకటించిన గాదె శ్రీనివాసులు నాయుడును గెలిపించి కూటమి సర్కారుపై తమ ఆగ్రహాన్ని చాటుకున్నాయి. తమ ఓటు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకమని స్పష్టంగా తేల్చి చెప్పారు. కాగా తమ అభ్యర్థి ఓడిపోవడంతో కూటమి నేతలు ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. పోలింగ్ రోజు వరకూ తమ అభ్యర్థి రఘువర్మను గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించి అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టీడీపీ నేతలు ఆయన ఓడిపోవడంతో.. గెలిచిన గాదె శ్రీనివాసులు కూడా తమవారేనంటూ కొత్త పల్లవి అందుకోవడం టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే రఘువర్మను తమ అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా ప్రకటించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి షాక్ తగలడంతో సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. దీని నుంచి బయటపడేందుకు పోలీస్ కమిషనర్ ఫోన్ ద్వారా గెలిచిన అభ్యర్థి గాదెతో ఆయన స్వయంగా ఫోన్లో మాట్లాడారంటే టీడీపీని పరాజయం ఏ స్థాయిలో వణికించిందో అర్థం అవుతోంది. సజావుగా జరిగి ఉంటే.. ఆ రెండు చోట్ల కూడా! కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ నేతలు భారీగా నగదు పంపిణీతో పాటు పీడీఎఫ్ అభ్యర్థి కుటుంబ సభ్యులు, ఏజెంట్లపై దాడులకు దిగి బీభత్సం సృష్టించారు. దొంగ ఓట్లను నమోదు చేసి... ఏకంగా రిగ్గింగుకు కూడా తెగబడ్డారు. స్వయంగా అధికార పార్టీ నేతలే విచ్చలవిడిగా డబ్బులను పంపిణీ చేశారు. ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే ఇక్కడ కూడా అధికార కూటమికి కచ్చితంగా ఓటమి ఎదురయ్యేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండో స్థానం కోసం పోటాపోటీ... ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ నుంచి బరిలో నిలిచిన గాదె శ్రీనివాసులు నాయుడు ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచారు. ఏ రౌండ్లో కూడా కూటమి అభ్యర్థి రఘువర్మకు మెజార్టీ రాకపోవటాన్ని గమనిస్తే టీడీపీ సర్కారుపై ఉపాధ్యాయుల్లో ఎంత వ్యతిరేకత ఉందో తేటతెల్లమవుతోంది. పైగా పీడీఎఫ్ నుంచి బరిలో నిలిచిన విజయగౌరి నుంచి రెండో స్థానం కోసం కొన్ని రౌండ్లల్లో రఘువర్మ పోటీని ఎదుర్కొన్నారు. ఒక దశలో పీడీఎఫ్ అభ్యర్థికి, కూటమి అభ్యర్థి రఘువర్మకు మధ్య పెద్దగా తేడా లేకపోవడంతో మూడో స్థానానికి పడిపోతారా? అనే ఆందోళన కూటమి నేతల్లో గుబులు రేపింది. ప్రధానంగా అధికార టీడీపీ, జనసేన పట్ల తమ వ్యతిరేకతను ఉపాధ్యాయులు ఓట్ల ద్వారా చాటిచెప్పారు. రాజకీయ జోక్యంతో...! టీడీపీ, జనసేన అధికారికంగా రఘువర్మను తమ అభ్యర్థిగా ప్రకటించాయి. గెలుపు కోసం అధికారపార్టీ ఎమ్మెల్యేలు విశ్వ ప్రయత్నాలు చేశారు. కూటమి పార్టీల తరపున బరిలో నిలిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీని గెలిపించాలంటూ టీచర్లపై ఒత్తిళ్లు తెచ్చారు. ప్రధానంగా ప్రైవేటు టీచర్లను బెదిరించే ధోరణిలో వ్యవహరించారు. ఎంత చేసినా ప్రజా వ్యతిరేకతను తప్పించుకోలేకపోయారు. అధికార పార్టీకి చెందిన విద్యాలయాల్లో పని చేసే ప్రైవేట్ టీచర్లు సైతం కూటమి అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటేశారంటే ఈ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత నెలకొందో ఊహించవచ్చు. కూటమికి చెంపదెబ్బ: బొత్ససాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి చెంప దెబ్బ లాంటివని శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యన్నారాయణ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన కూటమి పార్టీలకు ఏడాదిలోపే చావుదెబ్బ తగిలిందన్నారు. అధికారం ఉందనే అహంకారంతో అరాచకాలు చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలకు విజ్ఞులైన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు బెత్తంతో కొట్టి మరీ గట్టిగా గుణపాఠం చెప్పారన్నారు. ఫలితాలపై సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘ఈ ఎన్నికల ద్వారా ఉపాధ్యాయులు ప్రజాస్వామ్య విలువలను మరోసారి చాటిచెప్పారు. కూటమి ప్రభుత్వ మోసాలను తిప్పికొడుతూ గట్టి తీర్పు ఇచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్లు ఎన్నికల్లో పాల్గొన్న తీరు, వచ్చిన ఫలితం.. ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో తేటతెల్లం చేస్తున్నాయి. ఎన్నికల్లో హామీలిచ్చి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలను మోసగించింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దగా చేసింది. ఇప్పటికైనా ఎన్నికల హామీలను అమలు చేయాలి. లేదంటే స్థానిక ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకూ కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని బొత్స పేర్కొన్నారు.విశాఖ ఏయూలోని కౌంటింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రాల్ని లెక్కిస్తున్న పోలింగ్ సిబ్బంది అవునా.. అచ్చెన్న మద్దతిచ్చారా! : గాదెతమ ఫొటోలు పెట్టుకొని గెలిచారని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు గాదె శ్రీనివాసులు నాయుడును కోరగా.. అవునా..! అచ్చెన్న మద్దతిచ్చారా.. దానిపై నాకు అవగాహన లేదంటూ బదులిచ్చారు. ‘ఫొటోల వల్ల కాదు.. ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో మాత్రమే గెలిచా’ అని పేర్కొన్నారు. కూటమికి కౌంట్డౌన్ : ధర్మాన కృష్ణదాస్నరసన్నపేట: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్ధికి ఉపాధ్యాయులు తగిన బుద్ధి చెప్పారని, కూటమికి కౌంట్డౌన్ మొదలైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడికి అభినందనలు తెలిపారు. కూటమి బలపరిచిన అభ్యర్థి ఓటమికి కారణం ప్రభుత్వం పట్ల వ్యతిరేకతేనన్నారు. అధికారం కోసం అలవికాని హామీలు ఇచ్చి కూటమి నాయకులు ప్రజల్ని మభ్య పెట్టారన్నారు. తొమ్మిది నెలల్లోనే కూటమి పాలనపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం ఉత్తరాంధ్ర ఫలితంఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిని ఘోరంగా ఓడించి తొమ్మిది నెలల ప్రభుత్వ పాలనపై ఉపాధ్యాయులు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో చూపించారని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ రెడ్డి, గడ్డం సు«దీర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదర్శ పాఠశాలల ఏర్పాటుపై ఒత్తిడి తగదు ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు గ్రామస్తులను ఒప్పించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయులపై ఒత్తిడి చేయొద్దని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.ఆధిక్యంలో ఆలపాటిగుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్ధరాత్రి 12 గంటలకు ఐదో రౌండు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ 47,872 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం పోలైన ఓట్లు 1,40,297 కాగా చెల్లని ఓట్లు 14,888 ఉన్నాయి. పోలైన ఓట్లలో ఆలపాటి రాజేంద్రప్రసాద్కు 84,595, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుకు 36,723 వచ్చాయి. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉభయ గోదావరి తొలిరౌండ్ ఫలితాల వెల్లడిసాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తొలి రౌండ్ పూర్తయింది. మొదటి రౌండులో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు 16,520 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి దిడ్ల వీర రాఘవులుకు 5,815 ఓట్లు, జీవీ సుందర్కు 1,968 ఓట్లు వచ్చాయి. 2,416 చెల్లని ఓట్లుగా గుర్తించారు. ప్రతి రౌండ్కూ 28 వేల ఓట్ల చొప్పున 9 నుంచి 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా అధికారులు కౌంటింగ్లో మార్పులు చేశారు. ఇకనైనా సమస్యలపై దృష్టి సారించాలి ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి. గత తొమ్మిది నెలలుగా ఈ ప్రభుత్వ పాలనలో తమ సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదన్న విషయాన్ని ఈ ఫలితం ద్వారా చాటారు. ఉపాధ్యాయుల సరెండర్ లీవ్స్, సీఎఫ్ఎంఎస్లో పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలి. డీఏ బకాయిలను చెల్లించడంతో పాటు పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలి. – డాక్టర్ కరుణానిధి మూర్తి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, పీఆర్టీయూపాలక పార్టీల ఓటమికి నిదర్శనం.. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒక అభ్యర్ధికి మద్దతు ప్రకటించి ప్రచారం చేశాయి. అధికార పార్టీ నేతలు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా అధికారాన్ని ఉపయోగించి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నించారు. ఒకటో తేదీనే జీతాలు అని హామీ ఇచ్చినా ఆలస్యం అవుతున్నాయి. డీఏ బకాయిలు చెల్లించలేదు. పీఆర్సీ కమిటీని నియమించలేదు. బకాయిల విషయంలో స్పష్టత లేదు. ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించలేదు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించడం పాలక పార్టీల ఓటమికి నిదర్శనం. – హృదయరాజు, ఏపీటీఎఫ్ (1938) రాష్ట్ర అధ్యక్షుడుకూటమి పార్టీలు – ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీ.. రాజకీయ పార్టీల కూటమి.. ఉపాధ్యాయ సంఘాల మధ్య జరిగిన పోటీ ఇది. ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాల కూటమి విజయం సాధించింది. ఉపాధ్యాయ సంఘాలు సమస్యలపై పోరాడి సాధించుకోవాలి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడం సరికాదు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు అభ్యర్థి రఘువర్మకు మద్దతుగా నిలిచాయి. ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడును బరిలో నిలిపి గెలిపించుకున్నాయి. – పైడి రాజు, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూప్రభుత్వంపై సామ దాన భేద దండోపాయాలకు సిద్ధంఈవిజయం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులందరిదీ. నా గెలుపు కోసం మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా. ఈ విజయంతో నాకు కీలక బాధ్యతలు అప్పగించారు. నా విజయానికి ఏ పార్టీతోనూ సంబంధం లేదు. ఉపాధ్యాయ సంఘాల మద్దతుతోనే నేను గెలుపొందా. నా గెలుపును రాజకీయాలతో ముడిపెట్టొద్దు. ఉపాధ్యాయుల రుణం తీర్చుకుంటా. నా పనితీరును బట్టి నన్ను గెలిపించారు. 2007 నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రాజకీయాలకు అతీతంగానే పనిచేశా. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తా. అవసరమైతే ప్రభుత్వంపై సామ దాన బేధ దండోపాయాలకు సిద్ధంగా ఉన్నా. – గాదె శ్రీనివాసులునాయుడు, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ విజేత -
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. అప్డేట్స్
MLC Election Counting Updates..కరీంనగర్ జిల్లా :కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న బిజెపిటీచర్స్ ఓట్ల లెక్కింపు పూర్తి.భారీ మెజారిటీతో బిజెపి అభ్యర్థి మల్క కొమురయ్య విజయం.అధికారికంగా ఇంకా ప్రకటించని అధికారులు.కరీంనగర్ జిల్లా:కరీంనగర్ టీచర్ MLC మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపుకాసేపట్లో అధికారిక ప్రకటనవరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్ నల్లగొండ జిల్లా :కౌంటింగ్ హాల్ వద్ద మీడియాతో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డిగెలుపోటములు సహాజంఓటమిని అంగీకరిస్తున్నాగెలిచిన అభ్యర్థి ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాలని సూచిస్తున్నఓడిపోయినందుకు బాధపడటం లేదుఉపాధ్యాయులు రెండోసారి నన్ను గెలిపించాలని అనుకోలేదేమోప్రచారం ఉధృతంగా చేసినా నేను ఎందుకు ఓడిపోయానో ఉపాధ్యాయులకు తెలుసు. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదు.వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :కొనసాగుతున్న ఎలిమినేషన్ ప్రక్రియ18 రౌండ్ ఫలితాలుటీ పీఆర్టీయూ అభ్యర్థి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేట్మరికాసేపట్లో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియవరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :కొనసాగుతున్న 17వ రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియస్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభంసుందర్ రాజుకు వచ్చిన (3115) ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులువరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :కొనసాగుతున్న ఎలిమినేషన్ ప్రక్రియతొలి స్థానంలో ఉన్న పీఆర్టీయూ అభ్యర్థి టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి విజయానికి ఇంకా 4149 ఓట్లు అవసరంరెండో స్థానంలో ఉన్న యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి 6162 ఓట్లు అవసరంవరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :15 రౌండ్ ఫలితాలుబీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి ఎలిమినేట్వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :16 రౌండ్ ఫలితాలుబీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి ఎలిమినేట్సరోత్తం రెడ్డి ఎలిమినేషన్ తర్వాతశ్రీపాల్ రెడ్డి- 7673అలుగుబెల్లి నర్సిరెడ్డి- 5660హర్షవర్ధన్ రెడ్డి- 5309పూల రవీందర్- 3992కరీంనగర్ :టీచర్స్ కోటా ఎమ్మెల్సీలో ముందంజలో ఉన్న బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్యసంబరాలకు సిద్దమవుతున్న బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యమొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపు దిశగా కొమరయ్యకరీంనగర్: కొనసాగుతున్న టీచర్ ఎమ్మెల్సీ టేబుల్ కౌంటింగ్.మొదటి 14 వేల ఓట్ల లెక్కింపు సాగుతుండగా.. లీడ్ లో కొనసాగుతున్న బిజెపి అభ్యర్థి మల్క కొమురయ్యవిక్టరీ సింబల్ చూపిస్తూ కౌంటింగ్ ఆలోచించి బయటికి వచ్చిన మల్క కొమురయ్యవరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :ప్రారంభమైన 16వ రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియబీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభంసరోత్తం రెడ్డికి వచ్చిన (2289) ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులువరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా:15 రౌండ్ ఫలితాలుస్వతంత్ర అభ్యర్థి సుందర్ రాజు(2040 ఓట్లు) ఎలిమినేట్15వ రౌండ్ తర్వాత ఓట్ల వివరాలుశ్రీపాల్ రెడ్డి- 6916అలుగుబెల్లి నర్సిరెడ్డి- 5205హర్షవర్ధన్ రెడ్డి- 4799పూల రవీందర్- 3617పులి సరోత్తం రెడ్డి-2645వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :కొనసాగుతున్న 15వ రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియస్వతంత్ర అభ్యర్థి సుందర్ రాజు ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభంసుందర్ రాజుకు వచ్చిన (2040) ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులువరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :పన్నెండో అభ్యర్థి బాబు రావు( 128 ఓట్లు) ఎలిమినేట్వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :కొనసాగుతున్న 13 వ రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియకొలిపాక వెంకటస్వామి (421 ఓట్లు) ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులువరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :ముగిసిన నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుచెల్లుబాటు అయిన ఓట్లు- 23,641చెల్లని ఓట్లు- 494గెలుపు కోటా- 11822 గా నిర్ధారణ12 రౌండ్లు ముగిసిన తర్వాత వచ్చిన ఓట్లుశ్రీపాల్ రెడ్డి- 6105అలుగుబెల్లి నర్సిరెడ్డి- 4884హర్షవర్ధన్ రెడ్డి- 4502పూల రవీందర్- 3202పులి సరోత్తం రెడ్డి- 2337సుందర్ రాజు-2091వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :14 రౌండ్ ఫలితాలుకొలిపాక వెంకటస్వామి (421 ఓట్లు) ఎలిమినేట్14వ రౌండ్ తర్వాత ఓట్ల వివరాలుశ్రీపాల్ రెడ్డి- 6165అలుగుబెల్లి నర్సిరెడ్డి- 4946హర్షవర్ధన్ రెడ్డి- 4596పూల రవీందర్- 3249పులి సరోత్తం రెడ్డి- 2394సుందర్ రాజు-2141వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా: ప్రారంభమైన ఎలిమినేషన్ ప్రక్రియతొమ్మిదో అభ్యర్థి తాటికొండ రాజయ్య( 36 ఓట్లు) ఎలిమినేట్వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :ఏడో అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డి(24 ఓట్లు) ఎలిమినేట్వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా : ఎనిమిదో అభ్యర్థి కైలాసం( 26 ఓట్లు) ఎలిమినేట్వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా: ప్రారంభమైన ఎలిమినేషన్ ప్రక్రియఎవరికీ గెలుపు కోటా రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులుచలిక చంద్ర శేఖర్ 1 ఓటు, కంటే సాయన్న. 4 ఓట్లు, బంక రాజు 7 ఓట్లు, పురుషోత్తం రెడ్డి 11, లింగడి వెంకటేశ్వర్లు 15, అర్వ స్వాతి 19 ఎలిమినేటర్కరీంనగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఆలస్యంగా పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియనేటి రాత్రి వరకు కొనసాగనున్న బ్యాలెట్ పేపర్ల బెండల్స్ కట్టడం ప్రక్రియవ్యాలీడ్ ఇన్ వ్యాలిడ్ ఓట్ల పరిశీలనకు రాత్రి వరకు సమయం పట్టే అవకాశంరాత్రి వరకు ఎమ్మెల్సీ ఓట్లు కట్టలు కట్టి సపరేషన్ ప్రక్రియఅర్ధరాత్రి దాటిన తర్వాతే పట్టభద్రుల అసలు ఓట్ల లెక్కింపుచెల్లని ఓట్లు ఎక్కువగా పోల్ కావడంతో అభ్యర్థుల్లో ఆందోళనచెల్లని ఓట్లతో ప్రధాన పార్టీల అభ్యర్థులకే నష్టం అంటున్న ప్రసన్న హరికృష్ణగెలుపు ధీమా వ్యక్తం చేసిన ప్రసన్న హరికృష్ణటీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ బండెల్స్ కట్టడం పూర్తివరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్నల్లగొండ జిల్లాముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుమొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక లీడ్ లో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డిరెండో స్థానంలో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డిమూడో స్థానంలో టీ పీఆర్టీయూ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డినాలుగో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్ఐదో స్థానంలో బీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డికాసేపట్లో చెల్లని ఓట్లను తొలగించి గెలుపుకు కావాల్సిన కోటాను ప్రకటించనున్న అధికారులువరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లామరికాసేపట్లో ముగియనున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుఇప్పటి వరకు పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి ముందంజమొదటి ప్రాధాన్యత ఓట్లలో అత్యధికంగా శ్రీపాల్ రెడ్డికి నమోదుఆ తర్వాత యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డిమూడోస్థానంలో బీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డిరెండో ప్రాధాన్యత ఓట్లతోనే విజేత ఎవరనేది తెలిసే అవకాశంమొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక చెల్లని ఓట్లను తొలగించి గెలుపు కోటాను నిర్ణయించనున్న అధికారులువరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా..మరికాసేపట్లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం.ముగిసిన బ్యాలెట్ పత్రాల కట్టలు కట్టే ప్రక్రియ25 టేబుళ్లపై ఓట్ల లెక్కింపుటేబుల్ కు 40 కట్టల కేటాయింపుఒక్కో కట్టలో 25 ఓట్లుఒక్కో టేబుల్ కు 1000 ఓట్ల కేటాయింపుమిగిలిన ఓట్లు చివరి టేబుల్ కు కేటాయింపుమధ్యాహ్నం మూడు గంటల వరకే ముగియనున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుచెల్లని ఓట్లను తొలగించి గెలుపుకు కావాల్సిన కోటాను నిర్ణయించనున్న అధికారులుమొత్తం పోలైన ఓట్లు- 24139👉ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్, నల్లగొండలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడికానున్నాయి. పట్టుభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి రెండు రోజుల సమయం పట్టే అవకాశముంది. 👉కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది. దీనికోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్లు కోసం కేటాయించారు. 👉ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనుండగా, ఇందులో ఒక మైక్రో అబ్జర్వర్, ఒక సూపర్వైజర్, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉన్నారు. 👉గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 3.55 లక్షల ఓట్లు, టీచర్ నియోజకవర్గంలో 27,088 ఓట్లు ఉన్నాయి. 👉ఈ క్రమంలో టీచర్ల లెక్కింపు సాయంత్రానికి వెలువడే అవకాశాలు ఉండగా.. గ్రాడ్యుయేట్ మాత్రం మరునాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. గ్రాడ్యుయేట్ స్థానంలో 56 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, టీచర్ ఎమ్మెల్సీ బరిలో 15 మంది తలపడుతున్నారు. 👉వరంగల్–ఖమ్మం–నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్జాలబావి సమీపంలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 24,139 మంది ఓట్లు పోలయ్యాయి. -
AP: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. కూటమి అభ్యర్థి వెనుకంజ
MLC Election Results Updates..గుంటూరు జిల్లా:గుంటూరు - కృష్ణ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్పూర్తయిన మొదటి రౌండుమొదటి రౌండులో 28, 000 ఓట్లు లెక్కింపు.ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు 17,194 ఓట్లుపిడిఎఫ్ అభ్యర్థి కే.ఎస్. లక్ష్మణరావు కు 7,214 ఓట్లు.చెల్లని ఓట్లు3070మిగిలిన 23 మందికి కలిపి:522మొదటి రౌండ్ లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మెజార్టీ :9980 ఓట్లు గుంటూరు జిల్లా :ప్రారంభమైన గుంటూరు - కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రౌండ్ కౌంటింగ్ఒక్కో టేబుల్ కి వెయ్యి ఓట్లు చొప్పున కౌంటింగ్ చేస్తున్న సిబ్బందిమొత్తం 28 టేబుల్స్ ఏర్పాటుమొదటి రౌండ్ లో లెక్కించనున్న 28 వేల ఓట్లు.చెల్లని ఓట్లతో పాటు ప్రాధాన్యత క్రమంలో ఓట్లను వేరు చేస్తున్న సిబ్బందిమరో అర్ధగంట లో ముగియనున్న మొదటి రౌండ్ కౌంటింగ్.ఏలూరు జిల్లా : ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియచెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లు వేరు చేసిన అనంతరం లెక్కింపు ప్రక్రియ431పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు, పోలైన 243 ఓట్లుపోస్టల్ బ్యాలెట్ లో చెల్లుబాటు కాని ఓట్లు 42చెల్లుబాటు అయ్యే ఓట్లు 201 గా గుర్తించిన కౌంటింగ్ సిబ్బంది.మిగతా 2లక్ష 18వేల 902 ఓట్లలో చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను విడతీస్తున్న ఎన్నికల అధికారులు..చెల్లుబాటు అయ్యే ఓట్లును 50 చొప్పున కట్టలుగా కడుతున్న సిబ్బంది..మొత్తం 28టేబుల్స్ పై 17రౌండ్ల పాటు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ.కౌంటింగ్ కోసం మూడు షిఫ్టుల్లో 700మంది సిబ్బంది..రౌండ్ల వారీగా చెల్లుబాటైన ఓట్లను లెక్కిస్తున్న సిబ్బందిమొదటి రౌండ్లో 10,783 చెల్లుబాటు ఓట్లను లెక్కించిన సిబ్బందిరెండో రౌండ్లో 13,929 చెల్లుబాటు ఓట్లుమూడో రౌండ్లో 11,870 చెల్లుబాటు ఓట్లునాలుగో రౌండ్లో 13,777 చెల్లుబాటు ఓట్లు5వ రౌండ్లో 13,163 చెల్లుబాటు ఓట్లు6వ రౌండ్లో 14,783 చెల్లుబాటు ఓట్ల లెక్కింపు7వ రౌండ్లో 12841 చెల్లు బాటు ఓట్ల లెక్కింపు8వ రౌండ్లో 14296 చెల్లు బాటు ఓట్లు లెక్కింపు..విశాఖ:టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదలైన ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుఎలిమినేషన్ రౌండ్ తో తేలనున్న ఫలితంమొదటి ప్రాధాన్యత ఓట్లతో తేలని ఫలితంమొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీనివాసుల నాయుడుకు ఆధిక్యం 365శ్రీనివాసులు నాయుడుకి 7210 ఓట్లురఘు వర్మకు 6845 ఓట్లు నమోదుయూటీఎఫ్ అభ్యర్ధి విజయగౌరికి 5804 ఓట్లు విశాఖ.:హోరాహోరీగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక..మొదటి ప్రాధాన్యత ఓటుతో తేలని ఫలితం..రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్న అధికారులు..మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపులో పి ఆర్ టి యు అభ్యర్థి శ్రీనివాస నాయుడు 331 ఓట్ల ఆధిక్యతశ్రీనివాసుల నాయుడుకు వచ్చిన ఓట్లు 6927కూటమి బలపరిచిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మ కు ఓట్లు 6596యుటిఎఫ్ అభ్యర్థి విజయ గౌరీకి వచ్చిన ఓట్లు 5684విశాఖ..హోరాహోరీగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు.టేబుల్ నెంబర్ 4, 14 లో ముగిసిన ఓట్ల లెక్కింపు..కూటమి బలపరిచిన APTF అభ్యర్ధి పాకలపాటి రఘువర్మ వెనుకంజ..75 ఓట్ల ఆధిక్యంలో PRTU అభ్యర్ధి శ్రీనివాసుల నాయుడుమొదట ప్రాధాన్యత ఓటులో ఫలితం తేలే అవకాశాలపై ఉత్కంఠ..సుమారుగా చెల్లని ఓట్లు 250విశాఖ..హోరాహోరీగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు.టేబుల్ నెంబర్-14 లో ముగిసిన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు..APTF అభ్యర్ధి రఘువర్మపై 30 ఓట్ల ఆధిక్యంలో PRTU అభ్యర్ధి శ్రీనివాసుల నాయుడుమొదట ప్రాధాన్యత ఓటులో ఫలితం తేలే అవకాశాలపై ఉత్కంఠ..సుమారుగా చెల్లని ఓట్లు 250 విశాఖ..ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీకి జరుగుతున్న కౌంటింగ్ నువ్వా నేనా అన్నట్లు పోటీ..స్వల్ప ఓట్లు ఆధిక్యంలో PRTU అభ్యర్ధి గాదె శ్రీనివాసులు నాయుడు..ఏలూరు జిల్లా..ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..431పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు.. పోలైన 243 ఓట్లుపోస్టల్ బ్యాలెట్లో చెల్లుబాటు కాని ఓట్లు 42చెల్లుబాటు అయ్యే ఓట్లు 201గా గుర్తించిన కౌంటింగ్ సిబ్బంది.మిగతా 2,18,902 ఓట్లలో చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను విడతీస్తున్న ఎన్నికల అధికారులు..చెల్లుబాటు అయ్యే ఓట్లును 50 చొప్పున కట్టలుగా కడుతున్న సిబ్బంది..మొత్తం 28 టేబుల్స్ పై 17రౌండ్ల పాటు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ.కౌంటింగ్ కోసం మూడు షిఫ్టుల్లో 700మంది సిబ్బంది.. 👉మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రకియ కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు ప్రారంభం.👉ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ, ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీ, గుంటూరు ఏసీ కాలేజీలోని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లు లెక్కింపు జరుగుతోంది. 👉రాష్ట్రంలో గత నెల 27న జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు పోటీ పడిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ల నియోజకవర్గం, ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణ–గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ మూడు స్థానాలకు పోటీ అధికంగా ఉండడం, ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా లెక్కించాల్సి ఉండటంతో తుది ఫలితాలు వెలువడటానికి సుదీర్ఘ సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. విశాఖ..ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు..ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రారంభం.ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్కింపు..బరిలో పదిమంది అభ్యర్థులు.123 బ్యాలెట్ బాక్సులు.20 టేబుల్స్ సిద్ధం చేసిన అధికారులుమొత్తం ఓట్లు 20,493, పోలైన ఓట్లు 20,795.తొలి ప్రాధాన్యత ఓటుతో తేలితే సాయంత్రం 5 గంటలకు ఫలితం.లేదా రాత్రి 9 గంటల దాటే అవకాశం..లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు..కౌంటింగ్ కేంద్రం వద్ద మూడు అంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు..కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు.విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్న అధికారులుగుంటూరు..ఉమ్మడి కృష్ణ- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల కౌంటింగ్గుంటూరు ఏసీ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్మొత్తం 29 టేబుల్ ఏర్పాటుమూడు షిఫ్ట్ లో కౌంటింగ్ ప్రక్రియకౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుఏలూరు జిల్లా..ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు.456 కేంద్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసిన 2,18,902 మంది ఓటర్లుమూడు షిప్టుల్లో 700 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు28 టేబుల్స్ ఏర్పాటు17 రౌండ్స్లో తేలనున్న ఫలితం.కౌంటింగ్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు -
‘మాకు అన్ని వర్గాల మద్దతు ఉంది’
భువనగిరి: రాబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఉపాధ్యాయులు అండగా ఉన్నారన్నారు కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిందని, అన్ని వర్గాలను రేవంత్ సర్కార్ మోసం చేసిందని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్బీఆర్ఎస్ లు నాటకాలు ఆడుతున్నాయన్న కిషన్ రెడ్డి.. ఆ రెండు పార్టీలకు ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే ధైర్యం లేదన్నారు. బీజేపీకి అన్ని వర్గాల మద్దతు ఉందని భువనగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.కాగా, వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 23 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా19 మంది చివరకు బరిలో ఉన్నారు. ఈ నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా 10వ తేదీ వరకూ ానామినేషన్ల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 27న పోలింగ్ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం ఓటింగ్ ముగిసే సమయంలో క్యూ లైన్లో ఉన్న వారికి టోకెన్ నంబర్లను ఇచ్చి, ఓటింగ్ వేసే ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ రిలీజ్
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెలాఖరులో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. కృష్ణా-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్, అలాగే ఉత్తరాంధ్ర టీచర్స్ MLC పదవీకాలం త్వరలో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఈసీ షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 27వ తేదీన పోలింగ్, మార్చి 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. -
AP: టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభం
Teachers MLC Election Updates..పోలింగ్ ప్రారంభం.. ప్రారంభమైన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న పోలింగ్ఏలూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 2667..మొత్తం పోలింగ్ కేంద్రాలు 20..పశ్చిమ గోదావరి జిల్లాలోని 20 మండలాల్లో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుజిల్లాలో మొత్తం ఓటర్లు..3,729పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.బ్యాలెట్ పద్ధతి ద్వారా జరుగుతున్న పోలింగ్👉గోదావరి జిల్లాల్లో రసవత్తర పోరుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. శాసనమండలిలో ఖాళీ అవుతోన్న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుంది. ఇందుకు ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు.👉ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల్లో 16,737 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 116 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. 👉ఇక, సిట్టింగ్ ఎమ్మెల్సీ షేక్సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. మిగిలి ఉన్న రెండేళ్ల కాలానికి ఈ ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం కోసం ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గంధం నారాయణరావు, పులుగు దీపిక, డాక్టర్ నాగేశ్వరరావు కవల, నామన వెంకటలక్ష్మి(విల్ల లక్ష్మి), బొర్రా గోపి మూర్తి బరిలో నిలిచారు. వీరంతా స్వతంత్రంగానే పోటీలో నిలిచారు. వీరిలో ప్రధాన పోటీ గంధం నారాయణరావు, బొర్రా గోపి మూర్తి మధ్యనే ఉండేలా కనిపిస్తోంది. గంధం నారాయణరావు రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ఒక పర్యాయం పోటీ చేశారు. ఇప్పుడు మరోసారి పోటీ పడుతున్నారు.👉ఈ శాసనమండలి ఎన్నికలకు నవంబర్ 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. గురువారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. -
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు కసరత్తు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు నోటిఫికేషన్ జారీకానున్న నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు, పార్టీలు అప్పుడే మద్దతు కూడగట్టే పనిలో పడ్డాయి. 2025 మార్చి 29తో వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పదవీకాలం ముగియనుంది. దీంతో ఆలోగా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 30న ఓటరు నమోదుకు నోటిఫికేషన్ జారీచేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బలం పెంచుకునేందుకు.... రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఈసారి తమ సంఘం నుంచి అభ్యర్థులను గెలిపించుకునేందుకు పీఆర్టీయూ అప్పుడే కసరత్తు ప్రారంభించింది. పెద్దఎత్తున ఓటర్లను నమోదు చేయించేందుకు చర్యలు చేపట్టింది. యూటీఎఫ్ కూడా అదే పనిపై దృష్టి సారించింది. నెల రోజుల నుంచి సంఘ సభ్యత్వ నమోదు ముమ్మరంగా చేస్తోంది. గతంలో పోగొట్టుకున్న స్థానాన్ని ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో పీఆర్టీయూ ఉంది. సంఘంలోని నాయకుల్లో ఉన్న అభిప్రాయభేదాలను పక్కన పెట్టి అంతా కలిసి పనిచేసేలా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో సంఘాన్ని వీడిన, సంఘం నుంచి సస్పెండ్ చేసిన నేతలను కూడా మళ్లీ చేర్చుకుంటోంది. ఇందులో భాగంగా గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండలో పీఆర్టీయూ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారని సస్పెండ్ చేసిన సుంకరి బిక్షంగౌడ్తోపాటు మరికొంతమంది నాయకులను ఇటీవల మళ్లీ సంఘంలోకి చేర్చుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే వారిని తిరిగి చేర్చుకున్నారన్న చర్చ సాగుతోంది. ఇక యూటీఎఫ్, ఎస్టీయూ, టీపీటీఎఫ్ కూడా ఈనెలాఖరు వరకు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. త్వరలోనే పీఆర్టీయూ అభ్యర్థుల ఖరారు పీఆర్టీయూ ప్రస్తుతం జిల్లా కార్యవర్గాల సమావేశాలు నిర్వహిస్తోంది. వాటిని ఈనెలాఖరులోగా పూర్తి చేసి, రాష్ట్ర కార్యవర్గ సమావేశం వచ్చే నెల 7న నిర్వహించాలని నిర్ణయించింది. అందులో కొత్తగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎన్నుకోనుంది. ఆ సమావేశంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ తరఫున పోటీలో ఉండే వారి పేర్లను ఖరారు చేసే అవకాశముంది. వరంగల్–ఖమ్మం–నల్లగొండ స్థానం నుంచి గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పోటీచేయగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన పులి సరోత్తంరెడ్డి రెబెల్గా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం పీఆర్టీయూ నుంచి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఎమ్మెల్సీగా పోటీచేయాలని భావిస్తున్నట్టుగా సంఘంలో చర్చ సాగుతోంది. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పీఆర్టీయూ సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెళ్లి కమలాకర్రావు పోటీ చేయాలని భావిస్తున్నారు. వారిలో ఎవరిని ఖరారు చేస్తారన్నది మొదటి వారంలోనే తేలనుంది. మరోవైపు టీపీటీఎఫ్, యూటీఎఫ్ కూడా అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉంది. ఈసారి పార్టీల నుంచి పోటీ.. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఈసారి కాంగ్రెస్, బీజేపీ తరఫున కూడా అభ్యర్థులను పోటీలో నిలుపుతారన్న చర్చ సాగుతోంది. అదే జరిగితే బీజేపీ తరపున ఈసారి వరంగల్–ఖమ్మం– నల్లగొండ స్థానంలో పోటీచేయాలని పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తంరెడ్డి భావిస్తున్నారు. ఆయనతోపాటు టీపీయూఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సాయిరెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నట్టు తెలిసింది. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ –కరీంనగర్ స్థానంలో బీజేపీ నుంచి నరహరి లక్ష్మారెడ్డి, సుధాకర్రెడ్డి పోటీచేయాలని భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ రెండు స్థానాల్లో ఎక్కడి నుంచి పార్టీ పోటీ చేయమని చెబితే అక్కడి నుంచి పోటీచేసేందుకు సిద్ధమని పేర్కొంటున్నారు. -
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో పోలింగ్ 90%
సాక్షి, హైదరాబాద్/నాగర్కర్నూల్: మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం జరిగిన ఎన్నికలో 90.40 శాతం పోలింగ్ జరిగింది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు నెమ్మదిగా సాగిన పోలింగ్ ఆ తర్వాత ఊపందుకుంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ముగిసే సమయానికి 9 జిల్లాల పరిధిలో సగటున 90.40 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా గద్వాల జిల్లాలో 97.15 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 82.25 శాతం పోలింగ్ నమోదైంది. -
నేడు ‘మండలి’ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల ఎన్నికల్లో పోలైన ఓట్లను మంగళవారం లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రులు/ ఉపాధ్యాయ నియోజకవర్గాలతో పాటు వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపా ధ్యాయ నియోజకవర్గానికి శుక్రవారం పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 17 మంది, మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఏడుగురు, వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 9 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రులు, ఉపాధ్యా య నియోజకవర్గాల ఓట్లను కరీంనగర్ పట్టణం లోని ఇండోర్ స్టేడియంలో లెక్కించనున్నారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్లను నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం దుప్పలపల్లిలోని టీఎస్డబ్ల్యూసీ గోదాములో లెక్కించనున్నారు. పోలింగ్ను బ్యాలెట్ పేపర్లతో నిర్వహించడంతో ఫలితాల వెల్లడికి ఆలస్యం కానుంది. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని సీఈఓ రజత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాల కోసం క్లిక్చేయండి - ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు షాక్ -
కాటేపల్లి జనార్ధన్ రెడ్డి జయకేతనం
-
ఎవరికీ దక్కని మెజారిటీ
తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ కావల్సిన ఓట్లు రాకపోవడంతో.. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇందులో కాటేపల్లికి 7636, మాణిక్ రెడ్డికి 3091, ఏవీఎన్ రెడ్డికి 2966, హర్షవర్దన్ రెడ్డికి 2486 ఓట్లు వచ్చాయి. అయితే.. మొత్తం ఓట్లలో 50 శాతం ఓట్లు ఏ అభ్యర్థికీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత తుది ఫలితాన్ని వెల్లడిస్తారు. -
కొత్త ఓటు.. తీర్పు ఎటు?
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి కొత్తగా 6 వేలకుపైగా ఓట్లు మద్దతు కోసం టీచర్ల సంఘాలతో ఆశావహుల సంప్రదింపులు సిట్టింగ్ ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు టీఆర్ఎస్ యత్నాలు ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో హరీశ్ భేటీ సాక్షి, హైదరాబాద్: మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాలు బిజీ అయ్యాయి. ఇప్పటికే మద్దతు ప్రకటించిన తమ అభ్యర్థులతో సభలు, సమా వేశాల నిర్వహణలో పడ్డాయి. టీఆర్ఎస్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు దృష్టి సారించింది. గతంలో కంటే ఈసారి ఓట్ల సంఖ్య 6 వేలకు పైగా పెరగడంతో ఆశావహులు తమ ప్రయత్నాల్లో ముని గారు. ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రభుత్వ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చ రర్ల ఓట్లు ఈసారి కీలకం కానున్నాయి. దీంతో నోటి ఫికేషన్ జారీ కాకముందు నుంచే ఆయా సంఘాల సమావేశాల నిర్వహణలో ఆశావహులు తల మునకల య్యారు. ఈ నెల 13 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. తమ అభ్యర్థులను పోటీలో నిలుపుతామని 5 సంఘాలు ప్రకటించాయి. అభ్యర్థులు ఎందరో...? ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారికంగా 8 మంది అభ్యర్థులను పోటీలో నిలుపుతామని వివిధ ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. అందులో కొందరు నామినేషన్లు వేసినా చివరిలో ఉపసంహ రించుకునే అవకాశం ఉంది. ప్రధానంగా పోటీలో ఉండే అభ్యర్థులు సంఘాల మద్దతు కూడగట్టడంతో పాటు ఈ అంశంపైనా ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తానికి ప్రధాన పోటీ ఇద్దరి మ«ధ్యే ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం కూడా ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్దన్రెడ్డి తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఆయన ఇదివరకే టీఆర్ఎస్లో చేరారు. అయితే పార్టీ అధికారికంగా తమ అభ్యర్థి అని ప్రకటించకపోయినా ఆయన్ను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నియోజకవర్గంలోని మూడు జిల్లాలకు చెందిన మంత్రులను అప్రమత్తం చేసింది. ఇటీవలే మంత్రి హరీశ్రావు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమయ్యారు. శనివారం ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించారు. గతంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ ఓటమికి ప్రధాన కారణం ఉపాధ్యాయులేనన్న భావన ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో గత పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెరిగిన ఓటర్లు మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2011లో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో 15,053 ఓట్లు ఉండగా అందులో 11,883 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య పెరిగింది. ఈ నెల 13 వరకు కూడా ఓటర్ల నమోదుకు అవకాశం ఉంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల నుంచి అధిక సంఖ్యలో ఓటర్లు నమోదయ్యారు. ఓటర్ల సంఖ్య 21,520కి చేరింది. ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచుకునేందుకు ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సభలు, సమావే శాలు నిర్వహిస్తూ తమకు పడే ఓట్లపై బేరీజు వేసుకుంటున్నారు. పాత జిల్లాల ప్రకారం మహ బూబ్నగర్లో 6,510 మంది, రంగారెడ్డి జిల్లాలో 12 వేల మంది, హైదరా బాద్ జిల్లాలో 3,010 మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సంఘాల నుంచి ఎవరెవరు? 15 ఏళ్లు ప్రభుత్వ జూనియర్ లెక్చరర్గా పని చేసిన ఏవీఎన్ రెడ్డిని గెలిపించుకు నేందుకు ఎస్టీయూ, టీఎస్టీయూ, మరికొన్ని ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు తీవ్రంగా ప్రయత్నిస్తు న్నాయి. వివిధ ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల మద్దతు కూడగట్టుకోవడంతోపాటు ప్రైవేటు స్కూళ్లు కాలేజీల నుంచి భారీ మొత్తంలో ఓటర్ల నమోదుకు చర్యలు చేపట్టారు. ఇక పీఆర్టీయూ– తెలంగాణ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు హర్షవర్ధన్రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టీచర్ పోస్టుకు రాజీనామా చేసి ఆయన పోటీకి సిద్ధమయ్యారు. పీఆర్టీయూ– టీఎస్పై వ్యతిరేకతే ప్రధాన అంశంగా ప్రచారం చేస్తున్నారు. టీఎస్–యూటీఎఫ్ అభ్యర్థిగా మాణిక్రెడ్డి, టీపీయూఎస్ అభ్యర్థి భూపతిరెడ్డి తమ ప్రచారాన్ని కొనసాగి స్తున్నారు. మరికొన్ని ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యర్థులు పోటీలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు.