
సాక్షి, హైదరాబాద్/నాగర్కర్నూల్: మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం జరిగిన ఎన్నికలో 90.40 శాతం పోలింగ్ జరిగింది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు నెమ్మదిగా సాగిన పోలింగ్ ఆ తర్వాత ఊపందుకుంది.
సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ముగిసే సమయానికి 9 జిల్లాల పరిధిలో సగటున 90.40 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా గద్వాల జిల్లాలో 97.15 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 82.25 శాతం పోలింగ్ నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment