30న శ్రీవారి సన్నిధిలో ఉగాది వేడుకలు | - | Sakshi
Sakshi News home page

30న శ్రీవారి సన్నిధిలో ఉగాది వేడుకలు

Published Thu, Mar 27 2025 12:37 AM | Last Updated on Thu, Mar 27 2025 12:33 AM

కొమ్మాది: రుషికొండలోని శ్రీమహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 30న టీటీడీ అర్చకులచే పంచాంగ పఠనం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు వేకువజామున 4 నుంచి 4.30 గంటల వరకు సుప్రభాతం, 4.30 నుంచి 6 గంటల వరకు అర్చన, కొలువు, తోమాల, సహస్ర నామార్చన, 6 నుంచి 8.30 గంటల వరకు సర్వ దర్శనాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 8.30 నుంచి 9 గంటల వరకు అర్చన, 9 గంటల నుంచి 10 గంటల వరకు స్వామి వారి ఆస్థానం, పంచాంగ పఠనం, రాత్రి 7 గంటల వరకు సర్వ దర్శనం, 7 నుంచి 7.40 వరకు అర్చన, 7.40 నుంచి 9.30 గంటల వరకు సర్వ దర్శనం, 9.30 నుంచి 10 గంటల వరకు ఏకాంత సేవ ఉంటుందని, భక్తులు గమనించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement