ఒక్కసారిగా పేలిన సిలిండర్లు.. బయట పడే దారి లేక! | Fire Accident In Kakinada, Woman Died | Sakshi

కాకినాడలో భారీ అగ్ని ప్రమాదం.

Published Fri, Mar 19 2021 8:49 AM | Last Updated on Fri, Mar 19 2021 12:04 PM

Fire Accident In Kakinada, Woman Died - Sakshi

సాక్షి, కాకినాడ : గాంధీ పార్కు సమీపంలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు తెల్లవారుజామున 4.30 నిమిషాల సమయంలో మూడు సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి  పేలి పెద్ద ఎత్తున  మంటలు చెలరేగాయి. పెద్దగా శబ్ధం రావడంతో చుట్టుపక్కల స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో పక్కనున్న ఇళ్లలో కూడా మంటలు వ్యాపించడంతో అందులో ఉన్న సిలిండర్లు కూడా పేలాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు.

అయితే దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకొని ఓ వృద్ధురాలు సజీవ దహనం అయ్యింది.. మృతురాలిని తుమ్మల విజయలక్ష్మీ(65)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరణించిన వృద్ధురాలి సోదరి మాట్లాడుతూ.. ప్రమాదం ఎలా జరిగిందో తెలీయదని,  ఒక్కసారిగా మంటలు చేలరేగాయని అన్నారు. ఇళ్లు కాలిపోతున్నాయని తన సోదరే అందరికి చెప్పిందని, కానీ బయటకు వచ్చేందుకు దారి లేక తను మంటల్లో చిక్కుకొని మరణించిందని కన్నీరు పెట్టుకున్నారు.  ఈ ప్రమాదంలో నాలుగు కుటుంబాలకు ఆస్తినష్టం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement