Thakur
-
Sanjana Thakur: కామన్వెల్త్ బహుమతి గెలిచిన అమ్మ కథ
ఆధునిక జీవితం అమ్మను ఎక్కడకు చేర్చింది?వృద్ధాశ్రమానికి.ఒకమ్మాయికి వృద్ధాశ్రమంలో నుంచి ఒక తల్లిని ఇంటికి తెచ్చుకోవాలని అనిపిస్తుంది. కాని వృద్ధాశ్రమంలో చూస్తే అందరు తల్లులూ అద్భుతంగా అనిపిస్తారు. ఇంత మంచి తల్లులను ఎందుకు పెట్టారోనని సంజనా ఠాకూర్ రాసిన కథ కామన్వెల్త్ ప్రైజ్ 2024 గెలుచుకుంది. సంజనా ఠాకూర్ పరిచయం.‘స్కూల్ టీచర్లకు నన్ను తిట్టాలని ఉండేది. కాని తిట్టలేకపోయేవారు. సంజనా బాగా చదువుతుంది... హోమ్ వర్క్ చేస్తుంది... కాని క్లాస్ జరుగుతుంటే టేబుల్ కింద కూచుని కథల పుస్తకం చదువుతోంది అని కంప్లయింట్ చేసేవారు. నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే అంత పిచ్చి. మా అమ్మ రోజూ నాకు కథలు చదివి వినిపించేది. నేను మా ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్లినా పార్టీలకు వెళ్లినా పుస్తకం పట్టుకుని మూలన కూచునేదాన్ని. చిన్నప్పుడే రాయడం మొదలెట్టాను. ఇప్పుడు ఈ గుర్తింపు రావడం సంతోషంగా ఉంది’ అంటుంది 26 సంవత్సరాల సంజనా ఠాకూర్. ముంబైకి చెందిన సంజన ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ లో ఎం.ఎఫ్.ఏ. ఫిక్షన్ చదువుతోంది. ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్’ పోటీల్లో పాల్గొని 2024 సంవత్సరానికి విజేత అయింది.ఐదు లక్షల బహుమతికామన్వెల్త్ దేశాలలోని యువ రచయితలను ఉత్సాహపరచడానికి కామన్వెల్త్ ఫౌండేషన్ ఏటా కథల పోటీ నిర్వహిస్తుంది. 18 ఏళ్లు పైబడిన వారు దీనికి అర్హులు. నేరుగా ఇంగ్లిష్లో కాని లేదా ఇంగ్లిష్లో అనువాదమైన స్థానికభాష కథగాని పంపవచ్చు. 2500 పదాల నుంచి 5000 పదాల వరకూ కథ ఉండాలి. ఇందులో మళ్లీ ఐదు రీజియన్లకు (ఆఫ్రికా, ఆసియా, కెనడా–యూరప్, పసిఫిక్) ఐదుగురు రీజనల్ విన్నర్స్ను ప్రకటిస్తారు. వీరి నుంచి ఓవరాల్ విన్నర్ను ఎంపిక చేస్తారు. 2024కు ఆసియా రీజనల్ విన్నర్గా నిలిచిన సంజనా ఠాకూర్ ఓవరాల్ విన్నర్గా కూడా ఎంపికైంది. నగదు బహుమతిగా 5000 పౌండ్లు గెలుచుకుంది.కథ పేరు ఐశ్వర్యారాయ్‘అమెరికాలో నేనొక బొమ్మల షాపులో తిరుగుతున్నప్పుడు కేవలం అమ్మ బొమ్మలు అమ్మే ఒక షాప్ ఉంటే ఎలా ఉంటుందా అనే ఆలోచన వచ్చింది. అక్కడినుంచి పిల్లలు అమ్మల్ని దత్తత తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన కొనసాగింది. ఇండియాలో పట్టణ సంస్కృతి ఇప్పుడు ఇళ్లల్లో అమ్మకు చోటు లేకుండా చేస్తోంది. ఆమె వృద్ధాశ్రమంలో ఉండాల్సి వస్తోంది. నా కథలో అన్వి అనే అమ్మాయి ఒక వృద్ధాశ్రమానికి వెళ్లి ఒక అమ్మను దత్తత తీసుకోవాలనుకుంటుంది. కాని ఒక్కో అమ్మ ఒక్కో లక్షణంలో గొప్పగా కనిపిస్తుంది. అమ్మలందరూ తమ అనుబంధం రీత్యా ఐశ్వర్యారాయ్ కంటే తక్కువ సౌందర్యవతులు కాదు. ఏ అమ్మ సౌందర్యమైనా బంధం రీత్యా ఐశ్వర్యారాయ్ అంత అందమైనదే. అందుకే ఆ పేరుతోనే కథ రాశాను. వ్యంగ్యం, చెణుకులు ఉండటంతో నా కథను జడ్జిలు మెచ్చుకొని ఉండొచ్చు’ అని తెలిపింది సంజనా.త్వరలో పుస్తకం‘త్వరలో 15 కథలతో నేను పుస్తకం తెస్తాను. ఇప్పటికే రాశాను. అందులో అన్ని కథల్లోనూ తల్లులూ కూతుళ్లు కనిపిస్తారు. వారి భిన్న భావోద్వేగాలు చర్చకు వస్తాయి. ప్రస్తుతం నా థీసిస్లో భాగంగా ఈ కథలను సబ్మిట్ చేయగానే పుస్తకం పని మొదలెడతాను. ప్రపంచ సాహిత్యంలో చాలా మంచి రచనలు వస్తున్నాయి. మన దేశం నుంచి అరుంధతి రాయ్ శైలి నాకు బాగా నచ్చుతుంది’ అందామె.సాహిత్యాన్ని ఒక చదువుగా... రచనను ఒక ఉపాధిగా చేసుకోదలిచింది సంజన. -
హైకోర్టు ‘రోస్టర్’లో సమూల మార్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తులు విచారించే సబ్జెక్టుల్లో (రోస్టర్లో) సమూల మార్పులు జరిగాయి. హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు వచ్చిన నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ మార్పులు చేశారు. కొత్త న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్లకు సీనియర్ న్యాయమూర్తుల పక్కన ధర్మాసనాల్లో స్థానం కల్పించారు. జస్టిస్ నూనెపల్లి హరినాథ్కు సింగిల్ జడ్జిగా బాధ్యతలు అప్పగించారు. కీలకమైన బెయిల్ పిటిషన్లను ఎవరూ ఊహించని విధంగా న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావుకు అప్పగించారు. వీటితోపాటు 2019 నుంచి దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్లు, ప్రజా ప్రతినిధులకు సంబంధించిన వ్యాజ్యాలను కూడా జస్టిస్ మల్లికార్జునరావు విచారించాల్సి ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో బెయిల్, మధ్యంతర బెయిల్ కోరుతూ మాజీ సీఎం నారా చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యాలు సోమవారం జస్టిస్ మల్లికార్జునరావు ముందు లిస్ట్ అయ్యాయి. అలాగే కీలకమైన క్వాష్ పిటిషన్ల విచారణ బాధ్యతలను జస్టిస్ బీఎస్ భానుమతికి అప్పగించారు. సీఆర్పీసీ సెక్షన్ 482 కింద దాఖలు చేసే క్వాష్ పిటిషన్లతో పాటు అధికరణ 226 కింద దాఖలు చేసే క్వాష్ పిటిషన్లను సైతం ఆమే విచారిస్తారు. ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ 2022 తరువాత దాఖలైన వ్యాజ్యాలను జస్టిస్ భానుమతే విచారిస్తారు. మరో కీలకమైన సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు సంబంధించిన కేసులను జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లుకు కేటాయించారు. అమరావతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్నెట్ కుంభకోణాలతో పాటు గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు తదితరాలపై సమీక్ష జరిపేందుకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 1411, మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ ఆక్రమాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 344ను సవాలు చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై జస్టిస్ నిమ్మగడ్డ విచారణ జరుపుతారు. రోస్టర్ అమల్లోకి వచ్చే సోమవారం నాడే టీడీపీ నేతల వ్యాజ్యాలు జస్టిస్ నిమ్మగడ్డ ముందుకు విచారణకు రానున్నాయి. పురపాలక శాఖ, ఏపీసీఆర్డీఏ, ఏఎంఆర్డీఏ కేసులను జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి విచారిస్తారు. రెవెన్యూ, భూ సేకరణ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల కేసులను జస్టిస్ చీమలపాటి రవికి అప్పగించారు. మొన్నటివరకు బెయిల్ పిటిషన్లను విచారించిన జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డికి ఎఫ్ఐఆర్లు, చార్జిషీట్లను కొట్టేయాలని కోరుతూ 2017 వరకు దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ల విచారణ బాధ్యతలు అప్పగించారు. 2018 నుంచి దాఖలైన క్రిమినల్ అప్పీళ్లను కూడా జస్టిస్ సురేష్రెడ్డి విచారిస్తారు. మొన్నటి వరకు క్వాష్ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డికి 2017 వరకు దాఖలైన క్రిమినల్ అప్పీళ్లు, కంపెనీ కేసులు, ఒరిజినల్ సివిల్ సూట్ల కేసులను అప్పగించారు. జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయికి చార్జిషీట్లు, ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ 2020, 2021 సంవత్సరాల్లో దాఖలైన వ్యాజ్యాలను కేటాయించారు. ఒకట్రెండు రోజుల్లో రోస్టర్లో స్వల్ప మార్పులు హైకోర్టు జడ్జిలు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ దుప్పల వెంకటరమణ బదిలీపై వేరే హైకోర్టులకు వెళుతున్నందున ఈ రోస్టర్లో కూడా ఒకటి రెండు రోజుల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. వారు వెళ్లిన తరువాత తాజా రోస్టర్లో కేటాయించిన సబ్జెక్టులను ఇతర న్యాయమూర్తులకు కేటాయిస్తారు. అలాగే కర్ణాటక హైకోర్టు నుంచి బదిలీపై వస్తున్న జస్టిస్ జి.నరేంద్ర ఇక్కడ ప్రమాణం చేసిన తరువాత ఆయనకు కొన్ని సబ్జెక్టులను కేటాయించాల్సి ఉంటుంది. దీంతో తాజా రోస్టర్లో కొద్దిపాటి మార్పులు చేయనున్నారు. -
ప్రేమకథ విన్నారా?
కెరీర్లో హీరోయిన్గా మంచి ఫామ్లో ఉన్నారు మృణాళ్ ఠాకూర్. నార్త్ అండ్ సౌత్ అనే తేడాలను పక్కన పెడితే ఈ బ్యూటీ హీరోయిన్గా నటించిన ఐదు సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయంటే ఆమె ఏ స్పీడ్తో దూసుకెళ్తున్నారో ఊహించవచ్చు. ఇదే స్పీడ్ను కొనసాగించాలనుకుంటూ బాలీవుడ్ కొత్త సినిమాకు సై అన్నారట మృణాళ్. శ్రీదేవి టైటిల్ రోల్ చేసిన హిందీ హిట్ ఫిల్మ్ ‘మామ్’ తీసిన దర్శకుడు రవి ఉడయార్ ఇటీవల ఓ లవ్స్టోరీ స్క్రిప్ట్ను రెడీ చేసుకున్నారట. ఆయన ఈ కథను మృణాళ్కు వినిపించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ సమాచారం. సిద్ధార్థ్ చతుర్వేది హీరోగా నటించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రాంరంభం కానుందని బీ టౌక్ టాక్. -
సాధ్వి, పురోహిత్పై ఉగ్రవాద అభియోగాలు
ముంబై: మహారాష్ట్రలోని మాలెగావ్లో 2008లో జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితులు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, మరో ఐదుగురిపై మంగళవారం ఉగ్రవాద సంబంధిత అభియోగాలు నమోదయ్యాయి. నవంబర్ 2న ఈ కేసులో తుది విచారణ ప్రారంభమవుతుంది. ఉగ్రవాద వ్యాప్తికే నిందితులు అభినవ్ భారత్ అనే సంస్థను ప్రారంభించారని పేర్కొన్న ప్రత్యేక కోర్టు..వారిపై నేరపూరిత కుట్ర, హత్య తదితర నేరారోపణల్ని కూడా మోపింది. ఐపీసీ, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఎన్ఐఏ కోర్టు జడ్జి వినోద్ పాదాల్కర్ ఈ మేరకు ఏడుగురిపై అభియోగాలు నమోదుచేశారు. నిందితుల్లో ప్రసాద్ పురోహిత్, సాధ్వి ప్రజ్ఞాసింగ్తో పాటు మేజర్(రిటైర్డ్) రమేశ్ ఉపాధ్యాయ్, అజయ్ రాహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణి ఉన్నారు. జడ్జి ఈ అభియోగాలు నమోదుచేసిన సమయంలో నిందితులంతా కోర్టులోనే ఉన్నారు. వారు దోషులుగా తేలితే జీవితఖైదు లేదా మరణశిక్ష పడుతుంది. -
పూలన్ దేవీ హంతకుడా, మజాకా ?!
-
పూలన్ దేవీ హంతకుడా, మజాకా ?!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని సహ్రాన్ పూర్లో మే 9వ తేదీన జరిగిన దళితుడైన సచిన్ వాలియా అనుమానాస్పద మృతిపై పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ఎఫ్ఐఆర్లో ప్రధాన నిందితుడిగా ‘బందిపోటు రాణి’ పూలన్ దేవీ హంతకుడైన షేర్ సింగ్ రాణా పేరును పేర్కొనడమే అందుకు కారణం. మరోపక్క చనిపోయిన దళితుడు కూడా సామాన్యుడు కాదు. ‘భీమ్ ఆర్మీ’ సహ్రాన్పూర్ జిల్లా చీఫ్ కమల్ వాలియా సోదరుడు సచిన్ వాలియా(25). ఇరువర్గాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నా కేసు దర్యాప్తులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. రాజ్పుత్ అలియస్ ఠాకూర్లు హీరోగా భావించే షేర్ సింగ్ రాణాను అదుపులోకి తీసుకొని ప్రశ్నించేందుకు యూపీ పోలీసులు సాహసించడం లేదు. 2001లో ఢిల్లీలో జరిగిన ఫూలన్దేవి హత్య కేసులో జైలుకెళ్లిన షేర్ సింగ్ రాణా 2004లో జైలు నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు అరెస్ట్ అయ్యారు. ఆ కేసులో యావజ్జీవ జైలు శిక్ష పడిన ఆయన ప్రస్తుతం బెయిలపై ఉన్నారు. 16వ శతాబ్దానికి చెందిన మహారాణా ప్రతాప్ వార్షికోత్సవం సందర్భంగా మే 9వ తేదీన ఠాకూర్లు జరిపిన కాల్పుల్లో సచిన్ వాలియా మరణించారన్నది స్థానిక దళితుల వాదన. షేర్ సింగ్ రాణా ఉద్దేశపూర్వకంగా జరిపిన కాల్పుల్లోనే సచిన్ వాలియా మరణించాడన్నది ఆయన తల్లి వాదన. సచిన్ వాలియా మిత్రులు పొరపాటున జరిపిన కాల్పుల్లో మరణించాడన్నది ఠాకూర్ల వాదన. షేర్ సింగ్ రాణా స్థానికంగా ప్రముఖుడు. ఆయన పేరు, ముఖచిత్రంతో ఉన్న టీషర్టులు ఇంటర్నెట్లో తెగ అమ్ముడుపోతున్నాయి. ఆయన్ని హీరోగా కీర్తిస్తున్న అనేక పాటలు ‘యూట్యూబ్’లో అందుబాటులో ఉన్నాయి. ‘షేర్ సింగ్ రాణా క్షత్రియ యువకులకు నిజమైన హీరో’ అని ఉత్తరప్రదేశ్ క్షత్రియ మహాసభ అధ్యక్షుడు ఖాన్ సింగ్ రాణా వ్యాఖ్యానించారు. పూలన్ దేవీ హత్యతో... పూలన్ దేవీ హత్య వరకు సేర్ సింగ్ రాణా గురించి పెద్దగా ఎవరికి తెలియదు. 2001, జూలై నెలలో పార్లమెంట్ నుంచి అధికార నివాసానికి బయల్దేరిన పూలన్ దేవీని నివాసం వద్ద ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపి హత్య చేశారు. వారిలో ఒక వ్యక్తే షేర్ సంగ్ రాణాగా, ఆయనే హత్యకు ప్రధాన కుట్రదారుగా పోలీసులు గుర్తించారు. పూలన్ దేవీ బందిపోటు రాణిగా 21 మంది ఠాకూర్లను హత్య చేసినందుకు ప్రతీకారంగానే తానీ హత్య చేశానని రాణా నేరం అంగీకరించారు. 2004లో జైలు నుంచి తప్పించుకున్న రాణాను ఢిల్లీ ప్రత్యేక విభాగానికి చెందిన పోలీసులు 2006లో కోల్కతాలో అరెస్ట్ చేశారు. 2014లో రాణాకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 2016లో ఆయనకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ను మంజూరు చేసింది. ఆయనకు బెయిల్ రావడంలో కూడా రాజకీయ జోక్యం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. తీహార్ జైల్లో ఉన్న రాణాకు 2004కు ముందు జైల్లో కొంతమంది టెర్రరిస్టులు తారసపడ్డారట. 1192లో మొహమ్మద్ ఘోరీ చేతుల్లో ఓడి పోయిన 12వ శతాబ్దానికి చెందిన హిందూ మహారాజు పృధ్వీరాజ్ చౌహాన్ సమాధిలోని అవశేషాలను తీసుకొస్తానని వారితో రాణా సవాల్ చేశాడట. ఆ మేరకు 2004లో ఓ పోలీసు అధికారి (నకిలీ) వెంట కోర్టుకు వెళుతున్నట్లుగా నటించి తీహార్ జైలు నుంచి తప్పించుకున్నారు. మొరదాబాద్, రాంచీ మీదుగా కోల్కతా చేరుకున్నారు. అక్కడ సంజయ్ గుప్తా పేరిట నకిలీ పాస్పోర్టు సంపాదించారు. బంగ్లాదేశ్కు మూడు నెలల వీసా సంపాదించి ఆ దేశానికి వెళ్లారు. అక్కడి నుంచి దుబాయ్కి వెళ్లి, అక్కడి నుంచి అఫ్ఘానిస్థాన్ వెళ్లారు. మొహమ్మద్ ఘోరీ తన చేతుల్లో ఓడిపోయిన పృధ్వీరాజ్ చౌహాన్ను భారత్లో చంపేయకుండా అఫ్ఘానిస్థాన్ తీసుకెళ్లి అక్కడ చంపేశారన్నది రాణా నమ్మకం. అందుకనే ఆయన అక్కడికి వెళ్లారు. అఫ్ఘానిస్థాన్లోని దెహ్యాక్ వెళ్లి అక్కడ పృధ్వీరాజ్ చౌహాన్దిగా భావిస్తున్న ఓ మట్టి సమాధిని తవ్వి కొన్ని అవశేషాలను రాణా భారత్కు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని రాణా పలు సందర్భాల్లో భారతీయ మీడియాకు స్వయంగా తెలిపారు. ఆ అవశేషాలను వివిధ క్షత్రియ సంస్థలకు ఇచ్చారు. అందులో కొన్ని అవశేషాలను యూపీలోని మెయిన్పురిలోని స్మారక భవనంలో భద్రపర్చారు. అజయ్ దేవగన్తో సినిమా! తీహార్ జైలు నుంచి అఫ్ఘానిస్థాన్ వరకు తాను సాగించిన సాహస యాత్ర గురించి రాణా ‘జైల్ డైరీ: తీహార్ సే కాబూల్–కాందహార్’ అనే పుస్తకం రాశారు. ఇది 2012లో విడుదలయింది. ఈ పుస్తకం ఆధారంగా బాలీవుడ్లో సినిమా తీస్తున్నారని, రాణా పాత్రలో నవాజుద్దీన్ సిద్దిఖీ లేదా అజయ్ దేవగన్ నటించనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ విషయమై అజయ్ దేవగన్ తనతో మాట్లాడినట్లు రాణా పలుసార్లు స్వయంగా చెప్పుకున్నారు. (ఠాకూర్ల చేతుల్లో అంతులేని అత్యాచారాలకు గురైన పూలన్దేవీ బందిపోటు రాణిగా మారడాన్ని ఇతివృత్తంగా తీసుకొని బాలివుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ ‘బండిట్ క్వీన్’ పేరిట సినిమా తీయడం, 1994లో విడుదలైన ఆ సినిమాకు జాతీయ ఉత్తమ నటి అవార్డు రావడం తెల్సిందే) -
దేవాదాయశాఖలో అవినీతి ఆజాదు
-
‘అధర్మా’దాయం!
సాక్షి, అమరావతి: ‘అధర్మా’దా యం కూడబెట్టారన్న అభియోగంపై దేవాదాయశాఖ రాజ మహేంద్రవరం రీజనల్ జాయిం ట్ కమిషనర్(ఆర్జేసీ) శీలం సూర్యచంద్రశేఖర్ ఆజాద్ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ పంజా విసిరింది. తెలుగు రాష్ట్రాల్లోని ఆయన నివాసాలతోపాటు బంధువులు, బినామీ లకు చెందిన ఆస్తులపై 18 చోట్ల ఏసీబీ 21 బృందా లతో ఆకస్మిక సోదాలు జరిపింది. హైదరాబాద్, విజయవాడ, నూజివీడు, ఏలూరు, రాజమండ్రి, అనంతపురం తదితర ప్రాంతాల్లో సోదాలు జరిపి బ్యాంక్ పాస్ పుస్తకాలు, రికార్డులు, ఇతర డాక్యుమెంట్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆజాద్కు రూ.50 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించామని ఏసీబీ ఏలూరు డీఎస్పీ వాసంశెట్టి గోపాలకృష్ణ మీడియాకు తెలిపారు. ఆజాద్ను మంగళవారం రాత్రి ఏలూరులోని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా 2000లో బాధ్యతలు చేపట్టిన ఆజాద్ శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయం, కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం, శ్రీశైలం ఆలయాల్లో పనిచేశారు. ఆజాద్ పేరిట విజయవాడ గుణదలలో రూ.2 కోట్ల విలువైన భవనంతోపాటు హైదరాబాద్లోని గడ్డిఅన్నారంలో న్యూటన్స్ రమ్య అపార్టుమెంట్లో ప్లాట్, భార్య పేరుతో దిల్సుఖ్నగర్లో ప్లాట్ ఉన్నాయి. ఆజాద్ ఇంట్లో రూ.12 లక్షల విలువైన బంగారు, వెండి సామగ్రిని గుర్తించారు. రూ. 18 కోట్లతో సోలార్ పవర్ప్లాంట్ ఆజాద్ తన కుటుంబ సభ్యుల పేరుతో అనంతపురం జిల్లా ఊబిచర్లలో 32.1 ఎకరాల్లో ఆబేధ్య సోలార్ పవర్ ప్లాంట్ నిర్వహిస్తున్నట్టు గుర్తించిన ఏసీబీ అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆజాద్ రూ.18 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు చెబుతున్నారు. ఆజాద్ సోదరుడు వివేకానంద వద్ద డ్రైవర్గా పనిచేసే సాంబశివరావు, ప్లాంట్లో పనిచేస్తున్న లక్ష్మణరావు, రంగమ్మల పేరుతో రైతుల నుంచి 36.63 ఎకరాలను కొనుగోలు చేసి తర్వాత వివేకానంద పేరుపై బదిలీ చేయించుకున్నారు. ఆ భూముల్లోనే సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. అలాగే ఆజాద్ విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడిపారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఆజాద్ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ డీజీ ఠాకూర్ తెలిపారు. దాడుల్లో రాజమహేంద్రవరం ఏసీబీ సీఐ సూర్య మోహనరావు, ఏసీబీ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
మాతో ఆడతారా... లేదా!
స్పష్టం చేయాలని బీసీసీఐని కోరిన పీసీబీ కరాచీ: భారత్ తమతో క్రికెట్ ఆడేది లేనిది స్పష్టం చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కోరింది. ఒకవేళ తమతో ఆడకపోతే ఎఫ్టీపీని ఉల్లంఘించినందుకు తమకు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. కేప్టౌన్లో ఐసీసీ సమావేశం సందర్భంగా ద్వైపాక్షిక సిరీస్లపై స్పష్టత ఇవ్వాలని బీసీసీఐ అధ్యక్షుడు ఠాకూర్ను కోరామని... దీనికి ఆయన స్పందించలేదని పీసీబీ అధికారి నజమ్ సేథీ చెప్పారు. పైగా ఐసీసీ ఈవెంట్లలోనూ భారత్, పాక్లను ఒకే గ్రూప్లో ఉంచకూడదని ఠాకూర్ కోరడం శోచనీయమని అన్నారు. ఒకవేళ ఐసీసీ ఈవెంట్లలో భారత్ తమతో ఆడకపోతే మ్యాచ్ను రద్దు చేసి తమకు పాయింట్లు ఇవ్వాలని ఐసీసీని ఉద్దేశించి అన్నారు. భారత్ తమతో ద్వైపాక్షిక సిరీస్ ఆడకపోతే నష్టపరిహారం చెల్లించాలని, ఐసీసీ కూడా తమకు అదనంగా గ్రాంట్స్ ఇవ్వాలని సేథి అన్నారు. -
ఠాకూర్, షిర్కే అఫిడవిట్లు
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శులు అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కే లోధా కమిటీ ముందు తమ అఫిడవిట్లు దాఖలు చేశారు. కమిటీ సూచించిన ప్రతిపాదనలను అమలు చేయడంలో తమకు ఇబ్బందులు ఉన్నాయంటూ తన పాత మాటలనే ఠాకూర్ ఈ అఫిడవిట్లోనూ పొందుపరిచారు. -
అనురాగ్ ఠాకూర్ కొత్త ఇన్నింగ్స్!
న్యూఢిల్లీః భారతీయ జనతాపార్టీ ఎంపీ, బీసిసిఐ ఛీఫ్ అనురాగ్ ఠాకూర్ ఇప్పుడు ఎల్టీ అనురాగ్ ఠాకూర్ గా మారిపోయారు. శుక్రవారం ఆయన టెరిటోరియల్ ఆర్మ రెగ్యులర్ ఆఫీసర్ గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు సౌత్ బ్లాక్ లో ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ దల్బీర్ ఎస్ సుహాగ్ ద్వారా టెరిటోరియల్ ఆర్మీ రెగ్యులర్ ఆఫీసర్ గా కొత్త బాధ్యతలు చేపట్టారు. దీంతో మిలటరీలో చేరిన మొదటి బీజేపీ ఎంపీగా ఠాకూర్ రికార్డు సృష్టించారు. బీసీసీఐ చీఫ్, బిజేపీ ఎంపి, 41 ఏళ్ళ అనురాగ్ ఠాకూర్ ఆర్మీ ఆఫీసర్ గా శుక్రవారం ఉదయం నూతన బాధ్యతలు స్వీకరించారు. తాతగారు ఆర్మీలో పనిచేయడంతో తనకు ఆర్మీలోచేరి, దేశానికి సేవ చేయాలన్న కోరిక చిన్నతనంనుంచీ బలంగా ఉండేదని వేడుక సందర్భంగా మాట్లాడిన ఠాకూర్ తెలిపారు. తన కల ఇన్నాళ్ళకు సాకారమైందని, టెరిటోరియల్ ఆర్మీలో పనిచేస్తూ... దేశ ప్రజల సమస్యలను పార్లమెంట్ లో వినిపించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, దేశ భద్రతకు తనవంతు సేవ అందిస్తానని ఠాకూర్ పేర్కొన్నారు. టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించిన పరీక్షను పూర్తి చేసిన అనంతరం ఠాకూర్ తన పర్సనల్ ఇంటర్వ్యూను ఛండీగఢ్ లోనూ, ట్రైనింగ్ ను భోపాల్ లోనూ పూర్తి చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమిత్ పూర్ నుంచి లోక్ సభ మెంబర్ గా ఎన్నికైన ఠాకూర్ టెరిటోరియల్ ఆర్మీ రెగ్యులర్ ఆఫీసర్ కు అవసరమైన ట్రైనింగ్ ను పూర్తి చేశారు. డిఫెన్స్ లో రెగ్యులర్ ఆర్మీ తర్వాతి స్థానంలో ఉన్న టెరిటోరియల్ ఆర్మీలో.. సుమారు నెలనుంచి, సంవత్సరంపాటు ప్రత్యేక మిలటరీ ట్రైనింగ్ తీసుకున్న వాలంటీర్లను, అత్యవసర పరిస్థితుల్లో దేశ భద్రతకోసం వినియోగించుకుంటారు. -
ఆర్మీలోకి అనురాగ్ ఠాకూర్!
బీజేపీ ఎంపీ, బిసిసిఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్ త్వరలో ఆర్మీలో చేరబోతున్నారు. టెరిటోరియల్ ఆర్మీ అధికారిగా నూతన ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించిన పరీక్షను, ఇంటర్వూను, పూర్తి చేసిన ఆయన.. తన కల ఇన్నాళ్ళకు సాకారం కానుందని, మిలటరీ డ్రెస్ వేసుకోవాలని, దేశ భద్రతకు తనవంతు సేవ అందించాలన్న కోరిక తీరనుందని ఠాకూర్ వెల్లడించారు. అనురాగ్ ఠాకూర్ త్వరలో ఆర్మీ దుస్తుల్లో కనిపించనున్నారు. టెరిటోరియల్ ఆర్మీ అధికారిగా బాధ్యతలు చేపట్టబోతున్న ఆయన.. దానికి సంబంధఙంచిన పరీక్షను, ఇంటర్వ్యూను పూర్తి చేశారు. బీజేపీ ఎంపీగా, బీసీసీఐ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన... టెరిటోరియల్ ఆర్మీలో రెగ్యులర్ ఆఫీసర్ గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించి, మిలటరీ లో చేరిన మొదటి బీజేపీ ఎంపీగా రికార్డు సృష్టించనున్నారు. తాతగారు ఆర్మీలో పనిచేయడంతో తనకు ఆర్మీలో చేరాలన్న కోరిక బలంగా ఉండేదని, అయితే అనుకోకుండా తన కెరీర్ క్రికెట్, పాలిటిక్స్ మార్గంలోకి మారిపోయిందని ఠాకూర్ తెలిపారు. టెరిటోరియల్ ఆర్మీలో రెగ్యులర్ ఆఫీసర్ గా శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్న 41 ఏళ్ళ ఠాకూర్.. ఛండీగర్ లో నిర్వహించిన పర్సనల్ ఇంటర్వ్యూలో అర్హత పొందిన అనంతరం, భోపాల్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమిత్ పూర్ నుంచి లోక్ సభ మెంబర్ గా ఎన్నికయిన ఠాకూర్.. టెరిటోరియల్ ఆర్మీలో అర్హతకోసం ప్రత్యేక ట్రైనింగ్ తీసుకున్నారు. డిఫెన్స్ లో రెగ్యులర్ ఆర్మీ తర్వాతి స్థానంలో ఉన్న టెరిటోరియల్ ఆర్మీలో.. సుమారు నెల నుంచి సంవత్సరంపాటు ప్రత్యేక మిలటరీ ట్రైనింగ్ తీసుకున్న వాలంటరీర్లను తీసుకొని, అత్యవసర పరిస్థితుల్లో దేశ భద్రతకోసం వినియోగించుకుంటారు. దేశానికి సేవ చేయాలన్న తన కల ఇన్నాళ్ళకు నిజం కాబోతోందని, ఆర్మీ యూనిఫాం ధరించేందుకు ఎంతో తహ తహగా ఉందని ఠాకూర్ ఈ సందర్భంలో తెలిపారు. భద్రతా దళాల్లోని ఎన్నో సమస్యలను ఇప్పటిదాకా బయటినుంచే చూడగల్గుతున్నానని, ఇప్పుడు వాటిని దగ్గరినుంచీ చూడటమే కాక, ఎంపీగా సమస్యలను వెలుగులోకి తెచ్చి, వాటి సాధనకోసం పనిచేసే అవకాశం ఉందని తెలిపారు. -
ఆరు నెలల్లో అమలు చేయండి
-
4 గంటల మ్యాచ్లు రద్దు!
ఐపీఎల్-8 అన్ని రకాలుగా విజయవంతం అయిందని ఠాకూర్ ఆనందం వ్యక్తం చేశారు. టోర్నీకి సంబంధించి కొన్ని గణాంకాలు ఆయన వెల్లడించారు. 20 శాతం టీవీ రేటింగ్లు, స్టేడియంలో ప్రేక్షకుల సంఖ్య 15 శాతం పెరిగాయని... తొలి ఐపీఎల్తో పోలిస్తే ఆదాయం 120 శాతం పెరిగిందన్న ఠాకూర్, ఓవరాల్గా 200 కోట్ల మంది ఐపీఎల్ చూశారని వివరించారు. కొత్తగా 16 నగరాల్లో ఈసారి ఏర్పాటు చేసిన ‘ఫ్యాన్ పార్క్’ సిస్టం కూడా విజయవంతమైందని, గుంటూరులో 20 వేల మంది చూశారని ఠాకూర్ చెప్పారు. సెలక్షన్ కమిటీ సభ్యులు ఐపీఎల్లో దాదాపు ప్రతీ చోటా మ్యాచ్లు చూశారని, భవిష్యత్తు కోసం యువ ఆటగాళ్ల లీగ్ ప్రదర్శనపై కూడా వారు ఓ కన్నేసి ఉంచారని గుర్తు చేశారు. కొన్ని మ్యాచ్ ఫలితాలపై ఈడీ దృష్టి పెట్టిందనడంలో వాస్తవం లేదని, ఒకే ఒక ఆటగాడిని బుకీలు సంప్రదిస్తే అతను వెంటనే ఏసీయూకు సమాచారం అందించాడని ఆయన చెప్పారు. ఐపీఎల్లో 4 గంటల నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్ల రద్దు, అన్క్యాప్డ్ ప్లేయర్ల గురించి చర్చ జరిగిందని, వీటిపై తుది నిర్ణయం తర్వాత తీసుకుంటామని ఆయన చెప్పారు. -
2 వారాల్లో ‘గంగ’ ప్రక్షాళన!
రోడ్మ్యాప్ సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీం నదిని కాపాడతామని ఎన్నికల ప్రణాళికలో చెప్పారుగా? అప్పుడు అత్యవసరమన్నారు.. ఇప్పుడు ప్రాధాన్యం లేదా? న్యూఢిల్లీ: గంగానది ప్రక్షాళనకు తీసుకుంటున్న చర్యలపై రెండు వారాల్లోగా మార్గదర్శకాలతో కూడిన రోడ్మ్యాప్ను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గంగానదిని ప్రక్షాళన చేయటం అత్యంత ప్రాధాన్యమైన అంశమని, దీనిపై తక్షణం స్పందించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గంగను ప్రక్షాళన చేస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన విషయాన్ని బీజేపీ సర్కారుకు గుర్తు చేసింది. ‘మీరు గంగానదిని కాపాడుతున్నారా? ఈ అంశం మీ(బీజేపీ) మేనిఫెస్టోలో కూడా ఉంది. దీనిపై ఎందుకు స్పందించరు?’ అని సొలిసిటర్ జనరల్ రంజీత్కుమార్ను కోర్టు ప్రశ్నించింది. ఈ అంశాన్ని జలవనరుల శాఖకు అప్పగించామని కొంత సమయం ఇవ్వాలని ఆయన కోరటంపై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఇది అత్యవసరమైన అంశమని మీరే అన్నారు... ఇప్పుడు మీకు అంత ప్రాధాన్యం లేనట్లుగా కనపడుతోంది. రెండు మంత్రిత్వ శాఖల మధ్య విషయాన్ని తిప్పుతున్నారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. 2,500 కి.మీ. పొడవైన గంగానదిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతామని ఎన్నికల ప్రణాళికలో బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే.