
28వ రోజుకు ‘సమగ్ర’ సమ్మె
కై లాస్నగర్: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్తో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె 28వ రోజుకు చేరింది. సర్కారు తీరును నిరసిస్తూ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట గల సమ్మె శిబిరంలో తమ నిరసనను కొనసాగించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోజ్జ నారా యణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివయ్య తదితరులు సోమవారం సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు పడాల రవీందర్, ప్రియాంక, పార్థసారథి, మల్లిక, భోజన్న, ధరమ్ సింగ్, కేశవ్, దేవదర్శన్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment