కట్టుదిట్టంగా టెన్త్‌ పరీక్షలు | Director of Government Examinations issued further instructions to the officers | Sakshi
Sakshi News home page

కట్టుదిట్టంగా టెన్త్‌ పరీక్షలు

Apr 5 2023 5:01 AM | Updated on Apr 5 2023 5:01 AM

Director of Government Examinations issued further instructions to the officers - Sakshi

సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ దేవానందరెడ్డి మంగళవారం అధికారులకు  పలు సూచనలు జారీచేశారు. పరీక్ష కేంద్రాల్లో అక్రమాలు, అవకతవకలు జరిగితే చీఫ్‌ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్, సి–సెంటర్‌ కస్టోడియన్‌లు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. 

పరీక్ష కేంద్రాలన్నీ నో మొబైల్‌ జోన్లుగా ప్రకటించిన నేపథ్యంలో పరీక్ష విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ మొబైల్‌ ఫోన్‌ ఇంట్లోనే ఉంచి రావాలి. లేదా సెంటర్‌లో పోలీస్‌ పికెట్‌ వద్ద అప్పగించాలి. 
ఒకసారి పరీక్ష కేంద్రంలోకి వచ్చిన సిబ్బంది పరీక్ష ముగిసేవరకు బయటికి రాకూడదు. అటెండర్లు, ఇతర సహాయకులు కూడా టీ, శీతల పానీయాలు వంటి అవసరాలకు కూడా బయటకు రాకూడదు.
పరీక్ష విధులు లేని ఉపాధ్యాయులు పరీక్ష జరిగే సమయంలో ఆ పరిసరాల్లో ఉండకూడదు.
 పరీక్ష కేంద్రాలుగా ఉన్న కె.జి.బి.వి., రెసిడెన్షియల్‌ పాఠశాలల ఉపాధ్యాయులు పరీక్ష విధులు లేకపోతే ఆ సమయంలో పాఠశాలలో ఉండకూడదు. 
   పరీక్ష కేంద్రంలో ప్రైవేట్‌ వ్యక్తులు ఎవరు ఉండకూడదు.
ప్రశ్నపత్రాలు, వాటిపై వదంతులు వాట్సాప్‌ గ్రూప్‌లలోగానీ, సామాజిక మాధ్యమాల్లోగానీ ప్రచారం చేయకూడదు.
♦ చీఫ్‌ సూపరింటెండెంట్లు పరీక్షకు హాజరుకాని అభ్యర్థుల ప్రశ్నపత్రాలను, మిగిలిన ప్రశ్నపత్రాలను ఉదయం 10 గంటలలోపు అకౌంట్‌ రాసి సీల్‌ చేయాలి. 
♦  ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి పరీక్షల చట్టం 25/97 ప్రకారం ఏడేళ్ల వరకు జైలుశిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement