
విజయవాడ: ఏపీలో ఆగస్టు 15న రాజ్భవన్లో జరగాల్సిన "ఎట్ హోమ్" కార్యక్రమాన్ని రద్దు చేశారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా "ఎట్ హోమ్" కార్యక్రమం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకున్నా.. జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.