Eenadu Ramoji Rao False Writings Over Encroachments Removed On Roads In AP, Facts Inside - Sakshi
Sakshi News home page

ఆక్రమణలు తొలగించినా సీఎం పైనే నెపం

Published Wed, Jun 28 2023 4:16 AM

False writings in eenadu paper  - Sakshi

సాక్షి, చిత్తూరు: రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆపాదించడం ఈనాడు పత్రికకు అలవాటుగా మా­రింది. రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగించా­లని ఆక్రమణదారులకు మునిసిపల్‌ కార్పొరేష­న్‌ అధికారులు చెబితే ‘సీఎం వస్తున్నారు.. దు­కాణాలు తొలగించాల్సిందే’ అంటూ ఈనాడులో వార్త ప్రచురించారు. చిత్తూరు – వేలూరు రోడ్డు­లో విజయా డెయిరీని ఆనుకుని పది దుకాణాలు వెలిసాయి.

నగర సుందరీకరణకు అడ్డుగా ఉన్నాయని, రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించాలని మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషన­ర్‌ అరుణ నిర్ణయించారు. ఇదే విషయాన్ని వ్యాపారులకు చెప్పారు. ఆక్రమణలు తొలగించాలని ఆదే­శించారు. వ్యాపారులు కూడా ఆ దుకాణాల­ను స్వచ్ఛందంగా తొలగించారు.

దీనిని వక్రీకరిస్తూ ఈనాడులో తప్పుడు కథనాన్ని అచ్చేశారు. సీఎం జిల్లా పర్యటనకు వస్తుండడంతో అధికారులు బలవంతంగా దుకాణాలను తీసేయిస్తు న్నారని రాసుకొచ్చారు. రోడ్డుపై ఆక్రమ­ణలు తొలగిస్తే సీఎం పర్యటనకు ఆపాదిస్తూ రాయడం మంచిదికాదని కమిషనర్‌ అరుణ అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement