
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్గా అశోక్ ఎస్.గోయల్ను కేంద్ర జల్ శక్తి శాఖ నియమించింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(పీపీఏ) సీఈవోగా పనిచేస్తున్న శివ్నందన్కుమార్ రెండేళ్లుగా కృష్ణా బోర్డు చైర్మన్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆయన ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కేఆర్ఎంబీ చైర్మన్గా అశోక్ను కేంద్రం నియమించింది. జూన్ 1న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. పీపీఏ సీఈవోగా మరొకరిని నియమిస్తారా లేదా అశోక్కే అదనపు బాధ్యతలు అప్పగిస్తారా అనేది తేలాల్సి ఉంది.