Aruna
-
బిబిసి 100 విమెన్ 2024...నూరులో ఆ ముగ్గురు
ఎప్పటిలాగే 2024 సంవత్సరానికి కూడా ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రభావవంత మహిళలను బీబీసీ ఎంపిక చేసి ప్రకటించింది. వారిలో ముగ్గురు భారతీయ మహిళలు. సామాజిక కార్యకర్త అరుణా రాయ్ కుస్తీ యోధురాలు వినేష్ ఫొగట్ అనాథ శవాల అంతిమ సంస్కారాలు చేసే పూజా శర్మ... ఈ ముగ్గురి ఎంపిక ఎందుకో బీబీసీ ఇలా తెలిపింది.బి.బి.సి బి.బి.సి 2024 సంవత్సరానికి ‘బీబీసీ 100 విమెన్’ లిస్ట్ను విడుదల చేసింది. ప్రపంచ దేశాల నుంచి ఎంతో వడపోత తర్వాత ఈ 100 మందిని ఎంపిక చేయడం ఆనవాయితీ. పర్యావరణం, సంస్కృతి–విద్య, వినోదరంగం–క్రీడారంగం, రాజకీయరంగం, సైన్స్–హెల్త్ అండ్ టెక్నాలజీ విభాగల నుంచి సమాజం మీద విస్తృతమైన ప్రభావం ఏర్పరిచిన స్త్రీలను ఎంపిక చేసింది. వీరిలో వ్యోమగామి సునీతా విలియమ్స్, రేప్ సర్వైవల్ గిసెల్ పెలికట్, నటి షెరాన్ స్టోన్, ఒలింపిక్ అథ్లెట్ బెబాక అండ్రాడె, నోబెల్ శాంతి విజేత నాడియా మురాద్, రచయిత్రి క్రిస్టీనా రివెరా గర్జా తదితరులు ఉన్నారు. అలాగే మన దేశం నుంచి అరుణా రాయ్, వినేష్ ఫొగట్, పూజాశర్మలను ఎంపిక చేసింది. ‘ఓర్పు, పోరాట పటిమతో నిలబడి తమ తమ రంగాలలో, సమూహాలలో మార్పు కోసం కృషి చేస్తున్న ధీరలు వీరంతా’ అని బీబీసీ ఈ సందర్భంగా అంది. మన దేశం నుంచి ఎంపికైన ముగ్గురు ఎందుకు ఎంపికయ్యారు?పూజా శర్మÉì ల్లీకి 27 సంవత్సరాల పూజాశర్మ తల ఒంచక న్యాయం వైపు నిలబడి పోరాడటం వల్లే ముందుకు వెళ్లగలరు అని ఈ విధానం వినేష్‡కు ‘చనిపోయిన వ్యక్తిని సగౌరవంగా సాగనంపే సేవ’ చేయాలని తన జీవితంలోని సొంత విషాదం వల్ల గట్టిగా అనిపించింది. ఆమె సోదరుణ్ణి మూడేళ్ల క్రితం ఒక కొట్లాటలో చంపేశారు. ఆ గొడవ వల్ల అతని దహన కార్యక్రమాలకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు పూజాశర్మ తానే పూనుకొని దహన సంస్కారాలు చేసింది. ఇలాంటి సందర్భాలలోనే పేదరికం వల్ల, ప్రమాదాల వల్ల అనారోగ్యం వల్ల దహన సంస్కారాలకు నోచుకోని అనాథ శవాలను, దిక్కూమొక్కూ లేని శవాలను తానే గౌరవంగా సాగనంపాలని నిర్ణయించుకుంది. వెంటనే ‘బ్రైట్ ది సోలా ఫౌండేషన్’ స్థాపించి ఇప్పటికి వందల శవాలకు దహన సంస్కారాలు స్వయంగా నిర్వహించింది. ఇందుకు మొదట్లో కొంతమంది నుంచి విమర్శలు ఎదురైనా, ఇది ఆడవాళ్ల పని కాదు అని ఆమెను వారించినా, ఆమె చేసే పనులు సోషల్ మీడియా ద్వారా మద్దతు కూడగట్టుకున్నాయి. సేవారంగంలో ఎంతో మానవీయమైన ఆమె కృషికి నేడు దక్కిన గౌరవం బిబిసి 100లో చేరిక.అరుణా రాయ్అరుణా రాయ్ (74) తన జీవితం ఆరంభం నుంచి నేటి వరకూ అట్టడుగు వర్గాల జీవనమార్పు కోసం పోరాడుతూనే ఉన్నారు. ‘పెద్ద ముందంజలు కాదు... ఇరుగు పొరుగువారి చిన్న చిన్న ముందడుగులు అవసరం’ అనే ఆమె తన జీవితమంతా ఆదర్శాల కోసం నిలబడ్డారు. మద్రాసులో పుట్టి పెరిగిన అరుణ బాల్యం నుంచి ఛాందస భావాలను నిరోధించారు. తన 21 ఏళ్ల వయసులో 1967లో ఐ.ఏ.ఎస్ పరీక్ష రాసి ఎంపికయ్యారు. ఆ రోజుల్లో ఐ.ఏ.ఎస్ రాసే మహిళలే లేరు దేశంలో. 1967లో 10 మాత్రమే ఎంపికైతే వారిలో ఒకరు అరుణ. తమిళనాడులో కలెక్టర్గా పని చేసిన అరుణ గ్రామాలు బాగుపడాలంటే తన ఉద్యోగం పనికిరాదని అట్టడుగు వర్గాల చైతన్యం ముఖ్యమని, వారి ఆర్థిక స్వావలంబన తప్పదని భావించి ఉద్యోగానికి రాజీనామా చేసి తన భర్త సంజిత్ రాయ్తో కలిసి ‘బేర్ఫుట్ కాలేజ్’ స్థాపించి గ్రామీణుల కోసం పని చేశారు. ‘మజ్దూర్ కిసాన్ సంఘటన్’,‘నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్’ వీటన్నింటిలో ఆమెవి కీలక బాధ్యతలు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉనికిలోకి రావడానికి అరుణ కూడా ఒక కారణం. చైతన్యవంతమైన సమాజం, స్త్రీల హక్కుల కోసం ఆమె చేస్తున్న ఎడతెగని కృషే ఆమెను బీబీసీ 100 విమెన్కు చేర్చింది. -
Aruna Roy: 'ఈ పయనం సామాజికం'!
‘మహిళలు ఐఏయస్ కావడం కష్టం’ అనుకునే ఆ రోజుల్లో తొలి ప్రయత్నంలోనే ఐఏయస్ సాధించింది. ‘ఎంత పెద్ద ఉద్యోగమైనా సరే, ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడనప్పుడు ఆ ఉద్యోగం చేయడం వృథా’ అనుకొని ఉద్యోగాన్ని వదులుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చింది అరుణారాయ్. గ్రామీణ మహిళలతో కలిసి పోయి ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసింది. తాజా విషయానికి వస్తే... తన జ్ఞాపకాలను ‘ది పర్సనల్ ఈజ్ పొలిటికల్’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఉద్యమ ప్రయాణం గురించి...మనం పుట్టి, పెరిగిన వాతావరణం ఏదో రకంగా బలమైన ప్రభావం చూపుతుంది. కాలం కంటే కాస్త ముందుగా ఆలోచించే కుటుంబంలో చెన్నైలో పుట్టి పెరిగింది అరుణ. ‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’లో పోస్ట్–గ్రాడ్యుయేషన్ చేసింది.‘మహిళలు ఐఏఎస్కు సెలెక్ట్ కాలేరు’ అని బలంగా అనుకునే కాలంలో తొలి ప్రయత్నంలోనే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్ష రాసి ఎంపికైంది. సబ్–డివిజనల్ మెజిస్ట్రేట్ నుంచి ‘లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ దిల్లీ’ సెక్రెటరీ వరకు ఎన్నో పదవులు నిర్వహించినప్పటికీ తనలో ఏదో అసంతృప్తి ఉండేది. వ్యవస్థీకృతమైన అవినీతికి సంబంధించిన అసంతృప్తి అది. ఈ అసంతృప్తులు తారస్థాయికి చేరి ఉద్యోగానికి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఉద్యోగానికి ఆరు నెలలు సెలవు పెట్టి భర్త సంజిత్ రాయ్ నిర్వహిస్తున్న సోషల్ వర్క్ రిసెర్చ్ సెంటర్(బేర్ఫుట్ కాలేజీ)లో చేరింది. రాజస్థాన్లోని తిలోనియ గ్రామంలో ఉన్న ‘బేర్ఫుట్ కాలేజీ’లో పనిచేయడం అరుణకు ఎంతో సంతృప్తి ఇచ్చింది. ఉద్యోగానికి రాజీనామా చేసి సేవాపథంలోకి వచ్చింది.గ్రామాల్లో విద్యుత్ సరఫరా, తాగు నీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం... మొదలైనవి లేని కాలం అది. కిలోమీటర్ల కొద్దీ దూరం నడవాల్సి వచ్చేది. అయితే ఈ అసౌకర్యాలేవీ ఎప్పుడూ అరుణకు కష్టంగా అనిపించలేదు. మహిళలు ఒక బృందంగా ఏర్పడి గ్రామ అభివృద్ధికి పాటుపడేలా కృషి చేసింది. కెన్యాలో జరిగే అంతర్జాతీయ మహిళా సదస్సుకు ఆహ్వానం అందినప్పటికీ అక్కడికి వెళ్లకపోగా దానికి ప్రత్యామ్నాయంగా రాజస్థాన్లో మహిళా మేళ (మహిళల పండగ) నిర్వహించింది. కెన్యాలో జరిగే అంతర్జాతీయ మహిళా సదస్సుకు, ఈ స్థానిక సదస్సుకు తేడా ఏమిటంటే... మొదటి దానిలో మధ్యతరగతి, ఆ పై తరగతి విద్యాధికులైన మహిళలే ఎక్కువగా పాల్గొనే సదస్సు. ఇక రెండోది పూర్తిగా గ్రామీణ మహిళలు, శ్రామిక మహిళల కోసం నిర్వహించిన సదస్సు. ఈ తరహా పండగ జరగడం దేశంలో మొదటిసారి.‘మహిళ మేళ’ ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక–రాజకీయ చర్చలకు వేదిక అయింది. మహిళలపై జరిగే హింసను నిరోధించడానికి జరిగిన తొలి బహిరంగ చర్చావేదిక అయింది. ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన అరుణారాయ్ బాల్య వివాహాలకు, మూఢనమ్మకాలకు, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడింది. ‘మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్’ ఆర్గనైజేషన్ ద్వారా సోషల్ యాక్టివిస్ట్గా మరింత క్రియాశీలంగా పనిచేయడం ్రపారంభించింది.స్థూలంగా చెప్పాలంటే... అరుణా రాయ్ అంటే ఒక నామం కాదు. అనేకానేక ఉద్యమాల సమాహారం. సమాజహితాన్ని కోరుకునే వారికి స్ఫూర్తిదాయక ఉత్తేజం.పేద మహిళల కోసం...‘జ్ఞానం యొక్క ఉద్దేశం జ్ఞానం కాదు. కార్యాచరణ’ అంటాడు అరిస్టాటిల్. జ్ఞానం అనేది బుర్రలో భద్రపరుచుకొని మురిసిపోవడానికి కాదు. ఆ జ్ఞాన ఫలాలను ఆచరణలోకి, పదిమంది ఉపయోగంలోకి తీసుకురావడం ముఖ్యం. విశ్వవిద్యాలయాల నుంచి మారు మూల పల్లెల వరకు జ్ఞానమార్గంలో పయనించిన అరుణా రాయ్ ఆ జ్ఞానాన్ని పేద మహిళల సంక్షేమం, చైతన్యం కోసం వినియోగించింది. ఉద్యోగ, ఉద్యమ జ్ఞాపకాల ‘ది పర్సనల్ ఈజ్ పొలిటికల్’ ఆమె వ్యక్తిగతం కాదు. సామాజికం. ఉద్యమ బాటలో పయనించడానికి ఉపకరించే ఇంధనం. -
సినిమాల్లోకి ఒకప్పటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీ?
ముచ్చెర్ల అరుణ.. అచ్చ తెలుగింటి ఆడపడుచు. తన సినీప్రయాణం మొదలైంది మాత్రం తమిళ సినిమాతోనే! 1980లో కళుక్కుల్ ఈరమ్ అనే సినిమాతో హీరోయిన్గా మారింది. అక్కడ పదుల సంఖ్యలో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాక తెలుగు ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది. అలా రావుగారి ఇంట్లో రౌడీ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది. బిజినెస్మెన్తో పెళ్లి ఆమె హీరోయిన్గా నటించిన సీతాకోక చిలుక మూవీ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది. ఈ కథానాయిక 1987లో బిజినెస్మెన్ మోహన్ను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదు అని ఆయన కండీషన్ పెట్టాడట! దానికి ఒప్పుకునే పెళ్లి చేసుకుంది. వీరికి నలుగురు ఆడపిల్లలు. భర్తకు ఇచ్చిన మాట ప్రకారం ఇండస్ట్రీకి దూరమైంది. అలా ఆమె సినిమాలకు దూరమై దాదాపు పాతికేళ్లవుతోంది. ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్లో వంటలు చేస్తూ, రీల్స్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా ఓ నగల దుకాణానికి వెళ్లిన ఆమెకు రీఎంట్రీ గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై అరుణ మాట్లాడుతూ.. ప్రస్తుతానికైతే నేను ఏ సినిమా చేయడం లేదు. ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండటాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ రీల్స్ చేస్తూ కాలక్షేపం చేయడం బాగుంది. ఇదే కంటిన్యూ చేస్తాను. నా కూతుర్లు బిజీగా ఉండటంతో నా వీడియోలు తీయడం లేటవుతోంది. వీడియోల కోసం ప్రత్యేకంగా రెడీ అవడం, మేకప్ లాంటివేమీ ఉండదు. ఫోన్లోనే చాలా సహజంగా వీడియోలు చేస్తుంటాను. నాకిది చాలనిపిస్తోంది. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను' అని అరుణ చెప్పుకొచ్చింది. చదవండి: 18 ఏళ్ల వయసులో అలా చెప్పా.. ముద్దు సీన్పై అనుపమ రియాక్షన్ -
వివాహానికి హాజరై తిరిగొస్తుండగా..
శ్రీపొట్టి శ్రీరాములు: రోడ్డు ప్రమాదం పెళ్లింట అంతులేని విషాదాన్ని నింపింది. వివరాలు.. కందుకూరు పట్టణంలోని విప్ప గుంటలో నివాసముంటున్న రాయని అరుణ (50), రమణయ్య భార్యాభర్తలు. రమణయ్య సుమారు 20 ఏళ్ల క్రితం భార్యతో విభేదించి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆమె కోవూరు రోడ్డులో టిఫిన్ దుకాణాన్ని నిర్వహించుకుంటూ తన ఇద్దరి పిల్లలను పెంచి పెద్ద చేశారు. ఈ క్రమంలో కుమార్తె స్రవంతికి తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన అశేష్ అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది. పాల్వంచలోని వరుడి ఇంట్లో బుధవారం రాత్రి ఘనంగా పెళ్లి జరిగింది. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో అరుణతో పాటు కుమారుడు వేణుగోపాల్, మేనల్లుడు వినోద్, అతని భార్య తల్లపనేని దివ్య (30), వారి కుమారుడు మణి, మరో బంధువు గుళ్లాపల్లి శ్రావణి (22) కలిసి కారులో కందుకూరు బయల్దేరారు. వాహనాన్ని వేణుగోపాల్ నడిపారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో సూరారెడ్డిపాళెం వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టింది. ప్రమాదంలో అరుణ, దివ్య, శ్రావణి అక్కడికక్కడే మృతి చెందగా.. వేణుగోపాల్, వినోద్, మణి తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు. అంతలోనే.. అప్పటి వరకు పెళ్లిలో ఆనందంగా గడిపిన వారు అంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లి, బంధువులు రోడ్డు ప్రమాదంలో మరణించారనే వార్త తెలిసి కొత్త పెళ్లి కూతురు స్రవంతి కన్నీరుమున్నీరయ్యారు. దివ్య భర్త వినోద్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఆమె భర్త, తన ఐదేళ్ల కుమారుడు మణితో కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. మేనత్త కుమార్తె వివాహం కావడంతో వినోద్ కుటుంబంతో కలిసి రెండు రోజుల క్రితమే కందుకూరొచ్చారు. అయితే ఊహించని ప్రమాదంలో దివ్య మృతి చెందారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా.. పెళ్లి కోసమే హైదరాబాద్ నుంచి వచ్చిన శ్రావణి మృతి చెందడం తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మికి మింగుడు పడని ఘటనగా మారింది. శ్రావణి కుటుంబం చాలా కాలంగా హైదరాబాద్లో ఉంటోంది. డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. స్రవంతి పెళ్లి కోసమని శ్రావణి కందుకూరు వచ్చారు. ఇక స్రవంతి సొంత అన్న వేణుగోపాల్ కొద్దిరోజులుగా పెళ్లి పనులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. విశ్రాంతి తీసుకోకుండా అర్ధరాత్రి కారు డ్రైవింగ్ చేస్తూ రావడం.. నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని బంధువులు చెబుతున్నారు. అటు తల్లిని కోల్పోయి, ఇటు అన్న హాస్పిటల్ పాలవడంతో స్రవంతి రోదన వర్ణానాతీతంగా ఉంది. మృతదేహాలను గుర్రవారంపాళెం సమీపంలోని శ్మశానంలో ఖననం చేశారు. అక్కడికి పెద్ద ఎత్తున బంధువులు చేరుకున్నారు. ఇవి చదవండి: కట్టేసి, కారం చల్లి.. -
ఎంవీఎస్ కాలేజ్ లో ని మార్నింగ్ వాకర్స్ తో డీకే అరుణ ప్రచారం
-
జనసేన మహిళా నేతపై దాడి
ఒంగోలు టౌన్ : జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మీద అదే పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు రియాజ్ వర్గం దాడికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం దాసరివారిపాలెం కనపర్తిల వద్ద జరిగిన ఈ ఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది. బాధితురాలు అరుణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన రాయపాటి అరుణ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం నాగులుప్పలపాడు మండలంలోని ఎన్జీపాడు, వినోదరాయునిపాలెం, అమ్మనబ్రోలు, దాసరిపాలెం, కనపర్తి గ్రామాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. రాత్రి 9 గంటల సమయంలో తిరుగు ప్రయాణంలో దాసరివారిపాలెం గ్రామ శివారు వద్దకు రాగానే జనసేన జిల్లా అధ్యక్షుడైన షేక్ రియాజ్ అనుచరులు ఒంగోలుకు చెందిన చెనపతి రాంబాబు, ఆరిగ శివ, షాలు, చిట్టెం ప్రసాద్, పల్లి రాజేష్, ముత్యాల కళ్యాణ్ రియాజ్ ప్రోత్సాహంతో కారును అడ్డగించారు. కారులో ఉన్న అరుణ అనుచరుడైన చరణ్ను బయటకు లాగి కొట్టారు. ఈ దాడి నుంచి చరణ్ తప్పించుకుని తిరిగి కారులో బయలు దేరినా విడిచిపెట్టకుండా రియాజ్ అనుచరులు కారును వెంబడించారు. కనపర్తి గ్రామం వద్ద అటకాయించారు. మహిళ అని కూడా చూడకుండా ఛాతిపై చెయ్యివేసి గుండెల మీద బలంగా పిడి గుద్దులు గుద్దారు. అదే కారులో ఉన్న ఉప్పుగుండూరుకు చెందిన జనసేన నాయకుడు బాలిశెట్టి నాగేశ్వరరావు అడ్డుపడగా చిట్టెం ప్రసాద్ ఆయనపై కర్రలతో దాడి చేసి కొట్టారు. ఈ దాడిలో అతడి తల పగిలి రక్త స్రావం కావడంతో స్థానికుల సాయంతో బయట పడ్డారు. అక్కడి నుంచి తప్పించుకున్న అరుణ నేరుగా ఒంగోలు జీజీహెచ్కు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అరుణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడి విషయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినా పొత్తులతో బిజీగా ఉన్నామని, ఎన్నికలయ్యాక చూద్దాంలే అని తేలిగ్గా తీసుకున్నట్టు సమాచారం. -
సమాజాన్ని అద్దంలో చూపించాను
‘దేర్ ఐ వజ్, మీడియా మ్యూజింగ్స్’ పేరుతో తన జర్నలిస్ట్ జీవితాన్ని పాఠకుల ముందు ఆవిష్కరించారు అరుణా రవికుమార్. ముప్ఫై ఎనిమిదేళ్ల కిందట ‘అరుణా అశోకవర్ధన్’ పేరుతో తొలిసారి బైలైన్ చూసుకోవడం నుంచి నేటి వరకు సాగిన అక్షరయానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘నేను మీడియా రంగంలోకి రావడమే ఒక ఆశ్చర్యం. నా చదువు ఇంగ్లిష్ మీడియంలో, గ్రాడ్యుయేషన్ సైన్స్లో సాగింది. అమ్మ రచయిత కావడంతో తెలుగు సాహిత్యం మీద అభిరుచి మెండుగా ఉండేది. నా లక్ష్యం సివిల్స్. ప్రిలిమ్స్ క్లియర్ అయింది. మెయిన్స్ పరీక్షల నాటికి తాతగారు పోవడంతో రాయలేకపోయాను. ఆ తర్వాత అనుకోకుండా ఓ ఇంగ్లిష్ పత్రికలో జర్నలిస్టుగా చేరాను. నా తొలి రిపోర్టింగ్ జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్ రిపోర్ట్ మీద. బై లైన్తో వచ్చింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లు, ప్రపంచ విజేతనైన భావన. అలా మొదలైన నా జర్నీ ఎలక్ట్రానిక్ మీడియాకు మారింది. తెలుగులో ప్రైవేట్ టీవీ రంగంలో రిపోర్టర్ బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళను. పెళ్లి చేసుకున్న తర్వాత విజయవాడకు బదిలీ కావడం కూడా చాలా కీలకమైన అనుభవాన్నిచ్చింది. అది 1988, మార్చి నెల పదవ తేదీ. విజయవాడ వెళ్లిన తొలి రోజు, దేవినేని మురళి హత్య. సూపర్ మార్కెట్లో ఉన్నాను. ఓ కుర్రాడు పరుగున లోపలికి వచ్చి షట్టర్ వేసేశాడు. భయం కలిగినప్పటికీ నిబ్బరంగా ఉండిపోయాను. ఓ అరగంట తర్వాత షట్టర్ తీశారు. రోడ్డు మీదకు వస్తే... అంతకు ముందు ఏమీ జరగనట్లు తుపాను తర్వాత ప్రశాంతతలా ఉంది వాతావరణం. జర్నలిస్టుగా కొత్త ప్రపంచాన్ని చూశాను. చీరాలలో చేనేతకారుల ఆకలి చావులను రిపోర్ట్ చేయగలిగాను. సమాజంలో వేళ్లూనికొని ఉన్న ఆవేదనలు, ఆందోళనలకు అద్దం పట్టాను. ఛత్తీస్ఘడ్లో మావోయిస్టు సాంబశివుడి ఇంటర్వ్యూ చేశాను. ఎలిమినేటి మాధవరెడ్డి గారి హత్యకు కొద్దిగా ముందు ఆయనతోపాటు వారి వాహనంలోనే ప్రయాణించాను. అప్పటికే రెక్కీ నిర్వహించి హత్యకు ప్రణాళిక సిద్ధంగా ఉందని ఆ తర్వాత నాకు తెలిసింది. బళ్లారిలో ఎన్నికలను కవర్ చేశాను. భ్రూణహత్యల మీద పరిశోధనాత్మక కథనాలకు యూనిసెఫ్ అవార్డు వచ్చింది. స్టూడియో లో ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల ఇంటర్వ్యూలు ఎన్ని చేసినప్పటికీ క్షేత్రస్థాయి పరిశీలనా కథనాలు ఎక్కువ సంతోషాన్నిస్తాయి. ఫ్లోరోసిస్ బాధితుల కథనాలకు స్పందనగా ప్రభుత్వాలు నీటి సౌకర్యాన్ని కల్పించడం రిపోర్టర్గా నాకు అత్యంత సంతోషాన్నిచ్చిన సందర్భం. లంబాడా తండాల్లో ఆడపిల్లలను పుట్టగానే చంపేయడం, కుటుంబాన్ని పోషించడానికి ఓ మహిళ మూడుసార్లు సరోగసీ ద్వారా బిడ్డను కని అనారోగ్యం పాలు కావడం వంటి కథనాలెన్నింటికో నేను అక్షరసాక్షిని కావడం ద్వారా నాకు ఈ రంగం ఎంతో సంతృప్తినిచ్చింది. మా వారి బదిలీల రీత్యా, పిల్లలు పుట్టినప్పుడు, వాళ్ల చదువులు కీలక దశల్లో ఉన్నప్పుడు కెరీర్లో విరామాలు తీసుకుంటూ నా వృత్తిని కొనసాగిస్తున్నాను. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద ‘మరాడర్స్ ఆఫ్ హోప్’ నా తొలి రచన. ‘దేర్ ఐ వజ్, మీడియా మ్యూజింగ్స్’ నా రెండవ రచన. ఇండిపెండెంట్ జర్నలిస్టుగా హైదరాబాద్లో ప్రశాంతంగా జీవిస్తున్నాను. ఇప్పటికీ రోజూ చదువుతాను, రాస్తుంటాను. మహిళ ఎన్ని సాధించినప్పటికీ సమాజంలో సమానత్వం మాత్రం పూర్తిస్థాయిలో రాలేదనే చెప్పాలి. అయితే నా చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పట్లో సమాజంలో స్త్రీ–పురుషుల మధ్య అసమానత్వం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అంత తీవ్రంగా లేదు. కానీ సమానత్వం మాత్రం ఇంకా రాలేదు’’ అంటూ తన అక్షరయానం గురించి వివరించారు అరుణ. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి; ఫొటో: అనిల్కుమార్ మోర్ల -
మహిళలపై దాడి చేసినా పట్టించుకోరా?
ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ నడి బొడ్డున టవర్ సర్కిల్లో ఇద్దరు మహిళలపై నలుగురు హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై పోలీసుల నిర్లక్ష్యం విమర్శలపాలవుతోంది. బాధితులు ఫిర్యాదుపై కనీసంగా పట్టించుకోకపోవడం, నలుగురు నిందితులను కనీసం విచారించకుండా వదిలేయడం వివాదాస్పదమవుతోంది. ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ కెనాల్పై నివాసం ఉండే శివరాత్రి అరుణ, వింజ శోభ వరసకు అక్కా చెల్లెళ్లు. వీరిద్దరూ ఇళ్లలో కూలీ పనులు ముగించుకుని నడుచుకుంటూ తమ ఇళ్లకు వెళ్తుండగా వారి సామాజిక వర్గానికే చెందిన సంపంగి రమేష్, సంపంగి గణేశ్, సంపంగి బబ్లు, సంపంగి నాగమణి రాళ్లతో దాడి చేశారు. పాత కక్షల నేపథ్యంలో జరిగిన దాడిలో అరుణ తల పగిలి రక్తం కారడంతో తల్లి యాదమ్మ సహాయంతో ఆర్మూర్ పోలీస్ స్టేషన్కు పరిగెత్తుకొని వెళ్లారు. వెంటనే పోలీసులు బాధిత మహిళలిద్దరినీ చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించి ఘటనా స్థలానికి వెళ్లి దాడికి పాల్పడిన నలుగురిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత వారిని వదిలి వేయడంపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని తిరిగి పోలీస్ స్టేషన్కు బాధిత మహిళలు వచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. గత రెండు రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోకపోగా.. ఇదే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్సై ఏకంగా మీపైనే కేసు పెడతాం అంటూ తమనే బెదిరించారని బాధిత మహిళలు చెబుతున్నారు. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ప్రచారం చేస్తుండగా ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో మాత్రం నిరుపేద మహిళలపై దాడి చేసిన వారిని కేసులు పెట్టడానికి కూడా పోలీసులు మీనమేషాలు లెక్కించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా ఎఫ్ఐఆర్ ఎందుకంటే: సురేష్ బాబు, ఎస్హెచ్వో, ఆర్మూర్ ’’ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఇతర కేసుల ఒత్తిడిలో ఇద్దరు మహిళలపై దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆలస్యం అయింది. దాడి చేసిన నలుగురిపై శుక్రవారం రాత్రి 324 సెక్షన్ కేసు నమోదు చేశాము. బాధిత మహిళలపై సైతం కౌంటర్ కేస్ ఫైల్ చేశాము.’ -
ఆక్రమణలు తొలగించినా సీఎం పైనే నెపం
సాక్షి, చిత్తూరు: రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆపాదించడం ఈనాడు పత్రికకు అలవాటుగా మారింది. రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని ఆక్రమణదారులకు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు చెబితే ‘సీఎం వస్తున్నారు.. దుకాణాలు తొలగించాల్సిందే’ అంటూ ఈనాడులో వార్త ప్రచురించారు. చిత్తూరు – వేలూరు రోడ్డులో విజయా డెయిరీని ఆనుకుని పది దుకాణాలు వెలిసాయి. నగర సుందరీకరణకు అడ్డుగా ఉన్నాయని, రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించాలని మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ నిర్ణయించారు. ఇదే విషయాన్ని వ్యాపారులకు చెప్పారు. ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. వ్యాపారులు కూడా ఆ దుకాణాలను స్వచ్ఛందంగా తొలగించారు. దీనిని వక్రీకరిస్తూ ఈనాడులో తప్పుడు కథనాన్ని అచ్చేశారు. సీఎం జిల్లా పర్యటనకు వస్తుండడంతో అధికారులు బలవంతంగా దుకాణాలను తీసేయిస్తు న్నారని రాసుకొచ్చారు. రోడ్డుపై ఆక్రమణలు తొలగిస్తే సీఎం పర్యటనకు ఆపాదిస్తూ రాయడం మంచిదికాదని కమిషనర్ అరుణ అన్నారు. -
రాజకీయాల్లోకి వస్తానని కలలో కూడా అనుకోలేదు..
సాక్షి,బళ్లారి: ఇంటి ఆడచులా భావించి తనను గెలిపించాలని కేఆర్పీపీ బళ్లారి నగర అభ్యర్థిని గాలి లక్ష్మీ అరుణ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం ఆఖరి రోజైన సోమవారం ఆమె నగరంలో పలు వార్డులో సుడిగాలి పర్యటన చేశారు. నా పేరు గాలి లక్ష్మీ అరుణ, ఈవీఎంలో నా క్రమ సంఖ్య–8, ఇది అష్టలక్ష్మీలకు సంకేతం, తనను గెలిపిస్తే ప్రతి ఇంటా సమస్యలు తీర్చేందుకు అష్టలక్ష్మీల ఆశీర్వాదం ఉంటుందని ఓటర్లకు సూచించారు. 30 సంవత్సరాల క్రితం గాలి జనార్దనరెడ్డి సతీమణీగా బళ్లారికి వచ్చానని, ఇంటికి పరిమితమైన తాను రాజకీయాల్లోకి వస్తానని కలలో కూడా అనుకోలేదన్నారు. ఎమ్మెల్యే కావాలనుకుంటే భర్త గాలి జనార్దనరెడ్డి ప్రోత్సాహంతో ఎప్పుడో అసెంబ్లీలోకి కాలుపెట్టే భాగ్యం కలిగేదన్నారు. రాజకీయ కుట్రతో తన భర్తను 12 సంవత్సరాలు వనవాసం చేయించారని, ఆయన ఆశయ సాధనలు, బళ్లారి ప్రజల కన్నీరు తుడిచేందుకు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం అనివార్యమైందన్నారు. తమ కుటుంబానికి భగవంతుడు అన్ని ఐశ్యర్యాలు ఇచ్చారన్నారు. ఒక రూపాయి కూడా ప్రజాధనాన్ని తాము తీసుకోకుండా ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. మీ ఆశీస్సులు అందించి ఫుట్బాల్ గుర్తుకు ఓటెసి గెలిపించాలని అభ్యర్థించారు. ఆయా కాలనీల్లో ఆమెకు జనం బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో కేఆర్పీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ.వీ. శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దనరెడ్డి కుమార్తె బ్రహ్మణీ, కార్పొరేటర్లు కే.ఎస్ ఆశోక్,కోనంకి తిలక్, మాజీ మేయర్ వెంకటరమణ, నాయులు సంజయ్ బెటగేరి పాల్గొన్నారు. -
కర్ణాటకలో కొత్త పార్టీని స్థాపించిన గాలి జనార్దన్ రెడ్డి..
-
టీడీపీ నేత గోడి అరుణకు పార్టీలో లైంగిక వేధింపులు.. రాజీనామా ప్రకటన
మధురవాడ (భీమిలి) : తెలుగుదేశం పార్టీలోని కర్నూలు జిల్లా డోన్కు చెందిన ఓ నాయకుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని, అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడని, ఆ విషయాన్ని పార్టీలోని కీలక నేతలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గోడి అరుణ వెల్లడించారు. విశాఖలోని మధురవాడకు చెందిన తాను పదేళ్ల నుంచి పార్టీకి సేవలందిస్తున్నానన్నారు. బీసీ మహిళా నాయకురాలినైన తనకే ఈ పరిస్థితి ఎదురైందని, టీడీపీలో మహిళలకే కాదు.. మహిళా నాయకురాళ్లకు కూడా రక్షణ కరువైందని పేర్కొన్నారు. మంగళవారం ఆమె మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీలో చురుగ్గా ఉంటున్న తనను కర్నూలుకు చెందిన నేత ఏడాది నుంచి లైంగికంగా వేధిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడన్నారు. ఆ నేత లైంగిక వేధింపులు తాళలేక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితతోపాటు మరికొందరు ముఖ్య నాయకులకు పలుమార్లు ఫిర్యాదు చేశానని తెలిపారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదన్నారు. పైగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత, ఇతర నేతలు తనను వేధిస్తున్న వ్యక్తికే కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. టీడీపీలో ఈ నేతల వైఖరితో మనస్తాపం చెంది రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం అరుణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. మరోవైపు అరుణ పార్టీ నియమావళికి వ్యతిరేకంగా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందున ఆమెను పార్టీ పదవి నుంచి తొలగించినట్టు టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. -
స్త్రీ శక్తి: మడమ తిప్పలేదు... అడుగు ఆపలేదు
పౌరహక్కుల నుంచి పర్యావరణం వరకు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. జాత్యహంకార బెదిరింపులు ఎన్ని ఎదురైనా ధైర్యమే వజ్రాయుధంగా ముందుకు కదిలారు. కొత్త అడుగుతో చరిత్ర సృష్టించారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన మన వాళ్ల గురించి.. అరుణా మిల్లర్ మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా గెలిచిన అరుణా మిల్లర్ హైదరాబాద్లో పుట్టింది. భారత సంతతికి చెందిన వ్యక్తి లెఫ్టినెంట్ గవర్నర్ కావడం ఇదే మొదటిసారి. ఈ విషయంలో అరుణ చరిత్ర సృష్టించింది. మేరీలాండ్కు తొలి భారతీయ–అమెరికన్ డెలిగేట్గా తన ప్రత్యేకత చాటుకుంది. మిస్సోరీ యూనివర్శిటీలో సివిల్ ఇంజనీరింగ్ చేసిన అరుణ ట్రాన్స్పోర్టేషన్ ప్లానర్గా, ట్రాఫిక్ ఇంజనీర్గా వివిధ ప్రాంతాలలో పనిచేసింది. మిస్సోరీ ఫైర్బ్రాండ్గా గుర్తింపు పొందిన అరుణ ఆరోగ్య సంరక్షణ నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు ఎన్నో కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించింది. పరిమళా జయపాల్ పరిమళా జయపాల్ యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ)కు ఎంపికైన తొలి భారతీయ–అమెరికన్ మహిళ. తాజాగా 7వ డిస్ట్రిక్ట్(వాషింగ్టన్) నుంచి ప్రతినిధుల సభకు ఎంపికైంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి క్లిఫ్మూన్పై విజయం సాధించింది. చెన్నైలో పుట్టిన పరిమళా జయపాల్ ఇండోనేషియా, మలేసియాలో పెరిగింది. తల్లి రచయిత్రి. తండ్రి మార్కెటింగ్ రంగంలో పనిచేశారు. పదహారు సంవత్సరాల వయసులో అమెరికాకు వెళ్లింది పరిమళ. జార్జ్టౌన్ యూనివర్శిటీ నుంచి బీఏ, కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టాలు పుచ్చుకుంది. చదువు పూర్తయిన తరువాత ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో ఫైనాన్షియల్ ఎనలిస్ట్గా పనిచేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ముందు పౌరహక్కుల ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసింది. ‘హేట్ ఫ్రీ జోన్’ అనే సంస్థను ప్రారంభించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. పరిమళ మంచి రచయిత్రి కూడా. ‘పిల్గ్రిమేజ్: వన్ వుమెన్స్ రిటర్న్ టు ఏ ఛేంజింగ్ ఇండియా’ అనే పుస్తకం రాసింది. ‘నువ్వు మీ దేశానికి వెళ్లి పో’ అంటూ ఆమెకు ఎన్నోసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఆమె వాటిని ఎప్పుడూ ఖాతరు చేయలేదు. వెనక్కి తగ్గలేదు. నబీలా సయ్యద్ అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఇల్లినాయి జనరల్ అసెంబ్లీకి ఎన్నిక కావడం ద్వారా 23 ఏళ్ల ఇండియన్–అమెరికన్ నబీలా సయ్యద్ చరిత్ర సృష్టించింది. డెమోక్రటిక్ పార్టీకి చెందిన నబీలా 51వ డిస్ట్రిక్ట్లో రిపబ్లిక్ పార్టీకి చెందిన క్రిస్ బోస్పై ఘన విజయం సాధించింది. ఇల్లినాయి రాష్ట్రంలోని పాలై్టన్ విలేజ్లో పుట్దింది నబీలా. హైస్కూల్ రోజుల నుంచి ఉపన్యాస పోటీల్లో చురుగ్గా పాల్గొనేది. వాటి ద్వారా రకరకాల సామాజిక విషయాలను లోతుగా తెలుసుకునే అవకాశం వచ్చింది. కాలేజిలో ఎన్నో చర్చావేదికల్లో పాల్గొనేది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పొలిటికల్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లలో పట్టా పుచ్చుకుంది. స్త్రీ సాధికారత, హక్కులకు సంబంధించి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనే నబీలా ఉద్యోగం కంటే ఉద్యమాలకే ప్రాధాన్యత ఇచ్చేది. ఈ క్రమంలోనే రాజకీయాలకు దగ్గరైంది. ‘ఎమిలీస్ లిస్ట్’తో కలిసి పనిచేసింది. ఎమిలీస్ లిస్ట్ అనేది డెమోక్రటిక్ మహిళా అభ్యర్థులు చట్ట సభకు ఎన్నిక కావడానికి ఉపకరించే పొలిటికల్ యాక్షన్ కమిటీ.‘నా విజయానికి ప్రధాన కారణం తమ తరపున పోరాడే, బలంగా గొంతు వినిపించే వ్యక్తిని ప్రజలు తమ ప్రతినిధిగా చట్టసభకు పంపాలనుకోవడం. వారి నమ్మకాన్ని నిలబెడతాను’ అంటోంది నబీలా.ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి తలుపు తట్టిన నబీలా తనను గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి మళ్లీ ఇంటింటికీ వెళ్లనుంది. -
అమెరికాలో కొత్త చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ
వాషింగ్టన్: తెలుగు మహిళ కాట్రగడ్డ అరుణ మిల్లర్ (58) అమెరికాలో చరిత్ర సృష్టించారు. దేశంలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో మేరీలాండ్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ అమెరికన్గా రికార్డుకెక్కారు. డెమొక్రాటిక్ పార్టీ తరఫున అరుణ రికార్డు మెజార్టీతో గెలిచారు. రిపబ్లికన్ పార్టీ అనుకూల వర్గాలూ ఆమెకే మద్దతివ్వడంతో గెలుపు సులభమైంది. అమెరికాలో రాష్ట్రస్థాయిలో గవర్నర్ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ పదవి అత్యంత కీలకం. రవాణా ఇంజనీర్గా సేవలు కాట్రగడ్డ అరుణ మిల్లర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామం. ఆమె 1964 నవంబర్ 6న జన్మించారు. తల్లిదండ్రులు, సోదరుడు, సోదరితో కలిసి 1972లో అమెరికా చేరుకున్నారు. తండ్రి కాట్రగడ్డ వెంకటరామారావు ఐబీఎం సంస్థలో మెకానికల్ ఇంజనీర్గా పనిచేశారు. న్యూయార్క్లో ప్రాథమిక విద్య అనంతరం అరుణ ‘మిస్సౌరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’లో సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తిచేశారు. 1990లో మేరీల్యాండ్లోని మాంట్గొమెరీ కౌంటీకి మారారు. అక్కడే తన కళాశాల మిత్రుడు డేవిడ్ మిల్లర్ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు మీనా, క్లోయి, సాషా ఉన్నారు. అరుణ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీర్గా పనిచేశారు. 2000లో అమెరికా పౌరసత్వం లభించింది. 2010 నుంచి 2018 దాకా మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్లో డిస్ట్రిక్ట్ 15కి ప్రాతినిధ్యం వహించారు. 2018లో అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)కు పోటీపడి ఓడారు. ‘‘మేరీల్యాండ్ను అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి నావంతు కృషి చేస్తా. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తూ నన్ను గెలిపించి, ప్రజాస్వామ్య వ్యవస్థలో చిన్న రాష్ట్రం కూడా అద్భుతం సృష్టిస్తుందని ఈ ఎన్నికతో ప్రజలు నిరూపించారు’’ అని అరుణ మిల్లర్ చెప్పారు. రిపబ్లికన్ల ఆధిక్యం మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్ష రిపబ్లికన్లు స్వల్ప ఆధిక్యం కనబరుస్తున్నారు. మొత్తం 435 స్థానాలున్న ప్రతినిధుల సభలో కడపలి వార్తలు అందే సమయానికి 202 స్థానాలు గెలుచుకున్నారు. అధికార డెమొక్రటిక్ పార్టీకి 184 స్థానాలు దక్కాయి. మ్యాజిక్ ఫిగర్ 218 సీట్లు. సెనేట్లో 35 స్థానాలకు ఎన్నికలు జరగ్గా రిపబ్లికన్లు 19 , డెమొక్రాట్లు 12 సీట్లు నెగ్గారు. కడపటి వార్తలందేసరికి ఈ రెండు పార్టీలకూ సెనేట్లో చెరో 48 సీట్లున్నాయి. 36 గవర్నర్ పదవుల్లో రిపబ్లికన్లకు 16, డెమొక్రాట్లకు 15 దక్కాయి. ఐదింటి ఫలితాలు రావాల్సి ఉంది. ఐదుగురు భారత అమెరికన్ల విజయం వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభకు ఐదుగురు భారత–అమెరికన్లు ఎన్నికయ్యారు. వీరంతా అధికార డెమొక్రాటిక్ పార్టీ తరఫున నెగ్గడం విశేషం. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెషనల్ జిల్లాల నుంచి రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, అమీ బేరా, ప్రమీలా జయపాల్, థానేదార్ ప్రతినిధుల సభలో అడుగు పెట్టనున్నారు. -
ఎంఐఎం తరపున గెలిచిన అరుణ
భోపాల్: ఎంఐఎం పార్టీ తరపున ఓ హిందూ అభ్యర్థి మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందడం అక్కడి రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఊహించని రీతిలో ఓ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపి గెలుపు అందుకుంది ఆ పార్టీ. స్వయానా మంత్రే దగ్గరుండి అక్కడి ప్రచార బాధ్యతలను చూసుకున్నా.. ఆమె గెలుపును ఆపలేకపోయారు. తన విజయానికి గానూ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. హామీలను నెరవేరుస్తానంటోంది అరుణ ఉపాధ్యాయ. మొట్టమొదటిసారి మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఎంఐఎం. మొదటి ఫేజ్లో నాలుగు చోట్ల సంచలన విజయం సాధించింది. ఆయా చోట్ల బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించారు ఎంఐఎం అభ్యర్థులు. ఇప్పుడు రెండో ఫేజ్లోనూ ఏడు స్థానాల్లో పోటీ చేస్తే.. మూడు స్థానాలు కైవసం చేసుకుంది. అందులో ఖార్గావ్ మున్సిపల్ స్థానం విజయం ప్రత్యేకంగా నిలిచింది. ఈ మున్సిపాలిటీలో వార్డు నెంబర్ 2లో పోటీకి దిగింది గృహిణి అయిన అరుణ శ్యామ్ ఉపాధ్యాయ. ఆమె భర్త శ్యామ్ ఉపాధ్యాయ స్థానికంగా ఉద్యమవేత్త. రాజ్యాంగం, దళిత-వెనుకబడిన వర్గాల వాదనకు ఆకర్షితుడై ఎంఐఎంలో చేరాడు. తొలుత పార్టీ సీటును శ్యామ్కే కేటాయించాలనుకుంది. కానీ, అనూహ్యంగా స్థానికంగా మహిళలతో కలివిడిగా ఉండే అరుణకు బరిలోకి దించింది. కీలకమైన మున్సిపాలిటీ కావడంతో మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్ తన అనుచరులతో ప్రచారం చేయించినప్పటికీ.. అరుణనే గెలుపు అందుకుంది. #ArunaUpadhyaya Thanked #AIMIM President Barrister @asadowaisi after Winning Corporator Election on AIMIM Ticket from City of #Khargone for the First Time in #MadhyaPradesh, #AIMIM has Registered a Big Victory in Corporator Elections. pic.twitter.com/hRIjsP8eqk — Syed Mubeen (Tez Dhar) (@SyedZiya_Mubeen) July 21, 2022 -
రోడ్డు మీద 500లకు బిర్యానీ మొమోలను అమ్ముతూ.. అంచెలంచెలుగా ఎదిగి!
చిన్నప్పుడు అమ్మ అమ్మమ్మ, బామ్మల దగ్గర నేర్చుకున్న ఎన్నో విషయాలను జ్ఞాపకాలుగా ఉంచుకుంటారు చాలామంది. వారి దగ్గర నేర్చుకున్న విషయం ఎంత చిన్నదైనా, దానికి ఎంతో విలువనిస్తారు. ఇలా చిన్ననాటి బామ్మల వంటకాలను దగ్గర నుంచి చూసిన అరుణా టిర్కీ.. ఆ వంటకాలతో ఏకంగా ఓ రెస్టారెంట్ను ప్రారంభించింది. కనీస అవగాహన లేని వ్యాపారంలో అడుగుపెట్టినా అందులో చక్కగా రాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. జార్ఖండ్లో పన్నెండు మంది సంతానం ఉన్న అతిపెద్ద గిరిజన కుటుంబంలో పుట్టింది అరుణా టిర్కీ. తల్లిదండ్రులతో పద్నాలుగు మంది ఉన్న కుటుంబం. తల్లిదండ్రులు టీచర్లుగా పనిచేసేవారు. ఉన్నత విద్య వరకు బాగానే చదివించారు. వారి ప్రోత్సాహంతోనే నెట్ రాసిన తొలిప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించింది. రూరల్ డెవలప్మెంట్ చదివిన ఆరుణ ఆదివాసీల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులో ఉద్యోగిగా చేరి కొన్నేళ్లపాటు గిరిజనలు అభివృద్ధికోసం పాటుపడింది. కొడుకు కోసం ఉద్యోగం వదిలి... ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కులాంతర వివాహం చేసుకుంది అరుణ. ఈ పెళ్లి ఇష్టంలేని తల్లిదండ్రులు మొదట్లో ఒప్పుకోలేదు. కానీ తరువాత చేరదీశారు.పెళ్లైన ఏడాదికే అరుణకు బాబు పుట్టాడు. దీంతో బాబుని చూసుకునేందుకు తన ఉద్యోగం వదిలేసి పూర్తిసమయాన్ని కొడుకుకి కేటాయించింది. రెండేళ్లు వచ్చిన పిల్లలందరిలా కొడుకు ప్రవర్తించేవాడు కాదు. ‘అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్’ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ బాధనంతటినీ కడుపులో దాచుకుని తన కొడుకు సమస్యను తగ్గించేందుకు ఆదివాసీ ఆహార పదార్థాలను మాత్రమే తినిపించేది. దీంతో ఆరు నెలల్లోనే అతని ప్రవర్తన సాధారణ స్థితికి చేరింది. ఆర్థిక ఇబ్బందులతో.. కొడుకు ఆరోగ్యంగా బావున్నాడు అనుకున్న కొద్దిరోజులకే అరుణకు ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. అరుణ ఉద్యోగం మానేయడం, భర్త ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లడంతో ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. కుటుంబాన్ని పోషించేందుకు ఏం చేయాలా... అని ఆలోచిస్తోన్న సమయంలో... బిర్యానీ, మొమోలు విక్రయిస్తే బావుంటుందన్న ఆలోచన వచ్చింది అరుణకు. పుట్టిల్లు, అత్తారింట్లో ఎక్కువమందికి వండిపెట్టిన అనుభవంతో రోజుకి మూడు గంటలపాటు రోడ్డు మీద రూ.500లకు బిర్యానీ మొమోలను విక్రయించేది. ఈ పనిచేయడం ఇష్టంలేని కుటుంబ సభ్యులు ఆమెకు సాయం చేయకపోగా, నిరుత్సాహపరిచేవారు. అయినా అరుణ తాను అనుకున్నది చేసుకుంటూ పోయేది. వెరీ టేస్టీ.. అరుణ బిర్యానీకి మంచి ఆదరణ లభించడంతో.. ‘అజం ఎంబా’ అనే పేరుతో ఐదువేల రూపాయల పెట్టుబడితో 2016లో రాంచీలో రెస్టారెంట్ను ప్రారంభించింది. ఆదివాసీ భాషలో అజం ఎంబా అంటే ‘వెరీ టేస్టీ’ అని అర్థం. ఎక్కువగా ఆదివాసీలు తినే ఆహార పదార్థాలను విక్రయించడంతో అతికొద్ది కాలంలోనే రెస్టారెంట్కు మంచిపేరు వచ్చింది. గిరిజనేతరులు సైతం ఇక్కడి ఆహార పదార్థాలను రుచి చూడడానికి ఆసక్తి చూపడంతో రెస్టారెంట్ బాగా నడుస్తోంది. సంప్రదాయ ఇంటి భోజనం సంప్రదాయ వంటకాలు మదువ రోటి, దుస్కా, ఖుక్డీ, రుగాడ, బ్యాంబూ కర్రీ, పితా, ట్వీజర్ గ్రీన్స్, పుత్కల్ గ్రీన్స్, డాకాక్షాన్, సూప్ వంటి గిరిజన వంటకాలను ఆకు వేసి వడ్డించడం, ఇంట్లో తిన్నట్లుగా చాపమీద భోజనం చేయడం కస్టమర్లను బాగా ఆకర్షించాయి. వీటితోపాటు గిరిజన సంగీతం ఎంతో వినసొంపుగా వినిపించడం, కాలానికి తగ్గట్టుగా వంటకాలు అందించడం ఇక్కడి ప్రత్యేకం. గిరిజనుల మార్కెట్ నుంచి కూరగాయల సేకరణ, రెస్టారెంట్లో పనిచేసే ఉద్యోగులంతా ఆదివాసీ మహిళలు కావడం విశేషం. నైపుణ్యం గల చెఫ్లు లేకపోయినప్పటికీ స్థానిక గిరిజన మహిళా ఉద్యోగులతో ఈ రెస్టారెంట్ నడుస్తోంది. నలభై మంది కూర్చుని తినగల అంజా వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సైతం ఆహారాన్ని ఆర్డర్ల మీద అందిస్తోంది. ఫాస్ట్ ఫుడ్ దొరకదు కాబట్టి.. ‘‘ నేను చిన్నప్పటి నుంచి గిరిజన సంస్కృతి సంప్రదాయాలు చూసి పెరిగాను. చిన్నప్పుడు మా బామ్మల దగ్గర గిరిజన వంటకాలు చేయడం నేర్చుకున్నాను. హోటల్ పెట్టాలనుకున్నప్పుడు ఏమేం ఆహార పదార్థాలు విక్రయించాలని ఆలోచిస్తున్నప్పుడు... ‘ఇక్కడ ప్రస్తుతమంతా ఫాస్ట్ఫుడ్స్వైపే ఆకర్షితులవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని పెంపొందించే గిరిజన ఆహార పదార్థాలు విక్రయిస్తే బావుంటుంది’ అనిపించింది. నా కొడుకు ఆరోగ్య సమస్య కూడా ఈ ఆహార పదార్థాలతోనే నయం అయింది. అందుకే సంప్రదాయ ఆహారపదార్థాలను విక్రయించాలని నిర్ణయించుకున్నాను. రొటీన్కు భిన్నంగా ఉండే చిరుతిళ్లకు ఎప్పుడూ ఆదరణ లభిస్తుందన్న నమ్మకంతో ఈ వ్యాపారంలో దిగాను. అనుకున్నట్టుగానే రెస్టారెంట్ బాగా నడుస్తోంది. ఒకపక్క గిరిజన సంప్రదాయక వంటకాలను ప్రోత్సహిస్తూనే, స్థానిక ఆదివాసీ మహిళలకు ఉపాధి కల్పించడం చాలా సంతోషంగా ఉంది’’ – అరుణా టిర్కీ -
సీతాకోకచిలుక హీరోయిన్ అరుణ ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తుంది?
సీతాకోకచిలుక హీరోయిన్ అరుణ గుర్తున్నారా? ఈ ఒక్క సినిమాతోనే ఓవర్నైట్ స్టార్డమ్ సంపాదించుకున్న అరుణ ప్రస్తుతం ఎక్కడుంది? ఇప్పుడేం చేస్తుంది అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అందం, అభినయం కలబోసిన అచ్చతెలుగు అమ్మాయి ముచ్చర్ల అరుణ. తొలి సినిమాతోనే ప్రముఖ దర్శకుడు భారతీరాజా సినిమాలో చాన్స్ కొట్టేసింది. 1981లో ఆయన తెరకెక్కించిన సీతాకోకచిలుక అప్పట్లో ఓ సంచలనం. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీన్గా నిలిచాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఓవర్నైట్ స్టార్డడమ్ సంపాదించుకుంది అరుణ. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారామె. చటంబ్బాయి, స్వర్ణకమలం, సంసారం ఒక చదరంగం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి హిట్ సినిమాల్లో నటించిన మెప్పించింది. ఫ్యామిలీ హీరోయిన్గా స్థానం సంపాదించిన అరుణ కేవలం 10 సంవత్సరాల్లోనే 70కి పైగా సినిమాల్లో నటించి సత్తాచాటింది. అయితే హీరోయిన్గా దూసుకుపోతున్న సమయంలోనే బిజినెస్మ్యాన్ మోహన్గుప్తను పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్బై చెప్పేసింది. వీరికి నలుగురు సంతానం. ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయిన ముచ్చర్ల అరుణ రీసెంట్గానే ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఓపెన్ చేసింది. ఇందులో వంటలు, హెల్తీ లైఫ్, వర్కవుట్స్ వంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకుంటుంది. అలనాటి అందాల తార మళ్లీ ఇన్నాళ్లకు టచ్లోకి రావడంతోనే ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్గానే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిన అరుణకు ప్రస్తుతం ఒక లక్షా 69వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. View this post on Instagram A post shared by Aruna Gupta (@mucherla.aruna) View this post on Instagram A post shared by Aruna Gupta (@mucherla.aruna) -
టీఆర్ఎస్లోకి బీజేపీ ఎంపీటీసీ అరుణ
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో నందిపేట బీజేపీ ఎంపీటీసీ అరుణ చావన్ ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. అరుణతో పాటు బీజేపీ నేతలకు కవిత గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నంది పేట జెడ్పీటీసీ యమున ముత్యం, ఎంపీటీసి మురళి, టీఆర్ఎస్ పార్టీ నందిపేట మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, అయిలాపూర్ సుదర్శన్, సిలిండర్ లింగం పాల్గొన్నారు. -
కేసీఆర్ వైఫల్యంతోనే పాలమూరుపై ఎన్జీటీ స్టే
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్పై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్టే విధించడానికి సీఎం కేసీఆర్ వైఫల్యమే కారణమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. దక్షిణ తెలంగాణను ఎడారి చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యమని విమర్శించారు. పాలమూరుపై ఆయనకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఈ పరిణామం చోటుచేసుకుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత అరుణ
సాక్షి, రాజమండ్రి : మావోయిస్టు పార్టీ ఏవోబీ మిలటరి కమిషన్ చీఫ్ చలపతి భార్య అరుణను అంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతవారం జరిగిన గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు ఎన్కౌంటర్లో గాయపడిన అరుణ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అరుణతో పాటు గాయపడిన మరో మావోయిస్టు సభ్యురాలు భవానీ పెదబైలు దళానికి చెందిన సభ్యురాలిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన ఆమెను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం వీరిద్దరూ కోలుకోవడంతో విచారణ నిమిత్తం ఇంటెలిజెన్స్ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఇక గతవారం గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. అయితే ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనాయకురాలు అరుణ కూడా ఉన్నట్లు తొలుత అనుమానం వ్యక్తం చేశారు. అయితే అరుణ ఎదురుకాల్పుల్లో తప్పించుకుని పోలీసుల అదుపులో ఉందని, అమరుల బంధు మిత్రుల సంఘం ఆరోపించింది. కానీ ఆ వార్తలు అవాస్తమని పోలీసులు తేల్చిచెప్పారు. అయితే ఏడాది కిందట అప్పటి అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, అదే ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమల హత్యలో ఆరుణ కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. విశాఖ మన్యంలో కూంబింగ్ కొనసాగుతోంది: డీజీపీ సాక్షి, అమరావతి : విశాఖ మన్యంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గాలికొండ-గుత్తేడు ప్రాంతంలో మావోయిస్టు నేత సాకె కళావతి అలియాస్ భవాని గాయాలతో పోలీసులకి పట్టుబడినట్లు తెలిపారు. మావోయిస్టు స్టేట్ జోన్ కమిటీ మెంబర్ జగన్ భార్య భవాని అని, పెదబైలు ఏరియా కమిటీ మెంబర్గా భవానీ పనిచేస్తోందన్నారు. 20 ఏళ్లుగా మావో ఉద్యమంలో వివిధ విభాగాల్లో ఆమె పనిచేసిందన్నారు. భవానిని కోర్టులో హాజరుపరిచిన అనంతరం చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరిలించినట్లు డీజీపీ వివరించారు. -
అగ్రనేత అరుణ ఎక్కడ?
సాక్షి, సీలేరు (పాడేరు): ఏవోబీలోని మహిళా మావోయిస్టుల విభాగంలో అరుణ పేరు తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు అరుణ ఎవరు, ఉద్యమంలో ఆమె బాధ్యత ఏమిటీ, అరుణ కోసం ఏడాదిగా పోలీసు బలగాలు ఎందుకు గాలింపు చేపడుతున్నాయి అన్న ప్రశ్నలు ఏవోబీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు ఎన్కౌంటర్లో ఆమె ఉందని ప్రచారం కూడా సాగింది. అయితే ఎదురుకాల్పుల్లో ఆమె లేకపోవడంతో పోలీసు బలగాలు అరుణకోసం జల్లెడపడుతున్నాయి. పెందుర్తి మండలం సుజాతనగర్కు చెందిన అరుణ, ఆమె కుటుంబం కూడా మావోయిస్టుల ఉద్యమం నుంచి ఉన్నారు. అరుణ చిన్న వయసులోనే ఉద్యమానికి ఆకర్షితురాలైంది. ఏడాది క్రితం గూడెం మండలం మర్రిపాకల ఎన్కౌంటర్లో మృతి చెందిన అగ్రనేత ఆజాద్ సొంత చెల్లెలు ఈమె. అరుణ ఫొటో రాంగుడ ఎన్కౌంటర్లో లభ్యమైన ల్యాబ్ట్యాప్లో కనిపించింది. ఆమె పేరు తప్ప ఆమె ఎలా ఉంటుందనేది అప్పుడే వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు పార్టీ ఏవోబీ మిలటరి కమిషన్ చీఫ్ అయిన చలపతి భార్య అరుణ. ప్రస్తుతం అరుణ పార్టీలో కీలక పదవిలో ఉంది. చలపతి భార్య కావడం, తూర్పు మల్కన్గిరి డివిజన్ కమిటీ కార్యదర్శిగా ప్రస్తుతం ఏకే47 తుపాకీ వాడుతున్నట్లు మాజీ మావోయిస్టుల ద్వారా తెలిసింది. అలాగే ఆమెకు ఆరుగురు అంగరక్షకులు కూడా ఉన్నట్లు సమాచారం. కిడారి, సోమ హత్యల ఘటన నుంచి.. రాంగుడ ఎదురుకాల్పుల నుంచి అరుణ బయట ప్రపంచానికి తెలిసింది. అక్కడి నుంచి అందరి మావోయిస్టుల్లాగే పోలీసులు చూసే వారు. కానీ ఏడాది కిందట అప్పటి అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, అదే ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమల హత్యలో ఆమె కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. అప్పటి నుంచి ఏవోబీ, విశాఖ, తూర్పుగోదావరి పోలీసులు ఆమెను ఎలాగైనా పట్టుకోవాలన్న లక్ష్యంతో గాలిస్తున్నారు. ఆమె ఆచూకీ కోసం ఏడాదిగా.. మాజీ ఎమ్మెల్యేల హత్య సంఘటనల నుంచి అరుణ కోసం బలగాలు అడవిలో తిరగని రోజు లేదు. ఎప్పుడు దొరుకుతుందా అని తుపాకీలు ఎక్కుపెట్టి ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో జీకేవీధి మండలం మాదిగమల్లు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మహిళా మావోయిస్టుల్లో తొలుత ఆమె ఉందని ప్రచారం జరిగింది. ఆమె లేకపోవడాన్ని గుర్తించిన పోలీసు బలగాలు జల్లెడపడుతున్నాయి. గాలికొండ ఏరియా కార్యదర్శి హరి గూడెం మండలం గునుకురాయి ప్రాంతానికి చెందిన వాడు. అయితే ఇటీవల అరుణ ఆడియో టేపు రిలీజ్ చేసినపుడు అగ్రనేత నవీన్తో పాటు హరి కూడా లొంగిపోయాడని, తిరిగి ఉద్యమంలోకి ఎలా వచ్చాడని చెప్పింది. కానీ మొన్న జరిగిన ఎదురుకాల్పుల్లో హరి కూడా ఉన్నట్లు ప్రచారం సాగింది. ప్రస్తుతం హరి పార్టీలో ఉన్నాడా?.. బయట ఉన్నాడా? అనేది ప్రశ్నగానే మిగిలింది. పత్రికలకు అబద్ధం చెప్పను ప్రస్తుతం జరిగిన ఎదురుకాల్పుల్లో తప్పించుకుని పోలీసుల అదుపులో ఉందని, అమరుల బంధు మిత్రుల సంఘం ఆరోపించింది. దీనిపై చింతపల్లి ఏఎస్పీ సతీష్ కుమార్ను వివరణ కోరగా ప్రతికలకు అవాస్తవాలు చెప్పడం లేదని, అరుణ మా దగ్గర లేదని, ఎదురుకాల్పుల్లో 15 మంది ఉన్నారని, వీరిలో ఐదుగురు చనిపోయారని మిగిలిన వారు తప్పించుకున్నారన్నారు. అందులో అరుణ ఉందో లేదో బలగాలు కూడా చూడలేదని వివరణ ఇచ్చారు. తమకు ఎవరైనా దొరికితే అప్పుడు అరుణ ఉందో లేదో తెలుస్తుందన్నారు. ఆరోపణల్లో వాస్తవం లేదని ఏఎస్పీ చెప్పారు. – సతీష్కుమార్, చింతపల్లి ఏఎస్పీ -
మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. అగ్రనేత హతం!
సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టు వారోత్సవాల సమయంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నం జిల్లా జీకే వీధి మండలం మాదినమల్లు అటవీ ప్రాంతంలో ఆదివారం ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు వర్గాలు ఇప్పటికే ధృవీకరించాయి. అయితే ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనాయకురాలు, అరుణ కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఇటీవల ఈస్ట్జోన్కు వచ్చిన అరుణ గతకొంత కాలంగా విశాఖ మన్యంలో పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు మావోయిస్టు ఉద్యమంలో ఉన్న ఆమె పలు ఆపరేషన్స్లో పాల్గొన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. ఆమె మృతిపై పోలీసుల నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. కాగా గతంలో మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన నేత కిడారి సర్వేశ్వరరావు ఎన్కౌంటర్లో అరుణ క్రియాశీలకంగా వ్యవహరించినట్లు అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి. 2015లో కొయ్యూరు ఎన్కౌంటర్లో పోలీసుల చేతిలో హతమైన మావోయిస్టు అగ్రనేత అజాద్ సోదరి అరుణ అలియాస్ వెంకట రవి చైతన్య కిడారి హత్యకు నాయకత్వం వహించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలను బట్టి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను దగ్గరి నుంచి కాల్చింది కూడా అరుణగానే భావించారు. ఆ తరువాత ఆమెపై అనేకసార్లు ఎదురుకాల్పులు జరిపినప్పటికి అరుణ తప్పించుకున్నారు. అయితే తాజాగా ధారకొండలో జరిగిన ఎన్కౌంటర్లో ఆమె మృతి చెంది ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతోంది. కాగా తాజా ఘటనతో విశాఖలోని ఏజెన్సీ గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతూ ఉండటంతో.. ఏవోబీలో అధికారలు హై అలర్ట్ ప్రకటించారు. చదవండి: విశాఖలో భారీ ఎన్కౌంటర్ -
మెకానిక్ అరుణ
సాక్షి, కొత్తకోట: మెకానిక్లు అంటే పురుషులే ఎక్కువగా ఉండటం మనం చూస్తుంటాం. పెద్ద పెద్ద వాహనాలకు టైర్లు విప్పి పంక్చర్ చేయడం.. గాలి పట్టించడం పురుషులకే కష్టంగా ఉంటుంది. కానీ వీటన్నింటిని సునాయసంగా చేస్తోంది ఓ మహిళ. ఒకవైపు భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ.. పిల్లల చదువు, కుటుంబ పోషణకు అండగా నిలుస్తోంది. కొత్తకోట మండల కేంద్రానికి చెందిన అరుణ. అడ్డాకుల మండలం కాటారం గ్రామానికి చెందిన అరుణకు కొత్తకోట మండలం అప్పరాల గ్రామానికి చెందిన మద్దిలేటితో ఎనిమిదేళ్ల క్రిందట వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ఆర్థిక స్థోమత లేక పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. భర్త మద్దిలేటి వాహనాల టైర్ల పంక్చర్లు చేస్తూ జీవనం గడుపుతున్నాడు. అయితే మద్దిలేటి వద్దకు రోజురోజుకు పంక్చర్లు చేసుకునే వారి సంఖ్య ఎక్కువైంది. దీనికితోడు ఇంట్లో ఖర్చులు సైతం అధికమయ్యాయి. దీంతో పనిచేస్తున్న భర్తను చూసిన అరుణ మొదట టైర్లు విప్పడానికి కావాల్సిన సామగ్రిని అందజేసేది. అలాగే మెల్లగా ద్విచక్రవాహన టైర్లను విప్పడం మొదలుపెట్టింది. అలా ఒక్క బైక్ టైర్లనే కాకుండా ఆటో, కారు, వ్యాను, లారీ టైర్లను విప్పుతూ పంక్చర్లు చేస్తూ తోడుగా ఉంటుంది. రుణం ఇచ్చి ఆదుకోవాలి స్వయం కృషిని నమ్ముకొని పనులు చేసుకుంటున్న మాలాంటి వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. కష్టపడి పనిచేస్తూ బతికే వారు సమాజంలో గౌరవంగా జీవించాలనుకుంటారు. రుణం ఇస్తే దుకాణాన్ని మరింత పెద్దగా చేసి ఆర్థికంగా మెరుగుపడి మా పిల్లలను బాగా చదివించుకుంటాం. – అరుణ, మెకానిక్, కొత్తకోట -
వంచించాడు... యాసిడ్తో దాడి చేశా!
చిత్తూరు, తిరుపతి (అలిపిరి) : నన్ను పెళ్లి చేసుకుంటానని వంచించాడు.. ఏడాది పాటు నాతో సాన్నిహిత్యంగా మెలిగి తరువాత వదలించుకున్నాడు.. అనారోగ్యంతో ఉన్న నా భర్త ఏడుకొండలను నా చేతే డాక్టర్ ఆదర్శ్ చంపించాడు.. అంటూ తిరుపతి కోర్డు ఆవరణలో డాక్టర్ ఆదర్శ్పై యాసిడ్ దాడిచేసిన నర్సు అరుణ (35) వెల్లడించింది. యాసిడ్ దాడి అనంతరం ఆమె పురుగుల మందును తాగి అపస్మారక స్థితిలో రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మధ్యాహ్నం కోలుకున్న తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. డాక్టర్పై యాసిడ్ దాడికి కారణాలను ఆమె మాటల్లోనే.. ‘‘రెండేళ్ల క్రితం డాక్టర్ ఆదర్శ్తో పరిచయమైంది. తిరుపతిలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో అతనితో పాటు నర్సుగా పనిచేశాను. తిరుచానూరు రోడ్డులోని పద్మావతి పురంలో నివాసం ఉంటున్నాను. నా భర్త అనారోగ్యానికి తోడు కుటుంబ పరిస్థితిని ఆసరాగా చేసుకుని డాక్టర్ ఆదర్శ్ నాకు దగ్గరయ్యాడు. తోడుగా ఉంటానని.. తన భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానన్నాడు. అనారోగ్యంతో ఉన్న నా భర్త తాగుడుకు బానిస కావడంతో నాచేతనే ఒక ఇంజెక్షన్ ఇచ్చి చంపేలా చేశాడు. ఏడాది పాటు నాతో లివింగ్ రిలేషన్ పెట్టుకుని మోసం చేశాడు. అప్పట్లో ఆదర్శ్పై ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశా. ఆదర్శ్ విడాకుల వ్యవహారం కోర్టులో ఉండడంతో వాయిదాకు వస్తాడని తెలుసుకున్నా.. అతన్ని నడిరోడ్డులో చెప్పుతో కొట్టి యాసిడ్ తాగి చనిపోవాలనుకున్నా.. అయితే డాక్టర్ ఆదర్శ్ నన్ను చూసి పరుగెత్తాడు. దీంతో యాసిడ్తో దాడి చేయాల్సి వచ్చింది. ఆ తరువాత నేను పురుగుల మందు తాగాను..’’ ఆదర్శ్ను శిక్షించాలి డాక్టర్ ఆదర్శ్ నాలాగా మరో ఐదుగురిని మోసం చేసినట్లు తెలిసింది. అటువంటి వ్యక్తిని నడిరోడ్డులో నిలబెట్టాలి. అప్పుడే నాలాంటి వారికి న్యాయం జరుగుతుంది. పోలీసులు ఆదర్శ్ను అరెస్ట్ చేసి శిక్షించాలి. కోలుకుంటోంది అరుణ పురుగుల మందు తాగడంతో అపస్మార స్థితిలోకి వెళ్లిందని, ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందివ్వడంతో కోలుకుంటోందని రుయా ఆర్ఎంఓ డాక్టర్ శ్రీహరి తెలిపారు. ప్రస్తుతం ఆమె మాట్లాడుతోందని చెప్పారు. -
ఊపిరి ఆడక కువైట్లో మహిళ మృతి
కడప కార్పొరేషన్ : రైల్వేకోడూరు నియోజకవర్గం టీ కమ్మలపల్లెకు చెందిన పంట అరుణమ్మ కువైట్లో మృతి చెందిందని వైఎస్సార్సీపీ గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలాయాస్, కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి తెలిపారు. జీవనోపాధి కోసం కువైట్ వచ్చిన రమణమ్మ చలికి తట్టుకోలేక ఎలక్ట్రానిక్ హీటర్ వేసుకోవడంతో ఊపిరి ఆడక ఈనెల 3న చనిపోయిందన్నారు. ఆమె మృతదేహాన్ని స్వస్థలం పంపించేందుకు అంబేడ్కర్ సేవా సమితి ద్వారా ఇమ్మిగ్రేషన్, భారత రాయబార కార్యాలయంలో పనులన్ని పూర్తి చేసి ఎయిర్ ఇండియా ప్లైట్లో ఈనెల 26న పంపించారు. చెన్నై నుంచి టీ కమ్మపల్లె వరకు రాజంపేట మాజీ ఎంపీ మిథున్రెడ్డి ఉచితంగా అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అరుణమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ నాయకులు నివాళి అర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
చలపతే.. యాక్షన్ దళపతి!
ఆపరేషన్ లివిటిపుట్టులో మావోయిస్టు కీలకనేత చలపతి పాల్గొన్నారా?.. ఆయనే స్వయంగా ఆపరేషన్ను పర్యవేక్షించారా??.. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమల హత్యకు నిర్వహించిన ఈ ఆపరేషన్పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణలో దీనికి అవుననే సమాధానం లభిస్తోంది. గత నెల 23న జరిగిన ఈ హత్యాకాండలో మహిళా మావోయిస్టు నేత అరుణ ఈ ఆపరేషన్కు నేతృత్వం వహించారని.. మిలటరీ కమిషన్ ఆధ్వర్యంలో చలపతి వ్యూహం రచించినట్లు ప్రాథమిక సమాచారం వచ్చింది. అయితే లోతుగా జరిగిన సిట్ విచారణలో చలపతి పాత్ర స్పష్టంగా వెల్లడైనట్లు తెలుస్తోంది. ఆయన స్వయంగా హత్యాకాండలో పాల్గొనకపోయినా.. దళంతో కలిసి వచ్చి కాస్త దూరంగా ఉండి పర్యవేక్షించారని సమాచారం. మరోవైపు మీడియాను వెంట తీసుకెళితే మావోయిస్టులు దాడికి పాల్పడరన్న వ్యూహంతోనే కిడారి తన కాన్వాయ్ వెంట మీడియా ప్రతినిధులను తీసుకెళ్లినా.. అది ఫలించలేదు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యోదంతంపై సిట్ జరుపుతున్న విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. డుంబ్రిగూడ మండలం లివిటిపుట్టులో గత నెల 23న మావో యిస్టులు వారిద్దరినీ దారుణంగా కాల్చిచంపిన ఘటనలోమావోయిస్టు మహిళా నేత అరుణ కీలకంగా వ్యవహరించినట్టు ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తాజాగా ఆమె భర్త, మావోయిస్టు కీలక నేత చలపతి కూడా ఆ ఆపరేషన్లో పాల్గొన్నట్టు సిట్ అధికారులు తేల్చారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఆదేశాలతో చలపతి దగ్గరుండి ఆపరేషన్ విజయవంతం చేసినట్టు తెలుస్తోంది. కాల్పుల పనిని మహిళా మావోలకు అప్పజెప్పి చలపతి మాత్రం కాస్త దూరంలోనే నిలబడినట్టు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. చలపతి, అరుణల నాయకత్వంలో ఆ రోజు ఉదయమే నందాపూర్ కమిటీకి చెందిన సుమారు 30మంది మావోయిస్టులు లివిటిపుట్టు చేరుకున్నారు. అక్కడకు మరో ముప్పై మంది మిలీషియా సభ్యులు చేరుకున్న తర్వాత ఆపరేషన్కు రంగం సిద్ధం చేశారని అంటున్నారు. ఏజెన్సీ టీడీపీ నేతలే ఉప్పందించారు.. కిడారికి సన్నిహితంగా ఉన్న టీడీపీ నేతలే మావోలకు ఉప్పందించారని సిట్ అధికారులు ప్రాధమిక దర్యాప్తులో తేల్చినట్టు తెలుస్తోంది. అయితే కిడారి వెన్నంటి తిరిగిన టీడీపీ నేతలు ఒక్కసారిగా మావోలతో కుమ్మక్కై ఎందుకు పక్కాగా సమాచారం అందించారన్న దానిపై మాత్రం సిట్ అధికారులకు స్పష్టత రాలేదు. వ్యాపార లావాదేవీల్లో అంతర్గత విభేదాలా.. పార్టీ ఫిరాయించిన తర్వాత టీడీపీలోని ఓ వర్గంతో వచ్చిన అంతరాలా.. అన్నది ఇప్పటికీ తేలలేదని అంటున్నారు. మొత్తానికి ఏజెన్సీకి చెందిన, కిడారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన టీడీపీ నేతలే మావోలకు ఎప్పటికప్పుడు ఆయన కదలికలపై సమాచారం ఇచ్చినట్టు మాత్రం సిట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మీడియా ప్రతినిధుల సాక్షిగానే... ఆ రోజు కిడారి మీడియా వారిని తన వెంట తీసుకువెళ్లడం వాస్తవమేనని సిట్ తేల్చింది. మీడియా ప్రతినిధులు ఉంటే దాడికి మావోయిస్టులు వెనుకంజ వేస్తారన్న ఉద్దేశంతో వ్యూహాత్మకంగా కిడారి వారిని వెంటబెట్టుకు వెళ్లారని అంటున్నారు. ఓ ప్రధాన పత్రిక విలేకరితోపాటు ముగ్గురు స్థానిక విలేకరులు ఆయన్ను అనుసరించారని తెలుస్తోంది. ఆయన కారుకు ముందు ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరు విలేకరులు, కారు వెనుక మరో టూవీలర్పై ఇద్దరు విలేకరులు అనుసరించారు. కిడారి వాహనానికి ముందున్న విలేకరులు అక్కడ మావోలు కాపుకాయడం చూసి తమ బండి ఆపకుండా వెళ్ళిపోయారు. కిడారి వాహనం వెనుక అనుసరిస్తున్న ఇద్దరు మీడియా విలేకరులను మాత్రం మావోలు అడ్డగించినట్టు తెలిసింది. తమ ఆపరేషన్ పూర్తయ్యే వరకు వారిని అక్కడే కూర్చోబెట్టి ఆ తర్వాతే వదిలిపెట్టినట్టు చెబుతున్నారు. దీంతో సిట్ అధికారులు సదరు విలేకరులను విచారించినట్టు తెలిసింది. కాగా, ఆ రోజు ఆపరేషన్లో లివిటిపుట్టు గ్రామస్తుల పాత్ర ఏమీ లేదని సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు చెబుతున్నారు. సిట్ నివేదికను సర్కారు బయటపెడుతుందా? స్వయంగా అధికార తెలుగుదేశం నేతలే దగ్గరుండి ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరిలను కాల్చి చంపించిన వ్యవహారాన్ని ఎలా బయటపెట్టాలో తెలియక సిట్ అధికారులు మధనపడుతున్నారు. కారణాలు ఏమైనా కానీ టీడీపీ నేతలు అందించిన సమాచారంతోనే మావోలు పక్కా వ్యూహంతో మెరపుదాడి చేయగలిగారు. సిట్ దర్యాప్తులో ఈ విషయం స్పష్టమైంది. అయితే వాస్తవ నివేదిక బయటపెడితే సర్కారు తీరు ఎలా ఉంటుందోనన్న ఆందోళన విచారణ అధికారులను వెంటాడుతోంది. అందుకే మరింత లోతైన దర్యాప్తు కోసం విచారణ కొనసాగిస్తామని, ఏదేమైనా ఒకటి రెండు రోజుల్లో సిట్ నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని సిట్ వర్గాలు వెల్లడించాయి. -
అరుణకు రైల్వే ఉద్యోగం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ జిమ్నాస్ట్ బుద్దా అరుణరెడ్డికి నజరానాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు రూ. 2 కోట్ల నగదు ప్రోత్సాహకం ప్రకటించగా... తాజాగా దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) గ్రూప్ ‘సి’ ఉద్యోగాన్ని కేటాయించింది. అంతర్జాతీయ వేదికపై అదరగొట్టిన అరుణకు ఎస్సీఆర్లో ఉద్యోగం కేటాయించడం సంతోషంగా ఉందని జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. -
ఒలింపిక్స్ పతకమే జీవిత లక్ష్యం!
పుష్కర కాలానికి పైగా ఆ అమ్మాయి తాను ఎంచుకున్న ఆటలో తీవ్రంగా శ్రమించింది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తన పోరాటాన్ని ఆపలేదు. తనను నడిపించిన నాన్న దూరమైనా ఆయన కోరుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు మరింత కష్టపడింది. ఫ్లోర్పై, అన్ ఈవెన్ బార్స్పై కెరీర్ ‘బ్యాలెన్స్’ చేసుకుంటూ వెళ్లింది. కామన్వెల్త్ నుంచి ఆసియా క్రీడల వరకు, ఆసియా చాంపియన్షిప్ నుంచి ప్రపంచ చాంపియన్షిప్ వరకు పాల్గొనడమే తప్ప పతకానికి చేరువ కాలేకపోయిన సమయంలోనూ పట్టు వదల్లేదు. ఎట్టకేలకు ఇప్పుడు ప్రపంచ కప్లో పతకంతో మెరిసిన బుద్దా అరుణ రెడ్డి విజయగాథ ఇది. సాక్షి సిటీ బ్యూరో, హైదరాబాద్ :ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న క్రీడ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అమ్మాయి 22 ఏళ్ల బుద్దా అరుణ. ఇటీవల జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్లో కాంస్య పతకం సాధించిన ఆమె ఈ ఘనత సాధిం చిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందింది. ఇంతటితో ఆగిపోకుండా భవిష్యత్తులో మరిన్ని విజ యాలు సాధిస్తానని ఆమె ఆత్మవిశ్వాసంతో చెబుతోం ది. అయితే తన కెరీర్ తుది లక్ష్యం మాత్రం ఒలింపిక్ పతకం మాత్రమే అని చెప్పింది. శుక్రవారం స్వస్థలం హైదరాబాద్కు చేరుకున్న 22 ఏళ్ల అరుణ తాజా విజయం, తన కెరీర్కు సంబంధించిన విశేషాల గురించి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... కెరీర్ ఆరంభంపై... చార్టెడ్ అకౌంటెంట్ అయిన నాన్న నారాయణ రెడ్డికి ఆటలంటే కూడా ఆసక్తి. అయితే ముందుగా అమ్మాయికి ఆత్మరక్షణ కోసమంటూ నన్ను కరాటేలో చేర్పించారు. అయితే ఆ తర్వాత కరాటే మాస్టర్ బాలసుబ్రమణ్యం సూచనపై నేను జిమ్నాస్టిక్స్ వైపు మళ్లాను. ఎల్బీ స్టేడియంలో కోచ్లు స్వర్ణలత, రవీందర్, ఇప్పుడు బ్రిజ్ కిశోర్ మార్గ నిర్దేశనంలో నేను చాలా నేర్చుకున్నాను. ప్రాథమికాంశాల నుంచి వివిధ ఈవెంట్లలో పోటీ పడే వరకు అన్ని రకాలుగా శ్రమించాను. నేను మంచి ఫలితాలు సాధిస్తూ పోయాను. సబ్ జూనియర్ స్థాయి మొదలు ఇంటర్ యూనివర్సిటీ, సీనియర్ నేషనల్స్ వరకు వరుసగా పతకాలు సాధించాను. అయితే అంతర్జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ ఫలితాలు రాకపోవడంతో నాకు పెద్దగా గుర్తింపు లభించలేదు. నాన్న మరణం తర్వాత... నేను ఇంకా కెరీర్లో నిలదొక్కుకోక ముందే నాన్న 2010లో అకస్మాత్తుగా చనిపోవడం నన్ను కలచివేసింది. ఇక ఆటను కొనసాగించడం కష్టమనిపించింది. నాన్న ఉన్నంత వరకు నేను చాలా ధైర్యంగా ఉన్నాను. నాన్న అండ, ప్రేమ, ఆప్యాయతతో ధైర్యంగా అన్ని ఆటలు ఆడాను. ఆ క్షణాన నేను ఓ బలమైన శక్తిని కోల్పోయాను అనిపించింది. అప్పటి నుంచి నాకు కష్టాలు చాలా ఎదురయ్యాయి. నాన్న ఉన్నప్పుడు ప్రాక్టీస్కి, గేమ్స్కి, శిక్షణ శిబిరాలకు తనే స్వయంగా తీసుకెళ్లేవారు. నాన్న చనిపోయాక నేను ఒక్కదానినే ట్రావెల్ చేస్తుంటే చాలా కష్టంగా ఉండేది. నా శిక్షణ, సాధన విషయాల్లో ఎన్ని డబ్బులు ఖర్చు అయ్యాయనే విషయాలు కూడా నాకు తెలీదు, నాన్న ఎప్పుడూ చెప్పలేదు. నాన్న మరణానంతరం ఆర్థిక సమస్యలు తలెత్తడంతో మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాను. నేను విజయం సాధించిన ప్రతిసారీ నాన్న ఉండి ఉంటే ఎంత సంతోషించేవారో అని మా అమ్మ సుభద్ర గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నాన్న మరణించాక అక్క పావని, బావ జనార్ధన్ రెడ్డి నిరంతరం ప్రోత్సహించి నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. కుటుంబసభ్యుల అండతో ఎన్ని సమస్యలు వచ్చినా ఆట నుంచి వెనక్కి వెళ్లాలనే ఆలోచన మాత్రం ఎప్పుడూ రాలేదు. సీనియర్ స్థాయిలో ఫలితాలపై... జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ అనేక పతకాలు గెలుచుకున్నాను. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కూడా నాకు అండగా నిలిచింది. దాంతో అంతర్జాతీయ టోర్నీలలో వరుసగా పాల్గొన్నాను. ముఖ్యంగా 2014లో జరిగిన కామన్వెల్త్, ఆసియా క్రీడలు, 2013లో ప్రపంచ చాంపియన్షిప్, గత ఏడాది ఆసియా చాంపియన్షిప్ వాటిలో ముఖ్యమైనవి. దురదృష్టవశాత్తూ వీటిలో పతకానికి చేరువగా రాలేకపోయాను. అయితే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలలో పాల్గొనడం వల్ల నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. నా స్థాయి గురించి తెలుసుకొని తప్పులు దిద్దుకునేందుకు ఎంతో ఉపయోగపడింది. ప్రపంచ కప్ పతకంపై... నేను ఈ టోర్నీ కోసం ప్రత్యేకంగా తాష్కెంట్లో సిద్ధమయ్యాను. ఈ శిక్షణ కోసం గ్రీన్కో గ్రూప్తో పాటు వ్యాపారవేత్త, మాజీ క్రికెటర్ చాముండేశ్వరీనాథ్ కూడా ఆర్థికంగా చాలా సహాయ పడ్డారు. టోర్నీలో నేను ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. వాల్ట్ ఈవెంట్లో నా సహజ శైలిలోనే ఆడాను. కొన్ని విన్యాసాలు కష్టంగా ఉన్నా... సుదీర్ఘ కాలంగా అదే సాధన కాబట్టి కొత్తగా అనిపించలేదు. పతకం గెలుచుకున్న క్షణాన ఎంతో గర్వ పడ్డాను. చాలా ఉద్వేగానికి లోనయ్యాను. తర్వాతి రోజు ఫ్లోర్ విభాగంలో కూడా బాగానే రాణించినా చివరకు పతకం మాత్రం దక్కలేదు. జిమ్నాస్టిక్స్కు ఉత్తర భారతంలో చాలా ప్రాధాన్యత ఉంది. మన దక్షిణాదిలో దీనికి పెద్దగా గుర్తింపు లేదనే చెప్పాలి. రియో ఒలింపిక్స్లో దీపా కర్మాకర్ తన ప్రతిభను కనబరచడంతో అందరి దృష్టి ఆమెపై పడింది. నేను కూడా అలాంటి గుర్తింపునే కోరుకున్నాను. ఈ పతకంతో నేను ఏంటో అందరికీ తెలిసింది. మున్ముం దు కూడా ఇలాంటి ఫలితాలు సాధించా లని కోరుకుంటున్నా. ప్రభుత్వం నుంచి జిమ్నాస్టిక్స్కు ప్రోత్సాహం ఉంటే పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు రావడంతో పాటు మంచి ఫలితాలు సాధించవచ్చు. తర్వాతి లక్ష్యాలపై... వచ్చే నెలలో కామన్వెల్త్ క్రీడలు, ఆ తర్వాత ఇదే ఏడాది ఆసియా క్రీడలు కూడా ఉన్నాయి. వీటిలో పతకాలు గెలుచుకోవడంపైనే ప్రస్తుతం నా దృష్టి. ఆదివారమే తిరిగి తాష్కెంట్ వెళ్లిపోతున్నాను. మరోసారి మంచి ఫలితం రాబడతాననే నమ్మకముంది. అయితే ఏ క్రీడాకారిణికైనా అంతిమ లక్ష్యం ఒలింపిక్స్ పతకం సాధించడమే. నేను కూడా దాని గురించే కలలుగంటున్నాను. టోక్యో ఒలింపిక్స్లో పతకం నెగ్గాలనే లక్ష్యంతో ఉన్నాను. అందుకోసం ఎంతయినా కష్టపడతా. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పథకం ‘టాప్’లో ఉండటంతో ఆర్థికపరంగా కూడా పరిస్థితి కొంత మెరుగైంది. -
ఫ్లోర్, వాల్ట్ ఫైనల్స్లో అరుణ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి బుద్దా అరుణ రెడ్డి ఫ్లోర్, వాల్ట్ ఈవెంట్స్లో ఫైనల్లోకి చేరింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్లో అరుణ తన విన్యాసాలతో ఆకట్టుకుంది. ఫ్లోర్ ఎక్సర్సైజ్ క్వాలిఫయింగ్లో అరుణ రెడ్డి 11.466 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. వాల్ట్ క్వాలిఫయింగ్లో అరుణ రెడ్డి 13.566 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి ఫైన -
పాఠశాలల్లో ‘గురజాడ’ గీతాలాపన
శ్రీకాకుళం సిటీ: ‘దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న.. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్.. ఈ గేయం రాసింది ఆధునికాంధ్ర సాహిత్య కవి, ఆధునిక కవితా పితామహుడు గురజాడ అప్పారావు. దేశ భక్తిభావాన్ని విద్యార్థుల్లో మరింత పెంచేందుకు ఈ గేయాన్ని పాఠశాల స్థాయి నుంచే గీతాలాపన చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన మనవరాలు అరుణ గురజాడ పేర్కొన్నారు. అమెరికా టెక్సాక్స్లో నివాసముంటున్న ఈమె ఆదివారం సిక్కోలు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. క్షేత్రస్థాయిలోకి గురజాడ సిద్ధాంతాలు.. గురజాడ సంస్థల నేతృత్వంలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశాలోనూ పలుసేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్నాం. గురజాడ ఆశయాలను, సిద్ధాంతాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లాలన్నదే మా ఉద్దేశం. దేశమును ప్రేమించుమన్న గేయం ద్వారా గురజాడ ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చారు. సమాజం అంటే మనం అనే పదం ఎక్కువగా ఉండాలి. దురదృష్టవశాత్తు ఇప్పుడా పదం కనిపించడం లేదు. నేను, నా కుటుంబసభ్యులు, నా సంసారం.. ఇలా అన్నింటిల్లోనూ నా.. అనే పదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తోటివారికి సాయపడాలి.. ప్రకృతి, సమాజాం ఎంతో ఇచ్చిందనే సంతృప్తితో తోటివారికి కొంత సాయపడాలి. ప్రతి ఒక్కరూ కనీసం ఒఒక రూపాయిని ఇతరులకు సాయం చేయడం ద్వారా భగవంతుడు వేరే విధంగా తిరిగి మళ్లీ అదే ధనాన్ని మనకి ఇస్తాడు. కార్యరూపం దాల్చని కన్యాశుల్కం–2 కన్యాశుల్కంలో గిరీశాన్ని, ఇతర పాత్రలను ఎలా మార్పుచేశారో అందరికి తెలిసిందే. కన్యాశుల్కం–2లో చాలా విషయాలను గురజాడ ప్రస్తావించి సమాజాన్ని చైతన్యపరుద్దామని భావించారు. దురదృష్టవశాత్తు ఆయనకు ఆ అవకాశం దక్కలేదు. దేశాన్ని ప్రేమించుమన్న అనే గేయాన్ని మనదేశంతో పాటు ప్రపంచదేశాలను ఉద్దేశించి ముందుచూపుతోనే రచించారు. విజయనగరంలో సొంతింట్లో ప్రతిరోజు పిల్లలకు, పెద్దలకు వేర్వరుగా ఒక సభను ఏర్పాటుచేద్దామని భావించేవారు. స్థానికంగా కొన్ని పరిస్థితుల వల్ల ఆ కార్యక్రమాలు ముందుకు సాగలేదు. 20న గురజాడ కళావేదిక ప్రారంభం.. రాజమండ్రిలోని బిక్కవోలు సింగంపల్లిలో ఈ నెల 20న గురజాడ కళావేదికను ప్రారంభించనున్నాం. గత ఏడాది పిల్లల్లో సృజనాత్మక పెంపొందించేందుకు స్టడీసెంటర్, గ్రంథాలయాలను స్థాపించాం. ఐటీ వృత్తిలో సంపాదిస్తున్న మొత్తంలో కొంతభాగాన్ని గురజాడ సంస్థలకు ఖర్చుపెడుతూ ఆయన ఆశయసాధనకు కృషి చేస్తున్నాం. -
వైఎస్సార్ జిల్లాలో మరో స్వాతి కథ
-
కడపలో మరో స్వాతి కథ..
సాక్షి, కడప : తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ స్వాతి ఉదంతం మరవక ముందే కడపలోనూ అదే తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. ఈ దారుణ సంఘటన వైఎస్ఆర్ జిల్లా పుల్లంపేట మండలం చవనవారిపల్లెలో చోటుచేసుకుంది. ఆలస్యంగా ఈ వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నివసించే శివ, అరుణ దంపతులకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. వివాహానికి ముందే సాయి సుభాష్ అనే వ్యక్తితో అరుణకు ప్రేమ వ్యవహారం ఉంది. పెళ్లైన తర్వాత కూడా అది కొనసాగుతుండటంతో వద్దంటూ పలుమార్లు శివ వారించాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకునేందుకు అరుణ ప్రియుడితో కలిసి హత్యకు పథకం వేసింది. సుభాష్ తన ఇద్దరు మిత్రులతో కలిసి పార్టీ పేరుతో భార్యభర్తలిద్దరిని తోటకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించి విచక్షణా రహితంగా శివను కత్తులతో పొడిచి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని పుల్లంపేట మండలం అన్నసముద్రం అటవీప్రాంతంలో పడేశారు. శివ కనిపించకపోవడంతో మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అరుణ, సాయిసుభాష్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనలో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వైఎస్సార్ జిల్లాలో మరో స్వాతి కథ -
అక్షర యోగి
నాలుగు మంచి భావాలను అక్షరాలతో నేసి... ఒంటి మీద వేసుకుంటే.. అవేవీ పైకి కనిపించవు. ఆ మనిషి నగ్నంగా ఉన్నాడనో.. యోగి అనో.. బైరాగి అనో.. అనుకునే ప్రమాదం ఉంది. ‘వేమన.. వారెవరూ కాదు. పదాల నేతగాడు. భావాల కూర్పరి. గొప్ప కవి’ అంటారు డాక్టర్ ఎన్.గోపి. నిజమే. మనకు వేమన నగ్నంగానే కనబడతాడు. గోపీకి మాత్రం ఒక యజ్ఞంలా కనబడతాడు. కవితా సంకలనాలు, వ్యాస సంకలనాలు, పరిశోధనాత్మక ప్రచురణలు, అనువాదాలు, వ్యాఖ్యానాలు, టెక్ట్స్బుక్స్, కాలమ్ రైటింగ్స్.. ఇలా 50కి పైగానే రచనలు చేశారు డా.ఎన్.గోపి. ఒక్క తెలుగులోనే కాకుండా దేశ విదేశీ భాషల్లోకి గోపీగారి కవిత్వాలు అనువాదం అయ్యాయి. విశ్రాంత ఆచార్యులు అయినా నిరంతర కవితాన్వేషి. ప్రస్తుతం కేంద్రసాహిత్య అకాడమీలో సభ్యుడిగా ఉన్నారు. సభలూ, సమావేశాలతో నిత్యం బిజీగా ఉండే గోపీగారిని దైవం గురించి అడిగితే కవిత్వాన్నే పరిచయం చేశారు. వేమన జీవితం, పద్యాల మీద ఎంతో పరిశోధన చేశారు మీరు. వేమన దైవత్వం గురించి ఏం చెప్పారు? సమాజంలో దైవం పేరుతో జరిగే మూఢనమ్మకాలను విపరీతంగా నిరసించాడు వేమన. ఎంతో ధైర్యవంతుడు. శ్రమలో దైవత్వాన్ని దర్శించమన్నాడు. ‘శ్రమములోన పుట్టు సర్వంబు తానౌను’ అన్నాడు ఒకచోట. అది నా పట్ల నిజమైందనుకుంటాను. విద్యార్థి రోజుల్లో వేమన గురించి పరిశోధన మొదలుపెట్టినప్పుడు చాలా ప్రాంతాలు సందర్శించాను. తాళపత్రాలలో వేమన పద్యాలు మద్రాస్లోని లైబ్రరీలో ఉన్నాయని తెలిసి అక్కడకు వెళ్లాను. అక్కడ కట్టల కొద్ది తాళపత్రాలు. మూడువేల పద్యాలు ఉంటాయవి. వాటన్నింటినీ చూసి ‘అమ్మో!’ అనిపించింది. ఎందుకంటే, కాపీ చేసుకోవాలంటే రాత తప్ప మరో సాధనం లేని రోజులవి. వెనక్కి తిరిగి వెళ్లిపోదామా అనిపించింది. కానీ, వెనకడుగు వేయడమా? ప్రశ్నే లేదనుకొని ఓ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు రాస్తూ కూర్చున్నాను. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే కనీసం ఆరునెలలకు పైగా పడుతుంది. ఎలా? స్కాలర్షిప్ తప్ప మరో ఆదాయం లేదు. తెలిసినవారి గదిలో ఉంటూ రెండేళ్ల పాటు వేసవి సెలవుల్లో మాత్రం మద్రాస్ వెళ్లి, వేమనపద్యాలన్నీ రాసుకొని, తలమీద మోసుకుంటూ తీసుకొచ్చాను. మొదట ఆ పత్రాలను చూసినప్పుడు ‘అమ్మో! ఎలా సాధ్యమౌతుంది?’ అని భయపడిన నాకు ఆ పద్యాలను ఒక్కోటీ రాస్తూ ఉంటే నాలో ఏదో శక్తి ప్రవేశిస్తున్న అనుభూతి కలుగుతుండేది. అదే నన్ను యాక్టివేట్ చేసింది. ఆ తర్వాత వేమనపద్యాల ప్రభావం నా మీద బలంగా పడింది. ఆ శ్రమ తెలుగు సాహిత్యంలో ఇంకా ఇంకా పరిశోధించడానికి ఉపయోగపడింది. నేటి తరానికి వేమన పద్యాలు ఎంతవరకు అవసరమంటారు? వేమనను ఒక యోగిలాగానో, బైరాగిలాగానో భావిస్తారు కానీ, ప్రపంచంలో వేమనను మించిన కవి లేడన్నది నా అభిప్రాయం. నా గ్రంధం ‘ప్రజాకవి వేమన’ ఇప్పటివరకు అయిదు పునర్ముద్రణలు పొందిందంటే ఆ కవి పట్ల పెరుగుతున్న జిజ్ఞాసే అందుకు కారణం. తెలుగుభాషను కాపాడుకోవాలంటే వేమన పద్యాలు పిల్లలకు నేర్పితే చాలు. వేమననే మీ పరిశోధనకు ఎంచుకోవడం యాదృచ్ఛికమా? దైవికమా? ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక హైదరాబాద్లో ఇంజనీరింగ్ విద్యలో చేరాను. కానీ, నా మనసుకు పట్టలేదు. పరిశోధన సమయానికి వచ్చేసరికి వేమన పద్యాల మీదకు ఆలోచన మళ్ళింది. కారణం, నా చిన్ననాటి నుంచి ఊళ్లో చాలామంది నోట వేమన పద్యాలలోని సూక్తులు విని ఉన్నాను. ఇంట్లో నాన్న కూడా ఏదో ఒక సందర్భంలో వేమన పద్యాలలోని మాటలను ఉపయోగించే వాడు. వేమన జనంలోకి అంతగా ఎలా వెళ్లగలిగేడు అనే సందేహం నాకెప్పుడూ కలిగేది. దీంతో వేమన నా పరిశోధన గ్రంథమయ్యాడు. మీలో కవిత్వం పుట్టుక దైవికం అని భావిస్తారా? ఎప్పుడైనా సరే కవిత్వం అశాంతిలో నుంచి పుడుతుంది. సమాజంలో మనకు, సాటిమనిషికి జరుగుతున్న అన్యాయంలోంచి పుడుతుంది. ఎంతోమంది గొప్ప గొప్ప కవులు నా చిన్నతనంలోనే అంటే ఏడు, ఎనిమిది తరగతుల నుంచే పరిచయం అయ్యారు. అది నా అదృష్టం. ముఖ్యంగా సి.నారాయణరెడ్డి కవితలు నన్ను అమితంగా ఆకర్షించేవి. కవులతో పద్యాల్లోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవి. యాదగిరి గుట్టపైన బ్రహ్మోత్సవాల్లో జరిగే సాహిత్య, సంగీత కార్యక్రమాలు కూడా నా పసి మనస్సులో కవితాముద్రను వేశాయి. తెలుసుకోవడం పట్ల ఆసక్తి, సాధన మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పసితనంలో మొదలైన ఆసక్తి, ఆ తర్వాత సాధన ఈ రోజుకు ఇలా నిలిపింది. కవిత్వం పుట్టుక కోసం ఆలయాల సందర్శన ఏమైనా ఉపయోగపడిందా? అలాంటిదేమీ లేదు. అయితే నా కవితల్లో ‘కొండమీది గుడి’ ఒకటి. అందులో... ‘చిన్నప్పటి నుంచి కొండమీది గుడిని చూస్తూ ఆ రోడ్డు మీద ఎన్నో సార్లు వెళ్లాను. దగ్గర్నే ఉన్నట్టుంటుంది. నడిస్తే మైలున్నర. పెద్ద తలకు చిన్న కిరీటం పెట్టుకున్న పౌరాణిక పాత్రలా ఉంటుందా గుడి...’ అంటూ మొదలవుతుంది. ‘రెండు గంటలు కష్టపడి శిఖరాన్ని చేరుకున్నాను. కింది నుంచి గుట్ట చిన్నగా కనిపించేది. ఇక్కడి నుంచి లోకమూ అంతే! ‘ఇంత చిన్న గుడిలో ఒంటరిగా దేవుడెలా వుంటున్నాడో!’ ఇలాంటి అనేక సందేహాలు నా కవితలో పంక్తులుగా చేరిపోయాయి. కవిత్వంలో దైవాన్ని దర్శించడం అంటే...! ‘కాలాన్ని నిద్రపోనివ్వను’ కవితల్లో ఒక ఘర్షణ ఉంటుంది. ‘తంగేడుపూలు’లో ఒక వేదన ఉంటుంది. ‘జలగీతం’ అనే దీర్ఘకవితలో ఒక అనుభూతి ఉంటుంది. ‘జలగీతం’ కవిత ద్వారా నేను మళ్ళీ జన్మ ఎత్తిన భావన కలిగింది. నీటి విలువ ఎడారిలో ఉన్న వాళ్లకు తెలుస్తుంది. నీటి విలువ ఎడారిలో శుష్కించేవాళ్లకు తెలుస్తుంది...’ అంటూ జలం గురించి చెబుతుంది ఈ కవిత. ‘నీళ్లు లేని తనం ప్రాణాలను పీల్చేస్తుంది. నీళ్లు లేని తనం ఎంతటి వాణ్నయినా నిలువునా కూల్చేస్తుంది’ అంటూ వివరిస్తుంది. నీళ్లను సేవించినప్పుడైనా, అందులో స్నానించినప్పుడైనా మనం అనుభూతించాలి. ప్రేమగా అక్కున చేర్చుకోవాలి. ప్రతీబొట్టును ఆస్వాదించాలి. నీళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇదంతా జలగీతం కవిత ద్వారా తెలియజేశాను. సినారె ఈ కవితాసంపుటి ఆవిష్కరణలో ఒకమాట అన్నారు. ‘విశ్వంభర..లో నేను మట్టిని నమ్ముకున్నాను. ‘జలగీతం’లో నీవు నీటిని నమ్ముకున్నావు అన్నారు. ఏ పని చేసినా అందులో లీనమై చేయడం నాకు అలవాటు. కవిత్వంలో ఒక మంచిపదం పడటం కూడా ఒక జీవన్మరణ సమస్యలా అనిపిస్తుంది. అధ్యాపకుడిగా మీరు దర్శించిన దైవత్వం... అధ్యాపకుడి కంటే ముందు నేను టీచర్ని. తెలుగు నేర్పడానికి ముందు ప్రిపరేషన్ ఏముంటుంది... అనుకునేవారు కొందరు. కానీ, ప్రతి పాఠం, ప్రతి పద్యం పిల్లలకు నేర్పడానికి ముందు నేను విద్యార్థిగా మారేవాడిని. వారికొచ్చే సందేహాలు ఏయే రూపాలుగా వస్తాయో, ఎలా వాటిని తీర్చాలో ముందే నోట్సు సిద్ధం చేసుకునేవాడిని. విద్యార్థుల నుంచి ఎంతో నేర్చుకున్నాను. దాదాపు 40 ఏళ్ళ అధ్యాపక వృత్తిలో ఎంతో మంది శిష్యులకు అభిమాన గురువునయ్యాను. ఇది నాకు కలిగిన మరో అదృష్టం. దైవత్వాన్ని ఎలా దర్శించాలని మీ అభిప్రాయం...? సేవ ద్వారానే! మరో మార్గం లేదు. బాల్యంలో నేను ఎంతో దారిద్య్రాన్ని అనుభవించాను. పుస్తకాల కోసం, చదువుకోసం సరైన ఆర్థిక వనరులు లేని కారణంగా ఎంతో ప్రయాస పడ్డాను. నాలా తెలుగు భాష మీద అభిమానం ఉండి, ఇబ్బందులు పడే విద్యార్థుల పరిశోధనకు, వారి ఆసక్తికి 12 వేల పుస్తకాలతో మా ఇంటిపైన ఒక అంతస్తులో లైబ్రరీ ఏర్పాటు చేశాను. పరిశోధన చేసే విద్యార్థులు వాళ్ల ఐడీ కార్డుతో సంప్రదించి ఇక్కడే ఉండి చదువుకోవచ్చు. దైవం ఉందని అనిపించిన ఘటన...? వేమన పరిశోధనా గ్రంథం కోసం ఊళ్లు తిరుగుతూ రాజమండ్రి గౌతమీ గ్రంథాలయానికి వెళ్లాను. అక్కడ ఎవరూ పరిచయం లేరు. పగలంతా లైబ్రరీలో గడుపుతూ రాత్రిళ్లు ఆర్.టి.సి బస్స్టాండ్లో పడుకునేవాడిని. 25 సంవత్సరాల తర్వాత ఆ ఊరికే వైస్–ఛాన్స్లర్ హోదాలో వెళ్తే ఎందరో స్వాగతం పలకడం అదో అనుభూతి. సరస్వతీ దేవికి ఇచ్చే గౌరవం, మర్యాద ఎంతటిదో నాడు కళ్లారా చూశాను. మీరు దంపతులు అవడం దైవికమే అనుకుంటారా? గోపీ: ఏదో తెలియదు కానీ, అరుణకు మరుజన్మకు కూడా రుణపడి ఉన్నాను. మేం కాలేజీ రోజుల్లో క్లాస్మేట్స్. మాది నిజామాబాద్ జిల్లాలోని బోధన్. కులాంతర వివాహం కావడంతో మా ఇరువైపుల వారు ఒప్పుకోలేదు. నేను జీవితంలో నిలదొక్కుకునేంతవరకు ఓర్పుగా ఎదురు చూసింది. వేమనగ్రంథం పరిశోధన సమయంలో తను గర్భవతి. తనను ఒక్కదాన్ని ఉంచి నేను ఊళ్లు తిరగాల్సిన పరిస్థితి. గ్రంథం అచ్చువేయడానికి చేసిన అప్పులు పదేళ్లపాటు తీర్చుకుంటూ వచ్చాను. సాహిత్యానికి నేను చేసిన సేవ అరుణ ద్వారానే సాధ్యమైంది. అరుణ: ముమ్మాటికి దైవికమే! మేం కలుసుకోవడం, దంపతులు అవడం దైవికమే అనుకుంటాను. కవిత్వం కన్నా ముందుగా పరిచయమైన ఆయన వ్యక్తిత్వం బాగా నచ్చింది. ఆ తర్వాత కవితలు చదివి అబ్బురపడేదాన్ని. ఈయన ఇచ్చిన స్ఫూర్తితోనే నేనూ కవయిత్రిగా కొన్ని కవనాలు చేశాను. ‘మౌనమూ మాట్లాడుతుంది, పాటల చెట్లు, ఇత్తడి బిందెలు, అమ్మ ఒక మనిషి, హృదయమే వదనం, సూది నా జీవన సూత్రం, నిరీక్షణే ఒక గాయం, కొన్ని తీగలు– కొన్ని రాగాలు.’ పుస్తకాలుగా వచ్చాయి. ‘ప్రజాకవి వేమన’ గ్రంథం ఇప్పటి వరకు ఇన్ని పునర్ముద్రణలు పొందిందంటే ఆ కవి పట్ల పెరుగుతున్న జిజ్ఞాసే కారణం. తెలుగుభాషను కాపాడుకోవాలంటే వేమన పద్యాలు పిల్లలకు నేర్పితే చాలు. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
అత్తగారి ఇంటి ఎదుట మహిళ ఆందోళన
♦ న్యాయం చేయాలని డిమాండ్ ♦ మద్దతు తెలిపిన మహిళా సంఘాలు నేరేడుచర్ల (హుజూర్నగర్) : తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వివాహిత తన అత్తగారి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ స సంఘటన మంగళవారం మండలంలోని కల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఆందోళనకు సూర్యాపేటకు చెందిన మహిళా సంఘాలు మద్దతు పలికారు. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన అరుణకు నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన బుడిగె నాగరాజుతో 1998లో వివాహమైంది. వీరికి ఇద్దరు మగపిల్లలు. పెళ్లయిన కొద్దికాలం వరకు మంచిగానే సాగిన వీరి సంసారంలో విబేధాలు రావడంతో భార్యభర్తలు తరచూ గొడవలు పడుతుండేవారు. 2008లో అదనపు కట్నం కోసం వేధిం చాడని నాగరాజుపై అరుణ కేసు పెట్టి కోర్టును ఆశ్రయిం చింది. ఆనాటి నుంచి అరుణ పుట్టింట్లోనే ఉంటోంది. నాగరాజు పిల్లలిద్దరిని చదివించుకుంటూ మరో మహిళను పెళ్లి చేసుకోవడంతో వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఈ నేపథ్యంలో అరుణ మంగళవారం తనను ఆదరిచాలని తన పేరు మీద ఉన్న 3 ఎకరాల భూమిని తన ఇద్దరు కుమారులకు సమానంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారి ఇంటి ఎ దుట బైఠాయించింది. ఈమె ఆందోళనకు మహిళా సం ఘా ల మద్దతు తెలిపాయి. ఆందోళన జరుగుతున్న సమయంలో తన భర్త అందుబాటులో లేడు. విషయం తెలుసుకున్న నేరేడుచర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆం దోళన చేస్తున్న మహిళలను స్టేషన్కు వచ్చి వివాదం పరిష్కరించుకోవాలని సూచించడంతో స్టేషన్కు తరలివెళ్లారు. -
ఆ సమయంలో ఆర్కే అక్కడ లేరు...
మల్కన్గిరి : ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే కానీ, అరుణ కానీ లేరని, ఆర్కే కుమారుడు మున్నా మాత్రం ఎన్కౌంటర్లో మరణించినట్లు మల్కన్గిరి జిల్లా ఎస్పీ మిత్రభాను మహాపాత్రో, విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ తెలిపారు. కూంబింగ్కు వెళ్లిన పోలీసు బలగాలకు తారసపడిన మావోయిస్టులను లొంగిపోవాల్సిందిగా హెచ్చరించినప్పటికీ వారు వినకుండా కాల్పులు ప్రారంభించారని, తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురుకాల్పులు జరపడం వల్ల ఇంతమంది చనిపోయారని చెప్పారు. మల్కన్గిరి ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ఎన్కౌంటర్లో కొందరు తీవ్రంగా గాయపడి తప్పించుకు పారిపోయారన్నారు. ఒక్కరు కూడా తమకు లొంగిపోలేదని పేర్కొన్నారు. బూటకపు ఎన్కౌంటర్ ఎంతమాత్రం కాదన్నారు. చట్టప్రకారం, ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం మృతదేహాలను 72 గంటల పాటు భద్రపరుస్తామని, మృతుల సంబంధీకులు వస్తే అప్పగిస్తామని చెప్పారు. విజయనగరంలో ఉంటున్న మురళి కుటుంబసభ్యులు మాత్రమే ఇప్పటికవరకు తమను ఫోన్లో సంప్రదించారని, మృతదేహాన్ని తీసుకువెళతామని చెప్పారని తెలిపారు. కాగా ఏవోబీ ఎన్ కౌంటర్ ఘటనలో మొత్తం 28మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
చలపతి.. అరుణ..ఓ సెల్ఫీ
ఫొటో వెలుగులోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఎన్కౌంటర్ సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలంగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న కోరాపుట్-శ్రీకాకుళం డివిజినల్ కమిటీకి డిప్యూటీ కమాండర్గా వ్యవహరించిన చలపతి, ఈస్ట్ డివిజన్ సెక్రటరీగా పని చేసిన ఆయన భార్య అరుణ తాజా ఫొటోలు ‘సెల్ఫీ’ ద్వారానే పోలీసులకు చిక్కాయి! సోమవారం ఏవోబీలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరణించిన 24 మందిలో వీరిద్దరూ ఉన్నారు. చలపతి తలపై రూ.20 లక్షలు, అరుణపై రూ.5 లక్షల రివార్డు ఉంది. వారి తాజా ఫొటోల కోసం పోలీసులు అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఈ కారణంగానే భార్యాభర్తలు ఇద్దరూ పలు సందర్భాల్లో ఏజెన్సీ ప్రాంతంలో స్వేచ్ఛగా తిరగగలిగారు. అప్పట్లో వీరి కదలికలపై సమాచారం ఉన్నా.. గుర్తింపు సమస్య వల్లే పోలీసుల బలగాలు ఏమీ చేయలేకపోయాయి. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగించినట్లు అనుమానిస్తున్న చలపతి ఓ సందర్భంలో తన భార్యతో కలిసి దట్టమైన అటవీ ప్రాంతంలో సెల్ఫీ దిగాడు. దీన్ని అరుణ సోదరుడైన ఆజాద్ తన ల్యాప్టాప్లో భద్రపరుచుకున్నాడు. ఈ ఏడాది మే 4న విశాఖ జిల్లాలోని కొయ్యూరు మండలం మర్రిపాకలు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆజాద్తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఘటనాస్థలి నుంచి పోలీసులు కిట్ బ్యాగ్, ఆయుధాలతోపాటు ల్యాప్టాప్ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్టాప్ను విశ్లేషించిన పోలీసు వర్గాలకు ఈ సెల్ఫీ లభించింది. దీని ఆధారంగా భారీ సంఖ్యలో చలపతి, అరుణ పోస్టర్లు ముద్రించి పోలీసులు ఏజెన్సీ మొత్తం ప్రచారం చేశారు. దీంతో షాక్కు గురైన మావోయిస్టు కేంద్ర కమిటీ స్మార్ట్ ఫోన్ల వినియోగం, సెల్ఫీలు సహా ఫొటోలు తీసుకోవడంపై దాదాపు నిషేధం విధించింది. రెండు దశాబ్దాలకు పైగా అజ్ఞాతంలో ఉండి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చలపతి, అరుణల సెల్ఫీ వెలుగులోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఎన్కౌంటర్ అయ్యారు. సోమవారం ఎన్కౌంటర్ స్థలంలో వీరిద్దరినీ గుర్తిచడంలోనూ ఈ సెల్ఫీనే కీలక ఆధారంగా మారినట్టు సమాచారం. -
డి కె అరుణతో మనసులో మాట
-
వందేళ్ళ సూపర్ బామ్మ...!
గౌహతిః వందేళ్ళ వయసులోనూ ఆమె ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. స్వయంగా వృద్ధాశ్రమాన్ని స్థాపించి.. వయో వృద్ధులకు ఆసరాగాగా నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం గౌహతి సివిక్ అడ్మనిస్ట్రేషన్ కార్యాలయంలో అనుమతి కావాలంటూ ధరఖాస్తు చేసింది. అస్సాంకు చెందిన అరుణా ముఖర్జీ వయసు ఆగస్టు 31 నాటికి వందేళ్ళకు చేరింది. అయితేనేం.. ఆమె వృద్ధులకు సేవలందించేందుకు ఉవ్విళ్ళూరుతోంది. ఆశ్రమ నిర్వహణకు పర్మిషన్ కోరుతూ స్థానిక పౌర పరిపాలనా విభాగానికి ధరఖాస్తు చేసింది. దీంతో అక్కడి అధికారులు విస్తుపోయారు. వృద్ధాశ్రమాన్ని ఎవరు నిర్వహిస్తారంటూ మేయర్ అరుణను ఆరా తీశారు. వారి ప్రశ్నలకు ఏమాత్రం జంకని అరుణ.. ఎంతో ఉత్సాహంగా తానేనంటూ సమాధానం ఇచ్చింది. ఆమె ఆత్మవిశ్వాసానికి మురిసిపోయిన మేయర్ మ్రిగేన్ సరానియా సహా.. సిబ్బంది పర్మిషన్ కోసం కావలసిన పనులను వెంటనే చేసి పంపించారు. దీంతో ఆక్టోబర్ నాటికి అరుణ స్వయంగా ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. పెయింటింగ్, మ్యూజిక్, కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, సాఫ్ట్ టాయ్స్ తయారీ వంటి కళల్లో ఎంతోమందికి శిక్షణ ఇచ్చే నాలుగు సంస్థలు అరుణ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. దీంతో అరుణ ఆ ప్రాంతంలో అందరికీ సుపరిచితురాలు. కాస్త కంటిచూపు, వినికిడి శక్తి తగ్గడం తప్పించి మిగిలిన అన్నిరకాలుగా ఆరోగ్యంగా ఉన్నఆ ఉత్సాహవంతురాలు.. ఇంటిపనులను సైతం స్వయంగా చేసుకుంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఆమె.. కేవలం టీ బిస్కట్లు, సీజన్ లో అయితే కమలా ఫలాలు వంటి ఆహారంతోనే గత 70 ఏళ్ళుగా కాలం గడుపుతోంది. ఆ అలవాటును 1947 లో బంగ్లాదేశ్ యద్ధసమయంలో శరణార్థిగా ఉన్నపుడు ఆకలిని ఎదిరించేందుకు అలవరచుకుంది. బంగ్లాదేశ్ ఢాకాలో జన్మించిన అరుణ.. అస్పాంలోని గౌహతి కాటన్ కాలేజీలో పనిచేస్తున్న జాదూలాల్ ముఖర్జీతో వివాహం అనంతరం ఎనభై ఏళ్ళ క్రితమే అస్సాంలో స్థిరపడింది. భర్త మరణించి, సంతానం కెనడాలో స్థరపడటంతో అరుణ చాలాకాలంనుంచీ స్వతంత్రంగానే జీవిస్తోంది. వందేళ్ళ వయసులోనూ వరదల సమయంలో ఆయాప్రాంతాల్లో పర్యటించి, ఆపన్నులకు సేవలు అందిస్తున్న అరుణ జీవిత కథను.. ఓ ప్రముఖ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ చిత్రంగా కూడా మలిచేందుకు ప్రయత్నిస్తోంది. -
రైల్వే ట్రాక్పై మహిళ మృతదేహం
ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో రైల్వే ట్రాక్పై మృతిచెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయపల్లి రైల్వే స్టేషన్లో శుక్రవారం వెలుగుచూసింది. రెలు ఢీకొని మృతిచెందిన ఆనవాళ్లు లేకపోవడంతో.. ఎవరో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు స్థానికంగా నివాసముండే బానోతు అరుణ(25)గా పోలీసులు నిర్ధరించారు. -
భర్తకు అంతిమ సంస్కారాలు చేసిన భార్య
కడదాకా తోడుంటానని తలపై చెయ్యేసి ఒట్టేసి... బతుకంతా నీడనిస్తానని తాళిబొట్టు సాక్షిగా మాట ఇచ్చి.. తనతో కలిసి ఏడడుగులు నడిచిన భర్త అర్థాంతరంగా కనుమరుగైతే ఆమె కన్నీరుమున్నీరయింది. తోడూనీడగా ఉండాల్సిన వాడు కానరాని లోకాలకు తరలిపోయి తనను ఒంటరి చేసినందుకు బోరున ఏడ్చింది. తిరిగిరాని లోకాలకు బయల్దేరిన భర్తకు తానే తుడి వీడ్కోలు పలకాలని భావించి అంతిమ సంస్కారాల్లో పాలుపంచుకుంది. కుటుంబ సభ్యులు వారిస్తున్నా కాదని కన్నీళ్లతో అంత్యక్రియలు నిర్వర్తించి భార్యాభర్తల బంధానికి కొత్త అర్థాన్ని చెప్పింది. రోలుగుంట : దశాబ్దానికి పైగా సాగిన ఆ కాపురాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో.. అనారోగ్యం రూపంలో భర్తను కాటేసింది. మృత్యువు పగబట్టి ఆ బంధాన్ని విడదీసింది. విశాఖ జిల్లా మండల కేంద్రం రోలుగుంటలో లారీ డ్రైవర్గా పని చేస్తున్న ఆడారి అప్పారావు జీవితం అస్వస్థత కారణంగా అర్థాంతరంగా ముగిసిపోయింది. పదేళ్లుగా అప్పారావు, అరుణల వైవాహిక జీవితం ఉన్నంతలో సాఫీగా సాగింది. పదేళ్లకు పైగా తనతో తోడూనీడగా నడిచిన భర్త ఏడాది అనారోగ్యం తర్వాత తిరుగురాని లోకాలకు వెళ్లే సరికి అరుణ గుండెలవిసిపోయే విధంగా రోదించింది. అన్నీ తానైన భర్త కనుమరుగైన తన దురదృష్టాన్ని తలచుకుని కుమిలిపోయింది. ఇంతకాలం తనకు ఆసరాగా నిలిచిన భర్త రుణాన్ని ఏదో విధంగా తీర్చుకోవాలని ఆమె తలచింది. బుధవారం భర్త అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తుండగా తాను అంతిమ క్రియల్లో పాల్గొంటానని చెప్పింది. అప్పారావు తోడబుట్టిన వారు, బంధువులు వారించినా కాదని తానే చితికి నిప్పంటించి భార్యగా రుణాన్ని తీర్చుకుంటానని పట్టుబట్టి తన మాట నెగ్గించుకుంది. మృతదేహాన్ని రుద్రభూమికి తీసుకెళ్లినపుడు దారి పొడవునా ముందు నడిచి, రుద్రభూమిలో భర్త భౌతిక దేహం చుట్టూ కుండతో మూడు సార్లు ప్రదక్షిణ చేసి చితికి నిప్పు అంటించింది. గ్రామానికి చెందిన అనేక మంది మహిళలు ఆమె వెంట రుద్రభూమికి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
లే‘ఔట్’..!
♦ జిల్లా పరిధిలో 102 అక్రమ లేఅవుట్లు రద్దు ♦ గ్రామీణ ప్రాంతాల్లో అనధికారికంగా వెలిసిన వెంచర్లు ♦ అక్రమమని తేలుస్తూ పంచాయతీరాజ్ శాఖకు నివేదిక ♦ వాటిని రద్దు చేస్తూ డీపీఓ ఉత్తర్వులు అక్రమ లేఅవుట్లపై జిల్లా యంత్రాంగం కొరడా ఝళిపించింది. అనధికారికంగా వెలిసిన వెంచర్లపై ఉక్కుపాదం మోపింది. డెరైక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) పరిధిలోని మండలాల్లో పుట్టుకొచ్చిన 102 అక్రమ లేఅవుట్లను రద్దు చేసింది. ఎలాంటి అనుమతుల్లేకుండా అడ్డగోలుగా వెలిసిన వెంచర్ల చిట్టాను సేకరించిన డీటీసీపీ విభాగం అక్రమార్కుల జాబితాను జిల్లా పంచాయతీరాజ్ శాఖకు పంపింది. ఈ మేరకు డీటీసీపీ నిర్ధారించిన 102 అక్రమ లేఅవుట్లను రద్దు చేస్తున్నట్లు డీపీఓ అరుణ ప్రకటించారు. కేసులు పెడతాం.. అనధికారికంగా వెలిసిన లేఅవుట్లను కూల్చేస్తాం. 102 ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తాం. అధికార దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్లు, కార్యదర్శులు, విస్తరణాధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకుండా అడ్డగోలుగా లేఅవుట్లు చేస్తే ఉపేక్షించేది లేదు. అక్రమమని తేల్చిన లేఅవుట్ల జాబితాను ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరుస్తాం. ప్లాట్లు కొనేముందు ఆయా వెంచర్లకు అనుమతి ఉందా? లేదా అనేది ఒకసారి సరిచూసుకుంటే మోసాల బారినపడే అవకాశముండదు. - అరుణ , డీపీఓ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : లేఅవుట్లకు అనుమతి ఇచ్చే ఎలాంటి అధికారం గ్రామ పంచాయతీలకు లేదు. హెచ్ఎండీఏ పరిధిలో హెచ్ఎండీఏకు.. ఆ పరిధి దాటిన మండలాల్లో డీటీసీపీకి మాత్రమే లేఅవుట్లకు అనుమతులు జారీ అధికారం ఉంది. అయితే, ఈవిషయాన్ని గుట్టుగా ఉంచుతున్న రియల్టర్లు పంచాయతీ లేఅవుట్ల పేర కొనుగోలుదారులను ఏమార్చుతున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా.. అభివృద్ధి చేయని వెంచర్లలో కారుచౌకగా ప్లాట్లు విక్రయిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. అప్రూవ్డ్ లేఅవుట్లతో పోలిస్తే తక్కువ ధరకు స్థలాలు దొరుకుతుండడంతో అల్పాదాయవర్గాలు ఈ వెంచర్లలో ప్లాట్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నాయి. మధ్యతరగతి ప్రజల బలహీనతలను సొమ్ముచేసుకుంటున్న స్థిరాస్తి సంస్థలు.. మారుమూల ప్రాంతాల్లో సైతం వెంచర్లు చేశాయి. కనీస రోడ్లు, విద్యుత్ స్తంభాలు కూడా వేయకుండా.. నాలుగు రాళ్లు పాతి ప్లాట్లుగా విక్రయించి చేతులు దులుపుకుంటున్నారు. కొ న్ని సంస్థలయితే.. భూ వినియోగ మార్పి డి చేయకుండానే లేఅవుట్లుగా అభివృద్ధి చేసినట్లు డీటీసీపీ అధికారుల పరిశీలనలో తేలి ంది. అంతేకాకుండా కొన్నిచోట్ల భూ యజ మానికి కొంత మొత్తం చెల్లించి అగ్రిమెంట్ కాపీతోనే ప్లాట్లను అమ్మేస్తున్నట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే అక్రమ లేఅవుట్లపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సర్వేచేసిన డీటీసీపీ అధికారుల బృందం జిల్లావ్యాప్తంగా దా దాపు 400 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ లేఅవుట్లు (102) వెలిసినట్లు తేల్చి జాబితాను జిల్లా పంచాయతీశాఖాధికారికి అంద జేసింది. -
215 ప్యాకెట్ల పత్తి విత్తనాల సీజ్
ఖమ్మం అర్బన్ మండలం చిమ్మపుడిలో ఎలాంటి అనుమతి లేకుండా కొందరు వ్యాపారులు వీధుల్లో, రైతుల ఇళ్ల వద్ద పత్తి విత్తన ప్యాకెట్లు విక్రయిస్తుండగా, వ్యవసాయ శాఖ ఏడీ కొంగర వెంకటేశ్వరరావు, ఏఓ అరుణ శుక్రవారం అడ్డుకున్నారు. గుంటూరు నుంచి తీసుకొచ్చి బయటి మార్కెట్ కంటే రూ.40 తగ్గించి జాదు, ఏటీఎం, అజిత్, తదితర పేర్లతో ఉన్న 75 ప్యాకెట్లను రైతులకు అమ్మినట్లు గుర్తించారు. అందుబాటులో ఉన్న 215 ప్యాకెట్లను సీజ్ చేశారు. వ్యాపారులు ఉన్నం నాగేశ్వరరావు, కుసు అనిల్, కొంటెముక్కల నిఖిల్లపై కేసు నమోదు చేశారు. ఈ విత్తనాల నాణ్యత పరీక్షించేందుకు ల్యాబ్కు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. -
నీటి కోసం వచ్చి.. కుక్కల పాలైంది..
అడవిలో నీళ్లు దొరక్క గ్రామ సమీపంలోకి వచ్చిన ఓ జింకపై కుక్కలు దాడి చేయడంతో మృత్యువాత పడింది. రంగారెడ్డి జిల్లా మోమిన్పేట మండలం రావులపల్లిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక అడవిలోంచి ఓ జింక ఉదయం దాహం తీర్చుకునేందుకు రావులపల్లి గ్రామ సమీపంలో నిర్మిస్తున్న సోలార్ ప్లాంటు వద్దకు వచ్చింది. ఈక్రమంలో నీళ్లు తాగుతున్న జింకపై వీధికుక్కలు దాడి చేశాయి. గాయపడిన జింకను అక్కడే ఉన్న రైతులు గమనించి చేరదీసి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. వికారాబాద్ నుంచి అధికారులు రావడం ఆలస్యమవడంతో పరిస్థితి విషమించి జింక మృతి చెందింది. అనంతరం ఫారెస్టు రేంజ్ అధికారి అరుణ జింకను ఖననం చేశారు. -
చెరువులో పడి మహిళ మృతి
చెరువులో పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం నల్లగొట్టపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అరుణ (30) అనే మహిళ దుస్తులు ఉతుక్కునేందుకు చెరువు దగ్గరకు వెళ్లగా కాలు జారి నీటిలో పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. -
బిచ్చమైనా ఎత్తుకుంటా గానీ టీఆర్ఎస్ లో చేరను: డీకే అరుణ
♦ మా తమ్ముడు నాన్నకు, నాకు మచ్చ తెచ్చాడు ♦ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొట్టిన చెంపదెబ్బ గుర్తు లేదా? ♦ చిట్టెం రామ్మోహన్రెడ్డిపై అరుణ ధ్వజం సాక్షి, హైదరాబాద్: కష్టాలు వస్తే బిచ్చమైనా ఎత్తుకుంటా గానీ టీఆర్ఎస్లో చేరేది లేదని మాజీ మంత్రి, గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ స్పష్టం చేశారు. గురువారం గాంధీభవన్లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన తమ్ముడు, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరడం దారుణమన్నారు. పైగా నియోజకవర్గ అభివృద్ధి, బీమా ప్రా జెక్టు కోసమే పార్టీ మారుతున్నాననడం సిగ్గుచేటన్నారు. ‘‘కాంగ్రెస్ హయాంలోనే బీమా 90 శాతం పూర్తయింది.ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్ చేసేదేమిటి? నా తండ్రి చిట్టెం నర్సిరెడ్డి ప్రతిష్టకు, నా ప్రతిష్టకు రామ్మోహన్ మచ్చ తెచ్చాడు. కుటుంబ ప్రతిష్టను, ప్రజల విశ్వాసాలను వమ్ము చేస్తూ పార్టీ మారడం సరైంది కాదు. 1996లో నేను టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేశాను. అప్పుడు మక్తల్ ఎమ్మెల్యేగా మా తండ్రి నర్సిరెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే పని చేశారు. సొంత కూతురు ఓడిపోతుందని తెలిసినా పార్టీకే కట్టుబడ్డారు. కాంగ్రెస్ గెలుపు కోసం పని చేసి తన అంకితభావాన్ని నిరూపించుకున్నారు’’ అని డీకే గుర్తుచేశారు. 2004లో తన తండ్రిని, మరో సోదరుడిని నక్సల్స్ కాల్చి చంపితే, వారి వారసత్వంతో అనివార్యంగా రామ్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఎవరి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారో, ఎవరి ప్రతిష్టకు మచ్చ తెచ్చారో, ఎవరి ఆశయాలకు తూట్లు పొడిచారో ఆయనే ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. మొన్నటికి మొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే చేతిలోనే రామ్మోహన్రెడ్డి చెంపదెబ్బ తిన్న విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. చెంప దెబ్బ కొట్టినా ఎలా వెళ్లాడో, కొట్టిన వ్యక్తి తాలూకు పార్టీలో ఎలా చేరారో అర్థం కావడం లేదన్నారు. నైతిక విలువలకు కట్టుబడి రాజకీయాలు చేయాలనుకుంటే కాంగ్రెస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, టీఆర్ఎస్ నుంచి మళ్లీ గెలవాలని తమ్మునికి అరుణ సవాలు విసిరారు. పార్టీ మారుతున్నట్టుగా తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అరుణ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. ‘‘నన్ను ఆర్థికంగా దెబ్బకొట్టే ప్రయత్నం జరుగుతోంది. అయినా సరే, ఎంత ఇబ్బంది పెట్టినా టీఆర్ఎస్లోకి వెళ్లేది లేదు’’ అని స్పష్టం చేశారు. -
రూ.110కోట్ల పన్నుల వసూలు లక్ష్యం
♦ మార్చి నెలాఖరు వరకు స్పెషల్డ్రైవ్ ♦ జిల్లా పంచాయతీ అధికారి అరుణ శంషాబాద్ రూరల్ : జిల్లాలో రూ.110 కోట్ల ఆస్తిపన్ను వసూళ్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) అరుణ తెలిపారు. మండలంలో పన్ను వసూళ్లపై పంచాయతీ కార్యదర్శులు, బిల్కలెక్టర్లతో ఆమె గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల చివరి వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి లక్ష్యం మేరకు వసూళ్లు అయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో సుమారు రూ.166కోట్ల ఆస్తిపన్ను డిమాండ్ ఉండగా.. రూ.110కోట్ల వసూళ్లు లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు దాదాపు రూ.87కోట్లు ఆస్తిపన్ను వసూలు అయిందని, గత ఏడాది 104కోట్ల రూపాయలు వసూలు అయ్యాయని జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు. పంచాయతీల్లో కంప్యూటరీకరణకు చర్యలు తీసుకుంటామని, దీంతో పారదర్శకంగా పాలన అందించే అవకాశం ఉంటుందన్నారు. విద్యా సంస్థల నుంచి రావాల్సిన పన్ను బకాయిలను వసూలు చేయడానికి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు రోజువారి పన్ను వసూళ్ల వివరాలను తన సెల్కు మెసేజ్ ద్వారా పంపించాలని ఆదేశిం చారు. అంతకుముందు ఆమె ముచ్చింతల్ పంచాయతీలోని ‘జీవా’ ప్రాంగణాన్ని సందర్శించారు. జీవా ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ నిర్మించిన కట్టడాలకు పన్ను నుంచి మినహాయించాలని వచ్చిన అభ్యర్థన మేరకు డీపీఓ అరుణ భవన నిర్మాణాలను పరిశీ లించినట్లు సమాచారం. -
ఎక్కం చెప్పలేదని చావబాదాడు...
ఉపాధ్యాయుడిపై కేసు నమోదు తుర్కయంజాల్: చిన్నారులను సొంతబిడ్డల్లా లాలిస్తూ.. వారికి అర్థం అయ్యేలా విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు క్రమశిక్షణ పేరుతో చావబాదుతున్నారు. క్లాసు లో అల్లరి చేశారనో, హోంవర్క్ చేయలేదనో.. తమ మాట వినలేదనో చేయి చేసుకుంటున్నారు. చదువు పేరుతో విద్యార్థులను దండిస్తే కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ హెచ్చరిస్తున్నా... ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం పట్టించుకోవడంలేదు. ఎక్కం చెప్పలేదని గణిత ఉపాధ్యాయుడు కొట్టడంతో విద్యార్థిని ఆసుపత్రి పాలైన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో జరిగింది. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం... హయత్నగర్ మండలం ఇంజాపూర్ గ్రామం తుల్జాభవానీనగర్ కాలనీ నివాసి వడ్త్యా శ్రీను, సునీతల కుమార్తె అరుణ శ్రీకృష్ణదేవరాయనగర్ కాలనీ లోని కార్తికేయ కాన్సెప్ట్ స్కూల్లో 5వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం గణిత ఉపాధ్యాయుడు రాజు.. అరుణను 18వ ఎక్కం చెప్పమన్నాడు. తాను 18వ ఎక్కం కంఠస్థం చెయ్యలేదని... 19వ ఎక్కం నేర్చుకొచ్చానని చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన ఉపాధ్యాయుడు అరుణ మెడపై కట్టెతో కొట్టాడు. దీంతో అరుణ మెడ ఒక వైపునకు వంగి సరిగ్గా రావడం లేదు. అనంతరం తల్లిదండ్రులకు చెప్పవద్దని బెదిరించి.. నొప్పి తగ్గడానికి మాత్రలు తెచ్చి ఇచ్చాడు. రెండు రోజుల నుంచి ఇలా నొప్పిని భరిస్తూనే అరుణ పాఠశాలలో జరుగుతున్న పరీక్షలకు హాజరవుతోంది కాని తల్లిదండ్రులతో చెప్పలేదు. బుధవారం మధ్యాహ్నం నొప్పి తీవ్రం కావడంతో భరించలేక ఏడుస్తూ తండ్రి శ్రీనుకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే శ్రీను ఏఐఎస్ఎఫ్ విద్యార్థి విభాగం నాయకుడు గ్యార క్రాంతికుమార్ని తీసుకుని పాఠశాలకు వెళ్లి.. తమ పాపను ఎందుకు కొట్టారని నిల దీశాడు. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం అరుణను హస్తినాపురంలోని డెల్టా ఆసుపత్రిలో చేర్పిం చింది. డాక్టర్లు బాలికకు పలు పరీక్షలు చేసి చికిత్సలందిస్తున్నారు. అనంతరం డాక్టర్ రమేష్ మాట్లాడుతూ.. కట్టెతో కొట్టడం వల్ల అరుణ మెడ నరం పట్టుకుందని, ఆమెకు ఎలాంటి అపాయం లేదన్నారు. కాగా బాలికను కొట్టిన ఉపాధ్యాయుడు రాజు పాఠశాలకు సెలవుపెట్టి, ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. పూర్తి వైద్యం చేయించాలి: ఏఐఎస్ఎఫ్ విద్యార్థిని అరుణకు పూర్తి వైద్య ఖర్చులను పాఠశాల యాజమాన్యం భరించాలి. అదే విధంగా విద్యార్థినిని కొట్టి, వెకిలి చేష్టలతో దూషించిన ఉపాధ్యాయుడు రాజుపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకుడు గ్యార క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడిపై క్రిమినల్ కేసులు పెట్టాలి సిటీబ్యూరో: ఎక్కం చెప్పలేదని విద్యార్థినిని చితకబాదిన ఉపాధ్యాయుడు రాజును అరెస్టు చేయాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు బుధవారం డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు స్కూల్పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎందుకిలా ఉన్నావ్ ... ‘నువ్వు ఎందుకిలా బండలా ఉన్నావ్..... 5వ తరగతిలోనే నా అంత ఎత్తు పెరిగావు’... అంటూ గణితం టీచర్ రాజు అసభ్యంగా వెకిలి చేష్టలతో దూషించే వాడని బాధిత విద్యార్థిని అరుణ తెలిపింది. -
భవనంపై నుంచి పడి యువతి మృతి
హైదరాబాద్: భవనంపై నుంచి పడి ఓ యువతి మృతి చెందింది. ఈ సంఘటన నగరంలోని అమీర్పేట్లో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. విజయా డయాగ్నసిస్లో టెక్నిషియన్గా పని చేస్తోన్న అరుణ అనే యువతి భవనం పై నుంచి పడి మృతి చెందింది. ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు పై నుంచి జారిపడిందా లేక ఆత్మహత్య చేసుకుందా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు కేరళకు వాసిగా గుర్తించారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
మైనర్ బాలికకు పెళ్లీ చేయాలనుకున్న ఓ కుటుంబానికి రెవెన్యూ అధికారులు నచ్చజెప్పి బాల్య వివాహాన్ని అడ్డుకున్న సంఘటన గురువారం మెదక్ జిల్లా దుబ్బాక నగర పంచాయతీ పరిధిలోని ధర్మాజీపేటలో జరిగింది. తహశీల్ధార్ అరుణ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కొత్తోళ్ల లక్ష్మి, చంద్రయ్య పద్నాలుగేళ్ల కూతురు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. మైనర్ అమ్మాయికి మండల పరిధిలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఎర్రోల్ల స్వామితో వివాహాం చేయడానికి ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి.. వివాహాన్ని రద్దు చేశారు. అనంతరం కుటుంబానికి కౌన్సిలింగ్ ఇచ్చారు. -
వేధింపులతో మహిళ బలవన్మరణం
తాడిమర్రి: లైంగిక వేధింపుల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం దాడితోట గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల కథనం... గ్రామానికి చెందిన ఎన్. అరుణ(30) భర్త నాగరాజు రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో ఆమె అత్త, ఇద్దరు పిల్లలతో కలసి గ్రామంలో ఉంటోంది. కాగా, ఇటీవల ఆమెకు గ్రామానికి చెందిన కొందరి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే గురువారం వేకువజామున ఇంటి పక్కనే అంగడి ప్రాంతంలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
స్థానిక ఎమ్మెల్సీ పోలింగ్లో స్వల్ప ఉద్రిక్తత
హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం జరుగుతున్న స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు దారి తీసింది. మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల పోలింగ్ కేంద్రం వద్ద జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, డీకే అరుణ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు ఇరు వర్గాల వారిని పోలింగ్ కేంద్రం వద్ద నుండి చెదరగొట్టారు. నల్లగొండ జిల్లాలో పోటీ తీవ్రంగా ఉండటంతో పోలింగ్ రసవత్తరంగా మారింది. సుమారు 200 మంది అనుచరులతో పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలింగ్లో పాల్గొనే వారిని క్యాంపుల నుండి నేరుగా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలిస్తున్నారు. -
నన్ను చంపేస్తారేమో..
ఇదే అత్తింటి నుంచి ఆఖరి ఫోన్ వెళ్లేసరికే కూతురు శవమైంది గృహహింస చట్టం కింది శిక్షించాలి శైలజ తల్లిదండ్రుల వినతి విశాఖపట్నం: ‘మా అమ్మాయి ఆ రోజు ఉదయమే ఫోన్ చేసింది.. భర్త, ఆడపడుచులు చిత్రహింసలు పెడుతున్నారని, చంపేస్తారేమోనని భయం వ్యక్తం చేసింది.. మర్నాడు మేం వెళ్లే సమయానికి ఆమె ఉరి వేసుకొని చనిపోయినట్లు అత్తింటి వారు చెప్పారు. ఆత్మహత్య చేసుకుంటే ఒంటిపై బలమైన గాయాలు ఎందుకుంటాయి..?’ అని శైలజ తల్లిదండ్రులు రౌతు అప్పారావు, అరుణ కన్నీటితో ప్రశ్నించారు. గత నెల 29న విజయనగరంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తమ కుమార్తె కేసును గృహహింస చట్టం కింద విచారించాలని వారు శనివారం డీఆర్డీఏ కార్యాలయం శిశు సంక్షేమ శాఖలోని గృహహింస చట్ట విభాగంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు సాక్షితో తమ ఆవేదన పంచుకున్నారు. వేపగుంట మండలం అప్పన్నపాలేనికి చెందిన రౌతు అప్పారావు, అరుణ 2012లో విజయనగరం జొన్నగుడ్డి ప్రాంతంలోని రెల్లివీధికి చెందిన ఎర్రంశెట్టి శ్రీనివాసరావుతో తమ కుమార్తె శైలజకు వివాహం జరిపించారు. రూ.2 లక్షల కట్నంతోపాటు 30 తులాల బంగారం దఫదఫాలుగా చదివించుకున్నారు. అయినా అదనపు కట్నం కోసం భర్త, ఆడపడుచులు వేధిస్తూ తమ కూతురిని చిత్రహింసలు పెట్టేవారని తెలిపారు. కొద్ది రోజుల క్రితం రూ.2 లక్షలు తేవాలంటూ భర్త వేధించడం మొదలుపెట్టాడని, పిల్లలు పుట్టలేదని ఆడపడుచుల వేధింపులు కూడా ఎక్కువయ్యాయని తెలిపారు. భర్త, అత్తమామలు, ఆడపడుచులు చిత్రహింసలు పెట్టి చంపేసి, ఆత్మహత్యగా చిత్రించడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ విజయనగరంలో ఒకటో పట్టణ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమ కుమార్తె చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. -
అగర్తల అసిస్టెంట్ కలెక్టర్గా నిజామాబాద్వాసి
కమ్మర్పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామానికి చెందిన బోగ నిత్యానంద్, అరుణ దంపతుల పెద్ద కూతురు విశ్వశ్రీ త్రిపురలోని అగర్తలా జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా సోమవారం బాధ్యతలు చేపట్టారు. 2014 జూన్ 12న వెలువడిన యూపీఎస్సీ ఫలితాలలో విశ్వశ్రీ సివిల్స్కు ఎంపికయ్యూరు. ఇండియన్ రైల్వే ట్రాక్ సర్వీస్ (ఐఆర్టీఎస్) శిక్షణలో ఉండగానే సివిల్స్ రాసి 346 ర్యాంక్ సాధించారు. భర్త నక్క భానుశ్యాం ఉద్యోగ రీత్యా డిల్లీ లో స్థిరపడడంతో అక్కడికి వెళ్లారు. అక్కడి నుంచే సివిల్స్ పరీక్ష రాసి ఎంపికయ్యూరు. -
అరుణ అదృష్టవంతురాలు... కానివారో?
సందర్భం - మహేష్ విజాపుర్కార్ అరుణ శాన్బాగ్ లైంగిక దాడికి గురై, మెడకు కుక్క గొలుసు బిగుసుకుపోయి ఊపి రాడక గత నాలుగు దశాబ్దాలు గా ముంబైలోని ఒక ఆసు పత్రిలో అచేతనావస్థలో పడి ఉంది. ఆ కారణంగానే కారు ణ్య మరణం లేదా పాక్షిక కారు ణ్య మరణంపై చర్చ జరుగుతూనే ఉన్నా ఏమంత ముం దుకు సాగలేదు. నలభై ఏళ్లుగా మంచానికే అంటి పెట్టుకుని ఉన్నా అరుణ శరీరంపై ఒక్క పుండు కూడా పడకపోవడం మునిసిపల్ నిర్వహణలోని కేఈఎమ్ ఆసుపత్రికి గర్వదాయకం. అదే ఆసుపత్రిలోని బేస్మెంట్లో ఈ విషాదం జరిగేటప్పటికి ఆమె అక్కడ యువ నర్సు. ఆమెను కాపాడటం కోసం అత్యవసర చికిత్స గదిలోకి తీసుకు వచ్చేట ప్పటికి అన్ని శాఖల నిపుణులూ సహాయం అదించడం కోసం అక్కడికి చేరుకున్నారు. ఆమె పట్ల ప్రదర్శించిన శ్రద్ధ, సేవాభావం ప్రైవేటుదైనా, ప్రభుత్వం నడిపేదైనా దేశంలోని ప్రతి ఆసుపత్రికీ ప్రమాణం కావాలి. కానీ పరిస్థితి అలా ఉందా? ఉంటుందని ఆశించగలమా? నేటి ఆరవ వేతన సంఘం వేతనాలతో పోలిస్తే అప్పట్లో అరుణకు లభించినది అత్యల్పం. ఆమెగాక మరెవరైనా అత్యాచారం, గొంతు నులిమివేత బాధితు రాలై ఉంటే ఆమె ఎలా ఉండేది? అసలు ఆమెకు ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స అందించేవారేనా? అలా అచేత నావస్థలో పడి ఉండటానికైనా నోచుకునేదేనా? ఆమె తరఫున ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఆమెకు తెలిసేదే కాదు. ఆమె చికిత్స వ్యయానికి ఆ కుటుంబం సర్వస్వం కోల్పోయి బికారులై ఉండేదే. తరచుగా ఖరీదైన పరీక్షలు, వైద్యపరమైన జోక్యం అవసరం లేకపోయినా ప్రైవేటు ఆసుపత్రులైతే లాభాలు పిండటానికి దొరికిన మరో పేషంటు కోసం స్థలం కేటా యించేవే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీర్ఘకాలిక అచేతన స్థితిలో ఉన్న రోగి పట్ల ఆసక్తి ఉండదనే చెప్పాలి. అరుణ శాన్బాగ్ మాత్రమే అందుకు మినహాయింపు, ఆమె కూడా ఆ ఆసుపత్రికే చెందిన మనిషి. కాలక్రమేణా ఆ ఆసుపత్రికి, ఆమెకూ మధ్య అనుబంధం బలపడింది. ఆమెను దీర్ఘకాలిక స్వస్థత గృహానికి తరలించేట్ట యితే ఆందోళనకు దిగుతామని ఆమె సహోద్యోగు లంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వస్థత గృహాలుగా చెప్పేవి మన వైద్య వ్యవస్థలో అల్ప ప్రాధాన్యం గలవి. మన చుట్టుపక్కల ఎక్కడా అలాంటివి కనబడవు లేదా కనిపెట్టడ మే కష్టం. గత వారం అరుణ మరణానంతరం ఆ ఆసుపత్రి డీన్, ఆమె బంధువుతో కలసి అంత్య క్రియలను నిర్వహించారు. అరుణ విషయంలో కారు ణ్య మరణాన్ని అనుమతించవచ్చంటూ సుప్రీం కోర్టు జోక్యం చేసుకోగా, ఆసుపత్రి సిబ్బంది నిరవధికంగా ఆమెకు సేవలు చేస్తామని అఫిడవిట్లు ఇచ్చారు. ఆమె అదృష్టవంతురాలు. ఒక నిస్సహాయ వ్యక్తి పట్ల అంతటి అంకితభావాన్ని చూపడం నిజంగానే హృదయాన్ని కదిల్చేది, ప్రశంసనీయమైనది. దురదృష్టవశాత్తూ, సార్వత్రికంగా అలాంటి ప్రతి దీర్ఘకాలిక రోగిని ఆసుపత్రిలో సజీవంగా ఉంచాలనడం తప్పు. ఆమెది ఒక విలక్షణమైన కేసు. కానీ ఆమెకు అందించినంత నాణ్యమైన సేవలు ప్రతి ఒక్కరికీ అందా ల్సినవి, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నిటిలో అందు బాటులో ఉండాల్సినవి. కానీ అక్కడా ఇక్కడా కూడా అవి కొరవడుతున్నాయి. వివిధ కారణాల రీత్యా వైద్య రంగంలో ప్రభుత్వ ఆసుపత్రుల నిష్పత్తి క్షీణించిపోతోం దని, ప్రైవేటు ఆసుపత్రులు పీడకలలేనని అనుభవం ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వాసుపత్రుల్లో రోగికి మంచ మే కరువు. పడకల సామర్థ్యాన్ని మించి ఉన్న పేషంట్లం తా నేల మీద చాప పరుచుకు పడుకోవడమే రివాజు. డాక్టర్లు సహా సిబ్బంది కొరత, మందుల షెల్ఫ్లు ఖాళీగా ఉండటం, బంధువులే రోగులకు సేవలు చేయా ల్సిరావడం, మొదలైనవి ఈ వ్యవస్థ ఏర్పాట్ల గురించి బోలెడు తెలుపుతుంది. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం ఖర్చులు ఊహిం పరానివి. వాటికి లాభాలు ముఖ్యం. అనవసరమైన పరీక్షలు, అధిక చార్జీలు, ప్రమాదకరంగా మందులు ఎక్కువగా రాయడమూ తప్పవు. రూ. 25,000కు దిగు మతి చేసుకునే స్టెంట్కు ఒక రోగి నుంచి రూ.1.5 లక్షలు వసూలు చేశారని తెలిసింది. అయినా, ఎందువలనో దిగువ మధ్యతరగతివారు కూడా ఖరీదైనవైనా ఆ ఆసుప త్రులవేపే మొగ్గుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు తక్కువగా ఉండటం ఒక్కటే అందుకు కారణం కాదు. రెండు రకాల ఆసుపత్రుల్లోనూ సంస్థాగత నైతిక విలువలు కొరవడటమే ఈ పరిస్థితులకు అసలు కార ణం. అత్యుత్తమమైన వాటితో తులతూగే వైద్య సేవలు చౌకగా లభించే అవకాశం ఉన్నా అవి విధాన కర్తలను లేదా మదుపరులను ఊరించ గలిగేవి కావు. అరుణ శాన్బాగ్ బంధువులలో పలువురు ఆమెకు దూరంగా ఉండిపోయారు. ఆమెను జీవించి ఉంచడానికి అయ్యే వ్యయాల భయమే వారిని దూరంగా తరిమింది. బాధాకరమైన 40 ఏళ్ల తర్వాత ఆమె మరణించాక వారి లో చాలా మంది వచ్చారు. ఎంతో మంది రోగగ్రస్తులు చార్జీలను సైతం భరించలేక బూటకపు వైద్యులతో సరిపె ట్టుకుంటారు. ఆదాయం, విద్య తర్వాత జీవితంలో కోరుకునే ముఖ్యాంశం మంచి ఆరోగ్యమే. ఆరోగ్యంగా ఉండటమే మహా వ్యయభరి తమైనప్పుడు అసలా జీవితం ఏం జీవితం? (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) e- mal: vapuka@gmai.com -
‘అరుణ’ సర్వీసు రికార్డులు ఎక్కడ
- వెతుకులాట ప్రారంభించిన కేఈఎం ఆస్పత్రి అధికారులు - ఇప్పటి వరకు ఆమె సర్వీసుపై లేని స్పష్టత - వారం రోజుల్లో తెలుసుకుంటాం: ఆస్పత్రి డీన్ అవినాశ్ సాక్షి, ముంబై: అత్యాచారానికి గురై 42 ఏళ్లుగా కోమాలో ఉండి ఇటీవల మరణించిన అరుణా శాన్బాగ్ సర్వీసు రికార్డుల కోసం కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆమెపై అత్యాచారం జరిగి 42 ఏళ్లవుతున్నా అరుణ సర్వీసుపై ఎవరికీ సరిగ్గా తెలియదని ఆస్పత్రి అధికారులు పేర్కొంటున్నారు. ఇంకో వారం రోజుల్లోగా ఈ సమాచారం తెలుసుకుంటామని ఆస్పత్రి డీన్ డాక్టర్ అవినాశ్ గుప్తా తెలిపారు. అరుణపై అత్యాచారం జరిగి కోమాలోకి వెళ్లిన తర్వాత ఉద్యోగం నుంచి ఆమెను తొలగించారా లేదా ఆమె రిటైర్మెంట్ వరకు ఆమెను ఉద్యోగిగానే కొనసాగించారా అన్న దానిపై అధికారులు దృష్టి సారించారు. 2006 వరకు అరుణ ఆస్పత్రి పేరోల్లో ఉందని భావిస్తున్నారు. ఒకవేళ ఆమె ఉద్యోగంలోనే కొనసాగితే సర్వీసు రికార్డుతో పాటు ఆమె జీతభత్యాలు, పీఎఫ్ తదితరాలను కూడా కనుక్కోవాలని చూస్తున్నారు. చాలా కాలం కిందటి విషయం కాబట్టి ఈ అంశాలు కనుక్కోవడం కొంచెం కష్టమైన పనే. అరుణపై అఘాయిత్యం జరిగినపుడు చాలా మంది ఉద్యోగులు పనిచేశారని, దీంతో ఆమె వివరాలు కనుక్కోవడం కష్టమని అధికారులు చెబుతున్నారు. కాబట్టి కెఈఎమ్, బీఎంసీ సమన్వయంతో ఆమె వివరాలు తెలుసుకోవడం సులువేనని ఆస్పత్రి వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అరుణ కేసులో నిందితుడిపై మళ్లీ కేసు! ఇదిలా ఉండగా అరుణ షాన్బాగ్పై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సోహన్లాల్ వాల్మీకిపై హత్య కేసు నమోదు చేయాలని ఆస్పత్రి వర్గాలు యోచిస్తున్నాయి. సోహన్లాల్కు కేవలం ఏడేళ్లు జైలు శిక్షపడిన సంగ తి తెలిసిందే. శిక్షానంతరం ప్రస్తుతం ఢిల్లీలో సోహన్లాల్ నివాసముంటున్నట్టు సమాచారం. అయితే అరుణా షాన్బాగ్ మరణించడంతో మళ్లీ సోహన్లాల్పై హత్య కేసు నమోదు చేయవచ్చా అనే కోణాల్లో ఆలోచిస్తున్నారు. ఘటన జరిగిన 42 ఏళ్ల తర్వాత సోహన్లాల్పై హత్య కేసు నమోదు చేయవచ్చా అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కేసు నమోదు చేయడం, కోర్టులో విచారణ జరపడం సాధ్యం కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సంఘటన చాలా అరుదైంది కాబట్టి కేసు నమోదు చేయవచ్చా, చేస్తే కోర్టులో నిలుస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
అరుణకు ఘన నివాళి
- ఓ కళాశాలకు పేరు పెడుతున్నట్లు సీఎం ప్రకటన - అవార్డు నెలకొల్పుతున్నట్లు ప్రకటించిన ఎంపీ సీఎం ముంబై: 42 ఏళ్లపాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయిన అరుణా శానబాగ్ జ్ఞాపకార్థం థాణేలోని ప్రముఖ నర్సింగ్ కళాశాలకు ఆమె పెరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం తెలిపారు. ఆమె స్ఫూర్తికి సెల్యూట్ చేస్తున్నానని ట్వీట్ చేశారు. కేఈఎమ్ ఆస్పత్రిలోని నాలుగో వార్డుకు అరుణ పేరు పెట్టాలని ఆస్పత్రి అధికారులు బీఎంసీని కోరారు. చికిత్స చేసిన గదిలో ఆమె ప్రతిమను ఉంచారు. ఆ గదికి ఆమె పేరు పెట్టి ఆ గదిని ఆస్పత్రి పనులకు, చికిత్సలకు వాడుకోవాలని నిర్ణయించారు. అరుణ పేరుతో అవా ర్డు నెలకొల్పుతున్న ట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మహిళలపై జరుగుతు న్న అన్యాయాలకు వ్య తిరేకంగా పోరాడుతు న్న స్వచ్ఛంద సంస్థకు ఇవ్వాలని నిర్ణయిం చారు. ఈ అవార్డు కింది రూ. ఒక లక్ష బహుమతిగా ఇవ్వనుంది. అరుణకు జరిగిన అన్యాయానికి మధ్యప్రదేశ్ సీఎం చింతిస్తూ...ఆమె గౌరవానికి చిహ్నంగా పేర్కొన్నారు. దేశానికి దక్కిన బహుమతి అరుణ దేశానికి దక్కిన గొప్ప బహుమతి అని రచయిత పింకి విరానీ అన్నారు. 1973 నవంబర్ 27 ఘటన అరుణ జీవితాన్ని మార్చి వేసిందని విచారం వ్యక్తం చేశారు. ఆమె చనిపోయినా ఎప్పటికీ తన గుండెలో బతికే ఉందని అన్నారు. -
అశ్రునయనాల మధ్య అరుణ అంత్యక్రియలు
ముంబై : 42 ఏళ్ల పాటు జీవచ్ఛవంలా బతికి, నిన్న కన్నుమూసిన అరుణా షాన్ బాగ్ అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రిలోని నర్సులు, డాక్టర్లు, బంధువుల అశ్రునయనాల మధ్య ఆమె అంతిమయాత్ర సాగింది. అరుణ మరణ వార్త విన్న బంధువులంతా ఆసుపత్రికి తరలి వచ్చి తుది నివాళులర్పించారు. ఇన్నాళ్లు తాము కంటికి రెప్పలా కాపాడుకున్న అరుణ ఇక లేదనే వాస్తవాన్ని ఆస్పత్రి నర్సులు, ఇతర సిబ్బంది జీర్జించుకోలేకపోయారు. కొవ్వొత్తులు వెలిగించి , ఆమె ఆత్మశాంతికై ప్రార్థనలు చేశారు. ఆసుపత్రి డీన్ సహా అరుణా బంధువులు, నర్సులు భారీ ర్యాలీగా బోయివాడ శ్మశాన వాటికకు చేరుకుని అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ప్రేమించిన డాక్టరు సందీప్ను పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో హాయిగా ఉండాల్సిన అరుణ, ఓ దుర్మార్గుడి దురాగతంతో అచేతనంగా మారిపోయింది. పోతూ పోతూ.. ఈ సమాజంపై ఎన్నో ప్రశ్నల్సి సంధించింది. ఆడపిల్లల జీవితాలపై, మెదళ్లపై మరెన్నో సవాళ్లను మిగిల్చి..ఇక సెలవంటూ.. ఈ లోకాన్ని వీడింది. కాగా 26 ఏళ్ల వయసులో అరుణా షాన్ బాగ్ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైంది. విధి నిర్వహణలో ఉన్న ఆమెపై ఆస్పత్రి వార్డ్బాయ్ సోహన్ లాల్ వాల్మీకి అతి దారుణంగా అత్యాచారం చేసి, తీవ్రంగా గాయపరిచాడు. తలకుతీవ్రం గాయంకావడంతో అరుణా షాన్ బాగ్ కోమాలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి సోమవారం (మే 18) చనిపోయేవరకు కోమాలోనే ఉంది. -
ప్రేయసిని చంపి.. లోయలోకి విసిరేశాడు..
వాళ్లిద్దరూ విద్యావంతులే. ఉద్యోగం కూడా చేస్తున్నారు. మూడేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు.. ఉన్నట్టుండి ఏమైందో ఏమోగానీ ఆ ప్రియుడు రాక్షసుడిలా మారి ప్రియురాల్ని కిరాతకంగా హత్య చేశాడు. అంతేకాకుండా బెడ్షీట్లో శవాన్ని చుట్టచుట్టి లోయలోకి విసిరేశాడు. చెన్నై నగరంలో కలకలం రేపిన ఈ హత్యోదంతం సోమవారం రాత్రి జరిగింది. ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న దినేశ్ కన్నప్పన్ (25)కు ఎఫ్సీఐ ఉద్యోగిని అరుణ శ్రీనివాసన్ (22) తో చాలా కాలంగా పరిచయం ఉంది. గత మూడేళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని ఆస్పత్రిలో చేర్పించిన దినేశ్.. సోమవారం రాత్రి అయనవరంలోని అరుణ ఫ్లాట్ కు వెళ్లాడు.ఈ సందర్భంగా వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో ఉన్మాదిగా మారిన దినేశ్ ఫ్లవర్ వాజ్ తో అరుణ తలపై బలంగా మోదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అరుణ అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా ప్రియురాలి శవాన్ని బెడ్షీట్లో చుట్టి కారు డక్కీలో పెడుతుండగా స్థానిక యువకుడొకడు దినేశ్ చర్యను గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. తాను అనుకున్న ప్రాంతానికి చేరుకున్న దినేశ్.. అరుణ మృతదేహాన్ని లోయలోకి నెట్టేశాడు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపు అతడు అక్కడ నుంచి పరారయ్యాడు. హత్యకు దారితీసిన కారణమేమిటో ఇప్పటివరకు తెలియరాలేదని, దినేశ్ను దొరకబుచ్చుకొని ఇంటరాగేషన్ చేస్తేగానీ పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. -
‘అదర్స్’లోనూ చోటులేదా..?
సమాజంలో అందరి నుంచి చీదరింపులు.. అవమానాలు.. ఎవరూ పట్టించుకోరు...ప్రభుత్వ పథకాలు అందవు.. ఎటువంటి జీవనోపాధి లేదు.. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లోనూ అవకాశాలు కరువు.. వారే హిజ్రాలు.. సమాజంలో అదర్స్గా చెలామణి అవుతున్న వీరికి ఆదరణ కరువై దిక్కుతోచని స్థితిలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు..ప్రభుత్వం వితంతువులకు, వికలాంగులకు, వృద్ధులకు పింఛన్లు ఇస్తోందని, తమకు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.. తమకు ఉపాధి కల్పించాలని, సంక్షేమ పథకాలు అందించాలని, అప్పుడే సమాజంలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించగలమని అంటున్నారు... హిజ్రాలు నాగేటి రాజేశ్వరి, నాగేటి లాలస, రమ్య, అరుణ, పద్మలు సమాజంలో తమకు ఎదురవుతున్న బాధలను టేకులపల్లిలో ‘సాక్షి’కి వివరించారు.. ⇒ మేమంటే లెక్కలేదు..? ⇒ ప్రభుత్వ పథకాలు లేవు.. ⇒ ఆధార్, ఓటర్, రేషన్ కార్డులు ఇవ్వరు.. ⇒ డిగ్రీచేద్దామన్నా తిరస్కరించారు.. ⇒ ఆవేదన వ్యక్తం చేస్తున్న హిజ్రాలు టేకులపల్లి: కొత్తగూడెం గాజులరాజాం బస్తీలో సుమారు 50 మంది వరకు నివసిస్తున్నామని, తమకు ఆధార్, ఓటర్ గుర్తింపు, రేషన్కార్డు, ఇళ్లు, పింఛన్లు ఇలా ప్రభుత్వ పథకాలేమీ అందడం లేదని అంటున్నారు. తమకు ప్రభుత్వ పథకాలు అందించాలని పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఓటర్ నమోదులో తమ లాంటి వారి కోసం ‘ఆదర్స్’ ఆప్షన్ ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా ఓటు హక్కుకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇలా ఊరూరు తిరుగుతూ భిక్షాటన చేయూల్సి వస్తోందని అంటున్నారు. తాము ప్రభుత్వ పథకాలకు అర్హులం కాదా..? మేము మనుషులమే కాదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి తమలాంటి వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఓపెన్ డిగ్రీకి దరఖాస్తు చేస్తే తిరస్కరించారు ప్రభుత్వ పథకాలతో పాటు చదువుకూ మమ్మల్ని దూరం చేస్తున్నారు. చిన్నప్పుడు స్కూల్లో అడ్మిషన్ ఇవ్వకపోవడంతో శతవిధాల ప్రయత్నించి ఓపెన్లో టెన్త్ పూర్తి చేశా. రెండు నెలల క్రితం ఓపెన్ డిగ్రీకి దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించారు. చదువుకోవడానికి కూడా మాకు అర్హత లేదా..? గుండె నిండా బాధలు, సమాజం నుంచి చీదరింపులు ఎదురవుతున్నారుు. నరక యూతన అనుభవిస్తున్నప్పటికీ పెదవిపై చిరునవ్వుతోనే జీవిస్తున్నాం. ప్రభుత్వం స్పందించి ఆధార్, రేషన్, ఓటర్ గుర్తింపు కార్డులతో పాటు ఇల్లు, పింఛన్ సౌకర్యం కల్పించాలి. చదువుకునేందుకు అవకాశం కల్పించాలి. - లాలస -
పెళ్లింట్లో విషాదం
తండ్రి మృతితో ఆగిన కూతురు వివాహం మూడుచెక్కలపల్లిలో ఘటన నల్లబెల్లి : కూతురును అన్ని లాంఛనాలతో అత్తారింటికి సాగనంపేందుకు ఆ తండ్రి ఏర్పాట్లు చేశాడు.. ఇంకో వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి పందిరితో ఇల్లు కళకళలాడుతోంది.. ఈ క్రమంలో పెళ్లి బట్టలు కొనుగోలు చేస్తుండగా వధువు తండ్రికి గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆయన మార్గమధ్యలో మృతి చెం దాడు. దీంతో పెళ్లింట్లో విషాదం అలుముంది. శుక్రవారం నల్లబెల్లి మండలం గోవిందపూర్ శివారు మూడుచెక్కలపల్లిలో జరిగిన ఈ సంఘటన ఇరుకుటుంబాల్లో విషాదం నింపింది. మూడుచెక్కలపల్లి తండాకు చెందిన భూక్య కోబాల్సింగ్(40), మంగమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కూతురు అరుణకు గూడూరు మం డలం గుండెంగ గ్రామానికి చెందిన యువకుడితో మార్చి 6న పెళ్లి చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఇరుకుటుంబాల వారు బంధువులతో కలిసి నర్సంపేటలో పెళ్లి బట్టలు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. కొంత కాలంగా లివర్ వ్యాధితో బాధపడుతున్న కోబాల్సింగ్ పెళ్లి పనుల్లో అలసటకు గురై చాతినొప్పి వస్తోందంటూ ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కోబాల్సింగ్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. -
నల్లగా ఉన్నావు....అందంగా లేవంటూ..
ఆదోని: అందంగా లేవని వేధించినా..నచ్చలేదంటూ మానసికంగా హింసించినా ఆ మహిళ తన భర్తను వదులు కోవడానికి ఇష్టపడలేదు. పలువురి వద్ద పంచాయితీలు జరిగినా ఏడుగడుగులు నడిచిన భర్తతోనే తన జీవితం అంటూ తెగేసి చెబుతోంది. ఉన్నతమైన సంస్కృతి, సంప్రదాయాల మధ్య తాను పెరిగానని, భర్తకు తగ్గట్టు నడుచుకుంటానని న్యాయం చేయాలంటూ దీక్షకు పూనుకుంది. తన కుటుంబ సభ్యులతో భర్త ఇంటి వద్దే బైఠాయించిన ఓ స్త్రీ 'చరిత' ఇది.. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన శేషమ్మ, వెంకటేశ్వరరెడ్డి దంపతుల కుమార్తె చరిత(అరుణ)కు ఏడాదిన్నర కిందట ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన చంద్రశేఖరరెడ్డితో వివాహమైంది. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల వ్యాపారి అయిన చంద్రశేఖరరెడ్డి కుటుంబం ఆదోనిలోని తిరుమలనగర్లో నివాసం ఉంటోంది. ఎంటెక్ పూర్తి చేసిన చరిత హిందూపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నారు. పెళ్లిలో చరిత తల్లిదండ్రులు కట్నకానుకల కింద చంద్రశేఖరరెడ్డికి రూ.5 లక్షల నగదు, 15 తులాల బంగారం ఇచ్చారు. నాలుగైదు నెలలు అన్యోన్యంగా ఉన్నా. ఆ తర్వాత విభేదాలు మొదలయ్యాయి. వ్యాపారం కోసం డబ్బు కావాలని అడిగితే చరిత తల్లిదండ్రులు మరో రూ.2 లక్షలు ఇచ్చారు. అయినా సంతృప్తి చెందని చంద్రశేఖరరెడ్డి.. భార్యను వేధించసాగాడు. "అందంగా లేవని, తన స్థాయికి తగిన సంబంధం కాదని, తనకొద్దని, ఇక ఇంటికి రావద్ద'ని చెప్పాడు. అతని తల్లిదండ్రులు చాముండేశ్వరి, రామచంద్రారెడ్డి కూడా మద్దతుగా నిలిచారు. తానేమి తప్పు చేశానో చెప్పాలని ఆమె భర్తను నిలదీశారు. అందంగా లేకపోతే పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఆదోనిలో కుల పెద్దలు, పోలీసులతో పంచాయితీ కూడా చేశారు. పెద్దల ముందు సరే అన్నా.. ఆతర్వాత చంద్రశేఖరరెడ్డి తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఇంటికి రాగానే దుర్భాషలాడడం, అవమానించడం నిత్యకృత్యం అయింది. తాను తప్పు చేసి ఉంటే చెప్పాలని, అకారణంగా ఏవో సాకులు చెప్పి ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదని నచ్చ చెప్పి సంసారం చేయాలనే కృత నిశ్చయంతో బుధవారం ఇక్కడి వచ్చానని ఆమె తెలిపారు. తనతోపాటు తాత విరుపాక్షరెడ్డి, పిన్నమ్మ లక్ష్మీదేవి, చిన్నాన్న జయచంద్రారెడ్డి వచ్చారని, ఎంత వేడుకున్నా కనికరం చూపక తమను ఇంటి నుంచి బయటకు నెట్టేసి తాళాలు వేసుకుని ఎక్కడికో వెళ్లిపోయారని చరిత విలేకరుల వద్ద కన్నీరు పెట్టారు. తనకు భర్త సర్వస్వమని, ఆయన లేని జీవితం తనకొద్దని, భర్త, అత్త,మామలు ఎలా నడుచుకోమంటే అలా నడుచుకోడానికి సిద్ధంగా ఉన్నానని, ఈ విషయం ఎప్పడో చెప్పినా తనను నిరాదరణకు గురి చేయడం న్యాయం కాదని పేర్కొన్నారు. తనకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తాని అన్నారు. కాగా ఈ ఘటనపై ఆదోని పోలీసులు స్పందిస్తూ తమకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని తెలిపారు. -
నల్లగా ఉన్నావు..అందంగా లేవంటూ..
-
బాత్రూమ్లో దాక్కొని పోలీసులకు ఫోన్ చేసింది..
* కట్నం కోసం చిత్ర హింస *హత్య చేసేందుకు యత్నం *బాత్రూమ్లో దాక్కొని పోలీసులకు ఫోన్ చేసిన నవవధువు *రక్షించిన పోలీసులు హైదరాబాద్ : ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ నవ వధువును సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు రక్షించారు. భర్త, అత్తల చిత్రహింసలు భరించలేని ఆమె బాత్రూమ్లోకి వెళ్లి గడియ వేసుకుని 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అప్రమత్తమై పోలీసులు బాధిత యువతిని రక్షించారు. ఈ సంఘటన నిన్న తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... కరీంనగర్ కు చెందిన హనుమాన్, మధురవాణి దంపతుల కుమార్తె అరుణ (22)ను రెజిమెంటల్బజార్కు చెందిన జి.చంద్రశేఖర్ (26) అనే ప్రైవేట్ ఫొటోగ్రాఫర్తో ఆగస్టు 15న పెళ్లి జరిగింది. చంద్రశేఖర్ తండ్రి కొద్దికాలం క్రితమే మృతి చెందగా.. తల్లి లక్ష్మితో తాతాచారి కాలనీలో ఉంటున్నాడు. వివాహ సమయంలో లక్ష రూపాయలతో పాటు కొంత బంగారాన్ని కట్నంగా అరుణ తల్లిదండ్రులు ఇచ్చారు. రెండు నెలలపాటు అరుణను బాగానే చూసుకున్న భర్త, అత్త ఆ తర్వాత తమ విశ్వరూపం చూపించారు. చంద్రశేఖర్ నిత్యం పీకలదాకా మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. ఆ సమయంలోనే అత్త లక్ష్మి కట్నం ప్రస్తావన తేవడంతో అదనపు కట్నం కావాలని వేధించేవాడు. తల్లిదండ్రులకు అదనపు కట్నం ఇచ్చే స్తోమత లేకపోవడంతో అరుణ అత్తింతివారి వేధింపులను భరిస్తూ వచ్చింది. ఇటీవల వేధింపులు తీవ్రమయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వచ్చిన చంద్రశేఖర్ తల్లి సహాయంతో అరుణను చిత్రహింసలు పెట్టాడు. గొంతు నులిమే ప్రయత్నం చేయడంతో పాటు గదిలో నిర్భందించి కొట్టబోయాడు. దీంతో తనను చంపేస్తారని భావించిన అరుణ తన ప్రాణాలను కాపాడుకునేందుకు శనివారం తెల్లవారు జామున 3.30కి బాత్రూమ్లోకి పరుగెత్తింది. వెళ్తూ .. వెళ్తూ భర్త సెల్ ఫోన్ను వెంట తీసుకెళ్లి 100 నెంబర్కు డయల్ చేసి.. భర్త తనను బంధించి చిత్రహింసలు పెడుతున్న తీరును ఫిర్యాదు చేసింది. పోలీస్ కంట్రోల్రూమ్ సిబ్బంది గోపాలపురం పోలీసులను అప్రమత్తం చేశారు. గోపాలపురం పోలీసులు రెజిమెంటల్ బజార్లోని తాతాచారి కాంపౌండ్కు వెళ్లి బాత్రూమ్లో తలదాచుకున్న అరుణను రక్షించారు. అదే సమయంలో ఆమె భర్త చంద్రశేఖర్, అత్త లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి నుంచి ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు. భర్త, అత్తను రిమాండ్కు తరలించారు. -
హీరో ఆది వివాహ వేడుక
-
కందినైనా కాపాడుకోండి
శనగపచ్చ పురుగు రెక్కల పురుగులు(బసవంతలు) లేత ఆకులపై పూత, పిందెలపై తెల్లని గసగసాల పరిమాణంలో గుడ్లు పెడుతాయి. వీటి నుంచి బయటకు వచ్చిన లార్వాలు తొలి రోజుల్లో ఆకులను తిని రంధ్రాలు చేస్తాయి. తర్వాత పంట పూత దశకు చేరగానే పూత, మొగ్గలు, కాయలు, గింజలను ఆశించి అధిక నష్టం కలగజేస్తాయి. నివారణ చర్యలు... దీని నివారణకు మొక్కల మొదళ్లలో గోనె సంచులు లేదా తాటిపత్రి షీట్లను పరవాలి. మొక్కను సున్నితంగా ఓ వైపు వంచి దులపాలి. ఇలా చేస్తే 90 శాతం శనగపచ్చ పురుగులు, ఇతర క్రిమికీటకాలు, నల్లులు, పెంకు పురుగులు కింద పడుతాయి. రాలిన లార్వాలను, ఇతర కీటకాలను పూడ్చడం గానీ మంటలో వేయడం చేయాలి. ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే లీటర్ నీటిలో 3 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్ (20శాతం ఈసీ) లేదా 1 మిల్లీలీటరు నోవాల్యురాన్ (10శాతం ఈసీ) లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ (50 శాతం ఈసీ) మందును ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పంటపై పిచికారీ చేయాలి. కాయతొలుచు పురుగు దీన్ని మారుక మచ్చల పురుగు, గూడు పురుగు అని కూడా అంటారు. వీటి లార్వాలు చిన్నవిగా ఉండి పూత లోపలి మెత్తటి భాగాలను తిని నష్టపరుస్తాయి. ఆకులు, పూత, పిందెలను కలిపి గూడుగా మలిచి తింటూ ఉండిపోతుంది. ఫలితంగా పంట కాత పట్టదు. కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి ప్రవేశిస్తుంది. లోపలి మెత్తటి గింజలను తినేసి కాయలను డొల్లగా మారుస్తాయి. ఈ లార్వా ఆశించిన పూతపై, కాయ లోపల వాటి విసర్జన పదార్థాన్ని చూసి నిర్ధారించుకోవచ్చు. నివారణ చర్యలు... ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో 3 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్ (25శాతం ఈసీ) మందును కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే రెండోసారి వారం రోజుల తర్వాత.. లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల ట్రయాజోఫాస్ (40శాతం ఈసీ) లేదా 0.4 మిల్లీలీటర్ల ఇమమేక్టిన్ బెంజోయేట్ (5 ఈసీ డబ్ల్యూజీ) లేదా 2 మిల్లీలీటర్ల ప్లూబెండమైడ్ (39, 35 ఎస్సీ) మందును కలిపి స్ప్రే చేయాలి. కాయతొలుచు ఈగ తల్లి ఈగ గుడ్లను కాయ లోపలికి జొప్పించి పెడతాయి. కాయ లోపలే గుడ్లు పొదిగి కాళ్లు లేని పిల్లలు(మగ్గోట్స్)గా మారి లేత గింజలను తిని మగ్గేట్ దశను పూర్తి చేసుకుని ప్యూపాగా మారుతాయి. ప్యూపాలు కొంత కాలం తర్వాత పగిలి తల్లి ఈగలు తయారవుతాయి. మగ్గేట్లు కాయ లోపలి భాగాన్ని కొరికి తినేటప్పుడు కాయ తొక్కకి పలుచని పొర ఏర్పడుతుంది. దీన్ని చీల్చుకుంటూ తల్లి ఈగ బయటకు వస్తుంది. ఈగ లేత దశలోనే ఆశించడం వల్ల జీవిత చక్రం కాయ లోపలనే జరుపుకోవడంతో ఇది కలుగజేసే నష్టాన్ని గుర్తించడం కష్టం. నివారణ చర్యలు... మొదటి దశలో లీటరు నీటిలో 2 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ మందును పిచికారీ చేయాలి. పది రోజుల తర్వాత రెండో విడతగా లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల డైమిథోయేట్ను పంటపై స్ప్రే చేయాలి. వేరుకుళ్లు, ఎండుకుళ్లు ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు వడలిపోయి క్రమేపీ వాడిపోతాయి. కాండాన్ని చీల్చి చూసినట్లయితే గోధుమ రంగు ధారలు కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా కానీ పాక్షికంగా గానీ కుళ్లిపోతాయి. కొద్ది రోజుల్లోనే మొక్క చనిపోతుంది. నివారణ చర్యలు... దీని నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 0.2 గ్రాముల తెబుకొనజోల్ మందును కలిపి పిచికారీ చేయాలి. - మొక్కను మొత్తం మందుతో తడపాలి. ముఖ్యంగా మొదళ్లు బాగా తడిసేలా చూడాలి. - పై పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని ఏఓ సూచించారు. కందిపెంకు పురుగు పెంకు పురుగులు పూత, కాతను ఆశించి పూత నుంచి కాత రసాన్ని పీల్చడం ద్వారా నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారిస్తే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. నివారణ చర్యలు... లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ మందును కలిపి పిచికారీ చేయాలి. -
దేవుడోలె ఆదుకుంటారని..
కష్టాలు లేని, రాని మనిషులుంటారా..? కచ్చితంగా ఉండరు. కానీ కక్షకట్టి దాడిచేసినట్టు.. ఒకదాని తర్వాత ఒకటిగా మీదనొచ్చి పడితే తట్టుకోవడం సాధ్యమా.. ఎంతమాత్రమూ కాదు. అందులోనూ ఖరీదైన జబ్బుల రూపంలో వచ్చి పట్టిపీడిస్తే..? అదీ రోజుకూలి చేసుకుని బతుకుబండిని లాగే పేదలైతే.. నిత్యం నరకమే. కానీ ఇదే జరిగింది ఉప్పలయ్యకు.. ఒకదాన్నుంచి తెరిపి లభించిందనుకునేలోపే.. మరొటి.. ఆ వెంటనే ఇంకోటి. తట్టుకోలేకపోయాడు. చివరికి మంచం పట్టాడు. పాపం చిన్నారి రుషికేష్కూ అంతే. ఆడిపాడాల్సిన వయసులో.. ముద్దుముద్దు మాటలతో ఇంట్లో నవ్వులు పూయించాల్సిన చిరుప్రాయంలో తలసేమియాతో మంచానికే పరిమితమయ్యాడు. సాధ్యమా.. వీరిని చూస్తూ తట్టుకోవడం సాధ్యమా.. దేవుడిలా వచ్చి దాతలు ఆదుకుంటారని, ఆపన్నహస్తం అందించి ఆదుకుంటారని వేయికళ్లతో ఎదురుచూస్తున్నాయి ఈ విధివంచిత కుటుంబాలు. తలసేమియాతో తల్లడిల్లుతున్న బాలుడు మహబూబాబాద్ : మానుకోటకు చెందిన బొడ్డుపెల్లి ఉపేందర్, అరుణ దంపతులది నిరుపేద కుటుంబం. ఉపేందర్ హోంగార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఆరున్నరేళ్ల క్రితం కుమారుడు రుషికేష్ జన్మించడంతో సంబరపడిపోయారు. కానీ ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. పుట్టిన కొన్ని రోజులకే బాబుకు అనారోగ్యంగా ఉందని ఆస్పత్రికి తీసుకెళ్తే అప్పుడు తెలిసింది గుండెలు పిండేసే విషయం. చిన్నారి తలసేమియాతో బాధపడుతున్నాడని, నెలలో రెండుసార్లు రక్తం ఎక్కించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పడంతో బోరున విలపించారు. బాబును బతికించుకునేందుకు హైదరాబాద్ తీసుకెళ్తే అక్కడి రెడ్క్రాస్ సొసైటీలో ఉచితంగా రక్తాన్ని ఇస్తున్నారు. అయితే మందులు, రవాణా చార్జీలు కలిపి ప్రతినెల ఐదువేల రూపాయల వరకు అవుతున్నాయని ఉపేందర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు విధులకు హాజరుకాకుంటే వేతనంలో కోత పెడుతున్నారని వాపోతున్నాడు. వస్తున్న వేతనం బాలుడి వైద్యానికే ఖర్చవుతుండడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కన్నీరు పెట్టుకున్నాడు. మంచానికే పరిమితం రోజులు గడుస్తున్న కొద్దీ రుషికేష్ ఆరోగ్యం క్షీణిస్తోంది. బాలుడి తల్లి నిత్యం దగ్గరుండి సేవలందిస్తున్నా పరిస్థితిలో మా త్రం ఇసుమంతైనా మార్పులేదు. ఇంట్లో చెంగుచెంగున ఎగురుతూ సందడి చేయాల్సిన కొడుకు ఇలా మంచానికే పరిమితమవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మద్రాసులోని ఓ ప్రై వేటు ఆస్పత్రిలో రుషికేష్కు బోన్మారో ఆపరేషన్ చేయిస్తే తిరిగి మామూలు మనిషి అయ్యేందుకు అవకాశం ఉందని, ఇందుకు రూ.25లక్షలకు పైగా ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తెలియక అల్లాడిపోతున్నారు. డబ్బులు సమకూర్చుకునేందుకు ఏడాది కాలంగా పడరాని పాట్లు పడుతున్నారు. ప్రతి ఒక్కరిని చేతులు జోడించి అర్థిస్తున్నా రు. తమకు ఏ ఆధారం లేకపోవడంతో అప్పు ఇచ్చేందుకు అందరూ వెనుకాడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. పేదోళ్లకి ఖరీదైన జబ్బు రాకూడదంటూ వెక్కివెక్కి ఏడుస్తున్నారు. ప్రభుత్వం, దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. -
టాలీవుడ్ హీరో ఆది నిశ్చితార్థం
-
ఆది పెళ్లి ముహూర్తం కుదిరింది!!
డైలాగ్ కింగ్ సాయికుమార్ కుమారుడు, టాలీవుడ్ హీరో ఆది డిసెంబర్ 13న పెళ్లి చేసుకోబోతున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అరుణతో విజయదశమి రోజు నిశ్చితార్థం చేసుకున్న ఆది పెళ్లి ముహూర్తాన్ని రెండు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. నిశ్చితార్థం చాలా నిరాడంబరంగా జరిగిందని, పరిశ్రమకు చెందిన తన స్నేహితులను కూడా తాను ఎంగేజిమెంటుకు పిలవలేదని ఆది చెప్పాడు. డిసెంబర్ 13వ తేదీన హైదరాబాద్లోనే తన పెళ్లి జరగనుందని, దానికి మాత్రం దాదాపు ప్రతి ఒక్కరినీ తాను ఆహ్వానిస్తానని తెలిపాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన అరుణ తల్లిదండ్రులిద్దరూ న్యాయవాదులేనని ఆది అన్నాడు. తన అక్కడ అత్తమామల ద్వారా ఈ సంబంధం వచ్చిందని వివరించాడు. దాంతో ఆది ప్రేమ వివాహం చేసుకుంటున్నాడన్న కథనాలకు ఫుల్ స్టాప్ పడింది. ప్రస్తుతం ఆది నటించిన 'రఫ్' సినిమా విడుదల కావాల్సి ఉంది. 'ప్రేమకావాలి'తో తెరంగేట్రం చేసిన ఆది.. ఇటీవలే 'గాలిపటం' సినిమాతో మంచి విజయాన్ని సాధించి ఉత్సాహం మీద ఉన్నాడు. -
మహిళలు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి
నేషనల్ పోలీస్ అకాడమీ డెరైక్టర్ అరుణ బహుగుణ హైదరాబాద్: మహిళలు సమస్యలకు వెరవకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని నేషనల్ పోలీస్ అకాడమీ డెరైక్టర్ అరుణ బహుగుణ అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో మూడురోజులుగా జరుగుతున్న 12వ ఉమెన్ వరల్డ్ కాంగ్రెస్లో అరుణ బహుగుణ మంగళవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు విద్యావంతులైతే దేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతుందన్నారు. ఉత్తమ మానవవనరులని తయారు చేసేది మహిళలేనని కొనియాడారు. రక్షణ, పోలీసు వ్యస్థల్లో మహిళలు మగాళ్లకు దీటుగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. కాగా, ఈ సదస్సులో 58 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఆయా దేశాల్లో మహిళల స్థితిగతులపై ప్రసంగించారు. -
గాలి జనార్దనరెడ్డి రూ.37 కోట్ల ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ: ఇనుప ఖనిజం తవ్వకాలకు సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, ఆయన భార్య అరుణకు చెందిన రూ. 37.88 కోట్ల విలువైన ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక కోర్టు అటాచ్ చేసుకుంది. బెంగళూరులోని రూ. 4 కోట్ల విలువైన ఫ్లాట్, బళ్లారిలోని రూ. 14 లక్షల విలువైన ఇంటితో సహా పలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఈ అటాచ్ చేసిన ఆస్తుల్లో ఉన్నాయి. -
ఇద్దరు స్నేహితురాళ్ల ఆత్మహత్య
వత్సవాయి/పెనుగంచిప్రోలు : చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు. కష్టసుఖాలు పంచుకున్నారు. చివరకు ఆ ఇద్దరు స్నేహితురాళ్లు కలిసే కన్నుమూశారు. రాఖీ పౌర్ణమిరోజు జరిగిన ఈ ఘటన రెండు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. వత్సవాయి మండలం మక్కపేటకు చెందిన ధారావతు అరుణ(24), పెనుగంచిప్రోలుకు చెందిన సిరిపురపు సునీత(25) చిన్ననాటి నుంచే స్నేహితులు. ఇద్దరూ పదో తరగతి వరకు పెనుగంచిప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. అరుణ ఎమ్మెస్సీ, సునీత బీఎస్సీ పూర్తిచేశారు. ప్రస్తుతం అరుణ మక్కపేటలోని ఆర్సీఎం పాఠశాలలో విద్యావాలంటీర్గా పనిచేస్తోంది. సునీత నందిగామలోని ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తోంది. ఇద్దరికీ వివాహాలైనప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల తమతమ భర్తల నుంచి విడాకులు పొందారు. సునీతకు రెండు నెలల క్రితమే హైదరాబాద్కు చెందిన యువకుడితో రెండో వివాహమైంది. వారి దాంపత్యజీవనం అన్యోన్యంగా సాగుతోంది. సినిమా చూసేందుకు వెళ్లి.. ఈ క్రమంలో ఆదివారం అరుణ, సునీత కలిశారు. రాఖీ పండుగను పురస్కరించుకుని సినిమా చూసేందుకు పెనుగంచిప్రోలులోని ఓ థియేటర్కు వెళ్లారు. ప్రేక్షకులు లేని కారణంగా సినిమా వేయకపోవడంతో ఇద్దరు కలిసి మక్కపేటలోని అరుణ ఇంటికి చేరుకున్నారు. అరుణ తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేరు. దీంతో లోపలికి వెళ్లిన ఇద్దరు తలుపునకు గడియపెట్టారు. పెనుగంచిప్రోలులో కొనుగోలుచేసిన కూల్డ్రింక్ బాటిల్లో ఇంట్లో ఉన్న పురుగుల మందును కలుపుకుని ఇద్దరూ తాగారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో అరుణ తండ్రి భాస్కరరావు కూలి పనులు ముగించుకుని ఇంటి వద్దకు వచ్చారు. తలుపులు వేసి ఉండటంతో ఎన్నిసార్లు పిలిచినా లోపలి నుంచి స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చి స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే అరుణ మృతిచెందింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సునీతను 108 అంబులెన్స్లో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే మరణించింది. అరుణ, సునీత అత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. ఇద్దరు స్నేహితుల మరణంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనాస్థలాన్ని వత్సవాయి ఎస్ఐ ఆర్.ప్రసాదరావు పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాలకు సోమవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. -
కదం తొక్కిన కార్మికులు
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్లైన్: కడుపు మండిన కార్మికులు కదం తొక్కారు. విజయనగరంలోని లక్ష్మీ శ్రీనివాసా జూట్మిల్లు ఆధ్వర్యంలో నడుస్తున్న అరుణా, ఈస్ట్ కోస్టు జూట్మిల్లులను వెంటనే తెరిపించి తమకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదురుగా జూట్మిల్ కార్మికులంతా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు కె సన్యాసిరావు, బి శంకరరావు, టీవీ. రమణలు మాట్లాడుతూ గత కొంతకాలంగా లక్ష్మీ శ్రీనివాసా జూట్మిల్లుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరుణా, ఈస్ట్ కోస్టు జూట్మిల్లుల యాజమాన్యం కార్మికుల తరఫున జమ చేయాల్సిన ప్రావిడెంట్ ఫండ్ చెల్లించకపోవడమే కాకుండా కార్మికుల నుంచి వసూలు చేసిన సొమ్ము కూడా కాజేయడం దారుణమని ఆరోపించారు. కార్మికులకు ప్రయోజనాలు కల్పించాల్సిన యాజమాన్యమే ఇలా కార్మికులు కష్టాన్ని కాజేయడం ఎంత వరకూ సమంజసమో చెప్పాలంటూ ధ్వజమెత్తారు. అరుణా, ఈస్ట్ కోస్టు, బొబ్బిలి యూనిట్లలో ఈ విధంగా కార్మికుల సొమ్మును కాజేశారని కార్మిక నాయకులు ఆరోపించారు. కోట్లాది రూపాయల పీఎఫ్, ఎల్ఐసీ, ఈఎస్ఐ, గ్రాట్యుటీ బకాయిలు సకాలంలో చెల్లించడం లేదని ఆరోపించారు. ఆయా మిల్లుల్లో గుర్తింపు సంఘాలు, వివిధ ప్రతిపక్ష కార్మిక సంఘాల తరపున పలుమార్లు ఆందోళనలు చేపట్టినా యాజమాన్యం పరిష్కారానికి ముందు కు రావడం లేదని వాపోయారు. గత కలెక్టర్ హయాంలో వారం రోజు లపాటు నిరసన దీక్షలు చేపట్టిన ఫలితంగా జరిగిన ఒప్పందాన్ని కూడా యాజమాన్యం అమలు చేయలేదని ఆందోళన వెలిబుచ్చారు. యాజమాన్యం నిర్లక్ష్య చర్యలు, దోపిడీ విధానంతో మే 22నుంచి అరుణా జూట్మిల్లులోని కార్మికులు, మే 31 నుంచి ఈస్ట్ కోస్టు జూట్ మిల్లు కార్మికులు విధులను బహిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బొబ్బిల జూట్ మిల్లు కూడా నేడో రేపో మూతపడే పరిస్థితి ఉందన్నారు. సుమారు 10 వేల మంది కార్మికులు రోడ్డున పడే దయనీయ పరిస్థితి నెలకొందని ఆవేదన వెళ్లగక్కారు. అనంతరం కార్మికులంతా జేసీరామారావును కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. మీరేం చేస్తున్నారు ? : జేసీ కార్మికులంతా ఇంత నష్టానికి గురవుతుంటే మీరేం చేస్తున్నారు? కార్మికుల పక్షాన మీరు నోడల్ అధికారి కదా! పీఎఫ్ తినేయడం వంటి చర్యలకు పాల్పడుతున్న యా జమాన్యాలపై మీ ఉన్నతాధికారులకు మీరే చెప్పవచ్చు కదా అంటూ డీసీఎల్ ఆనందరావుపై జాయింట్ కలెక్టర్ బి రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో కార్మికుల సమస్యలు పెరిగిపోతున్నాయి. ఎస్ఎంఎస్, అరుణా, ఈస్ట్ కోస్టు వంటి మిల్లుల్లో కార్మికులకు అన్యాయం జరగుతుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించడంతో లేఖ రాశానని డీసీఎల్ సమాధానమిచ్చారు. దీంతో జేసీ మాట్లాడుతూ కార్మికులకు న్యాయం చేసే విధంగా వ్యవహరించండని అనడంతో ఆయన వెంటనే విశాఖలోని కమిషనర్ ఆఫ్ లేబర్తో మాట్లాడారు. వెంటనే ఫోన్ను అందుకున్న జేసీ కమిషనర్తో మాట్లాడుతూ యాజమాన్యం, కార్మికులతో సమావేశం నిర్వహించి కార్మికులకు ఆయా యాజమాన్యాలు ఎంత మేరకు బకాయిలు ఉన్నాయో పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో కార్మికులు కాస్త శాంతించి ధర్నా విరమించి వెనుదిరిగారు. -
విషాద వీచిక
నిజాలు దేవుడికెరుక కళ్లల్లో కోటి ఆశలు నింపుకుని ముంబై నగరానికి వచ్చిందామె. ఆ నగరం తన భవిష్యత్తుకు పూలబాట పరుస్తుందని అనుకుంది. కానీ అలా జరగలేదు. ఆ నగరంలోనే ఆమె ఆశలు ఆవిరైపోయాయి. ఆమె జీవితం మోడువారిపోయింది. చివరికి జీవితమే లేకుండా పోయింది. అరుణా షాన్బాగ్... ఈమె పేరు వింటే ముంబై నగరం కంటతడి పెడుతుంది. ఆమె కథ తెలిస్తే... ప్రతి మనసూ కలవరపడుతుంది! కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్, ముంబై . గది తలుపులు తెరచుకుని లోనికి అడుగు పెట్టాడు డాక్టర్ సందీప్ సర్దేశాయ్. గదిలో గోడవారగా ఉన్న మంచం దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. బెడ్ మీద ఉన్న పేషెంటుని చూడగానే అతడు కళ్లు కన్నీటి చెలమలయ్యాయి. నీరసంగా, నిస్సహాయంగా పక్కనే ఉన్న స్టూల్మీద కూచున్నాడు. ఆ పేషెంట్ అతని వైపే చూస్తోంది. ఆ చూపుల్లో ఏ భావమూ లేదు. అక్షరాలు చెరిగిపోయిన తెల్ల కాగితాల్లా ఉన్నాయి ఆమె నయనాలు. వాటిలో తనకు కావలసినదేదో వెతకాలని ప్రయత్నించాడు డాక్టర్ సందీప్. కానీ అతడి ప్రయత్నం ఫలించలేదు. ఈ రోజనే కాదు... పదేళ్లుగా అతడి ప్రయత్నం ఎప్పుడూ ఫలించిందే లేదు. ‘‘అరుణా’’... అతడి పెదవులు ఆ పేరును ఎంతో ఆత్మీయంగా పలికాయి. కానీ ఆ ఆత్మీయత ఆమెను కదిలించలేదు. ‘‘అరుణా... నేను... నేను... పెళ్లి చే...సు...కుం...టు..న్నా...ను’’... పలకలేక పలికాడు సందీప్ ఆ మాటల్ని. నోటి నుంచి వెలువడుతున్న ఆ పలుకులకు తోడుగా కంటి నుంచి అశ్రువులు జాలువారాయి. ‘‘చెప్పు అరుణా. నువ్వీ పెళ్లి చేసుకోవద్దు సందీప్ అని ఒక్కసారి చెప్పు. నేను ఆగిపోతాను. ప్లీజ్ అరుణా’’... ఇక నిభాయించుకోలేకపోయాడు సందీప్. అరుణ చేతిని తన చేతిలోకి తీసుకుని వెక్కి వెక్కి ఏడవసాగాడు. అలా ఎంతసేపు ఏడ్చాడో అతడికే తెలియదు. పదేళ్లుగా గుండెల్లో గూడు కట్టుకుపోయిన బాధనంతా కన్నీళ్లుగా వెళ్లగక్కాడు. అతడికి తెలుసు... ఆమె తనని ఆపదని, ఆపలేదని. ‘‘నన్ను క్షమించు అరుణా. నేను నీకు అన్యాయం చేస్తున్నాను. కానీ ఏం చేయను? నన్ను ప్రాణంగా చూసుకునే నా వాళ్ల కోరిక తీర్చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనే నమ్మకం నాకుంది. దయచేసి నన్ను క్షమించు. వస్తాను అరుణా... బై’’... బాధగా మూలుగుతోన్న మనసును ఇక నియంత్రించలేక అక్కడ్నుంచి వడివడిగా వెళ్లిపోయాడు సందీప్. అప్పుడు కూడా అరుణ చలించలేదు. చలించదు కూడా. ఆమెకు మనసుంది. కానీ అది చెప్పినట్టు నడచుకోవడానికి ఆమె శరీరం సిద్ధంగా లేదు. ఓ దుర్మార్గుడు చేసిన దారుణంతో అది చచ్చుబడి పోయింది. అరుణను ప్రాణమున్న శవంలా మార్చేసింది. నవంబర్ 27, 1973. ‘‘ఏయ్... ఏం చేస్తున్నావ్?’’ ఉలిక్కిపడ్డాడు సోహన్లాల్. తన చేతిలో ఉన్న ప్యాకెట్ని వదిలేసి కంగారుగా వెనక్కి తిరిగాడు. కోపంగా చూస్తోంది అరుణ. ‘‘నిన్నే... ఏం చేస్తున్నావిక్కడ?’’ ‘‘ఏం లేదు మేడమ్... శుభ్రం చేస్తున్నానంతే’’... తడబడ్డాడు సోహన్లాల్. ‘‘ఆహా... నువ్వేం చేస్తున్నావో నాకు బాగా తెలుసు. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? ప్రయోగాలు చేయడం కోసం కుక్కల్ని ల్యాబ్కి తీసుకొస్తున్నారు. వాటికోసం తెచ్చే ఆహారాన్ని దొంగతనంగా తీసుకెళ్లి అమ్మేసుకుంటున్నావ్. నోరు లేని వాటి కడుపు కొట్టడానికి సిగ్గు లేదూ?’’ సోహన్లాల్ మాట్లాడలేదు. కసిగా పెదవి కొరుక్కుంటూ నిలబడ్డాడు. ‘‘ఏమైంది అరుణా... ఏంటి గొడవ?’’ అంటూ వచ్చింది స్టెల్లా. ‘‘చూడవే. ఎన్నిసార్లు చెప్పినా వీడు వినడం లేదు. డాగ్ఫీడ్ తీసుకెళ్లి అమ్మేస్తున్నాడు’’... విసుగ్గా అంది అరుణ. ‘‘ఏం సోహన్లాల్... ఎన్నిసార్లు చెప్పింది అరుణ నీకు! మాట వినవేం’’ వారించింది స్టెల్లా. ‘‘ఎందుకు వింటాడు! ఈసారి విషయం డీన్ దృష్టికి తీసుకెళ్తా. అప్పుడు తెలుస్తుంది’’ అనేసి విసురుగా వెళ్లిపోయింది అరుణ. ‘‘చూడు సోహన్లాల్... అరుణ ఎంత సిన్సియరో నీకు తెలుసు. ఇలాంటివి తనకసలు నచ్చవు. మంచిది కాబట్టి నువ్వు కష్టాల్లో పడకూడదని కంప్లయింట్ ఇవ్వడం లేదు. తనని విసిగించి ఉద్యోగం మీదికి తెచ్చుకోకు’’ అనేసి వెళ్లిపోతున్న స్టెల్లా వంక కొరకొరా చూస్తూండిపోయాడు సోహన్లాల్. ‘‘అది నా ఉద్యోగం తీయించడం కాదు. నేను దాని పరువు ఎలా తీస్తానో చూస్తూండు’’... కసిగా అన్నాడు. 1973, నవంబర్ 28. ఉదయం 5:30. ‘‘ఇంత పొద్దున్నే గది తలుపులు ఎవరు తీశారు?’’... అప్పుడే డ్యూటీకి వచ్చిన స్టెల్లా ఆపరేషన్ థియేటర్ తెరిచి ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. ఆ పాడుబడిన థియేటర్ని నర్సులు బట్టలు మార్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఉదయం మొదట డ్యూటీకి వచ్చేది తనే. తను అటెండ్ అయ్యాకే నైట్డ్యూటీలో ఉన్న నర్సులు ఇంటికి వెళ్లేందుకు సిద్ధపడతారు. మరి ఇంత పొద్దున్నే ఎవరు తలుపు తెరిచివుంటారు? సందేహంగానే లోనికి అడుగుపెట్టింది స్టెల్లా. ఎక్కడా అలికిడి లేకపోవడంతో రాత్రి తలుపు వేయడం ఎవరో మర్చిపోయి ఉంటారనుకుని ముందుకు నడిచింది. యూనిఫామ్ వేసుకుందామనుకుంటుండగా ఆమె కళ్లు అనుకోకుండా గది మూలకు చూశాయి. అంతే... ఉలిక్కిపడింది స్టెల్లా. ఓ స్టూల్మీద బోర్లా పడివుంది అరుణ. చెయిన్తో కాళ్లూచేతులూ కట్టేసి ఉన్నాయి. మెడచుట్టూ గొలుసు బిగించి ఉంది. ఆమె ఒంటిమీద, కింద అంతా రక్తం. ‘‘అరుణా’’ అంటూ అటువైపు పరుగెత్తింది స్టెల్లా. క్షణంలో స్టాఫ్ అంతా వచ్చేశారు. అరుణను హుటాహుటిన ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారు. అంతలో పరుగు పరుగున వచ్చాడు సందీప్. ‘‘స్టెల్లా... అరుణకు ఏమైంది?’’ అరిచినట్టే అన్నాడు. ‘‘ఆపరేషన్ రూమ్లో కట్టేసి ఉంది సర్. నేను చూసేటప్పటికి కాస్త స్పృహలోనే ఉంది. ఏదో చెప్పడానికి ట్రై చేసింది. కానీ అంతలోనే స్పృహ కోల్పోయింది. డీన్ ఎగ్జామిన్ చేస్తున్నారు.’’ సందీప్ మనసు విలవిల్లాడింది. రాత్రి తను, అరుణ కూడా నైట్ డ్యూటీలోనే ఉన్నారు. ఇద్దరూ కలిసే డిన్నర్ చేశారు. తమ పెళ్లి గురించి, భవిష్యత్తు గురించి కబుర్లు చెప్పుకున్నారు. తర్వాత ఎవరి వార్డుకి వాళ్లు వెళ్లిపోయారు. ఇంతలో ఏమైంది? ఆపరేషన్ థియేటర్ తలుపు తెరచుకోవడంతో అటు పరుగెత్తాడు సందీప్. బయటకు వస్తోన్న డీన్ సందీప్ని చూసి ఆగిపోయాడు. ‘‘సర్... అరుణకి ఏమైంది? ఇప్పుడెలా ఉంది? ఏం ప్రమాదం లేదు కదా?’’ జరిగినదాన్ని ఎలా చెప్పాలో డీన్కు అర్థం కాలేదు. ‘‘సారీ సందీప్. అరుణని ఎవరో రేప్ చేశారు’’ చెప్పలేక చెప్పాడు. షాక్ తిన్నట్టుగా అయ్యాడు సందీప్. ‘‘రేపా?’’ అన్నాడు నమ్మలేనట్టుగా. ‘‘అవును. కానీ అంతకంటే దారుణం మరోటి ఉంది. కుక్కల్ని కట్టేసే గొలుసుతో మెడ చుట్టూ గట్టిగా బిగించడం వల్ల నరాలు చిట్లి కంటి చూపు పోయింది. మెదడులోని ఓ ముఖ్యమైన నరం తెగిపోవడంతో బ్రెయిన్ డెడ్ అయ్యింది.’’ ‘‘నో’’... కుప్పకూలిపోయాడు సందీప్. అంత పెద్ద డాక్టర్, జీనియస్, చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తుంటే అందరి గుండెలూ పిండేసినట్టయ్యింది. అరుణ కూడా చాలా తెలివైంది. అందరికీ ఎంతో ఇష్టం ఆమె అంటే. ఆమెకిలా అవడం కూడా ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. వెంటనే పోలీసులకు కబురందించారు. వాళ్లు వచ్చి ఎంక్వయిరీ మొదలుపెట్టారు. ముందురోజు జరిగిన గొడవ స్టెల్లా చెప్పడంతో పోలీసులు నేరుగా సోహన్లాల్ ఇంటికే వెళ్లారు. అతడింట్లో అరుణ గొలుసు, గాజులు దొరికాయి. దాంతో అతడిని అరెస్ట్ చేశారు. అయితే కేసు నమోదు చేయడంలో ఆసుపత్రి యాజమాన్యం తీసుకున్న ఓ నిర్ణయం సోహన్లాల్ని కఠినశిక్ష నుంచి తప్పించింది. అరుణ అభిమానాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అత్యాచారమన్న మాట లేకుండా హత్యాయత్నం, చోరీ కేసుల్ని మాత్రమే పెట్టారు. దాంతో యావజ్జీవిత శిక్ష పడాల్సింది కేవలం ఏడేళ్లు మాత్రమే పడింది. ఆ ఏడేళ్లు కూడా వేగంగా గడిచి పోయాయి. సోహన్లాల్ విడుదలై వేరే ఆసుపత్రిలో పనికి చేరాడు. మొన్నమొన్నటి వరకూ ఆనందంగా జీవించాడు. చివరికి ఏదో అనారోగ్యంతో మరణించాడు. కానీ అతడి పైశాచికత్వానికి బలయిన అరుణ మాత్రం ఇప్పటికీ నరకయాతన అనుభవిస్తూనే ఉంది. కళ్లు కనిపించవు. శరీరంలో చలనం లేదు. నలభయ్యొక్కేళ్లుగా జీవచ్ఛవంలా బతుకుతోంది. అయినవాళ్లు వదిలేశారు. ప్రేమించినవాడు పదేళ్లు ఎదురు చూసి, ఇంట్లోవాళ్ల బలవంతంతో మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమెరికా వెళ్లి సెటిలయ్యాడు. అరుణ మాత్రం అలాగే ఉంది. ఓ విధి వంచితలా... విషాద వీచికలా...! (మే 18న అరుణా షాన్ బాగ్ శ్వాస ఆగిపోయింది) - సమీర నేలపూడి -
చెదిరిన ‘పెళ్లి కళ’
గజ్వేల్, న్యూస్లైన్: మరికొద్ది సేపట్లో బాజాభజంత్రీలు మోగాల్సిన ఆ పెళ్లి మండపంలో.. ఒక్కసారిగా విచారం అలుముకుంది. తాళి కట్టాల్సిన వరుడు మొహం చాటేశాడు. వధువు బంధువులు వరుడి తల్లిని నిలదీయగా ఎక్కడికి వెళ్లాడో తెలియదని చేతులెత్తేసింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. సాయంత్రం వరకు వరుడి కోసం ఎదురుచూసినా ఎంతకీ రాకపోవడంతో చివరకు వివాహాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో వధువు బంధువులు విచారంలో మునిగిపోయారు. ఈ సంఘటన గజ్వేల్లో ఆదివారం చోటుచేసుకుంది. గజ్వేల్ నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి సికింద్రాబాద్ ఆర్కే పురానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అరుణ కుమారుడు విజయ్రెడ్డితో పెళ్లి కుదిరింది. ఇతను హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేఎండబ్ల్యూ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. వివాహాన్ని పురస్కరించుకుని వధువు తల్లిదండ్రులు అతనికి భారీగానే కట్నకానుకలను సమర్పించుకున్నారు. ఆదివారం స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాలులో మధ్యాహ్నం వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆనవాయితీ ప్రకారం ఆదివారం తెల్లవారుజామున వరుడిని తీసుకురావడానికి వధువు తరపు బంధువులు ఆర్కే పురానికి వెళ్లారు. కానీ అక్కడ ఒక్కసారిగా సీను మారింది. ఏం జరిగిందో తెలియదు కానీ వరుడు అప్పటికే ఆ ఇంట్లోంచి పరారయ్యాడు. దీంతో వారు ఏం చేయాలో తెలియక వరుడి తల్లి అరుణ, సోదరి స్వప్నతో మరో అమ్మాయి, కొందరు బంధువులను తీసుకొని ఇక్కడికి వచ్చారు. వారంతా పెళ్లి సమయానికి విజయ్రెడ్డి వస్తాడని నమ్మబలికారు. తాళి కట్టే సమయానికైనా విజయ్రెడ్డి రావచ్చనే ఆశతో ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు. మండపాన్ని తీర్చిదిద్దడమే కాకుండా భోజనాలకు కూడా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం వరకు కూడా వరుడి జాడ లేదు. ఫోన్ చేసినా కలవలేదు. అతని తల్లిని, బంధువులను నిలదీస్తే తమకేం తెలియదని చేతులెత్తేశారు. వారిపై వధువు తరపు బంధువులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా వరుడి తరపు బంధువులపై దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన కల్యాణ మండపం వద్దకు చేరుకుని వారిని శాంతింపజేశారు. మొత్తానికి పెళ్లి ఆగిపోవడంతో వధువు తల్లిదండ్రులు, బంధువులు విచారంలో మునిగిపోయారు. గజ్వేల్ ఎస్ఐ ఆంజనేయులును వివరణ కోరగా వధువు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
అరుణ మృతదేహం వద్ద టిడిపి, కాంగ్రెస్ శవరాజకీయాలు
-
అరుణ మృతదేహం వద్ద టిడిపి, కాంగ్రెస్ శవరాజకీయాలు
నల్లగొండ : నల్లగొండ జిల్లాలో కామాంధుడి దాడిలో గాయపడి ఐదురోజులు ప్రాణాలతో పోరాడి కన్నుమూసిన బీటెక్ విద్యార్థిని అరుణ అంత్యక్రియలు నకిరేకల్లో పూర్తయ్యాయి. అంతకు ముందు క్లాక్టవర్ వద్ద అరుణ మృతదేహానికి విద్యార్థి సంఘాలు, రాజకీయ నేతలు నివాళులర్పించారు. అరుణ తల్లిదండ్రులను ఓదార్చే నెపంతో కాంగ్రెస్, టీడీపీ నేతలు చెరోమైకు పట్టుకుని ప్రసంగాలు మొదలుపెట్టారు. ఒక దశలో ఇరుపార్టీల నేతలు ఘర్షణకు దిగారు. ఇరు పార్టీల నేతలు శవరాజకీయాలు చేశారు. కాంగ్రెస్, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దాంతో పోలీసులు భారీగా మొహరించారు. అరుణ మృతదేహాన్ని నకిరేకల్ తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. శవరాజకీయాలకు పాల్పడిన కాంగ్రెస్, టీడీపీ నేతల తీరు పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన విద్యార్థిని తలారి అరుణ మృత్యువుతో పోరాడి ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. కనగల్ మండలం కురంపల్లికి చెందిన నిట్స్ కళాశాల బీటెక్ విద్యార్థిని అరుణపై ఈనెల 17న నకిరేకంటి సైదులు కిరోసిన్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. ప్రేమించిన తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసినందుకు కక్ష పెంచుకుని అరుణపై కర్కశంగా హత్యాయత్నం చేశాడు. నిలువెల్లా తీవ్రగాయాలైన ఆమెకు మొదట జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఈనెల 18న కంచన్బాగ్లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. 95 శాతానికిపైగా కాలిన గాయాలవడంతో కోలుకోవడం కష్టంగా మారింది. రోజురోజుకూ పరిస్థితి మరింత విషమించి చివరకు ప్రాణాలొదిలింది. అరుణ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి సోమవారం ఉదయం నల్గొండ తరలించారు. సంచలనం రేకెత్తించిన కేసును జిల్లా పోలీసు యంత్రాంగం సవాల్గా తీసుకుంది. ఘటన జరిగిన 24 గంటల్లోగా నిందితుడు సైదులుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇతనిపై చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద నల్లగొండ వన్టౌన్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. -
అకృత్యాలకు అంతం లేదా?
నిన్న అరుణ.. నేడు రేవతి.. రేపు ఇంకెవరో! దేశంలో అమ్మాయిల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. రెండేళ్ల పాటు ప్రేమించి, కాలక్షేం చేసి.. చివరకు పెళ్లి చేసుకొమ్మని అడిగినందుకు కిరోసిన్ పోసి తగలబెట్టేశాడో దుర్మార్గుడు. ఈ దారుణం నల్లగొండ జిల్లాలో జరిగింది. ఆ సంఘటనలో తీవ్రంగా గాయపడిన బీటెక్ విద్యార్థిని అరుణ.. హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అసువులు బాసింది. ఇక మూడు నాలుగు రోజుల్లో పెళ్లి ఉందనగా, ఇంకా కాళ్ల పారాణి పెట్టుకోక ముందే, పట్టుబట్టలు కట్టుకోకముందే కాటికి పంపేశాడో నీచుడు. ప్రేమిస్తున్నానని వేధించాడు. కాదు, నేను చదువుకుంటున్నానని ఆమె తిరస్కరించింది. పెద్దలు కూడా మందలించారు. ఈలోపు ఆమెకు పెళ్లి కుదిరింది. అంతే, అతడిలోని రాక్షసుడు నిద్రలేచాడు. ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని, ఇంటికి వెళ్లి ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈమె కూడా బీటెక్ విద్యార్థినే. ఈ ఇద్దరు అమ్మాయిల ఉదంతాలు ఒకే సమయంలో.. ఒకేలా చోటుచేసుకున్నాయి. రోడ్డుమీదకు అమ్మాయి వెళ్లిందంటే ఎలా తిరిగొస్తుందోనని తల్లిదండ్రులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని భయపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారి మానప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోంది. కంటికి కాస్త నదురుగా కనపడితే చాలు.. ప్రేమిస్తున్నామంటూ వెంటపడుతున్నారు. కొంతమంది దాన్ని నిరాకరిస్తుంటే, మరికొందరు అమాయకంగా ఆ వలలో పడిపోతున్నారు. ఏం చేసినా చివరకు మాత్రం వారి కథలు విషాదాంతాలే అవుతున్నాయి. పాపం అరుణ, రేవతి ఆస్పత్రులలో నాలుగైదు రోజుల పాటు నరకయాతన అనుభవించారు. దాదాపు 60-70 శాతం వరకు శరీరంపై కాలిన గాయాలు అయినప్పుడు ఎంత నరకం అనుభవిస్తారో!! కాకినాడ ఆస్పత్రిలో రేవతి పెట్టిన కేకలు ఇప్పటికీ ఆ తల్లిదండ్రుల గుండెల్లోనే కాదు.. చూసిన ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా అంతా అయిపోయిన తర్వాత నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామంటూ చెబుతున్నారు తప్ప.. వీటిని నిరోధించడానికి చర్యలు తీసుకున్న పాపాన పోవట్లేదు. పెప్పర్ స్ప్రేలు, లేజర్ గన్నుల్లాంటివి వచ్చాయని చెబుతున్నా.. అవి ఎంతమందికి అందుబాటులో ఉంటున్నాయో ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆ తల్లిదండ్రుల కడుపుకోతను ఎవరు తీరుస్తారు? చిన్నపిల్లలని కూడా చూడకుండా కామాంధులు కాటేస్తుంటే.. ఈ యంత్రాంగం మాత్రం కుంభకర్ణుడి వారసత్వం తీసుకుంటోంది. దేవుడా రక్షించు ఈ దేశాన్ని.. కామాంధుల నుంచి.. ప్రేమ ముసుగులోని కాళ రాక్షసుల నుంచి!! -
ప్రేమికుడి దాడిలో గాయపడిన అరుణ కన్నుమూత
-
ప్రేమికుడి దాడిలో గాయపడిన అరుణ కన్నుమూత
రెండేళ్లుగా ప్రేమించాడు. పెళ్లి చేసుకుందాం అని అడిగిన పాపానికి ఆ బంగారు తల్లిని నిలువునా కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఐదు రోజుల పాటు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడిన ఆ అమ్మాయి.. ఇక ఈ పాపిష్టి లోకంలో తానుండలేనంటూ వెళ్లిపోయింది. నల్లగొండ జిల్లా కనగల్ మండలం కురంపల్లికి చెందిన అరుణ.. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూసింది. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న ఆమెకు దర్వేశిపురానికి చెందిన సైదులుతో పరిచయం అయ్యింది. అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోమంటే ఏదో కారణం చెబుతూ వాయిదా వేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఫైనాన్స్ కార్యాలయంలోకి అరుణ వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని అతడిని నిలదీసింది. దీంతో అతను కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ విషయాన్ని ఆమె బావకు ఫోన్ చేసి తెలిపాడు. తొలుత స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేసినా, మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఐదు రోజుల పాటు నరకం అనుభవించిన అరుణ.. ఆదివారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయింది. -
విషమంగానే అరుణ ఆరోగ్యం
హైదరాబాద్ : నల్లొండలో మంగళవారం ఓ కిరాతకుడు నిప్పంటించటంతో తీవ్రంగా గాయపడ్డ బీటెక్ విద్యార్థిని అరుణ ఆరోగ్యం విషమంగా ఉంది. ఆమెకు మెరుగైన నిమిత్తం నిన్న కంచన్బాగ్లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. దాదాపు 90 శాతం గాయపడిన అరుణను తొలుత ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే మరింత మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో అపోలోకి తీసుకువచ్చారు. అరుణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సమీ తెలిపారు. ఆమెను జిల్లా జాయింట్ కలెక్టర్ నీలకంఠం, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి పరామర్శించారు.