notice issue
-
అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి నోటీసులు
-
15 రోజుల్లో రూ.24.57 కోట్లు చెల్లించాలి: సెబీ
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్, కంపెనీ సీఎండీ సి.పార్థసారథికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నోటీసు జారీ చేసింది. పవర్ ఆఫ్ అటార్నీను దుర్వినియోగం చేయడం ద్వారా ఖాతాదారుల నిధులను పక్కదారి పట్టించిన కేసులో రూ.24.57 కోట్లను చెల్లించాలని ఆదేశించింది.గతంలో సెబీ విధించిన జరిమానాను చెల్లించడంలో కార్వీ సంస్థ విఫలమైంది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీస్, ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి ఈ నోటీసు వచ్చింది. 15 రోజుల్లోగా బకాయిలు చెల్లించని పక్షంలో బ్యాంకు ఖాతాలను అటాచ్ చేసి, కంపెనీల స్థిర, చర ఆస్తులను విక్రయించడం ద్వారా ఈ మొత్తాన్ని రికవరీ చేస్తామని సెబీ హెచ్చరించింది. అంతేకాకుండా మార్కెట్ రెగ్యులేటర్ నిబంధనల ప్రకారం పార్థసారథిని అరెస్ట్ చేసి జైలులో నిర్బంధిస్తామని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ప్రముఖ సంస్థపై సీబీఐ కేసు నమోదుబ్రోకింగ్ సంస్థకు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీను దుర్వినియోగం చేసినట్లు సెబీ గతంలోనే తెలిపింది. క్లయింట్ల నిధులను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించారని పేర్కొంది. దాంతో ఏప్రిల్ 2023లో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్, సీఎండీ పార్థసారథిలను సెక్యూరిటీ మార్కెట్ నుంచి ఏడేళ్లపాటు సెబీ నిషేధించింది. అలాగే రూ.21 కోట్ల పెనాల్టీని కూడా విధించింది. అయితే ఈ పెనాల్టీను చెల్లించడంలో కార్వీ జాప్యం చేస్తోంది. దాంతో జరిమానాతో కలిపి మొత్తం రూ.24.57 కోట్లు చెల్లించాలని సెబీ ఆదేశించింది. -
కర్ణాటకలో కొత్త ట్విస్ట్.. ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణకు సిట్ నోటీసులు
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపులు, దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లికి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణను విచారించేందుకు శుక్రవారం ఐపీసీ సెక్షన్లు 64(A), 365, 109, 120(B) కింద సిట్ నోటీసులు ఇచ్చింది. తమ విచారణ కోసం భావానీ రేవణ్ణ హోలెనర్సీపూర్లోని వారి నివాసంలోనే జూన్ 1న సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో సిట్ పేర్కొంది. #BreakingS.I.T issues another notice to #PrajwalRevanna's mother #BhavaniRevanna in the kidnapping case.Prajwal Revanna will shortly be taken for a medical examination, and after that, he will be brought to the City Civil Court Complex for further questioning...: @dpkBopanna… pic.twitter.com/G9croxFBP6— TIMES NOW (@TimesNow) May 31, 2024 ఇక.. శుక్రవారం తెల్లవారుజామున జర్మనీ నుంచి భారత్కు వచ్చిన ప్రజ్వల్ రేవణ్ణను సిట్ పోలీసులు బెంగళూరు కెంపెగౌడ ఎయిర్పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. ఇక.. అక్కడి నుంచి ఆయన్ను విచారణ కోసం సీఐడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. విచారణలో భాగంగా ప్రజ్వల్కు పొటెన్సీ పరీక్షలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
Lok sabha elections 2024: ఫేక్ రాజకీయం!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏప్రిల్ 23న తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మతపరమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను వారికి తిరిగిస్తామని ప్రకటించారు. అయితే మొత్తంగా రిజర్వేషన్లనే రద్దు చేస్తామని అమిత్ షా చెప్పినట్టుగా మారి్ఫంగ్ చేసిన వీడియో తాజాగా దేశవ్యాప్తంగా వైరలవుతోంది. లోక్సభ ఎన్నికల్లో తీవ్ర నష్టం చేయగల ఈ పరిణామాన్ని బీజేపీ సీరియస్గా తీసుకుంది. కేంద్ర హోం శాఖ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. దీంతో సంబంధముందంటూ అసోంలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక ఈ నకిలీ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ విస్తృతంగా షేర్ చేసిందంటూ పీసీసీ చీఫ్ అయిన సీఎం రేవంత్రెడ్డికి ఏకంగా సమన్లు జారీ చేశారు! సోమవారం హైదరాబాద్ వచ్చి మరీ రేవంత్, పీసీసీ సోషల్ మీడియా ఇన్చార్జి, మరికొందరు కాంగ్రెస్ నేతలకు నోటీసులిచ్చారు! అమిత్ షా మార్ఫింగ్ వీడియోను ఎక్స్లో పోస్టు చేశారన్నది రేవంత్పై ఆరోపణ. రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్న ఈ పరిణామంతో డీప్ ఫేక్ ముప్పు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది...దేశం ఇప్పుడు సమాచార యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. సాంకేతికత సమాచారాన్ని ఎంత వేగంగా ప్రచారం చేస్తోందో అంతే వేగంగా దేశాన్ని ప్రమాదంలోనూ పడేస్తోంది. ముఖ్యంగా కృత్రిమ మేధతో పుట్టుకొచి్చన వికృత శిశువు ‘డీప్ ఫేక్’ ఎన్నికల్లో పెద్ద అస్త్రంగా మారిపోయింది. పారీ్టలు ఫేక్ వీడియోలతో తమ ప్రత్యర్థులపై దు్రష్పచారం చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫేక్ వీడియోలు విపరీతంగా కలకలం రేపడమే గాక ఓటర్లపైనా బాగా ప్రభావం చూపాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా ఫేక్ వీడియోల జోరు మామూలుగా లేదు! పలు పార్టీలు తమ చేతికి మట్టి అంటకుండా డీప్ ఫేక్లను వీలైనంతగా వాడుకుంటున్నాయి. చౌక బేరండీప్ ఫేక్లను రూపొందించడానికి అవసరమైన కృత్రిమ మేధ సాధనాలు కారుచౌకగా అందుబాటులో ఉన్నాయి. కొన్నయితే ఉచితం కూడా! దాంతో పారీ్టలన్నీ ఓటర్లను ప్రభావితం చేయడానికి ఎడాపెడా డీప్ ఫేక్లను తయారు చేసి వదులుతున్నట్టు వాటి నిర్వాహకులే చెబుతున్నారు. టీవీ వార్తలు మొదలుకుని ఫేస్బుక్, వాట్సాప్ వంటి గ్లోబల్ ప్లాట్ఫాంల దాకా నకిలీ వార్తల రూపకల్పన, ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. ఇవి ఒకసారి జనంలోకి వెళ్లాక ఏం చేసినా నష్ట నివారణ కష్టమే.ఏఐ వాడకం..బీజేపీతోనే మొదలు... » ప్రచారంలో సాంకేతికతను వాడకంలో అధికార బీజేపీ ఎంతో ముందంజలో ఉంది. » ఆ పార్టీ 2012లోనే మోదీ త్రీడీ హాలోగ్రామ్ను వాడింది! దీని ద్వారా ఒకేసారి అనేక ప్రదేశాల్లో ప్రచారంలో పాల్గొనవచ్చు. » ఈ వ్యూహాన్ని 2014 లోక్సభ ఎన్నికల్లో విస్తృతంగా అమలు చేశారు. » ప్రచారం కోసం డీప్ఫేక్లను వాడిన తొలి నేతగా ఢిల్లీ బీజేపీ ఎంపీ, సినీ నటుడు మనోజ్ తివారీ నిలిచారు. 2020లో ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ హిందీ, హర్యాణ్వీ, ఇంగ్లిష్ భాషల్లో ఓటర్లనుద్దేశించి మూడు వీడియోల్లో ప్రసంగించారు. వీటిలో హిందీ వీడియో మాత్రమే అసలుది. మిగతా రెండూ డీప్ ఫేక్లు. కానీ ఏ మాత్రమూ గుర్తించలేనంత పకడ్బందీగా తివారీ గొంతు, పెదవుల కదలిక తదితరాలను మార్చారు! గతి తప్పుతున్న వ్యూహం అధికారికంగా, బహిరంగంగా జరిగే డీప్ ఫేక్ వ్యవహారాన్ని మించి ప్రత్యర్థులపై బురదజల్లేలా ‘అనైతిక ప్రచారం’ జోరుగా సాగుతోంది. వాట్సాప్లో అంతర్జాతీయ నంబర్లు, ఇన్స్టా్రగాంలో బర్నర్ హ్యాండిల్స్ తదితరాల ద్వారా ఇలాంటి కంటెంట్ ప్రజలను చేరుతోంది. రాజకీయ ప్రత్యర్థుల వీడియోలు, ఆడియోలకు అభ్యంతరకర, అశ్లీల కంటెంట్ను జోడిస్తూ డీప్ ఫేక్లు హోరెత్తిస్తున్నాయి. పలు సంస్థలు ఇలాంటి కంటెంట్ తయారీతో పాటు దాన్ని వైరల్ చేసే బాధ్యతనూ తీసుకుంటున్నాయి. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా నిర్మాణ కారి్మకుల ఫోన్ నంబర్ల సాయంతో డీప్ ఫేక్లను విచ్చలవిడిగా వైరల్ చేశారు. అభ్యర్థులు అవినీతిపరులని చూపేందుకు డబ్బులు తీసుకుని ఓటేయాలని ఓటర్లను బెదిరిస్తున్నట్టు, డబ్బు పంచుతున్నట్టు వీడియోలు, ఆడియోలు రూపొందించి ప్రచారం చేశారు. ప్రత్యర్థులపైనే గాక సొంత పారీ్టలోనూ శత్రువులపైనా కొందరు ఇలాంటి ప్రచారాలకు దిగుతున్నారు!చట్టాలకావల మన దేశంలో డీప్ ఫేక్ ఎన్నికల సమగ్రతకే ముప్పుగా మారుతోంది. ప్రస్తుత చట్టాలేవీ డీప్ ఫేక్ను స్పష్టంగా నిర్వచించడం లేదు. వ్యక్తిగత కేసుల్లో ఐటీ చట్టంతో కలిపి, పరువు నష్టం, నకిలీ వార్తలు, వ్యక్తి ప్రతిష్టకు భంగం, ప్రైవసీ ఉల్లంఘన వంటి చట్టాలను వాడుతూ పోలీసులు నెట్టుకొస్తున్నారు. నిరాశపరిచిన మ్యూనిచ్ ఒప్పందం డీప్ ఫేక్లను నియంత్రించాలంటూ గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలపై కేంద్రం ఒత్తిడి తెస్తోంది. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు కృత్రిమ మేధ సాధనాలను వాడకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటూ ప్రముఖ టెక్ కంపెనీలు మ్యూనిచ్ సదస్సులో ఒప్పందానికి వచి్చనా ఆచరణలో పెద్దగా జరిగిందేమీ లేదు. గతేడాది తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలాంటిదే జరిగింది. కాంగ్రెస్కు ఓటేయాలంటూ బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ ప్రజలకు పిలుపునిస్తున్న వీడియో క్లిప్ పోలింగ్కు ముందు రోజు తెగ వైరలైంది. దాన్ని లక్షలాది మంది చూశారు. ఇదీ కృత్రిమ మేధ సాయంతో రూపొందిన డీప్ ఫేక్ వీడియోనే.నోట్ దీజ్ పాయింట్స్» భారత్లో జనాభాలో సగానికి పైగా, అంటే ఏకంగా 76 కోట్ల పై చిలుకు ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. » కనుక ఆన్లైన్ ప్రచారం శరవేగంగా ప్రజలను చేరుతోంది. » రీల్స్, షార్ట్స్ ప్రపంచాన్ని ఏలుతున్న ఈ రోజుల్లో ఒక్క క్లిక్, ఒక్క స్వైప్తో ఓటరు అభిప్రాయాన్ని మార్చొచ్చు. కనీసం ప్రభావితం చేయొచ్చు. » పార్టీ అభిమానులు పెద్దగా పట్టించుకోకున్నా తటస్థ ఓటర్లను ఇలాంటి ప్రచారం ప్రభావితం చేయగలదు. » ఈ అంశాన్ని తమ అభిమాన పార్టీలకు సానుకూలంగా మలిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. » అందుకే కృత్రిమ మేధతో పుట్టుకొచ్చే ‘మానిప్యులేటెడ్ కంటెంట్’ ఈ లోక్సభ ఎన్నికల్లో అనేక రెట్లు పెరగనుందని అంచనా. తప్పుడు ప్రచారంతో ఒక్క ఓటర్ మనసు మార్చినా అది స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు గొడ్డలిపెట్టే. ఈ తప్పుడు ప్రచార సరళి మీద ఈసీ దృష్టి పెట్టి ప్రజాస్వామ్యానికి చేటుగా మారుతున్న డీప్ఫేక్లను నియంత్రించాల్సిన అవసరముంది. నష్టం జరగకముందే చర్యలు తీసుకోవాలి– కేంద్ర ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్ ఎస్వై ఖురేషీ–సాక్షి, నేషనల్ డెస్క్ -
రూ.46 కోట్లు కట్టు! పీజీ విద్యార్థికి ఐటీ నోటీసు
గ్వాలియర్: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ప్రమోద్ దండోతియా(25) అనే పీజీ విద్యార్థి ఏకంగా రూ.46 కోట్ల ఆదాయ పన్ను నోటీసు అందుకున్నాడు! దాంతో షాకై పోలీసులను ఆశ్రయించాడు. తన పాన్ కార్డు వివరాల ద్వారా ఎవరో ఢిల్లీ, ఫుణేల్లో తన పేరిట ఓ కంపెనీని సృష్టించి ఈ లావాదేవీలు జరిపినట్లు ఐటీ, జీఎస్టీ అధికారుల ద్వారా తెలిసిందని బాధితుడు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారతనికి సూచించారు. ఐటీ నోటీసులు, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేయాలని ప్రమోద్కు చెప్పినట్టు ఏఎస్పీ షియాజ్ తెలిపారు. దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. -
కేజ్రీవాల్కు మళ్లీ సమన్లు
న్యూఢిల్లీ: మద్యం విధానం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణకు రావాలంటూ ఈడీ పంపిన నోటీసులను పట్టించుకోని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. విచారణకు రావాలంటూ జనవరి 12, 31వ తేదీలతోపాటు ఫిబ్రవరి 14వ తేదీన పంపిన 4 నుంచి 8 వరకు సమన్లపై కేజ్రీవాల్ స్పందించలేదంటూ బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేసింది. విచారణ చేపట్టిన జడ్జి దివ్యా మల్హోత్రా ఈ నెల 16వ తేదీన తమ ఎదుట హాజరు కావాలంటూ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేశారు. -
కేజ్రీవాల్కు ఢిల్లీ పోలీసుల నోటీసులు
ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ చేసిన ఆరోపణలకు గాను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు శనివారం పోలీసులు నోటీసులిచ్చారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను మూడు రోజుల్లో అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఐదు గంటలు హైడ్రామా జరిగింది. కేజ్రీవాల్ నివాసంలో అధికారులు తాము నోటీసులు తీసుకుంటామని చెప్పగా పోలీసులు నిరాకరించారు. సీఎంకే ఇస్తామన్నారు. చివరికి కేజ్రీవాల్ బయటకు రాగా నోటీసులిచ్చారు. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తామిచ్చిన ఐదు నోటీసులకు కేజ్రీవాల్ స్పందించలేదంటూ ఈడీ అధికారులు శనివారం అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దివ్యా మల్హోత్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ నెల 7వ తేదీన విచారణ చేపడతామని మేజిస్ట్రేట్ చెప్పారు. -
జీ–సోనీ విలీన డీల్ రద్దు!!
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న జీ ఎంటర్టైన్మెంట్, సోనీ గ్రూప్ భారత విభాగ విలీన డీల్ ఊహాగానాలకు అనుగుణంగానే రద్దయింది. సోనీ గ్రూప్ కార్పొరేషన్ సోమవారం ఈ మేరకు ప్రకటన చేసింది. ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్)కు నోటీసు పంపింది. ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించినందుకు, ఆర్బిట్రేషన్కు తెర తీసినందుకు గాను 90 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.750 కోట్లు) బ్రేకప్ ఫీజు చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. ‘సోనీ గ్రూప్ కార్పొరేషన్లో భాగమైన సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (ప్రస్తుతం కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్) సంస్థ .. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) విలీనానికి సంబంధించి 2021 డిసెంబర్ 22న ప్రకటించిన ఒప్పందాలను రద్దు చేస్తూ, నోటీసులు ఇచ్చింది’ అని సోనీ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. విలీన సంస్థకు ఎవరు సారథ్యం వహించాలనే విషయంపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఈ విషయమై సోనీ నుంచి నోటీసులు వచి్చనట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు జీల్ తెలిపింది. ‘విలీన ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు నిబద్ధతతో అన్ని ప్రయత్నాలు చేశాం. మాకు వన్టైమ్ ప్రాతిపదికన, మళ్లీ మళ్లీ ఖర్చులకు దారి తీసే చర్యలు కూడా తీసుకున్నాం’ అని తెలిపింది. డీల్ రద్దు వ్యవహారంపై చట్టపరంగా తీసుకోదగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. నిబంధనల పాటింపునకు, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తెచ్చుకునేందుకు జీల్ 2023 సెపె్టంబర్ వరకు దాదాపు రూ. 367 కోట్లు వెచి్చంచింది. ఇదీ జరిగింది.. ఎస్పీఎన్ఐలో జీల్ను విలీనం చేసేందుకు సంబంధించి 2021 డిసెంబర్లో ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం 24 నెలల్లోగా విలీనం జరగాలి. అలా జరగకపోవడంతో నెల రోజుల పాటు జనవరి 21 గడువు పొడిగించారు. డీల్ సాకారమై ఉంటే దేశీయంగా 10 బిలియన్ డాలర్ల మీడియా దిగ్గజం ఆవిర్భవించేది. విలీన సంస్థలో సోనీకి 50.86 శాతం, జీల్ ప్రమోటర్లయిన గోయెంకా కుటుంబానికి 3.99 శాతం వాటాలు ఉండేవి. 70 పైగా టీవీ చానల్స్, రెండు వీడియో స్ట్రీమి ంగ్ సరీ్వసులు, రెండు ఫిలిమ్ స్టూడియోలతో భార త్లో అతి పెద్ద ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్గా ఉండేది. ఈ ఒప్పందానికి నియంత్రణ సంస్థల నుంచి కూడా అనుమతులు లభించాయి. అయితే, ఈలో గా జీ ప్రమోటర్లయిన సుభాష్ చంద్ర, ఆయన కుమారుడు .. సీఈవో పునీత్ గోయెంకాలపై నిధుల మళ్లింపు ఆరోపణలు రావడంతో వారిని లిస్టెడ్ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉండకూడదంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. దీనిపై సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్లో గోయెంకాకు స్టే లభించింది. కానీ, ప్రాథమికంగా డీల్ కింద విలీన సంస్థ సారథ్య బాధ్యతలను గోయెంకాకు అప్పగించాలని భావించినప్పటికీ ఈ పరిణామాలతో ఆ అంశంపై సందిగ్ధత నెలకొంది. గోయెంకాను సీఈవోగా కొనసాగించడాన్ని సోనీ ఇష్టపడటం లేదని, ఆయన వెనక్కి తగ్గటం లేదని వార్తలు వచ్చాయి. దీనిపై నిర్దిష్ట డెడ్లైన్లోగా ఇరుపక్షాలూ అంగీకారానికి రాకపోవడంతో డీల్ రద్దు కానుందంటూ ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడేంటి.. ఆదాయాలు, లాభాల క్షీణతతో కొన్నాళ్లుగా జీ ఆర్థిక పనితీరు తగ్గుతూ వస్తోంది. సోనీతో డీల్ రద్దు అయిన నేపథ్యంలో జీల్కి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ భారత మీడియా వ్యాపార విలీనమైతే ఏర్పడే భారీ సంస్థతో పోటీపడేందుకు మళ్లీ వ్యూహాలు రచించుకోవాలి. కొన్ని క్రికెట్ ఈవెంట్ల ప్రసారం కోసం డిస్నీలో భాగమైన స్టార్తో జీల్కి ఒప్పందం ఉంది. దీని కోసం నాలుగేళ్ల వ్యవధిలో 1.32–1.44 బిలియన్ డాలర్ల వరకు చెల్లించాలి. సోనీతో డీల్ రద్దు అయినందున ఈ ఒప్పందంపైనా ప్రభావం పడొచ్చు. మరోవైపు, ప్రాంతీయ భాషల్లో జీల్కి ఉన్న కంటెంట్, టీవీ చానల్స్ అందుబాటులో ఉండవు కాబట్టి సోనీ కూడా భారత్లో తన కార్యకలాపాల వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సి రావచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
మహారాష్ట్ర స్పీకర్కు బాంబే హైకోర్టు నోటీసులు
ముంబై: ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోని 14 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ తాను పెట్టుకున్న పిటిషన్లను మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ కొట్టేయడాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం నేత, చీఫ్ విప్ భరత్ గోగావాలే బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో ఈ విషయంలో మీ స్పందన తెలపాలంటూ స్పీకర్, 14 మంది ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు పంపింది. అసెంబ్లీ సచివాలయానికీ కోర్టు నోటీసులిచి్చంది. నోటీసులు అందుకున్న వారు తమ స్పందనను అఫిడవిట్ల రూపంలో సమరి్పంచాలని కోర్టు సూచించింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి ఎనిమిదో 8కి వాయిదావేసింది. -
మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. రాహుల్కు ఈసీ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై ఈసీ వివరణ కోరింది. రాహుల్ వ్యాఖ్యలపై ఈనెల 25లోగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. వివరాల ప్రకారం.. రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు ఇచ్చింది. క్రికెట్ వరల్డ్కప్ ఫైనల్లో భారత్ ఓటమి నేపథ్యంలో మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఫైనల్ సందర్బంగా మోదీ స్టేడియంకు వెళ్లడం వల్లే టీమిండియా ఓడిపోయిందని రాహుల్ అన్నారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీని అపశకునంగా రాహుల్ పోల్చారు. ఈ క్రమంలో మోదీని పనౌతీ, పిక్ పాకెటర్ అంటూ రాహుల్ వ్యాఖ్యలు చేశారు. దీంతో, రాహుల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం, ఈసీ.. రాహుల్కు నోటీసులు పంపింది. రాహుల్ వ్యాఖ్యలపై ఈనెల 25లోగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. Election Commission of India issues notice to Congress MP Rahul Gandhi on his 'panauti' and 'pickpocket' jibes at PM Modi, asks him to respond by 25th November pic.twitter.com/CcrIlU6I9o — ANI (@ANI) November 23, 2023 -
తమిళనాడు పిటిషన్పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీస్
న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ తాత్సారం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు స్పందన కోరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జే/బీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ మేరకు నోటీసు జారీ చేసింది. రాజ్యాంగ బద్ధమైన ఒక అధికారం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ విధులను అడ్డుకుంటోందని తమిళనాడు ప్రభుత్వం పిటిషన్లో ఆరోపించింది. జోక్యం చేసుకోవాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 12 బిల్లులు గవర్నర్ ఆర్ఎన్ రవి వద్ద పెండింగ్లో ఉన్నాయని విచారణ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 20న చేపడతామని తెలిపింది. -
విపక్షాల కూటమికి షాక్.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు..
న్యూఢిల్లీ: అధికార ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల కూటమికి 'ఇండియా' అని పేరు పెట్టడంపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన నేపధ్యంలో హైకోర్టు విపక్షాల కూటమికి నోటీసులు జారీ చేసింది. అధికార బీజేపీ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా 26 ప్రతిపక్షాలు ఏకమై ఆ కూటమికి 'ఇండియా'(ఇండియాన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్) అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ కూటమికి ఇండియా అని నామకరణం చేయడంపై మొదట్లోనే వ్యతిరేకత వచ్చింది. దీనిపై ఎలెక్షన్ కమిషన్ కు నివేదించినా కూడా వారు స్పందించకపోవడంతోనే పిటిషనర్ రిట్ పిటిషన్ దాఖలు చేశాడని హైకోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ న్యాయమూర్తి అమిత్ మహాజన్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ వెంటనే కేంద్ర హోంశాఖ, ఎలక్షన్ కమిషన్, 26 పార్టీలు దీనిపై వివరణ ఇవ్వాల్సిందింగా కోరింది. విపక్షాల కూటమికి 'ఇండియా' అని నామకరణం చేయడంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని, ఎలక్షన్ కమిషన్ను ఆదేశించమని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఇండియా అనే పేరుని వాడుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అమాయక ప్రజలను సెంటిమెంటుతో మోసం చేసి అధికారాన్ని చేజిక్కించుకుని మొదట వారిలో రాజకీయ ద్వేషాన్ని రగిలించి రాజకీయ విధ్వంసానికి పాల్పడనున్నారని పిల్ ద్వారా గిరీష్ భరద్వాజ్ పిల్లో పేర్కొన్నారు. ఇండియా అనేది జాతీయ చిహ్నంలో భాగమని.. విపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టడం 1950 యాక్ట్ నిబంధనల ప్రకారం వృత్తి, వాణిజ్య, రాజకీయ ప్రయోజనాలకు జాతీయ చిహ్నాన్ని వినియోగించడం చట్ట విరుద్ధం కాబట్టి ఒకరకంగా ఇది జాతిని అవమానించడమేనని అందులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: Viral Video : ఎన్సీసీ జూనియర్లపై సీనియర్ దురాగతం.. -
స్పైస్జెట్కు ఎన్సీఎల్టీ నోటీసులు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ స్పైస్జెట్పై దివాలా పరిష్కార ప్రక్రియ కింద చర్యలు తీసుకోవాలంటూ కంపెనీకి ఎయిర్క్రాఫ్టులను లీజుకి ఇచ్చిన ఎయిర్క్యాజిల్ (ఐర్లాండ్) పిటీషన్పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) విచారణ జరిపింది. స్పైస్జెట్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే 17కు వాయిదా వేసింది. నోటీసుల జారీ ప్రక్రియ సాధారణమేనని, ఎన్సీఎల్టీ తమకు ప్రతికూలంగా ఉత్తర్వులేమీ ఇవ్వలేదని స్పైస్జెట్ అధికార ప్రతినిధి తెలిపారు. సెటిల్మెంట్ కోసం ఇరు పక్షాలు చర్చలు జరుపుతున్న విషయాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుందని పేర్కొన్నారు. ఇకపైనా చర్చలను కొనసాగించవచ్చని వివరించారు. స్పైస్జెట్పై ఎయిర్క్యాజిల్ ఏప్రిల్ 28న పిటిషన్ దాఖలు చేసింది. అయితే, తమ దగ్గర ఎయిర్క్యాజిల్ విమానాలేమీ లేవని, ఈ పిటిషన్తో తమ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదని స్పైస్జెట్ గత వారం తెలిపింది. ఎన్సీఎల్టీ వెబ్సైట్ ప్రకారం స్పైస్జెట్పై ఇప్పటికే రెండు దివాలా పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. -
పేపర్ లీక్ కేసు: ‘కేటీఆర్ చెప్పింది నిజమే.. వారిద్దరూ ఎవరంటే?’
సాక్షి, కామారెడ్డి: టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ స్పీడ్ పెంచింది. ఈ కేసులో ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలపై సిట్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్కు ఆయన దగ్గరున్న వివరాలు ఇవ్వాలని సిట్.. సీఆర్పీసీ 91 కింద నోటీసులు పంపించింది. ఈ మేరకు రేవంత్ రెడ్డి ఇంటికి సిట్ అధికారులు, జూబ్లీహిల్స్ పోలీసులు చేరుకున్నారు. రేవంత్ ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. నోటీసుల్లో భాగంగా ఈనెల 23వ తేదీన సిట్ ఆఫీసు వచ్చి వివరాలు ఇవ్వాలని కోరారు. అయితే, కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడులో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేపట్టిన హాత్ సే హాత్ యాత్రలో ఉన్నారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. టీఎస్టీఎస్ ఛైర్మన్ కేటీఆర్కు దగ్గరి బంధువు. అన్ని ప్రభుత్వ శాఖల్లో కంప్యూటర్లను టీఎస్టీఎస్ మాత్రమే నిర్వహిస్తోంది. పేపర్ లీకేజీ కేసులో ఐటీ శాఖకు ఏం సంబంధమని కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలోనే టీఎస్పీఎస్సీ రికార్డుల కంప్యూటరీకరణ జరిగింది. కంప్యూటర్ల భద్రతపై ఐటీ శాఖ సెక్యూరిటీ ఆడిట్ చేయాలి. పేపర్ లీకేజీ స్కాంను తామే బయటపెట్టామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఒక విషయంలో కేటీఆర్ నిజం మాట్లాడారు. ఈ స్కాంలో ఇద్దరికే సంబంధం ఉందని కేటీఆర్ చెప్పారు. ఆ ఇద్దరు కేసీఆర్, కేటీఆరేనని నేను అంటున్నాను అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక సిట్ నోటీసులపై స్పందిస్తూ.. సిట్ నోటీసులు ఊహించిందే. నన్ను వేధించాలనే నోటీసులు ఇస్తోంది. సిట్ నోటీసులను స్వాగతిస్తున్నాను. కేటీఆర్కు కూడా నోటీసులు ఇవ్వాలి. కేటీఆర్తో పాటు సబిత, శ్రీనివాస్ గౌడ్, సిట్ అధికారి శ్రీనివాస్కు కూడా నోటీసులు ఇవ్వాలి. నా దగ్గర ఉన్న ఆధారాలు సిట్ను ఇస్తాను. కేటీఆర్కు నోటీసులు ఇవ్వకపోతే కోర్టులో తేల్చుకుంటాను అని అన్నారు. ఇక, పేవర్ లీక్ వ్యవహారంపై అంతకుముందు రేవంత్ మాట్లాడుతూ గ్రూప్-1 పరీక్ష పత్రం లీకేజీపై తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రూప్-1 పరీక్షల్లో కరీంనగర్లోని మల్యాల మండలంలో వంద మందికి పైగా అభ్యర్థులు ప్రిలిమ్స్ క్లియర్ చేశారని ఆరోపించారు. ప్రిలిమ్స్లో వీరికి 100కుపైగా మార్కులు వచ్చాయన్నారు. ఇందులో కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపైనే సిట్ తమకు ఆధారాలు ఇవ్వాలని నోటీసులు పంపించింది. ఇది కూడా చదవండి: కేటీఆర్ పీఏపై రేవంత్ షాకింగ్ కామెంట్స్.. -
పేపర్ లీక్పై రేవంత్ సంచలన ఆరోపణలు.. ట్విస్ట్ ఇచ్చిన సిట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్పై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, ఈ కేసులో విచారణ చేపట్టిన సిట్.. దూకుడు పెంచింది. ఆరోపణలు చేసిన పొలిటికల్ లీడర్లకు నోటీసులు అందజేస్తోంది. తమ వద్ద ఉన్న ఆధారాలను అందించాలంటూ సిట్ వారిని కోరింది. దీంతో, పేపర్ లీక్ అంశం ఆసక్తికరంగా మారింది. పేపర్ లీక్ విషయంలో ఆరోపణలు చేస్తున్న పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇచ్చి.. వారి వద్ద ఆధారాలని పేర్కొంది. ఇక, పేపర్ లీక్ వ్యవహారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే మండలంలో వంద మందికి ర్యాంకులు వచ్చాయని తెలిపారు. అయితే, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సిట్ సీరియస్గా తీసుకుంది. దీంతో, రేవంత్ వద్ద ఉన్న ఆధారాలను తమకు అందించాలని సిట్ ఏసీపీ కోరారు. ఇక, రేవంత్ ఇటీవలే పేపర్ లీక్ అంశంలో కేటీఆర్ పీఏ తిరుపతి పాత్ర కూడా ఉందన్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు, వివరాలు కూడా ఇవ్వాలని సిట్ పేర్కొంది. ఇది కూడా చదవండి: మంత్రి పీఏనే లీకేజీ సూత్రధారి.. జైలులో ప్రవీణ్, రాజశేఖర్కు బెదిరింపులు: రేవంత్ రెడ్డి -
ప్రధాని మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఇంటి పేరును ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు ఉపయోగించుకోలేదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై కేపీ వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై సమాధానం ఇస్తూ ఫిబ్రవరి 9న రాజ్యసభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీపై రాజ్యసభ కార్యకలాపాల నిర్వహణ నిబంధనల్లోని రూల్ 188 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు కేసీ వేణుగోపాల్ తన నోటీసులో పేర్కొన్నారు. నెహ్రూ కుటుంబాన్ని ప్రధాని అవమానించారని ఆక్షేపించారు. నెహ్రూ కుటుంబ సభ్యులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లోక్సభ సభ్యులేనని గుర్తుచేశారు. నెహ్రూ ఇంటి పేరును ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు వాడుకోలేదని ప్రశ్నించడం అసంబద్ధం, అర్థరహితమని వేణుగోపాల్ తేల్చిచెప్పారు. -
రాజాసింగ్కు మళ్లీ నోటీసులు.. భయపడేది లేదంటూ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి షోకాజ్ నోటీసులు ఇచ్చారు పోలీసులు. తాజాగా మంగళ్హాట్ పోలీసులు.. రాజాసింగ్కు నోటీసులు అందజేశారు. కాగా, నోటీసుల్లో కోర్టు పేర్కొన్న బెయిల్ షరతులను ఉల్లంఘించారని తెలిపారు. అంతకుముందు, పీడీ యాక్ట్ కేసులో రాజాసింగ్కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇక, పోలీసుల నోటీసులపై రాజాసింగ్ స్పందించారు. రాజాసింగ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా, జైలుకు పంపినా భయపడేది లేదు. ధర్మం కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను.. గో హత్య, మతమార్పిడులు, లవ్ జిహాద్పై చట్టం చేయాలని కోరాను.. ఇందులో మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం ఉన్నాయి. ముంబైలో పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడితే.. నాకు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. సోమవారం విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టంలోని (పీఎంఎల్ఏ) 2, 3, 50 సెక్షన్ల కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో మొత్తం పది అంశాలను పొందుపరిచింది. హైదరాబాద్ జోనల్ ఈడీ కార్యాలయం అదనపు డైరెక్టర్ దేవేందర్ కుమార్ సింగ్ పేరుతో, 15వ తేదీతో (గురువారం) ఈ సమన్లు ఉన్నాయి. 2015 నుంచి రోహిత్రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులకు సంబంధించిన ఆర్థిక, వ్యాపార లావాదేవీలు, ఐటీ, జీఎస్టీ రిటర్న్స్, బ్యాంకు స్టేట్మెంట్స్, స్థిరచరాస్తులతోపాటు రుణాల వివరాలు తీసుకురావాలంటూ ఈడీ స్పష్టం చేసింది. ఆధార్, పాన్కార్డు, పాస్పోర్టు కాపీలు తీసుకురావాలని పేర్కొంది. అతడి కుటుంబీకులకు సంబంధించిన పూర్తి బయోడేటాను అందించాలని కోరిన ఈడీ దాని నమూనాను నోటీసులతో జత చేసింది. రోహిత్రెడ్డిపై తొమ్మిది కేసులు రోహిత్ రెడ్డి 2018లో నామినేషన్తోపాటు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయనపై మొత్తం 9 కేసులు ఉన్నాయి. ఇవన్నీ 2017–18 మధ్య తాండూరుతోపాటు బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో నమోదయ్యాయి. వీటిలో అత్యధికం ఎన్నికల సంబంధిత నేరాలే. ఒక్క కేసులో మాత్రమే మోసం తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ ఏడాది మార్చిలో బెంగళూరులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులోనూ రోహిత్రెడ్డి పేరు వినిపించింది. నిర్మాత శంకరగౌడ్ బెంగళూరులో గతేడాది ఇచ్చిన పార్టీకి రోహిత్రెడ్డి హాజరైనట్లు ఆరోపణలు ఉన్నాయి. నైజీరియన్ అరెస్టుతో గుట్టురట్టయిన ఈ వ్యవహారంలో రూ.కోట్ల విలువైన డ్రగ్స్ విదేశాల నుంచి వచ్చినట్లు అక్కడి నార్కోటిక్ అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబం«ధించి ఇప్పటికే హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్తలకు నోటీసులు ఇచ్చిన బెంగళూరు పోలీసులు విచారించారు. వీరిలో కొందరు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులను ఆ పార్టీకి తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమేయంపై వార్తలు వెలువడ్డాయి. ఆ డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని రోహిత్రెడ్డి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏ కేసులో ఈడీ సమన్లు జారీ చేసిందో తెలియాల్సి ఉంది. ఏ కేసు ప్రస్తావన లేకుండా ఈడీ ఇచ్చిన నోటీసులపై రోహిత్రెడ్డి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఈడీ ఎలాంటి కేసులను దర్యాప్తు చేస్తుంది? ఈడీ అధికారులు రెండు చట్టాలకు సంబంధించిన కేసులను మాత్రమే దర్యాప్తు చేస్తుంటారు. పీఎంఎల్ఏతో పాటు విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద మాత్రమే కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తుంటుంది. ఫెమా చట్టాన్ని ఈడీ అధికారులే నేరుగా వినియోగించవచ్చు. విదేశీ మారకద్రవ్యాలకు సంబంధించిన లావాదేవీలున్న అంశాలనే ఈ చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో దర్యాప్తు చేస్తుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, విచారణకు నోటీసులు అందుకున్న వారు ఏదో ఒక కోణంలో విదేశీ కరెన్సీ లావాదేవీలు చేసి ఉండాలి. అయితే పీఎంఎల్ఏ కింద ఈడీ అధికారులు ఓ కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలంటే మాత్రం నేరుగా కుదరదు. అప్పటికే ఏదో ఒక పోలీసుస్టేషన్ లేదా సీబీఐ వంటి ప్రత్యేక విభాగంలో కేసు నమోదై ఉండాలి. ఆ ఎఫ్ఐఆర్ ఆ«ధారంగానే ఈడీ పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేస్తుంది. ఏదైనా కేసులో ఓ వ్యక్తి నిందితుడు కాకపోయినప్పటికీ... నిందితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి విచారణలో పేరు వెలుగులోకి రావడమో, వారి వాంగ్మూలాల్లో ప్రస్తావన ఉండటమో జరిగినా ఈడీ నోటీసులు ఇచ్చి విచారించే ఆస్కారం ఉంది. ఇప్పటికే ఏదో ఒకచోట నమోదైన కేసు ఆధారంగానే రోహిత్రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసి ఉండొచ్చని చెప్తున్నారు. మరోసారి రకుల్కు నోటీసులు టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్కు ఈడీ అధికారులు శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈమెను సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. టాలీవుడ్ ప్రముఖులతో ముడిపడి ఉన్న డ్రగ్స్ కేసుకు సంబం«ధించి ఇప్పటికే ఈడీ రకుల్ను ఓసారి విచారించింది. ఎక్సైజ్ అధికారులు 2017లో నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. అయితే అప్పట్లో ఎక్కడా రకుల్ పేరు బయటకు రాలేదు. తర్వాత ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన ఓ డ్రగ్ కేసులో కీలక నిందితుడైన కెల్విన్ విచారణలో బయటపడిన అంశాల ఆధారంగానే రకుల్ను గత సెప్టెంబర్ 3న ప్రశ్నించింది. తాజాగా రకుల్ను ఏ అంశాలపై, ఎవరితో సంబంధాలపై, ప్రశ్నిస్తారనే ఉత్కంఠ నెలకొంది ఇదీ చదవండి: హైదరాబాద్ నుంచి విదేశాలకు డ్రగ్స్ -
చిక్కుల్లో క్రికెటర్ యువరాజ్ సింగ్..
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ చిక్కుల్లో పడ్డాడు. గోవా ప్రభుత్వం యువరాజ్కు నోటీసులు జారీ చేసింది. విషయంలోకి వెళితే.. గోవాలోని మోర్జిమ్ ప్రాంతంలో యువీకి 'కాసా సింగ్' పేరిట ఒక విల్లా ఉంది. గత సెప్టెంబర్లో ఈ విల్లాను అద్దెకు ఇస్తానంటూ యువీ తన ట్విటర్ వేదికగా ప్రకటన చేశాడు. గోవా రూల్స ప్రకారం ఇది ఒక విధంగా పేయింగ్ గెస్ట్ విధానం కిందకు వస్తుంది. దీనికి గోవా రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు అభ్యంతరం తెలిపారు. పేయింగ్ గెస్ట్ విధానం కింద విల్లాను అద్దెకు ఇవ్వాలంటే గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్ 1982 ప్రకారం గోవా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ యూవీ ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే అద్దె ఇవ్వడం అతనికి చిక్కులు తెచ్చిపెట్టింది. దీనిని గోవా అధికారులు తప్పుబడుతూ రూ.లక్ష జరిమానా విధించారు. అంతేకాదు డిసెంబర్ 8న తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీచేశారు. పర్యాటక శాఖ చట్టాన్ని ఉల్లంఘించిన క్రమంలో ఎందుకు రూ. లక్ష జరిమానా విధించకూడదో చెప్పాలని నోటీసుల్లో ప్రశ్నించారు. ఎవరైనా సరే గోవాలో హోటల్/గెస్ట్ హౌస్ కార్యకలాపాలు నిర్వహించాలంటే కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని ఆ రాష్ట్ర టూరిజం శాఖ ఇదివరకే స్పష్టం చేసింది. I’ll be hosting an exclusive stay at my Goa home for a group of 6, only on @Airbnb. This is where I spend time with my loved ones & the home is filled with memories from my years on the pitch. Bookings open Sep 28, 1pm IST at https://t.co/5Zqi9eoMhc 🏖️#AirbnbPartner @Airbnb_in pic.twitter.com/C7Qo32ifuE — Yuvraj Singh (@YUVSTRONG12) September 21, 2022 చదవండి: 'నెంబర్ వన్ స్థానం నావల్లే.. వాడుకొని వదిలేశారు' బంధం ముగిసింది.. రొనాల్డోతో మాంచెస్టర్ యునైటెడ్ తెగదెంపులు -
పవన్ కల్యాణ్కు విశాఖ పోలీసుల నోటీసులు
సాక్షి, విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు విశాఖ పోలీసులు నోటీసులు అందజేశారు. 41A కింద పవన్కు ఏసీపీ హర్షిత నోటీసులు ఇచ్చారు. కాగా, నోటీసుల్లో.. ఈనెలఖారు వరకు పోలీసు యాక్ట్ 30 అమలులో ఉంది. విశాఖలో సభలు, ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతి లేదు. నిబంధనలను ఉల్లంఘించి ర్యాలీ చేసినందుకు పవన్ కల్యాణ్కు నోటీసులు ఇచ్చినట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: మంత్రుల కార్లపై జనసేన దాడి -
తలాక్లపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: ఇస్లాంలో తలాక్–ఎ–కినయా, తలాక్–ఎ–బెయిన్తో పాటు అన్నిరకాల విడాకులనూ రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై స్పందన తెలపాల్సిందిగా కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు కేంద్ర న్యాయ, మైనారిటీ వ్యవహారాల శాఖలకు నోటీసులు జారీ చేసింది. కర్నాటకకు చెందిన సయేదా అంబ్రీన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎ.నజీర్, జస్టిస్ జె.బి.పార్డీవాలాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఇదీ చదవండి: కొలీజియంలో విభేదాలు! -
ఇక తప్పదు రావాల్సిందే.. సోనియాకు ఈడీ నోటీసులు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఊహించని షాక్ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సోనియాకు మరోసారి సమన్లు పంపించింది. ఈ సందర్భంగా జూలై 21న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆ నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియాను ఈడీ గత నెలలోనే విచారించాల్సి ఉండగా.. సోనియా కరోనా వైరస్ బారినపడటంతో విచారణ వాయిదా పడింది. అనారోగ్యం కారణంగా ఆమె విచారణకు హాజరుకాలేదు. విచారణకు హాజరుకాలేనని, మరెప్పుడైనా వస్తానంటూ ఈడీని సోనియా గాంధీ కోరారు. ఆ అభ్యర్థనకు స్పందించిన ఈడీ.. విచారణను వాయిదా వేసింది. ఈ క్రమంలో సోమవారం మళ్లీ సమన్లు పంపింది. జూలై 21న విచారణకు హాజరు కావాలని అధికారులు తెలిపారు. ఇక, ఈ కేసు విచారణలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సైతం ఈడీ పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. ED summons Congress interim President Sonia Gandhi to join investigation in the National Herald Case on July 21: Official sources (File pic) pic.twitter.com/MlUWVdzLbO — ANI (@ANI) July 11, 2022 ఇది కూడా చదవండి: ఎమ్మెల్యేలకు భారీ ఆఫర్.. కాషాయ తీర్థం పుచ్చుకుంటే రూ. 50 కోట్లు! -
ట్విటర్కు షాక్: జూలై 4 వరకే డెడ్లైన్
సాక్షి, న్యూఢిల్లీ: మైక్రో బ్లాకింగ్ సైట్ ట్విటర్కు కేంద్రం మరో అల్టిమేటం జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలన్నింటినీ అమలు చేసేందుకు జూలై 4 చివరి గడువు ఇచ్చింది. ఈ మేరకు తుది నోటీసులు జారీ అయ్యాయి. జులై 4 లోగా గత ఆదేశాలన్నింటినీ పాటించాలని ప్రభుత్వం ట్విట్టర్కు నోటీసు జారీ చేసినట్లు బుధవారం అధికారిక వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ జూన్ 27 న నోటీసు జారీ చేసింది. దీన్ని ట్విటర్ బేఖాతరు చేయడంతో తుది నోటీసులిచ్చిన మంత్రిత్వ శాఖ ఇదే చివరి నోటీసని తేల్చి చెప్పింది. గడువులోగా ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే ట్విటర్ మధ్యవర్తి స్థితిని కోల్పోతుందని హెచ్చరించింది. ఆ తరువాత ట్విటర్ పోస్ట్లకు బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. కాగా అంతర్జాతీయ న్యాయవాద గ్రూప్ ఫ్రీడమ్ హౌస్, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, రైతు ఉద్యమానికి మద్దతు పలికిన ట్విటర్ ఖాతాలను, కొన్ని ట్వీట్లను బ్లాక్ చేయాలని 2021లో ప్రభుత్వం ట్విటర్ను కోరింది. ఈ నేపథ్యంలో 80కి పైగా ట్విటర్ ఖాతాలను బ్లాక్ చేశామంటూ దీనికి సంబంధించిన జాబితాను జూన్ 26న కేంద్రానికి సమర్పించింది. అయితే, ట్విటర్ పాటించాల్సిన ఆర్డర్లు ఇంకా ఉన్నాయని, ఇందుకు జూలై 4 మాత్రమే చివరి గడువిచ్చామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు తాజా పరిణామంపై ట్విటర్ ఇంకా స్పందించలేదు. -
ఎంపీ నవనీత్ రాణా దంపతులకు మరో షాక్.. నోటీసులు జారీ
మహారాష్ట్రలో శివసేన, మాజీ నటి, ఎంపీ నవనీత్ రాణా దంపతుల మధ్య పొలిటికల్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) శనివారం ఎంపీ నవనీత్ రాణా, మహారాష్ట్రలో ఎమ్మెల్యే అయిన ఆమె భర్త రవి రాణాకు నోటీసులు జారీ చేసింది. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ఖార్ ప్రాంతంలో నవనీత్ రాణా దంపతులు తమ ఇంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు బీఎంసీ గుర్తించారు. ఈ క్రమంలో వారి ఫ్లాట్ వద్ద అక్రమ నిర్మాణాన్ని ఏడు రోజుల్లో తొలగించాలని బీఎంసీలు అధికారులు నోటీసులు పంపించారు. లేనిపక్షంలో బీఎంసీ చర్యలు తీసుకొని కూల్చివేస్తుందని హెచ్చరించారు. ఈ క్రమంలోనే MMC చట్టంలోని సెక్షన్ 475-A ప్రకారం ఫ్లాట్ యజమానికి జరిమానాతో పాటుగా జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, మాజీ నటి, ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలు హనుమాన్ చాలీసా చాలెంజ్తో ముంబైలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. వీళ్లకు కౌంటర్గా శివ సేన కార్యకర్తలు రంగంలోకి దిగడంతో ముంబైలో హైటెన్షన్ నెలకొంది. ఎంపీ నవనీత్ కౌర్ ఇంటి ముట్టడికి శివసేన శ్రేణులు యత్నించగా.. ఏం జరుగుతుందో అనే ఆందోళన ఏర్పడింది. ఈ తరుణంలో ఐపీసీ సెక్షన్ 153-ఏ ప్రకారం.. నవనీత్ కౌర్ దంపతులను అరెస్ట్ చేసి ఖార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరుచగా.. ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలకు షరతులతో కూడిన బెయిల్ను ప్రత్యేక న్యాయస్థానం మంజూరు చేసింది. ఇది కూడా చదవండి: ఒమిక్రాన్ కలవరం.. తమిళనాడులో సబ్వేరియంట్ బీఏ.4 రెండో కేసు -
చిక్కుల్లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ
న్యూఢిల్లీ: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ చిక్కుల్లో పడ్డారు. మూడు దశాబ్దాల క్రితం ఒక వ్యక్తి మరణానికి కారకుడైన కేసులో దోషి అయిన సిద్ధూ స్వల్ప జరిమానాతో బయటపడ్డారు. సిద్ధూ చేసిన నేరానికి తగిన శిక్ష పడలేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తూ మళ్లీ కోర్టుకెక్కడంతో తీర్పుని పునఃసమీక్షించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. 1998లో పంజాబ్లోని పాటియాలాలో వాహనం పార్కింగ్పై వివాదం నెలకొని 65 ఏళ్ల వయసున్న గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిని సిద్ధూ చితకబాదారు. ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో కుటుంబ సభ్యులు సిద్ధూపై కేసు పెట్టారు. ఈ కేసు నుంచి బయట పడడానికి సిద్ధూ దశాబ్దాల పాటు న్యాయ పోరాటం చేశారు. పంజాబ్ హరియాణా హైకోర్టు సిద్ధూ ఒక వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని దోషిగా తేలుస్తూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2018 మేలో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుని పక్కన పెట్టేసింది. సీనియర్ సిటిజన్ను గాయపరిచినందుకు కేవలం వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ సిద్ధూని కేసు నుంచి విముక్తుడిని చేసింది. ఈ తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బాధిత కుటుంబం మళ్లీ కోర్టుకెక్కింది. సిద్ధూకి కఠిన శిక్ష విధించాలని బాధిత కుటుంబం సుప్రీంలో శుక్రవారం వాదనలు వినిపించింది. సిద్ధూ తరపున కాంగ్రెస్ నేత, లాయర్ పి. చిదంబరం వాదనలు వినిపించారు. ఇన్నేళ్ల తర్వాత తీర్పుని సమీక్షించడం అర్థరహితమని పేర్కొన్నారు. -
క్వాలిటీ లేని వస్తువులెలా అమ్ముతారు? అమెజాన్, ఫ్లిప్కార్టులకు నోటీసులు
న్యూఢిల్లీ: ప్రమాణాలు లేని ప్రెజర్ కుక్కర్లను విక్రయిస్తున్న పలు విక్రయ సంస్థలపై కేంద్ర వినియోగ హక్కుల పరిరక్షణా సంస్థ (సీసీపీఏ) దృష్టి సారించింది. బీఐఎస్ నిబంధనలకు అనుగుణంగా లేని ప్రెషర్ కుక్కర్లను అందిస్తున్నందుకు విక్రేతలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన సంస్థల్లో ఈ–కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటిఎమ్మాల్ కూడా ఉన్నాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్, షాప్క్లూస్, పేటీఎంమాల్ తదితర విక్రేతలకు ఈ నెల 18న నోటీసులు జారీ అయ్యాయని సోమవారం ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ఫోకస్ చేశాం 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో సందర్భంగా నిర్వహిస్తున్న ’ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా నాణ్యత నియంత్రణ ఉత్తర్వులను ఉల్లంఘించే వారిపై దృష్టి సారించినట్లు సీసీపీఏ స్పష్టం చేసింది. నకిలీ వస్తువుల విక్రయాలను నిరోధించడానికి సీసీపీఏ దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించిందని కూడా ఈ ప్రకటన తెలిపింది. నకిలీ వస్తువుల తయారీ లేదా విక్రయాల ద్వారా నిబంధలనకు వ్యతిరేకంగా వాణిజ్య విధానాలను అనుసరిస్తూ, వినియోగదారుల హక్కుల ఉల్లంఘన జరిపే సంస్థలపై దర్యాప్తు చేయాలని సీసీపీఏ ఇప్పటికే దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. రోజువారీ వినియోగ ఉత్పత్తులపై దృష్టి ప్రత్యేకించి రోజువారీ వినియోగ ఉత్పత్తులు హెల్మెట్లు, ప్రెషర్ కుక్కర్లు వంట గ్యాస్ సిలిండర్ల వంటి వస్తువులపై సీసీపీఏ దృష్టి సారించినట్లు ప్రభుత్వ ప్రకటన వివరించింది. ‘బీఐఎస్ చట్టం, 2016లోని సెక్షన్ 16 (1) ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన డొమెస్టిక్ ప్రెజర్ కుక్కర్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్, 2020ని ఉల్లంఘించి ప్రెజర్ కుక్కర్లను విక్రయిస్తున్నట్లు గుర్తించిన ఇ–కామర్స్ సంస్థలపై సీసీపీఏ తనకుతానుగా సీసీపీఐ చర్యలకు ఉపక్రమించింది’’ అని అని ప్రకటన పేర్కొంది. నోటీసులు నవంబర్ 18న జారీ అయ్యాయని ప్రకటన పేర్కొంటూ, నోటీసులు జారీ చేసినప్పటి నుండి ఏడు రోజుల్లోగా ఇ–కామర్స్ సంస్థల నుండి ప్రతిస్పందనను అథారిటీ కోరిందని, లేని పక్షంలో వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని నిబంధనల ప్రకారం వారిపై అవసరమైన చర్య తీసుకోవచ్చని వివరించింది. ఈ విషయాన్ని వెంటనే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని బీఐఎస్ డీజీ (డైరెక్టర్ జనరల్)కి కూడా సీసీపీఏ లేఖ రాసిందని వెల్లడించింది. బీఐఎస్ ఉత్తర్వు ప్రకారం, దేశీయ ప్రెషర్ కుక్కర్లు భారతీయ ప్రామాణిక ఐఎస్ 2347: 2017కి అనుగుణంగా ఉండాలి. అలాగే 2020 ఆగస్ట్ 1 నుండి అమలులోకి వచ్చిన బీఐఎస్ లైసెన్స్ కింద ప్రామాణిక గుర్తును కలిగి ఉండాలి. వినియోగదారుల రక్షణ (ఈ–కామర్స్) నిబంధనలు, 2020లోని రూల్ 4(2) ఏ ప్రకారం ఈ–కామర్స్ సంస్థలు తమ ప్లాట్ఫారమ్లో వ్యాపారానికి సంబంధించి వినియోగదారుకు వ్యతిరేకంగా ఎటువంటి అన్యాయమైన వాణిజ్య విధానాన్ని అవలంభించకూడదు. 13 ఉత్పత్తుల జాబితా ఉన్నత స్థాయి వర్గాల కథనం ప్రకారం వినియోగదారుల వ్యవహారాల విభాగం ఈ–కామర్స్ ప్లాట్ఫారమ్లలో విక్రయానికి అందుబాటులో ఉన్న 13 ఉత్పత్తుల జాబితాపై దృష్టి సారించినట్లు సమాచారం. ► వీటిలో రెండు– ‘అమెజాన్ బేసిక్స్ స్టెయిన్లెస్ స్టీల్ ఔటర్ లిడ్ ప్రెజర్ కుక్కర్– నాలుగు లీటర్లు (విజిల్ ద్వారా ప్రెజర్ అలర్ట్ ఇవ్వదు), క్యూబా 5 లీటర్ ఇండక్షన్ బేస్ అల్యూమినియం ప్రెషర్ కుక్కర్– ఇన్నర్ లిడ్’ వీటిలో ఉన్నాయి. ► ఫ్లిఫ్కార్ట్. కామ్ విషయంలో మూడు ప్రాడక్టులపై పరిశీలన ఉంది. వీటిలో క్యూబా అల్యూమినియం రెగ్యులర్ ఐదు లీటర్ల ఇండక్షన్ బాటమ్ ప్రెజర్ కుక్కర్ (అల్యూమినియం), ప్రిస్టైన్ స్టెయిన్లెస్ స్టీల్ ఐదు లీటర్ల ఇండక్షన్ బాటమ్ ప్రెజర్ కుక్కర్ (స్టెయిన్లెస్ స్టీల్), డైమండ్ బై ఫాస్ట్కలర్స్ ఔటర్ లిడ్ 10 మినీ ప్రీమియం 10మిని ) ఉన్నాయి. ► స్నాప్ డీల్కు సంబంధించి రెండు ఉత్పత్తుల్లో– ఇండక్షన్ బేస్ లేకుండా ఎబోడ్ 5 లీటర్ల అల్యూమినియం ఔటర్లిడ్ ప్రెజర్ కుక్కర్, బెస్టెక్ మిర్రర్ ఫినిష్ ఇండక్షన్ స్టవ్టాప్ అనుకూలమైన చెర్రీ ప్రెజర్ కుక్కర్ (ఐదు లీటర్లు) ఉన్నాయి. ► షాప్క్లూస్.కామ్లోలో మూడు ఉత్పత్తులు ఉన్నాయి –– క్యూబా అల్యూమినియం రెగ్యులర్ ఐదు లీటర్ల ప్రెజర్ కుక్కర్ (ఇండక్షన్ బాటమ్–అల్యూమినియం), ప్రిస్టైన్ ఇండక్షన్ బేస్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెజర్ కుక్కర్ (ఐదు లీటర్లు), ఎథికల్ టీఆర్ఐ–నేచర్ ప్రెజర్ కుక్కర్ (ఐదు లీటర్లు), ఇండక్షన్ బోటమ్ స్టైన్లెస్ స్టీల్ ట్రైప్లే ఎస్ఏఎస్ జాబితాలో నిలిచాయి. ► పేటీఎంమాల్ మూడు ఉత్పత్తుల విక్రయాన్ని అందిస్తోంది. ప్రిస్టైన్ 5.5 లీటర్ల ఔటర్ లిడ్ ప్రెజర్ కుక్కర్ ఇండక్షన్ బాటమ్ (సిల్వర్, స్టెయిన్లెస్ స్టీల్, సెట్ ఆఫ్ 1), క్యూబా 5 లీటర్ల ఇన్నర్ మూత ప్రెజర్ కుక్కర్ ఇండక్షన్ బాటమ్ (సిల్వర్, అల్యూమినియం, సెట్ ఆఫ్ 1), ఎథికల్ కుక్వేర్ కాంబోస్ ఇండక్షన్ బాటమ్ (స్టెయిన్లెస్ స్టీల్, సెట్ ఆఫ్ 1) వీటిలో ఉన్నాయి. చదవండి: ఈ–కామర్స్ కంపెనీలకు షాక్! రూ.42 లక్షల జరిమానా -
వింత పోకడలు.. 30 సెకన్ల ప్రమాదం
ఇన్స్టాగ్రామ్లో ఫాలోయెర్స్ను పెంచుకోవడానికి నేటి కుర్రకారు 30 సెకన్ల రీల్స్ ద్వారా వింత పోకడలు పోతోంది. ఇండోర్ ఇన్స్టా ఇన్ఫ్లూయెన్సర్ శ్రేయ కాల్రా ట్రాఫిక్ సమయంలో జీబ్రా క్రాస్ మీద డాన్స్ చేసి సమస్యలు తెచ్చుకుంది. ఏకంగా హోమ్ మినిస్టర్ ఆమె మీద చర్యలకు ఆదేశించాడు. తెలుగు ప్రాంతాలతో మొదలు దేశం మొత్తం వేల మంది అమ్మాయిలు ఇన్స్టా అకౌంట్ల ద్వారా గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారిలో కొందరి రీల్స్ అందరి మెచ్చుకోలు పొందేలా ఉంటే మరికొందరివి తల్లిదండ్రులకు గుండెపోట్లు తెస్తున్నాయి. రీల్స్ ట్రెండ్పై ఒక నజర్. మొన్నటి ఆగస్టు నెలలో అహమదాబాద్ (గుజరాత్)లో ఒక టీనేజ్ అమ్మాయి తన ఫాలోయెర్స్ను పెంచుకోవడానికి అర్ధనగ్న వీడియోలు చేస్తోందని తెలిసి ఆమె తల్లిదండ్రులిద్దరికీ ఒకేసారి హార్ట్ఎటాక్ వచ్చింది. ఇద్దరూ బతికి బట్ట కట్టాక కూతురు ఏం చేస్తున్నదో వివరంగా తెలుసుకున్నారు. కరోనా వల్ల ఆన్లైన్ క్లాసులు మొదలయ్యేసరికి ఆమె చదువుకు భంగం కలగకూడదని ఒక గదీ ఫోన్ ఇచ్చారు. ఆ అమ్మాయి ఆ గదిలో ఒక సోషల్ మీడియాలో తన వీడియోలు పోస్ట్ చేయడమే కాకుండా తన కజిన్స్ను తనను ఫాలోకమ్మని చెప్పింది. అంతేకాదు వాళ్లను కూడా అలాంటి వీడియోలు చేయమని చెప్పింది. ఆమెకు ఈ వీడియోల పిచ్చి ఎంత పట్టిందంటే తల్లిదండ్రులు హాస్పిటల్ పాలయ్యి ఇంటికి చేరినా ఆ వీడియోలు పోస్ట్ చేయడం మానలేదు. దాంతో వారు టీనేజ్ కౌన్సిలర్లను సంప్రదించి ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇప్పించారు. ‘ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తే సైబర్ చట్టాల కింద కేస్ అవుతుంది. అరెస్ట్ కూడా చేయొచ్చు’ అని కౌన్సిలర్ ఆ అమ్మాయికి చెప్తే అప్పుడుగాని ఆ అమ్మాయి వాటిని మానలేదు. ఆ తర్వాత తన అకౌంట్ డీయాక్టివేట్ చేసుకుంది. సోషల్ మీడియాలో మనకో అకౌంట్ ఉంటే దానికి ఫ్రెండ్సో, ఫాలోయెర్సో ఉంటారు. వారి సంఖ్య పెరిగితే కొన్ని మీడియాలు ఆర్థిక లాభం కలిగిస్తాయి. దాంతో కొన్ని అనవసర ధోరణులను ఈ కాలపు అమ్మాయిలు అవలంబిస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. రెండు పద్ధతులు కేరళకు చెందిన టీనేజ్ అమ్మాయి నివేద్య ఆర్.శంకర్కు ఇన్స్టాగ్రామ్లో 16 లక్షల మంది ఫాలోయెర్స్ ఉన్నారు. ఆ అమ్మాయికి 13– 14 ఏళ్లకు మించవు. ఆమె తన సోదరితో కలిసి 30 సెకన్ల రీల్స్ చేస్తూ విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకుంది. అయితే ఆ రీల్స్ అన్నీ సినిమా పాటలకు చేసిన డాన్సులే. ఆహార్యంలో ఎటువంటి ‘అసభ్యత’ లేకుండా తన ఎక్స్ప్రెషన్స్తో నవ్వుతూ ఆమె అన్ని లక్షల మంది ఫాలోయెర్స్ను సంపాదించుకుంది. అయితే ఇదే సమయంలో మరో ఐదుమంది టాప్ ఇన్స్టాగ్రామర్స్ ఉన్నారు. వారు నేహా సింగ్ (16 లక్షల ఫాలోయెర్లు), శాశీ పూనమ్ ( 8.5 లక్షలు), శ్రిష్ (27 లక్షలు), ఏంజల్ రాయ్ (39 లక్షలు), సోఫియా (39 లక్షలు). కానీ వీరంతా ఫాలోయెర్స్ కామెంట్స్ను బట్టి ‘బోల్డ్’గా ఉండటం వల్లే ‘బోల్డ్’ వీడియోస్ చేయడం వల్ల ఇంతమంది ఫాలోయెర్స్ను సంపాదించుకున్నారు. ఫాలోయెర్స్ వేటలో ‘సౌందర్య ప్రదర్శన’కు ‘శరీర ప్రదర్శన’కు ఈ సోషల్ సెలబ్రిటీలకు తేడా తెలియడం లేదని కొందరు విమర్శలు చేస్తూ ఉంటారు. వీరిలో కొందరు ఇన్స్టాగ్రామర్లు ప్రత్యేక యాప్లు తయారు చేసుకుని వాటిలో తమ వీడియోలు పోస్ట్ చేస్తూ తద్వారా యాడ్స్ను ఆకర్షించి లాభాలు కూడా పొందుతున్నారు. మొదటి కోవకు చెందిన అమ్మాయి అందరి మన్ననలు పొందుతుంటే రెండో తరగతి అమ్మాయిలు కొన్ని సెక్షన్ల నుంచి విమర్శలు పొందుతున్నారు. ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. పెద్ద సరంజామా 30 సెకన్ల వీడియోలు చేసి ఫాలోయెర్స్ను సంపాదించుకోవడం చిన్న విషయం కాదు. ప్రతి వీడియోకి ఒక డ్రస్ సంపాదించుకోవాలి. దానికి మేకప్, ఆభరణాలు, చెప్పులూ... ప్రతిదీ సమకూర్చుకోవాలి. దానికి ఖర్చు అవుతుంది. సరైన పద్ధతిలో షూట్ చేసేవారు కావాలి. ఇన్స్టాలో ఇవన్నీ సమకూర్చుకోగల ‘స్తోమత ఉన్న’ సెలబ్రిటీలు ఉన్నారు.. మరోవైపు మురికివాడల్లో ఉంటూ రేకుల గదిలో ఉన్న బట్టల్లో డాన్స్ ప్రతిభ చూపుతూ గుర్తింపు పొందిన వారు ఉన్నారు. రూపాలీ అగర్వాల్ అనే శ్రీమంతురాలు తన భర్త, ఇద్దరు టీనేజ్ కుమార్తెలతో సరదా వీడియోలు, సినిమా పాటల వీడియోలు చేసి 12 వేల మంది ఫాలోయెర్స్ను సంపాదించుకున్న ఉదంతాలు ఉన్నాయి. అయితే ఎలా చూసినా ‘బోల్డ్ వీడియోలు చేస్తేనే ఫాలోయెర్స్ పెరుగుతారు’ అనుకునే ప్రమాదం ఈ రీల్స్ ద్వారా సెలబ్రిటీలు అయిన వారిని చూస్తే అనిపించవచ్చు. కొందరు ఆ దారి పడుతున్నారు కూడా. ఇండోర్లో డాన్స్ తాజాగా ఇండోర్కు చెందిన ఇన్స్టాగ్రామర్ శ్రేయా కాల్రాకు రెండున్నర లక్షల మంది ఫాలోయెర్స్ ఉన్నారు. ఈమె కూడా అడపా దడపా బోల్డ్ వీడియోస్ చేస్తూ ఉంటుంది. రెండు రోజుల క్రితం ఇండోర్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడినప్పుడు హటాత్తుగా జీబ్రా క్రాస్ మీద ప్రత్యక్షమై అమెరికన్ ర్యాపర్ డోజా క్యాట్ పాట ‘లెట్ మి బి యువర్ ఉమన్’కు డాన్స్ చేసింది. 30 సెకన్ల ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ‘రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగి ట్రాఫిక్ నియమాలు పాటించండి. మాస్క్ వాడండి’ అని సందేశం ఇచ్చిందిగాని నెటిజన్లకు, ఇండోర్ పోలీసులకు ఈ వ్యవహారం ఏమాత్రం నచ్చలేదు. అంతేకాదు మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా శ్రేయా మీద చర్య తీసుకోమని కోరారు. పోలీసులు ఆమెపై న్యూసెన్స్ కేస్ బుక్ చేయడమే కాక మరెవరూ ఇలాంటి తలతిక్క పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి అని స్టేట్మెంట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వచ్చే పేరు ఎన్నాళ్లు నిలబడుతుందో చెప్పడం కష్టం. ఆ గుర్తింపును కొనసాగించడమూ కష్టమే. ఒక్కసారి ఫాలోయెర్స్ డ్రాప్ అయ్యాక దాంతో వచ్చే డిప్రెషన్ కథలు వేరు. మంచి చెడ్డలను గమనించుకుంటూ సోషల్ మీడియాను ఉపయోగించేలా స్త్రీలు, యువతులు జాగ్రత్త తీసుకోవాలి. అన్నింటి కంటే ముఖ్యం తాము ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియ చేసి వారి అంగీకారమో లేదా వారిని ప్రిపేర్ చేయడమో తప్పనిసరిగా చేయాలి. వ్యక్తులు ఒక వయసు వచ్చాక సర్వ స్వతంత్రులే అయినా వారితో పాటు ఒక కుటుంబం ఉంటుంది కదా. -
చిక్కుల్లో పడ్డ పరిటాల సిద్దార్థ
-
పరిటాల సిద్ధార్థ్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్టులో బుల్లెట్తో పట్టుబడ్డ సిద్ధార్థ్ను వివరణ ఇవ్వాల్సిందిగా ఎయిర్పోర్టు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సిద్ధార్థ్ లైసెన్స్డ్ గన్కు బ్యాగులో దొరికిన బులెట్కు వ్యత్యాసం ఉంది. గతంలో పాయింట్ 32 క్యాలిబర్ గన్కు లైసెన్స్ పొందిన సిద్ధార్థ్ బ్యాగులో.. 5.56 క్యాలిబర్ బుల్లెట్ లభ్యం అయ్యింది. (చదవండి: పరిటాల సిద్ధార్థ్ వద్ద అక్రమ ఆయుధం?) అయితే సిద్ధార్థ్ వద్ద సాయుధ బలగాలు వాడే ఇన్సాస్ రైఫిల్స్ బుల్లెట్ గుర్తించారు పోలీసులు. ఈ బుల్లెట్ సిద్ధార్థ్కు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై విచారణ జరుపుతున్నారు. అనంతపూర్కు చెందిన ఇండో టిబెటెన్ బోర్డర్లో పని చేస్తున్న కానిస్టేబుల్ తూటాగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్తో పరిటాల కుటుంబానికి పరిచయాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
అఫ్గాన్ గగనతలం మీదుగా విమాన రాకపోకలు రద్దు
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్లో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో ‘అఫ్గాన్ గగనతలం అనియంత్రితం’ అంటూ కాబూల్ విమానాశ్రయం అధికారులు ప్రకటించారు. అఫ్గాన్ గగనతలం ఆర్మీకి బదిలీ అయిందనీ, ఇతర ఏ విమానాలు ప్రయాణించినా దానిని అనియంత్రితంగానే పరిగణిస్తామంటూ కాబూల్ ఎయిర్పోర్టు అధికారులు నోటమ్ (పైలట్లకు హెచ్చరిక నోటీస్) విడుదల చేశారు. తదుపరి ప్రకటన చేసే వరకు ప్రజా ప్రయాణాలకు కాబూల్ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీంతో అనేక దేశాలు ఆ దేశానికి విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి. ఎయిర్ ఇండియా, యునైటెడ్ ఎయిర్లైన్స్ ఇతర సంస్థలు పాశ్చాత్య దేశాలకు తమ విమానాలను ఇతర మార్గాల ద్వారా నడిపాయి. ఎయిర్ ఇండియా తన ఏకైక ఢిల్లీ–కాబూల్–ఢిల్లీ సర్వీసును రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. -
రూల్ 267కింద ఏపీ ప్రత్యేక హోదాపై చర్చించాలి: విజయసాయి రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాపై వెంటనే చర్చ జరపాలంటూ.. సభా నియమ నిబంధనలలోని రూల్ 267 కింద రాజ్యసభ చైర్మన్కు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని ఆయన కోరారు. రాజ్యసభలో ఈరోజు నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటిని పక్కన పెట్టి రూల్ 267 కింద ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చను ప్రారంభించాలని ఆయన నోటీసులో కోరారు. ఈ అంశం ఎందుకు అత్యంత ప్రధాన్యతతో కూడుకున్నదో విజయసాయి రెడ్డి తన నోటీసులో క్లుప్తంగా వివరించారు. నోటీసులో ‘‘రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కు పలు హామీలను ప్రకటించారు. అందులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అతి ప్రధానమైనది. ప్రధానమంత్రి ఇచ్చిన హామీని మార్చి 1, 2014లో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం చర్చించి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆమోదించింది. కానీ ఇది జరిగి ఏడేళ్ళు కావస్తున్న కేంద్ర మంత్రి మండలి ఈ హామీని నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు సభా కార్యక్రమాలన్నింటినీ సస్పెండ్ చేసి సభలో తక్షణమే ఈ అంశంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలి’’ అని విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్కు ఇచ్చిన నోటీసులో విజ్ఞప్తి చేశారు. -
సి.కల్యాణ్కు సుప్రీంకోర్టు నోటీసులు..
సాక్షి, న్యూఢిల్లీ: హఫీజ్పేట భూములకు సంబంధించి దాఖలైన కేసులో సినీ నిర్మాత సి.కల్యాణ్, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. సర్వే నంబర్ 80లో కొంతభూమి అంశంలో సి.కల్యాణ్కు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సాహెబ్బాదీ హమీదున్నీసా బేగం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిష న్ను బుధవారం జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఫైనల్ డిక్రీ పొందక ముందే ఆ భూముల్లో నిర్మాణాలు ఎలా చేపడతారని సి.కల్యాణ్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. సి.కల్యాణ్ తరఫు న్యాయవాది శ్రీధర్ వాదనలు వినిపిస్తూ ఫైనల్ డిక్రీ వచ్చిందని చెబుతుండగా.. హైకోర్టు తీర్పులో ఫైనల్ డిక్రీ ఇవ్వలేదని స్పష్టంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ సి.కల్యాణ్, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. చదవండి: టాలీవుడ్ ప్రముఖ నిర్మాతపై కేసు నమోదు -
ఆరెస్సెస్ నేతల ఖాతాలకే ఇలా.. ఇదే ఆఖరి హెచ్చరిక
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, సామాజిక మాధ్యమం ట్విట్టర్ మధ్య పోరు మరింత తీవ్రమైంది. కొత్త డిజిటల్ (ఐటీ) నిబంధనల ప్రకారం దేశంలో భారత్కు చెందిన అధికారుల్ని నియమించకపోవడంతో ట్విట్టర్పై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త నిబంధనల్లో అమల్లోకి వచ్చి వారం రోజులు గడిచిపోయినా ట్విట్టర్ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో కేంద్ర ఐటీ శాఖ ఆ సంస్థకు చివరి హెచ్చరికగా శనివారం నోటీసులు జారీ చేసింది. ట్విటర్లో నెటిజన్లు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి భారత్కు చెందిన అధికారుల్ని నియమించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతాకి సంబంధించి బ్లూ టిక్స్ బ్యాడ్జ్ని ట్విట్టర్ కొద్దిసేపు తొలగించి మళ్లీ పునరుద్ధించింది. ఇది జరిగిన కొద్ది గంట్లోలనే కేంద్రం ట్విటర్కి నోటీసులు పంపింది. కొత్త నిబంధనలు పాటించడానికి ట్విట్టర్ విముఖత చూపించడం భారతదేశ ప్రజల పట్ల ఆ సంస్థకు చిత్తశుద్ధి లేకపోవడాన్ని తేటతెల్లం చేస్తోందని పేర్కొంది. ట్విట్టర్ వేదికగా భారత్ ప్రజలు ఎదుర్కొనే సమస్యలు సరైన సమయంలో పారదర్శకంగా పరిష్కారమవ్వాలంటే దేశ పౌరులే అధికారులుగా ఉండాలని స్పష్టం చేసింది. ఇదే తాము ఇచ్చే చివరి నోటీసు అని తక్షణమే చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీస్, నోడల్ కాంటాక్ట్ ఆఫీసర్లుగా భారతీయుల్ని నియమించకపోతే చట్టపరమైన చర్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నోటీసుల్లో హెచ్చరించింది. బ్లూ బ్యాడ్జ్ వివాదం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ట్విట్టర్ అకౌంట్లలో బ్ల్యూ బ్యాడ్జ్ను తొలగించడం చర్చనీయాంశంగా మారింది. వెరిఫై చేసిన అకౌంట్లకు ట్విట్టర్ బ్లూ బ్యాడ్జ్ ఇస్తుంది. అంటే సదరు వినియోగదారుడే ఈ ఖాతాను వాడుతున్నట్లు అధికారికంగా ధృవీకరించడమన్న మాట. శనివారం ఉదయం తొలుత వెంకయ్య వ్యక్తిగత ఖాతాకు బ్లూ బ్యాడ్జ్ను తొలగించిన ట్విట్టర్ తర్వాత పునరుద్ధరించింది. ఆరెస్సెస్ చీఫ్ భగవత్ వ్యక్తిగత ఖాతాతో పాటుగా ఇతర ఆరెస్సెస్ నేతలు సురేష్ సోని, అరుణ్కుమార్, సురేష్ జోషి, కృష్ణ గోపాల్ ఖాతాల్లో వెరిఫైడ్ బ్లూ టిక్స్ను తొలగించింది. ఆరెస్సెస్ నేతల ఖాతాలకే ఇలా జరగడం వివక్షాపూరిత చర్యని ఆరెస్సెస్ ఢిల్లీ యూనిట్ నాయకుడు రాజీవ్ మండిపడ్డారు. టెక్ ఫ్యూడలిజానికి ట్విట్టర్ నిదర్శనంగా మారుతోందని విమర్శించారు. ట్విట్టర్ చర్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆ సంస్థ వివరణ ఇచ్చింది. ఆరు నెలల పాటు ఖాతాను వినియోగించకపోతే, ఎలాంటి ట్వీట్లు చేయకపోతే బ్లూ బ్యాడ్జ్ ఆటోమేటిక్గా తొలగిపోతుందని ట్విట్టర్ తెలిపింది. గత కొద్దికాలంగా వారెవరూ ట్వీట్లు చేయకపోవడంతో బ్ల్యూ టిక్స్ పోయాయని, ఇప్పుడు వాటిని పునరుద్ధరించామని వివరించింది. -
కేంద్రం సీరియస్: ఢిల్లీ రణరంగంపై 20మందికి నోటీసులు
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన కిసాన్ ర్యాలీ హింసాత్మకం కావడం.. పోలీసులపై దాడులు జరగడంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. జాతీయ వేడుక నాడు దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ రోజు హింసాత్మకంగా మారడానికి కారణమైన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలోనే మొత్తం 25మంది ఎఫ్ఆర్ఐలు నమోదు చేశారు. తాజాగా 20 మందికి నోటీసులు పంపారు. గణతంత్ర రైతు పరేడ్లో ఉద్రిక్త పరిస్థితులపై వివరణ ఇవ్వాలని కోరుతూ మొత్తం 20 మంది రైతు నాయకులకు నోటీసులు పంపించారు. కిసాన్ ర్యాలీలో చోటుచేసుకున్న పరిణామాలపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పోలీసులు ఆదేశించారు. నోటీసులు యోగేంద్ర యాదవ్, బాల్దేవ్ సింగ్ సిర్సా, బల్బీర్ రాజేవాల్తో పాటు పలువురు ఉన్నారు. మూడు రోజులైనా ఢిల్లీలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. పోలీసులు పటిష్ట బందోబస్తు కొనసాగిస్తున్నారు. రైతులు రెచ్చిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే పోలీసులు పంపిన వాటిపై రైతు ప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారో.. ఏమని సమాధానమిస్తారో ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం రోజు ఆందోళనకర పరిస్థితులు ఏర్పడి రైతులతో పాటు పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీరియస్ అయ్యింది. దీనిపై నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తోంది. ఎర్రకోటపై ఇతర జెండాలు ఎగురవేయడంతో పాటు విధ్వంసం సృష్టికి కారకులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
కేజీఎఫ్ 2 టీజర్ ఎఫెక్ట్: యశ్కు నోటీసులు
బెంగళూరు: కేజీఎఫ్ 2 టీజర్ రికార్డులు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏ సినిమాకు సాధ్యం కాని రీతిలో రికార్డులు తిరగరాస్తున్నాడు రాఖీ భాయ్. యశ్ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 7 రాత్రి విడుదలైన ఈ టీజర్ సంచలనాలు సృష్టిస్తోంది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న పాన్ ఇండియన్ సినిమాగా నిలిచింది. ఇక యూట్యూబ్లో కూడా కేజీఎఫ్ 2 సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 48 గంటల్లోపే ఈ టీజర్ 100 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. ఈ రోజు వరకు యూట్యూబ్లో 147 మిలియన్స్కు పైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. 2.16 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ చూస్తే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. తొలి భాగానికి పది రెట్లు అదిరిపోయేలా కేజీఎఫ్-2 తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. (చదవండి: కేజీఎఫ్ ‘గరుడ’ ఎవరో తెలుసా..?!) అయితే రికార్డులు సృష్టిస్తోన్న`కేజీఎఫ్-2` టీజర్ వల్ల దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్ మాత్రం చిక్కుల్లో పడ్డారు. వీరికి కర్ణాటక స్టేట్ యాంటీ టొబాకో సెల్ నోటీసులు జారీ చేశారు. దానికి కారణం టీజర్ చివర్లో చూపించిన ఓ సన్నివేశం. టీజర్ చివర్లో హీరో యశ్ గన్తో వరుసగా వాహనాలను షూట్ చేసి వచ్చి ఆ తుపాకీ గొట్టంతో సిగరెట్ ముట్టించుకుంటాడు. ఆ సీన్ చూపించేటపుడు `యాంటీ స్మోకింగ్ వార్నింగ్` వేయకపోవడమే ఈ అభ్యంతరానికి కారణమట. దాంతో స్టేట్ యాంటీ టొబాకో సెల్ వారికి నోటీసులు జారీ చేసింది. -
నా పరువు తీస్తున్నారు!
న్యూఢిల్లీ: రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో తన పేరును అనవసరంగా మీడియాలో ప్రచారం చేస్తున్నారని, దీన్ని నిలిపివేయాలని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రకుల్ దాఖలు చేసిన పిటిషన్పై కేంద్రం వైఖరి వెల్లడించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తమ వైఖరిని చెప్పాలని పిటిషన్ విచారించిన జస్టిస్ నవీన్ చావ్లా కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖకు, ప్రసారభారతికి, ప్రెస్ కౌన్సిల్కు, న్యూస్ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్కు నోటీసులు జారీ చేశారు. రకుల్ పిటిషన్ను ఫిర్యాదుగా స్వీకరించి ఈ నాలుగు సంస్థలు ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేశారు. డ్రగ్స్ కేసులో విచారణ వేళ సంబంధిత ఆఫీసర్లకన్నా ముందే మీడియాకు కొన్ని అంశాలు లీకవుతున్నాయని, దీనిపై విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు. ముందుగా ఫిర్యాదు చేయాల్సింది.. కేసులో కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ వాదనలు వినిపించారు. రకుల్ కోరుకున్నట్లు ఇంజంక్షన్ లేదా బ్లాంకెట్ బ్యాన్ లాంటి ఆదేశాలివ్వద్దని కోరారు. కోర్టుకు వచ్చేముందు ఆమె ప్రభుత్వానికి కానీ సంబంధిత అథార్టీకి కానీ ఫిర్యాదు చేయలేదని, ఏదో ఒక్క మీడియా హౌస్ లేదా చానల్ను ప్రత్యేకంగా ఆమె పేర్కొనలేదని చెప్పారు. దీనిపై రకుల్ న్యాయవాది స్పందిస్తూ రకుల్ పేరు తాను చెప్పలేదని రియా చక్రవర్తి వివ రించినా మీడియా రిపోర్టులు రకుల్ను డ్రగ్స్ కేసుతో లింక్ చేసే రాస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో విపరీత ప్రచారం జరుగుతుండడంతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే సమయం లేక నేరుగా కోర్టును ఆశ్రయించామని చెప్పారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా లాక్డౌన్ ప్రకటించడంతో రాష్ట్రంలోని పేద, అసంఘటిత కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లకూ వైరస్ సోకిందని, రాష్టంలోని ప్రతి ఒక్క వైద్య సిబ్బందికి మాస్క్లు, డ్రెస్ కోడ్ ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు తెలిపారు. హైదరాబాద్తో పాటు ప్రధాన పట్టణాల్లో ఉన్న వారి ఇంటి వద్దకు వెళ్లి కరోనా పరీక్షలు జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టుకు విన్నవించారు. లాక్డౌన్ నేపథ్యంలో 1897 యాక్ట్ ప్రకారం ఇంటికే వస్తువులు సరఫరా చేయాలని, పేద ప్రజలు, అసంఘటిత కార్మికులకు షల్టర్ ఏర్పాటు చేయడంతో పాటు ఉచితంగా భోజనం కల్పించాలి పిటిషనర్ వాదించారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై ఏప్రిల్ 9న మధ్యంతర నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తుది నివేదిక ఏప్రిల్ 15 వరకు సమర్పించాలని హైకోర్టు అదేశిస్తూ.. తదుపరి విచారణను ఏప్రిల్ 9కి హైకోర్టు వాయిదా వేసింది. కాగా ఈ పిటిషన్ను హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. -
ఆ 22 మందికి నోటీసులు
భోపాల్/న్యూఢిల్లీ/బెంగళూరు: మధ్యప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. రాజీనామా చేసిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ ఎన్పీ ప్రజాపతి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం కల్లా తన ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు. స్వచ్ఛందంగానా లేక.. ఎవరి ఒత్తిడితోనైనా రాజీనామా చేశారా అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని వారిని కోరారు. ఆ తర్వాతే సభలో బల పరీక్ష చేపడతామని స్పీకర్ తెలిపారు. బల నిరూపణకు సిద్ధమని సీఎం కమల్నాథ్ ఇంతకుముందే తెలిపారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే, పార్టీని వీడిన ఆరుగురు మంత్రులు సహా 22 మంది సభ్యుల రాజీనామాల విషయం తేలాకే బలపరీక్ష ఉంటుందన్నారు. రాజీనామాలు చేసిన వారంతా స్పీకర్ను ఎందుకు కలుసుకోలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభానికి బీజేపీయే కారణమన్నారు. గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో భోపాల్ చేరుకున్న జ్యోతిరాదిత్య సింధియాకు బీజేపీ కార్యకర్తలు, సింధియా అనుచరులు ఘనస్వాగతం పలికారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలోకి ఆయన్ను మాజీ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా సింధియా మీడియాతో మాట్లాడుతూ..బీజేపీలోకి చేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని, పార్టీ కోసం మనస్ఫూర్తిగా పనిచేస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. బెంగళూరులో హైడ్రామా బెంగళూరు పోలీసులు తమ మంత్రులను ఇద్దరిని అరెస్టు చేశారని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ఎంపీ, న్యాయవాది అయిన వివేక్ తంఖా మాట్లాడుతూ.. ‘బెంగళూరు రిసార్టులో ఉన్న ఎమ్మెల్యే మనోజ్ చౌదరితో మాట్లాడేందుకు ఆయన తండ్రితో కలిసి మంత్రులు జితు పట్వారీ, లఖన్ సింగ్ వెళ్లారు. బెంగళూరు పోలీసులు వారిని రిసార్టులోపలికి వెళ్లనివ్వలేదు. వారిపై దాడి చేసి, అరెస్టు చేశారు. మనోజ్ తన తండ్రితో కలిసి భోపాల్ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, రానివ్వడం లేదు. దీనిపై మేం సుప్రీంకోర్టుకు వెళతాం’ అని ఆయన వెల్లడించారు. కాగా, పట్వారీ అక్కడి పోలీసులతో వాదులాడుతున్నట్లుగా ఉన్న వీడియో వైరల్ అవుతోంది. రాజీనామా చేసిన 22 మందిలో 19 మంది బెంగళూరులోనూ మిగతా వారు మధ్యప్రదేశ్లోనూ ఉన్నట్లు సమాచారం. బల పరీక్షకు బీజేపీ డిమాండ్ ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో అసెంబ్లీలో సర్కారు బలం నిరూపించుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ విప్ నరోత్తమ్ మిశ్రా గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. అందుకే, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న ఈ నెల 16వ తేదీన సభలో బల నిరూపణ జరపాలని స్పీకర్ను, గవర్నర్ను కోరతాం’ అని పేర్కొన్నారు. ఆయన భవిష్యత్తు గురించి భయపడ్డారు: రాహుల్ తన రాజకీయ భవిష్యత్తు గురించి భయపడుతున్నందునే సింధియా నమ్ముకున్న సిద్ధాంతాలను మర్చిపోయారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘ఆయన బయటకు చెప్పే దానికి వాస్తవ కారణాలకు చాలా తేడా ఉంది. ఆయన నా చిరకాల మిత్రుడు. కాలేజీ రోజుల నుంచి ఆయన నాకు బాగా తెలుసు. తన రాజకీయ భవిష్యత్తు గురించిన భయం వల్లే సిద్ధాంతాలను పక్కనబెట్టి ఆర్ఎస్ఎస్(బీజేపీ)లోకి వెళ్లారు. అయితే, ఆయనకు అక్కడ గౌరవం లభించదు. ఆ పార్టీలో ఆయన సంతృప్తికరంగా ఉండలేరు’ అని అన్నారు. -
నకిలీ వార్తల ఏరివేతపై మీ వైఖరేంటి?
న్యూఢిల్లీ: ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ వంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు, ద్వేషపూరిత ప్రసంగాలను తొలగించే అంశంపై తన వైఖరిని తెలియజేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి ఒక నోటీసు జారీ చేసింది. బుధవారం కేంద్ర హోం, ఆర్థిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఎస్ఎస్ మాజీ సిద్ధాంతకర్త కె.ఎన్.గోవిందాచార్య దాఖలు చేసిన ఈ పిటిషన్పై తదుపరి విచారణ ఏప్రిల్ 14న జరగనుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం.. ట్విట్టర్, ఫేస్బుక్, గూగుల్లు భారత్లో తమ అధికార ప్రతినిధుల వివరాలను బహిర్గతపరిచేలా ఆయా సంస్థలను ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విరాజ్ గుప్తా డిమాండ్ చేశారు. ద్వేషపూరిత ప్రసంగాలకు స్వర్గ ధామాలైపోయినా సామాజిక మాధ్యమాల్లో చట్టాలను అమలు చేసే వ్యవస్థ పోతోందని, అందుకు జవాబుదారీ అయిన అధికారులు ఎవరనేది తెలియకపోవడమూ ఇందుకు కారణమని పిటిషన్లో పేర్కొన్నారు. అలర్లకు, ఆస్తుల విధ్వంసానికి సామాజిక మాధ్యమాలు ఒక పనిముట్టుగా మారకూడదని, భావప్రకటన స్వేచ్ఛలో భాగమని చెప్పుకోవడమూ సరికాదని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. భావ ప్రకటన స్వేచ్ఛ అన్న భావనను ఈ సామాజిక మాధ్యమాలు దుర్వినియోగం చేస్తున్నాయని, భారతీయ చట్టాలను పాటించడం లేదని ఆరోపించారు. తగిన చర్యలేవీ లేని కారణంగానే రెచ్చగొట్టే ప్రసంగాలూ ఎక్కువ అవుతున్నాయని పిటిషనర్ ఆరోపించారు. -
ప్రకాశ్రాజ్కు హైకోర్టు నోటీసులు
పెరంబూరు : నటుడు ప్రకాశ్రాజ్కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో నటించి పేరుగాంచిన నటుడు ప్రకాశ్రాజ్. ఈయన నటుడు మాత్రమే కాకుండా, నిర్మాత, దర్శకుడు కూడా. తమిళంలో ధోని, ఉన్ సమయల్ అరైయిల్ వంటి చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించారు. కాగా ప్రకాశ్రాజ్ నడిగర్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఇది తమిళంలో రూపొందించిన ఉన్ సమయల్ అరైయిల్ చిత్రానికి రీమేక్. కాగా ఈ చిత్రానికి ఆయన బాలీవుడ్ ఫైనాన్సియర్ ఒకరి వద్ద రూ.5 కోట్లు అప్పు తీసుకున్నట్లు తెలిసింది. అందుకు ఆయన ఆ ఫైనాన్సియర్కు చెక్కును ఇవ్వగా అది బ్యాంకులో బౌన్స్ అయ్యింది.దీంతో ఆ ఫైనాన్సియర్ నటుడు ప్రకాశ్రాజ్పై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను గురువారం విచారించిన న్యాయమూర్తి ఏప్రిల్ 2వ తేదీలోగా కోర్టుకు హాజరవ్వాలని నటుడు ప్రకాశ్రాజ్కు సమన్లు జారీ చేశారు. (వారిని చంపేందుకు 29న ముహూర్తం) -
ఆధార్ నోటీసులపై అసదుద్దీన్ ఫైర్..
సాక్షి, హైదరాబాద్ : పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ హైదరాబాద్లో నివసిస్తున్న 127 మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) నోటీసులు జారీ చేయడంపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఉడాయ్, తెలంగాణ పోలీసులపై మండిపడ్డారు. ఉడాయ్ నోటీసులు అందుకున్న 127 మందిలో ముస్లింలు, దళితులు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. ఆధార్ సంస్థ తన అధికారాలను దుర్వినియోగం చేసిందని, సరైన ప్రామాణికాలు అనుసరించకుండానే పక్షపాతపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు. కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో ఆధార్ చూపమని అడగటం విరమించుకోవాలని, ఇలా చేయడానికి మీకు చట్టబద్ధ అనుమతి లేదని తెలంగాణ పోలీసులను ఉద్దేశించి ఏఐఎంఐఎం చీఫ్ ట్వీట్ చేశారు. నోటీసులో పౌరసత్వ వెరిఫికేషన్ అనే పదాన్ని ఉపయోగించారని, ఆధార్ వ్యాలిడిటీ గురించి ప్రస్తావించలేదని, ఈ నోటీసును జారీ చేసిన డిప్యూటీ డైరెక్టర్ను ఉడాయ్ సస్పెండ్ చేయాలని మరో పోస్టులో ఆయన కోరారు. కాగా 127 మందికి నోటీసులు జారీ చేసిన ఉడాయ్ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఫిబ్రవరి 20లోగా విచారణకు రావాలని వారిని ఆదేశించింది. సరైన పత్రాలు సమర్పించకపోయినా, భారత పౌరులమని నిరూపించుకోకపోయినా వారి ఆధార్ కార్డులను రద్దు చేస్తామని హెచ్చరించింది. చదవండి : హైదరాబాద్లో 127మందికి ఆధార్ నోటీసులు -
వేలంలో ఇల్లు..బీ కేర్ఫుల్లు!
కారు చౌకగా వస్తుందనో... ఎవరో చెప్పారనో... మంచి ఏరియాలో ఉందనో ఇలా కారణాలేవైతేనేం బ్యాంకులు వేలం వేసే ఇళ్లవైపు మొగ్గుచూపేవారు చాలామందే ఉంటారు. అయితే, ఇలా కొనేటప్పుడు నిబంధనలు... చట్టపరమైన అంశాలన్నింటినీ కూలంకషంగా పరిశీలించాకే ముందుకెళ్లడం మంచిదన్నది నిపుణుల మాట. లేదంటే అనవసరంగా కోరి చిక్కులు కొనితెచ్చుకున్నట్టే! వేలంలో ప్రాపర్టీని కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇతరత్రా అంశాలపై అవగాహన పెంచే ‘సాక్షి ప్రాఫిట్’ కథనం ఇది... నరేష్ కుమార్ (42) హైదరాబాద్లోని ఓ ప్రైవేటు సంస్థలో సీనియర్ స్టాఫ్గా పనిచేస్తున్నాడు. తన బడ్జెట్ పరిమితుల దృష్ట్యా హైదరాబాద్ శివార్లలో ఓ ఇంటిని సమకూర్చుకోవాలని చూస్తుండగా.. ఓ ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకు వేలం నోటిఫికేషన్ అతన్ని ఆకర్షించింది. వేలానికి ఉంచిన ప్రాపర్టీలలో (ఆస్తులలో) హైదరాబాద్ శివార్లకు సంబంధించిన ఒక ఇల్లు కూడా ఉంది. దీంతో నరేష్ బ్యాంకును సంప్రదించి వివరాలు తెలుసుకున్నాడు. 2018 మే నెలలో జరిగిన వేలంలో ఆ ఇంటికి బిడ్ వేసి గెలవడంతోపాటు రూ.13 లక్షలు కూడా అప్పుడే చెల్లించేశాడు. కానీ, ఆ ఇంటివాడు కాలేకపోయాడు..! ఆ ఇంటిపై రుణం తీసుకున్న వ్యక్తి చెల్లింపుల్లో విఫలం కావడంతో ‘సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ (సర్ఫేసీ) చట్టం 2002’ కింద బ్యాంకు వేలం వేసింది. వేలంలో నరేష్కుమార్కు విక్రయించేసి చేతులు దులుపుకుంది. 20 నెలలు గడిచిపోయింది. కానీ, ఇప్పటికీ ఆ ఇంటిని నరేష్ కుమార్కు బ్యాంకు స్వాధీనం చేయలేదు. వినియోగ హక్కుల్లేవు.. ఓ నిర్మాణ దారు నుంచి ప్రాపర్టీని కొనుగోలు చేసే సమయంలో సంబంధిత నిర్మాణం నాణ్యంగా లేదని గుర్తించినట్టయితే ఆ నిర్మాణదారునిపై వినియోగదారుల ఫోరమ్లో కేసు వేసి పరిహారం కోరే హక్కులు ఉంటాయి. కానీ, వేలంలో కొనుగోలు చేసిన ఇళ్లకు సంబంధించి ఈ హక్కులు ఉండవని తెలుసుకోవాలి. ‘‘ఈ తరహా కేసుల్లో కొనుగోలుదారులు వినియోగదారుల వివాద పరిష్కార కోర్టులను ఆశ్రయించలేరు. ఎందుకంటే అక్కడ ఎటువంటి ఉత్పత్తి లేదా సేవల విక్రయం జరగలేదు. దీంతో కొనుగోలుదారుడు వినియోగదారు అన్నదానికి అర్హులు కారు’’ అని విశ్లేషకులు తెలిపారు. వేలంలో విక్రయానికి ఉంచే ప్రాపర్టీల కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించడానికి గల కారణాల్లో ప్రధానమైనది.. అవి తక్కువ ధరకు రావడమే. కానీ, అదే సమయంలో ఆయా ఆస్తులపై ఎటువంటి సమస్యలు భవిష్యత్తులో ఎదురు కావన్న హామీ ఏమీ ఉండదు. కనుక బిడ్ వేసి కొనుగోలు చేసే ముందుగానే పూర్తి వివరాలు తెలుసుకోవాలి. న్యాయ నిపుణులను సంప్రదించి వారి సూచనల మేరకు నడుచుకోవడం ద్వారా తదనంతరం సమస్యల పాలు కాకుండా, నష్టపోకుండా, విలువైన సమయాన్ని వృ«థా కాకుండా చూసుకోవచ్చు. సర్ఫేసీ చట్టం ప్రకారం రుణ గ్రహీత తాను తీసుకున్న రుణాన్ని చెల్లించడంలో విఫలమైతే ఆ ఆస్తిని రుణమిచ్చిన సంస్థ స్వాధీనం చేసుకోవచ్చు. ఏ కోర్టు, చట్టపరమైన జోక్యం అవసరం లేకుండానే ఈ పనిచేయవచ్చు. ఒక్కసారి ఈ విధంగా ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నట్టయితే.. దాన్ని విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం లేదా ఆ ప్రాపర్టీపై హక్కులను వేరే సంస్థకు అప్పగించొచ్చు. సంబంధిత ఇంటిని వేలంలో విక్రయించగా, వచ్చిన మొత్తం నుంచి బ్యాంకు ముందుగా తన రుణ బకాయిలను సర్దుబాటు చేసుకుంటుంది. అదనంగా ఏమైనా మిగిలితే ఆ మొత్తాన్ని రుణ చెల్లింపుల్లో విఫలమైన వ్యక్తికి తిరిగి ఇచ్చేస్తుంది. కానీ, నరేష్ కుమార్ విషయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రుణ చెల్లింపుల్లో విఫలమైన వ్యక్తి ఆ ఇంట్లోనే కుటుంబంతో కలసి ఉంటూ ఖాళీ చేయడానికి నిరాకరిస్తున్నాడు. నరేష్ కుమార్ వద్ద రూ.13 లక్షలు తీసేసుకున్న బ్యాంకు తాను ఏం చేయలేనంటూ చేతులెత్తేసింది. ‘‘పూర్తి మొత్తం చెల్లించిన అనంతరం ఇంటిని స్వాధీనం చేస్తానని బ్యాంకు చెప్పింది. తీరా ఇప్పుడు ఈ విషయంలో ఏ విధమైన చర్యలు తీసుకోవడానికి బ్యాంకు ఆసక్తి చూపించడం లేదు’’ అంటూ నరేష్ కుమార్ వాపోయాడు. అయితే, ఒక్క నరేష్ కుమార్కే వచ్చిన ఇబ్బంది కాదు ఇది. వేలంలో కొనుగోలు చేసిన వారికి ఇళ్లను స్వాధీనం చేయకపోవడం, పూర్వపు యజమానులు వేలాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులను ఆశ్రయించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకే వేలంలో మీరు ప్రాపర్టీని కొనుగోలు చేస్తున్నట్టయితే, చేయాలనుకుంటున్నట్టు అయితే ఇందులో ఉండే రిస్క్లు తెలుసుకోవడం ఎంతో అవసరం. బ్యాంకులపై బాధ్యత లేదు.. బ్యాంకులు సాధారణంగా తమ తనఖాలో ఉన్న ఇళ్లు, ఇతర ప్రాపర్టీలను వాటి ప్రస్తుత స్థితిలోనే వేలం వేస్తుంటాయి. ఇదే విషయాన్ని వేలం నిబంధనలు, షరతుల్లో చట్టపరమైన పరిభాషలో పేర్కొంటాయి కూడా. ‘యాజ్ ఈజ్ వేర్ ఈజ్’, యాజ్ ఈజ్ వాట్ ఈజ్ బేసిస్’ అనే వ్యాక్యాలు వేలం షరతుల్లో ఉన్నాయేమో చూసుకోవాలి. ‘‘‘యాజ్ ఈజ్ వేర్ ఈజ్’, యాజ్ ఈజ్ వాట్ ఈజ్ బేసిస్’ అనే వాటిని పరస్పరం మార్చి ఉపయోగిస్తుంటారు. ప్రాపర్టీని ప్రస్తుత రూపంలో భౌతికంగా, చట్టపరంగా, బాధ్యతలతో సహా అని తెలియజేయడం జరుగుతుంది’’ అని న్యాయ నిపుణుడు కునాల్ అరోరా తెలిపారు. అంటే ప్రాపర్టీకి సంబంధించి అన్ని రిస్క్లనూ కొనుగోలుదారుడు తీసుకుంటున్నట్టు అర్థం చేసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘‘కొనుగోలుదారులు సంబంధిత ఆస్తి టైటిల్ (చట్టపరమైన హక్కుల వివరాలతో కూడిన పత్రం)ను, స్వాధీనతను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఒక్కసారి ప్రాపర్టీని చట్టపరంగా వేలం వేసిన తర్వాత ఆ ఆస్తికి సంబంధించి అన్ని రిస్క్లు, బాధ్యతలను కొనుగోలుదారే భరించాల్సి ఉంటుంది’’ అని అరోరా వివరించారు. అందుకే వేలంలో కొనుగోలు చేయడానికి ముందుగా, ఆయా ప్రాపర్టీని సందర్శించాలి. నిర్మాణాన్ని, నాణ్యతను పరిశీలించుకోవాలి. ఏవైనా రిపేర్లు లేదా నవీకరణ అవసరమవుతాయా అన్ని చూసుకోవాలి. నోటీసుపై దృష్టి... బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు వేలం వేసే ఇళ్లు స్పష్టమైన టైటిల్తో ఉంటాయని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. సాధారణంగా వేలం నోటీసులో కొన్ని నిబంధనలను పేర్కొనడం జరుగుతుంది. ‘అధీకృత అధికారికి తెలిసినంత వరకు సంబంధిత ప్రాపర్టీపై ఎటువంటి తనఖా లేదు. అయితే, ఏదైనా తెలియని తనఖా ఉన్నా లేదా భవిష్యత్తులో ఈ ఆస్తికి సంబంధించి తనఖా చోటు చేసుకున్నా లేదా ఏదైనా మూడో పక్షం నుంచి క్లెయిమ్లు, బకాయిల డిమాండ్లు వచ్చినా మా బాధ్యత ఉండదు’ అని వేలం నోటీసులో పేర్కొనడం జరుగుతుంది. అయితే, దాదాపు అధిక శాతం మంది ఈ నిబంధనలు పూర్తిగా పట్టించుకోరు. ఫలితం.. వేలంలో కొనుగోలు చేసిన తర్వాత ఎవరైనా వచ్చి ఆ ప్రాపర్టీకి సంబంధించి హక్కులను క్లెయిమ్ చేస్తే.. అప్పుడు బ్యాంకులు బాధ్యత తీసుకోవు. అందుకే వేలంలో కొనుగోలు చేసే వారు సంబంధింత ఆస్తి తనఖాలో ఉందా లేదా.. ఆ ప్రాపర్టీపై హక్కులు ఎవరి పేరిట ఉన్నాయి? న్యాయ వివాదాలు ఏవైనా ఉన్నాయా, బకాయిలు ఏవైనా ఉన్నాయా? తదితర వివరాలను బిడ్ వేయడానికి ముందుగానే సమగ్రంగా తెలుసుకోవడం అవసరం. ‘‘సర్ఫేసీ చట్టం కింద బ్యాంకులు, ఆర్థిక సంస్థలు బిడ్డర్లకు వ్యక్తీకరించే యాజమాన్య హక్కులు పూర్తిగా స్పష్టమైనవి, అమలు చేయతగినవి. అయితే, టైటిల్కు సంబంధించిన అంశాలు, ఆస్తి స్వాధీనత, ఇతర తనఖాలు ఏవైనా తలెత్తవచ్చు. ఎందుకంటే సంబంధిత ఆస్తి టైటిల్ ఏ స్థితిలో ఉన్నదనే దానిపై బ్యాంకు నుంచి శ్రద్ధ తక్కువగా ఉండడం వల్ల కావచ్చు’’ అని అరోరా వివరించారు. స్వాధీనత సమస్య.. స్థిరాస్తి అయినటువంటి ఓ ప్లాట్ లేదా ఇల్లు లేదా అపార్ట్మెంట్ అయితే స్వాధీనత కీలకం అవుతుంది. చాలా కేసుల్లో వేలం వేసే ఆస్తుల స్వాధీనతను బ్యాంకులు పత్రాల్లోనే చూపుతున్నాయి కానీ, నిజానికి భౌతికంగా చూస్తే వాటి స్వాధీనత కలిగి ఉండడం లేదు. ‘‘రుణం చెల్లింపుల్లో విఫలమైన పూర్వపు యజమాని స్వాధీనంలోనే ఆ ఆస్తి ఉన్నప్పటికీ.. ఆ ప్రాపర్టీపై చట్టపరమైన హక్కు కలిగిన బ్యాంకులు లాంఛనప్రాయ స్వాధీనాన్ని చూపుతుంటాయి. చట్ట ప్రకారం బ్యాంకులు భౌతికంగానూ ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కొనుగోలుదారునికి హక్కులు బదలాయించాలి. కానీ, ఆచరణలో బ్యాంకులు ఆయా ఆస్తులను భౌతికంగా స్వాధీనం చేసుకోకుండానే వేలంలో లావాదేవీలను పూర్తి చేసేస్తున్నాయి’’ అని అరోరా వివరించారు. ఇదే జరిగితే నరేష్ కుమార్ మాదిరే పూర్వపు యజమానిని ఆ ఇంటి నుంచి బయటకు పంపించేసి స్వాధీనం చేసుకోవడం పెద్ద ప్రహసనంతో కూడుకున్న పని అవుతుంది. ఇందుకు ఎంత సమయం పడుతుందో కూడా తెలియదు. -
విచారణకు హాజరు కావాలని శివాజీకి నోటీసులు
-
సీఎల్పీ విలీనంపై స్పీకర్కు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ దాఖలైన తాజా వ్యాజ్యంలో రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్ అధిపతిగా వ్యవహరించే శాసనసభ స్పీకర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం, టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన పైలట్ రోహిత్రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, డి.సుధీర్రెడ్డి, హరిప్రియ, సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగ కాంతారావు, ఆత్రం సక్కు, వనమా వెంకటేశ్వరరావు, జె.సురేందర్, చిరుమర్తి లింగయ్యలకు నోటీసులు ఇచ్చింది. గతంలో ఇదే తరహాలో దాఖలైన మరో రెండు వ్యాజ్యా లతో కలిపి ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. శాసనమండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయడం చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఇప్పటికే రిట్ దాఖలు చేశారు. ఈ కేసులో పదో షెడ్యూల్ నిబంధనల ప్రకారం ట్రిబ్యు నల్గా వ్యవహరించే మండలి చైర్మన్కు, ఇతర ప్రతి వాదులకు హైకోర్టు మంగళవారం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మండలిలో మాదిరిగా అసెంబ్లీలోనూ చేయనున్నారంటూ గత ఏప్రిల్ 29న కాంగ్రెస్ నాయకులు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క దాఖలు చేసిన కేసులోనూ అదే తరహా నోటీసులు శాసనసభ స్పీకర్, ఇతరులకు జారీ అయ్యా యి. బుధవారం జరిగిన తాజా రిట్ను కూడా ఉత్తమ్, భట్టిలే దాఖలు చేశారు. ఈ కేసులన్నింటినీ కలిపి విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. -
చందా కొచర్కు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్నకు రూ. 1,875 కోట్ల రుణాల వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. సెంట్రల్ ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో జూన్ 10న ఉదయం 10.30 గం.లకు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఢిల్లీలో చందా కొచ్చర్ కుటుంబ సభ్యులను ఈడీ ఇప్పటికే అయిదు సార్లు విచారణ చేసింది. 2009–2011 మధ్య కాలంలో వీడియోకాన్ గ్రూప్నకు రుణాల మంజూరులో చందా కొచర్ పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఆమె చేసిన మేలుకు ప్రతిగా వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్.. చందా కొచర్ భర్తకు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్లోకి కొంత పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత వీడియోకాన్ గ్రూప్ తీసుకున్న రుణాలు మొండిబాకీలుగా మారడం గమనార్హం. మొత్తం మీద ఇదంతా చందా కొచర్ కుటుంబం, ధూత్లకు లబ్ధి చేకూర్చేలా క్విడ్ ప్రో కో వ్యవహారంగా జరిగిందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. -
ప్రఫుల్కు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో జరిగిన ఏవియేషన్ స్కాంలో మాజీ మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం సమన్లు జారీ చేసింది. జూన్ 6వ తేదీన ఉదయం దర్యాప్తు సంస్థ అధికారి ముందు హాజరుకావాలని ఆయనకు నోటీసు ఇచ్చింది. విమానయాన మంత్రిగా తన హయాంలో వివిధ ఏవియేషన్ సంస్థలకు లాభం చేకూర్చే క్రమంలో ప్రభుత్వం కోట్లాది రూపాయలు నష్టపోయిందని ఈడీ ఆరోపిస్తోంది. అరెస్ట్అయిన లాబీయిస్ట్ దీపక్ తల్వార్ విచారణలో వెల్లడించిన వివరాల ప్రకారం, లభించిన సాక్ష్యాధారాల ఆధారంగా ఈ కుంభకోణంలో కోట్లాది రూపాయల ముడుపులు చేతులు మారాయని ఇది మనీలాండరింగ్ కేసుగా భావిస్తున్నామని ఈడీ తెలిపింది. -
హెచ్4 వీసాలపై పిడుగు!
వాషింగ్టన్: హెచ్–4 వీసాదారులకు అమెరికాలో ఉద్యోగం చేసుకునే అనుమతులను రద్దుచేయాలన్న డీహెచ్ఎస్ (డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ) ప్రతిపాదనను అమలుచేసే దిశగా మరో అడుగు ముందుకు పడింది. హెచ్–1బీ వీసా కలిగిన వ్యక్తుల జీవిత భాగస్వాములకు, వారి 21 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు ఇచ్చేదే ఈ హెచ్–4 వీసా. హెచ్–4 వీసా కలిగిన వారు కూడా ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతులిస్తూ 2015లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ అనుమతులను రద్దు చేయాలని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా, డీహెచ్ఎస్ ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణను ప్రారంభించాల్సిందిగా మే 22న అమెరికా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. హెచ్–4 వీసాకు ఉద్యోగానుమతులు రద్దయితే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న లక్ష మందికి పైగా భారతీయులు, తమ కొలువులను కోల్పోయే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఈ లక్ష మంది భారతీయుల్లో స్త్రీలే అత్యధికంగా ఉన్నారు. కనీసం సంవత్సరం తర్వాతే.. ఒక వేళ హెచ్–4 వీసాకు ఉద్యోగానుమతులు రద్దయినా, అది అమలు కావడానికి కనీసం ఒక సంవత్సరం పడుతుందని అమెరికాలో వలస చట్టాల న్యాయనిపుణుడు రాజీవ్ ఖన్నా చెప్పారు. ‘హెచ్–4 వీసాదారులకు ఉద్యోగాలు చేసుకునే అనుమతిని రద్దుచేసే ప్రక్రియ ప్రస్తుతం చివరి నుంచి రెండో దశలో ఉంది. ప్రజాభిప్రాయ సేకరణలో ఈ ప్రతిపాదనకు మద్దతు లభిస్తే, ఫెడరల్ రిజిస్టర్లో దీనిని పోస్ట్ చేస్తారు. 30 లేదా 60 రోజుల్లోపు మళ్లీ ప్రజలు తమ అభిప్రాయాలు తెలపవచ్చు. అనంతరం నిబంధనకు తుదిరూపు వస్తుంది’ అని ఆయన వివరించారు. వలస విధానాల్లో పూర్తి సంస్కరణలు తీసుకొచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం తొలి నుంచీ మొగ్గుచూపుతుండటం తెలిసిందే. అందులో భాగంగానే, గతేడాది ఫిబ్రవరిలో తొలిసారిగా హెచ్–4 వీసాలకు ఉద్యోగానుమతులు రద్దు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం చేసింది. అనంతరం గతేడాది అక్టోబర్లో డీహెచ్ఎస్ ఈ ప్రతిపాదనకు అనుకూలంగా మాట్లాడింది. అయితే హెచ్–4 వీసాకు ఉద్యోగానుమతులు రద్దు చేస్తే అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలకు ప్రతిభావంతులైన ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. -
రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు
న్యూఢిల్లీ: గిరిజనులను కాల్చి చంపడం కోసం ప్రధాని మోదీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించిందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఈసీ బుధవారం ఈ నోటీసులు ఇస్తూ, 48 గంటల్లోగా రాహుల్ స్పదించాలనీ, లేని పక్షంలో రాహుల్ను సంప్రదించకుండానే ఈ అంశంలో నిర్ణయం తీసుకుంటా మంది. ప్రత్యేక వార్తాహరుడి ద్వారా రాహుల్కు ఈ నోటీసులను ఈసీ పంపింది. -
ప్రజ్ఞాకు ఈసీ నోటీసులు
భోపాల్: మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు, భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్కు ఎలక్షన్ కమిషన్ శనివారం నోటీసులు జారీ చేసింది. 26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కరేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసులిచ్చింది. ప్రజ్ఞాతో పాటు బీజేపీ భోపాల్ యూనిట్ అధ్యక్షుడు వికాస్ విరానీకి నోటీసులు ఇచ్చినట్లు భోపాల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుదామ్ చెప్పారు. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ప్రజ్ఞా వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించామని, దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాల్సిందిగా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఏఆర్వో) ను కోరామన్నారు. శనివారం ఉదయం ఆయన ఈ నివేదికను అందించారని.. దీనిపై ప్రజ్ఞా, వికాస్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఏఆర్వో ఇచ్చిన నివేదికను ఎలక్షన్ కమిషన్కు పంపనున్నామని వెల్లడించారు. కాగా, గురువారం భోపాల్లో బీజేపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ప్రజ్ఞామాట్లాడుతూ.. తన శాపం వల్లనే హేమంత్ చనిపోయారని వ్యాఖ్యానించారు. -
రాహుల్కు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చిక్కుల్లో పడ్డారు. ‘ప్రధాని మోదీ దొంగ అని సుప్రీంకోర్టే చెప్పింది’ అన్న వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం రాహుల్కు నోటీసులు జారీచేసింది. రఫేల్ తీర్పునకు రాహుల్ తప్పుడు ఆరోపణల్ని ఆపాదించారని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలకు ఏప్రిల్ 22లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రఫేల్ ఒప్పందంపై లీకైన పత్రాల ఆధారంగా గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు సుప్రీం ఈ నెల 10న అంగీకరించిన సంగతి తెలిసిందే. అదేరోజు అమేథీలో నామినేషన్ దాఖలుచేసిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ..‘చౌకీదార్(కాపలాదారు–మోదీ) దొంగ అని సుప్రీంకోర్టు చెప్పింది. మోదీ దొంగతనానికి పాల్పడ్డారని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా నేను సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు చెబుతున్నా. సత్యమే గెలిచింది’ అని వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం తీర్పునకు రాహుల్ తన అభిప్రాయాన్ని ఆపాదించారని ఆరోపించారు. రఫేల్ పత్రాలపైనే చర్చించాం ఈ పిటిషన్ను సోమవారం విచారించిన సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం స్పందిస్తూ..‘రఫేల్ వ్యవహారంలో రాహుల్ గాంధీ తన ప్రసంగాలు, మీడియా సమావేశాల్లో తప్పుడు ఆరోపణలను సుప్రీం తీర్పునకు ఆపాదించారు. అంతేకాకుండా రాహుల్ ప్రస్తావించిన కొన్ని వ్యాఖ్యల్ని మేం అసలు చెప్పనేలేదు. మేం కేవలం లీకైన రఫేల్ పత్రాల చట్టబద్ధతపైనే చర్చించాం. కాబట్టి ఈ విషయంలో స్పష్టత కోసం రాహుల్ గాంధీ నుంచి వివరణ కోరడమే సరైనదని భావిస్తున్నాం’ అని తెలిపింది. ఈ కేసులో ఏప్రిల్ 23న తదుపరి విచారణ చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. రాజకీయ నేతలు న్యాయస్థానాల తీర్పులకు ఎలాంటి అభిప్రాయాలను ఆపాదించరాదని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా మీనాక్షి లేఖీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ.. సుప్రీంకోర్టును ప్రస్తావిస్తూ ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని కలిగించేందుకు రాహుల్ ప్రయత్నించారని ఆరోపించారు. ఇది కోర్టు ధిక్కారానికి పాల్పడటమేననీ, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పందిస్తూ.. ఈ విషయంలో రాహుల్ వివరణను తీసుకుంటామని పునరుద్ఘాటించింది. ఈ కేసులో అదనపు అఫిడవిట్ దాఖలుచేసేందుకు అనుమతిస్తున్నామని పేర్కొంది. రాహుల్ అబద్ధాల కోరు: బీజేపీ పదేపదే అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ చీఫ్ రాహుల్కు అలవాటైపోయిందని బీజేపీ చీఫ్ అమిత్ షా విమర్శించారు. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో మోదీపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు రాహుల్పై ఈసీ చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి రవిశంకర్ డిమాండ్ చేశారు. రాహుల్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్నారు. ఈ విషయమై ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. కేవలం అబద్ధాలు చెప్పడమే కాకుండా తన ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగ సంస్థలను రాహుల్ వివాదంలోకి లాగారన్నారు. మోదీ పారదర్శక పాలన అందిస్తుంటే, కుంభకోణాల్లో మునిగితేలిన కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతోందని దుయ్యబట్టారు. సుప్రీంకు వివరణ ఇస్తాం: కాంగ్రెస్ రాహుల్ గతంలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ..‘రాహుల్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు వివరణ కోరింది. వాళ్లకు మేం వివరణ ఇస్తాం’ అని ముక్తసరిగా జవాబిచ్చారు. మరోవైపు కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ స్పందిస్తూ..‘సుప్రీంకోర్టు నోటీసుపై సమగ్రంగా, గట్టిగా జవాబు ఇస్తాం. ఎవ్వరినీ నొప్పించే ఉద్దేశం రాహుల్కు లేనప్పటికీ ఆయన వ్యాఖ్యలను వక్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇది ఎంతమాత్రం సరికాదు’ అని వ్యాఖ్యానించారు. -
నోటీసులు అందాయి
‘హార్న్ ఓకే ప్లీజ్’ (2008) సినిమా సెట్లో నటుడు నానా పటేకర్, ‘చాక్లెట్’ సినిమా సెట్లో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తనతో అసభ్యంగా ప్రవర్తించారని నటి తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇప్పుడు నెక్ట్స్ లెవల్కి వెళ్లింది. నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రి తరఫు న్యాయవాదులు తనుశ్రీకి నోటీసులు పంపారు. ‘‘తన పట్ల వివేక్ అగ్నిహోత్రి అమర్యాదగా ప్రవర్తించారన్న తనుశ్రీ మాటల్లో వాస్తవం లేదు. పబ్లిసిటీ లేదా వ్యక్తిగత లబ్ధి కోసమే ఆమె ఇలా చేస్తున్నారు’’ అన్నది ఆ నోటీసుల సారాంశమట. ‘‘నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రిల నుంచి నాకు గురువారం నోటీసులు వచ్చాయి. వేధింపులు, అవమానం, అన్యాయాలకు నోరు విప్పితే ఇక్కడ ఇలాంటి బహుమతులు వచ్చాయి. నానా, వివేక్ బృందాలు నాపై బురద చల్లడానికి అసత్యాలు మాట్లాడుతున్నారు’’ అని తను శ్రీ ఆవేదన వ్యక్తం చేశారని బాలీవుడ్లో తాజాగా కథనాలు వస్తున్నాయి. అంతేకాదు.. ‘‘ఎప్పుడో పదేళ్ల క్రితం నాటి సంఘటనను ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు. నానా పటేకర్ చాలా మంచి వ్యక్తి’’ అని ముంబై మంత్రి ఒకరు ఫోన్లో తనుశ్రీతో సంభాషించారని వార్తలు వస్తున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ ఫ్రీదా పింటో కూడా తనుశ్రీకి మద్దతు తెలిపారు. -
నిబంధనలకు విరుద్ధం: ఎన్హెచ్ఆర్సీ
సాక్షి, న్యూఢిల్లీ: వరవరరావు సహా ఐదుగురు మానవహక్కుల కార్యకర్తల అరెస్టులన్నీ నిబంధలనలకు విరుద్ధంగా, మానవ హక్కులను ఉల్లంఘిస్తూ జరిగాయని కేంద్ర మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) మండిపడింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీకి నోటీసులు జారీచేసింది. ఈ ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు ఇచ్చింది. ‘మీడియాలో వార్తల ఆధారంగా చూస్తే.. ఈ ఐదుగురి గృహనిర్బంధం నిబంధలకు విరుద్ధంగా జరిగిందని కమిషన్ భావిస్తోంది. ఈ అరెస్టులను మానవ హక్కుల ఉల్లంఘనగానే చూస్తున్నాం’ అని ఎన్హెచ్చార్సీ సీనియర్ సభ్యుడొకరు తెలిపారు. నవలఖా ట్రాన్సిట్ రిమాండ్పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఈ అరెస్టుల విషయంలో కోర్టుకు పోలీసులు సరైన వివరణ ఇవ్వలేదనేది సుస్పష్టమైందన్నారు. ‘ఫరీదాబాద్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు సుధా భరద్వాజ్ ట్రాన్సిట్ రిమాండ్ పెండింగ్లో ఉంది. ఈ ఘటనతో తనకు సంబంధం లేదని ఆమె కోర్టుకు వెల్లడించారు. ఎఫ్ఐఆర్లోనూ తన పేరు లేదని.. కేవలం తన సిద్ధాంతం కారణంగానే అరెస్టు చేసి హింసిస్తున్నారని చెప్పారు’ అని ఎన్హెచ్చార్సీ ఒక ప్రకటనలో పేర్కొంది.జెనీవాలోని ఓ ఎన్జీవో నుంచి కూడా మహారాష్ట్ర పోలీసులు ఈ ఏడాది జూన్లో ఐదుగురు మానవ హక్కుల కార్యకర్తల (సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్, సుధీర్ ధావ్లే, షోమాసేన్, మహేష్ రౌత్) ను అరెస్టు చేసినట్లు ఫిర్యాదు అందిన విషయాన్ని కమిషన్ వెల్లడించింది. ఈ అంశంలోనూ మహారాష్ట్ర డీజీపీకి జూన్ 29న నోటీసులు పంపామని, దీనిపై సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొంది. -
కోమటిరెడ్డి,సంపత్ పిటిషన్పై హైకోర్టు తీర్పు
-
దినకరన్కు నోటీసులు..!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆకస్మిక మరణం రాను రానూ అనుమానాస్పద మృతిగా మారిపోతున్న తరుణంలో జయ మరణ విచారణ కమిషన్ టీటీవీ దినకరన్కు బుధవారం నోటీసులు జారీచేసింది. అలాగే శశికళ మేనకోడలు, ఇళవరసి కుమారై్తన కృష్ణప్రియ, జయలలితకు అంతరంగిక కార్యదర్శిగా వ్యవహరించిన పూంగున్రన్లకు నోటీసులు జారీ అయినాయి. జయ మరణంపై అనేక అనుమానాలు తలెత్తడంతో సీఎం ఎడపాడి సెప్టెంబరు 25 వ తేదీన విచారణ కమిషన్ను ఏర్పాటు చేశారు. రిటైర్డు న్యాయమూర్తి అరుముగస్వామి చైర్మన్గా నియమితులైనారు. గత నెల 22వ తేదీన విచారణ ప్రారంభం కాగా, డీఎంకే లీగల్సెల్ కార్యదర్శి డాక్టర్ శరవణన్, జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్, దీప భర్త మాధవన్, తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు షీలా బాలకృష్ణన్, రామమోహన్రావు సహా ఇప్పటి వరకు 28 మంది కమిషన్ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. వీరుగాక మరో 422 మంది కమిషన్కు వినతిపత్రాలు సమర్పించారు. అపోలో ఆసపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రీతారెడ్డి, శశికళ సైతం విచారణ కమిషన్ నుండి నోటీసులు అందుకున్నారు. ఈ ముగ్గురు కమిషన్ ముందు హాజరుకావాల్సి ఉంది. ఇదిలా ఉండగా, అపోలో ఆసుపత్రిలో జయ చికిత్స దృశ్యాలను ఆర్కేనగర్ ఉప ఎన్నికల పోలింగ్ ముందు దినకరన్ అనుచరుడైన బహిషృత ఎమ్మెల్యే వెట్రివేల విడుదల చేయడాన్ని కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. వీడియోల విడుదల నేరం: విచారణ జరుగుతున్న సమయంలో వీడియో విడుదల చేయడం నేరమని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కమిషన్ ఆదేశాల మేరకు వీడియో ఆధారాలను తన న్యాయవాది ద్వారా వెట్రివేల్ కమిషన్కు అందజేశాడు. జయలలిత చికిత్సకు సంబంధించి తన వద్ద మరిన్ని దృశ్యాలు ఉన్నాయని కృష్ణప్రియ మీడియాకు చెప్పడం కమిషన్ నుండి నోటీసులకు కారణమైంది. వచ్చేనెల 2వ తేదీన కృష్ణప్రియ కమిషన్ ముందు హాజరుకావాల్సి ఉంది. జయలలిత వీడియోకు సంబంధించి మరిన్ని ఆధారాలుంటే వారంలోగా అందజేయాలని పేర్కొంటూ దినకరన్కు నోటీసులు అందాయి. జయ చికిత్సకు సంబంధించిన వీడియోల విడుదలపై విచారణ కమిషన్ నిషేధం విధించింది. -
టెక్ మహీంద్రాకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: ఉద్యోగుల తొలగింపు విషయంలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టెక్ మహేంద్రకు ఉమ్మడి హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ కంపెనీతో పాటు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్కు నోటీసులిచ్చింది. ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. టెక్ మహీంద్రలో ఉద్యోగుల తొలగింపును సవాలు చేస్తూ సుద్దాల సుధాకర్ మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రామచంద్రరావు ఇవాళ విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ, టెక్ మహేంద్ర కంపెనీ పలువురు ఉద్యోగుల్ని రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తోందని, సెలవుపై వెళ్లాలని కూడా వేధిస్తోందని తెలిపారు. దీనిపై రంగారెడ్డి జిల్లా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన తర్వాత సదరు కంపెనీ ఉద్యోగుల్ని తొలగించిందని వివరించారు. కార్మిక శాఖ జాయింట్ కమిషన ర్ చర్యలు తీసుకునేలోపే ఆ కంపెనీ ఉద్యోగుల్ని తొలగించడం అన్యాయమని, ఫిర్యాదు పెండింగ్లో ఉండగా తొలగించరాదని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లోని సెక్షన్ 47(2) స్పష్టం చేస్తోందన్నారు. ఈ సెక్షన్ నుంచి ఐటీ కంపెనీలకు మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 22 అమలు కాకుండా హైకోర్టు గతంలోనే స్టే ఇచ్చిందని, కాబట్టి ఈ నిబంధన ఐటీ కంపెనీలకు వర్తిస్తుందని ఆయన వివరించారు. ఇటీవల కాలంలో పలు ఐటీ కంపెనీలు నిర్ధాక్షణ్యంగా ఉద్యోగులను తొలగించేస్తున్నాయని, ఒక నెలలోనే కార్మిక శాఖ కమిషనర్ దగ్గర 80 పిటిషన్లు దాఖలయ్యాయని సత్యప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులుగా ఉన్న టెక్ మహీంద్ర కంపెనీతోపాటు తెలంగాణ కార్మిక శాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది. టెక్ మహీంద్రకు వ్యక్తిగతంగా నోటీసులు అందచేసేందుకు పిటిషనర్కు అనుమతినిస్తూ విచారణను వాయిదా వేసింది. -
వీఆర్ఏల పోరుబాట
ఇన్చార్జి జేసీ నాగేంద్రకు సమ్మె నోటీసు సెప్టెంబర్1 నుంచి విధుల బహిష్కరణ ముకరంపుర : మరోసారి వీఆర్ఏలు సమ్మెకు సిద్ధమయ్యారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందంటూ ఆందోళనకు దిగుతున్నారు. సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్1 నుంచి సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ వీఆర్ఏల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కందుకూరి బాపుదేవు ఆధ్వర్యంలో ఇన్చార్జి జేసీ నాగేంద్రకు గురువారం సమ్మె నోటీసు అందజేసారు. ఏపీపీఎస్సీ ద్వారా నియామకమైన గ్రామ రెవెన్యూ సహాయకులు 56 రకాల విధులతో వెట్టిచాకిరీ చేస్తున్నా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అంగన్వాడీలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల వరకు జీతాలు పెంచినప్పటికీ వీఆర్ఏల సమస్యలపై స్పందించడం లేదంటూ వాపోతున్నారు. వీఆర్ఏలను పార్ట్టైం ఉద్యోగులుగానే పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినా జిల్లాలో అమలు కావడం లేదు. 2012, 2014 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 5 వేల మందికి గాను జిల్లాలో 700 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా అప్పటి ప్రభుత్వం వీఆర్ఏలను భర్తీ చేసింది. వీరికి గౌరవ వేతనంగా రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెరిగింది. ఏపీపీఎస్సీ ద్వారా కావడంతో ఎక్కువగా ఉన్నత విద్యావంతులే వీఆర్ఏలుగా నియామకమయ్యారు. ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ అయినప్పటికీ వీఆర్ఏలకు సర్వీసు రూల్స్ వర్తించడం లేదు. పని బారెడు... గ్రామాలు, పట్టణాల్లో మొత్తం 56 రకాల విధులను నిర్వర్తిస్తున్నారు. మీసేవ కేంద్రాల్లో పహాణీలు, కుల, ఆదాయ, నివాస ద్రువీకరణ పత్రాలు, పాస్బుక్ల కంప్యూటరీకరణ పనులను వీఆర్ఏ చేస్తున్నారు. మండల కేంద్రాల్లో తహసీల్దార్, డీటీ, ఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్లకు కావాల్సిన రికార్డులను వీరే అందిస్తారు. సమగ్ర సర్వే, హరితహారం, ఆహార భద్రత కార్డుల తయారీ సమాచారాన్ని గ్రామస్థాయిలో పూర్తిగా అందించేది కూడా వీరే. గ్రామాల్లో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల శిఖాలు కాపాడడానికి వీరు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. వీఆర్ఏల డిమాండ్లు.. –సర్వీసును రెగ్యులరైజ్ చేస్తూ పే స్కేలు అమలు చేయాలి –పదోన్నతుల్లో ఇచ్చే వాటా 30 నుంచి 70 శాతానికి పెంచాలి –మూడేళ్లు పూర్తయిన వారికి వీఆర్వోలుగా పదోన్నతి కల్పించాలి –హెల్త్కార్డులు మంజూరీ చేయాలి. –మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులివ్వాలి. –నూతనంగా ఏర్పడే జిల్లాల్లో రెవెన్యూ శాఖలోని ఖాళీలను అర్హత కలిగిన ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికైన వారితో భర్తీ చేయాలి.