అక్టోబర్‌ 1 నుంచి విశాఖలో ఇన్ఫోసిస్‌: మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ | Infosys Operations To Begin At Vizag On October 1st Says Gudivada Amarnath | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 1 నుంచి విశాఖలో ఇన్ఫోసిస్‌ కార్యకలాపాలు: మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

Published Tue, Sep 27 2022 12:26 PM | Last Updated on Tue, Sep 27 2022 1:29 PM

Infosys Operations To Begin At Vizag On October 1st Says Gudivada Amarnath - Sakshi

సాక్షి, విజయవాడ: అక్టోబర్‌ 1 నుంచి విశాఖపట్నంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. ఈ మేరకు మంత్రి ట్వీట్‌ చేశారు. ‘ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ అక్టోబర్‌​ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. తొలుత 1,000 మంది ఉద్యోగుల సామర్థ్యంతో మొదలు పెట్టి క్రమంగా 3 వేల మందికి ఉద్యోగాలు విస్తరించనున్నారు. మరో ప్రముఖ ఐటీ సంస్థ డల్లాస్‌ టెక్నాలజీస్‌ సెంటర్‌ కూడా తమ కార్యకలాపాలను విశాఖలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement