Advertisement
Ulajh Movie
-
జాన్వీ కపూర్ గురించి తప్పుగా మాట్లాడలేదు: సహ నటుడు
సాధారణంగా సినిమా యాక్టర్స్ చాలావరకు ఆచితూచి మాట్లాడుతుంటారు. కానీ కొన్నిసార్లు చాలా సాధారణంగా మాట్లాడినా సరే దాన్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు. అలా ప్రముఖ నటుడు గుల్షన్ దేవయ్య.. హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. అవి కాస్త వైరల్ అయిపోయాయి. ఇప్పుడు దీనికి సదరు నటుడు మళ్లీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. నిజమేనా?)జాన్వీ కపూర్తో కలిసి నటించాను గానీ తనకు వైబ్ రాలేదని గుల్షన్ దేవయ్య అన్నాడు. దీనిపై జాన్వీ కూడా స్పందిస్తూ.. అవును అతడు చెప్పింది నిజమేనని, షూటింగ్ జరుగుతున్న టైంలో ఒక్కసారి కూడా కలిసి కూర్చోలేదని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో గుల్షన్ ఏదో తప్పు చేసినట్లు విమర్శలు వచ్చాయి. దీంతో తన మాటలపై క్లారిటీ ఇచ్చాడు.'జాన్వీ కపూర్ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మా ఇద్దరి మధ్య స్నేహం లేదని చెప్పానంతే. అది మా తప్పు కాదు. జాన్వీ మంచి యాక్టర్. చాలా ప్రొఫెషనల్. సినిమాలో మా సీన్స్ బాగా వచ్చాయ్. ప్రతి సినిమా సెట్లోనూ టీమ్ అంతా కలిసిపోవాలనేం లేదు కదా! నేను ఎవరినీ తక్కువ చేయలేదు. ఉద్దేశపూర్వకంగా తప్పుగా మాట్లాడలేదు. మూవీ కోసం 100 శాతం పనిచేశాం. గతంలో నేను చాలామంది హీరోయిన్లతో కలిసి నటించాను. వాళ్లందరితో నాకు మంచి స్నేహం ఉంది. రాధికా ఆప్టే, సోనాక్షి సిన్హాలతో కలిసి యాక్ట్ చేయడం మర్చిపోలేను. మేం ఎన్నో విషయాలు మాట్లాడుకునే వాళ్లం. జాన్వీతో మాత్రం సినిమా గురించే డిస్కషన్ జరిగింది. అదే రీసెంట్గా ఇంటర్వ్యూలో చెప్పా' అని గుల్షన్ దేవయ్య క్లారిటీ ఇచ్చాడు.(ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి') -
ప్రతి ముఖం ఓ కథ చెబుతుందంటున్న జాన్వీ కపూర్!
ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) విభాగంలో ఆఫీసర్గా ఉద్యోగం చేసి ఓ కుట్రను గురించి కాన్ఫిడెన్షియల్ ఫైల్ను రెడీ చేశారు జాన్వీ కపూర్. మరి... ఈ ఫైల్లో ఉన్న వివరాలు ఏంటి? నిజమైన కుట్రదారులు ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం ‘ఉలజ్’ సినిమాలో చూడాలి. ఈ సినిమాలోనే జాన్వీ కపూర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా నటించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి సుధాంశు సరియ దర్శకత్వం వహించారు. ముందు ‘ఉలజ్’ను జూలై 5న విడుదల చేయాలనుకున్నారు. కానీ రిలీజ్ కాలేదు. దీంతో ఆగస్టు 2న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించి, కొత్త ఫోటోలను విడుదల చేసింది యూనిట్. ‘‘ప్రతి ముఖం ఓ కథ చెబుతుంది. ప్రతి కథ ఓ ఉచ్చులాంటిదే’’ అని ఈ సినిమాను ఉద్దేశించి పేర్కొన్నారు జాన్వీ కపూర్. ఇక తెలుగులో ఎన్టీఆర్ ‘దేవర’, రామ్చరణ్ ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్), హిందీలో వరుణ్ ధావన్ ‘సన్నీ సంస్కారీకీ తులసీ కుమారి’ చిత్రాల్లో హీరోయిన్గా చేస్తున్నారు జాన్వీ కపూర్. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor)