గుర్లలో కలరా! | Diarrhea victims are initially diagnosed with cholera symptoms | Sakshi
Sakshi News home page

గుర్లలో కలరా!

Published Fri, Oct 25 2024 5:24 AM | Last Updated on Fri, Oct 25 2024 5:24 AM

Diarrhea victims are initially diagnosed with cholera symptoms

డయేరియా బాధితుల్లో కలరా లక్షణాలున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ

పూర్తి స్థాయి నిర్ధారణ కోసం కోల్‌కతాకు నమూనాలు 

విషయం బయటకు పొక్కకుండా చూస్తున్న ప్రభుత్వం

సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా గుర్లలో 14 మంది మరణించడంతో పాటు, వందల సంఖ్యలో బాధితులు ఆస్పత్రులపా­లవ్వడానికి కారణం కలరా అని తెలుస్తోంది. బాధితుల నుంచి సేకరించిన నమూనాలను  ల్యాబ్‌లో పరీక్షించగా కలరా ఆన­వాళ్లను గుర్తించినట్టు సమాచారం. వైద్య శాఖ నియమించిన ర్యాపిడ్‌ రియాక్షన్‌ టీమ్‌ సైతం ఈ అంశాన్ని ధ్రువీక­రిస్తూ ప్రభు­త్వానికి నివేదిక అందజేసినట్లు తెలిసింది. 

గుర్లలో చోటు చేసుకున్న మరణా­లను దాచిన­ట్లు­గానే, సమస్యకు కారణాలను సైతం బయ­టకు పొక్కకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆస్ప­త్రిలో చేరిన కొందరు బాధితుల నుంచి నమూనాలు సేకరించి.. విజయనగరం వైద్యకళాశాల ల్యాబ్‌లో పరీ­క్షించారు. కల్చర్‌ టెస్ట్‌లో విబ్రియో కలరా ఆన­వాళ్లను గుర్తించినట్టు తెలిసింది. 

పూర్తి స్థాయిలో నిర్ధారణ కోసం కోల్‌కతాలోని ల్యాబ్‌కు పంపినట్టు సమా­చారం. కలరా సోకిన వారిలో తీవ్ర స్థాయి­లో విరోచనాలు అవు­తాయి. దీంతో తొందరగా శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి బాగా నీరసించిపో­తారు. ఆపై కిడ్నీల పనితీరుపై ప్రభావం పడి మల్టీ ఆర్గాన్స్‌ ఫెయిల్యూర్‌తో మరణాలు సంభవిస్తాయని వైద్యులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement