
పవన్ కల్యాణ్కు విశాఖ పోలీసులు నోటీసులు అందజేశారు.
సాక్షి, విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు విశాఖ పోలీసులు నోటీసులు అందజేశారు. 41A కింద పవన్కు ఏసీపీ హర్షిత నోటీసులు ఇచ్చారు. కాగా, నోటీసుల్లో.. ఈనెలఖారు వరకు పోలీసు యాక్ట్ 30 అమలులో ఉంది. విశాఖలో సభలు, ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతి లేదు. నిబంధనలను ఉల్లంఘించి ర్యాలీ చేసినందుకు పవన్ కల్యాణ్కు నోటీసులు ఇచ్చినట్టు పోలీసులు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: మంత్రుల కార్లపై జనసేన దాడి