ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలి: సీఎం జగన్‌ | CM Jagan Holds Review Meeting On Termination Of CPS | Sakshi
Sakshi News home page

ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలి: సీఎం జగన్‌

Published Tue, Mar 22 2022 6:58 PM | Last Updated on Tue, Mar 22 2022 8:43 PM

CM Jagan Holds Review Meeting On Termination Of CPS - Sakshi

సాక్షి, అమరావతి: భాగస్వామ్య పింఛన్‌ పథకం (సీపీఎస్‌) రద్దు అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా  సీపీఎస్‌పై సీఎం వైఎస్‌ జగన్‌కు అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రక్రియలో ఉద్యోగ సంఘాలనూ భాగ్వస్వామ్యం చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

మంత్రుల బృందం, అధికారులు సంబంధిత సంఘాలకు ప్రెజెంటేషన్ ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఆ తర్వాత ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని అధికారులకు సూచించారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 4వ తేదీ నుంచి ప్రారంభం కావాలని సీఎం తెలిపారు. ఈ  సమీక్షలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement