Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

KSR Comments On Chandrababu Political Career
పరిపాలన మరీ ఇంత అధ్వానమా?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాలలో అదృష్టవంతుడైన నేత అని చెప్పాలి. ఆయన ఎమ్మెల్యే అవడం నుంచి ముఖ్యమంత్రి కావడం వరకు, అందులోను నాలుగుసార్లు సీఎంగా పగ్గాలు చేపట్టడం వరకు ఆయన అదృష్టం చెప్పలేనిది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రజలకు మేలు చేస్తే మంచిదే. అందుకు భిన్నంగా పాలన సాగిస్తే అపకీర్తిని మూటకట్టుకుంటారు. ప్రస్తుతం ఆయన ఆ దశలోనే ఉన్నారన్న అనుమానం కలుగుతోంది.గత మూడు టరమ్‌లలో కన్నా ఈ విడత ఆయన పాలన తీరు మరీ నాసిరకంగా మారుతోందని చెప్పడానికి బాధ కలుగుతోంది. గతంలో కూడా అలవికాని వాగ్దానాలు చేసి, వాటిని అమలు చేయకుండా ఉన్నప్పటికీ, పాలన మరీ ఇంత అద్వాన్నంగా లేదని చెప్పాలి. ప్రత్యేకించి గత నెల రోజుల పాలనలో జరిగినన్ని అరాచకాలు ఇంతకు ముందెన్నడూ చూడనివి. ఆ రోజుల్లో ప్రజలు ఏమైనా అనుకుంటారేమోనని వెరచేవారు. ఇప్పుడు చంద్రబాబులో ఆ వెరపు పోయినట్లయింది.జనాన్ని మాయచేయగలిగాం కాబట్టి ఎవరేం చేయలేరు అన్న అహంభావ ధోరణిలోకి వెళ్లి ఉండాలి. లేదా ఆయనకు సంబంధం లేకుండా పాలన సాగుతుండాలి. పూర్వం కూడా పోలీసులను ఆయన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నా, మరీ ఇంతలా ప్రత్యర్దులను వేధించడానికి వినియోగించుకున్నారని చెప్పజాలం.2024లో ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయ్యారో కాని, అసలు రాష్ట్రంలో పాలన ఉందా? లేక టీడీపీ అరాచక శక్తుల పాలన సాగుతోందా? అన్నట్లుగా పరిస్థితి తయారైంది. బహుశా పాలనలో తనకన్నా ఆయన కుమారుడు మంత్రి లోకేష్ పెత్తనం బాగా పెరిగి ఉండాలి. లోకేష్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్రలో కాని, ఇతరత్రా కాని ఒక మాట అంటుండేవారు. తాను మూర్ఖుడనని, తన తండ్రి మాదిరి ఉదారంగా ఉండనని, రెడ్ బుక్‌లో అధికారుల పేర్లు రాసుకుంటున్నానని హెచ్చరిస్తుండేవారు. అలాగే తనకు నచ్చని, లేదా తనను విమర్శించేవారి పేర్లను ఆ బుక్‌లో రాస్తున్నట్లు చెబుతుండేవారు.అప్పట్లో టీడీపీ కార్యకర్తలు ఎంత పెద్ద కేసు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి అని ఊరించేవారు. చంద్రబాబును మించి అరాచకంగా ఉపన్యాసాలు చేశారు. సరిగ్గా ప్రస్తుతం పాలన అలాగే నడుస్తోంది. కాలం కలిసి వచ్చి చంద్రబాబు, లోకేష్ లు పాలన పగ్గాలు చేపట్టారు. వారికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా తోడయ్యారు. పవన్‌ను వారు తమదారిలో పెట్టుకుని నోరు విప్పకుండా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి లోబరుచుకోగలిగారు.దాడులు, విధ్వంసాలకు టీడీపీ నేతలు పాల్పడుతుంంటే, వారిపై కేసులు పెట్టడం లేదు కాని, వైఎస్సార్‌సీపీ వారిపై అక్రమ కేసులు పెట్టడం సర్వసాధారణం అయింది. కేంద్రంలో కూడా టీడీపీ, బీజేపీ కూటమే అధికారంలో ఉంది కనుక ఇక్కడ నెలకొన్న అశాంతిపై బీజేపీ పెద్దలు ఎవరూ కిమ్మనడం లేదు. ఈ పరిస్థితిలో ప్రజలు ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు తమను తాము రక్షించుకోవలసి వస్తోంది. ఇది ఎటువైపు దారితీస్తోందోనన్న భయం కలుగుతోంది.ఇవి చాలవన్నాట్లు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన, మరికొందరు సీనియర్ ఐపిఎస్ అధికారులపైన తప్పుడు కేసులు బనాయించడం. చివరికి ప్రభుత్వ వైద్యశాల అధికారులను కూడా వదలిపెట్ట లేదు. ఈ సదర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రాజమండ్రిలో గోదావరి పుష్కరాలలో చంద్రబాబు నిర్వాకం వల్ల తొక్కిసలాట జరిగి ఇరవైతొమ్మిది మంది మరణించడం, చంద్రబాబు ప్రభుత్వం తిరుమలలో ఇరవైమంది కూలీలను ఎన్ కౌంటర్ చేయడం వంటి ఘటనలు తీవ్ర సంచలనం కలిగించాయి. వాటిని చంద్రబాబు తానే ముఖ్యమంత్రిగా ఉన్నందున మేనేజ్ చేసుకుని అవి తనకు చుట్టుకోకుండా జాగ్రత్తపడ్డారు.జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వాటిని తిరగదోడి ఉంటే చంద్రబాబు పరిస్థితి ఎలా ఉండేదని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాని జగన్ ఆ పని చేయలేదు. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుతో ఒక ఫిర్యాదు చేయించి, జగన్ పైన కేసు పెట్టిన తీరు చంద్రబాబు లేదా లోకేష్‌లు ఎంత కక్షపూరితంగా మారారో తెలియచేస్తున్నదని అంటున్నారు. ఆ కేసు పరిణామాలు ఏమి అవుతున్నాయన్నది ఇక్కడ చర్చకాదు.చంద్రబాబు పాలన అధ్వాన్నంగా మారిందని చెప్పడానికి దీనిని ఒక ఉదాహరగా తీసుకుంటున్నారు. రఘురామకృష్ణంరాజు వైఎస్సార్‌సీపీ అసమ్మతి ఎంపీగా ఉన్నప్పుడు కులాలు, మతాల మద్య దారుణమైన విద్వేషాలు రెచ్చగొట్టే విదంగా ఉపన్యాసాలు చేస్తుంటే, సీఐడీ అన్ని ఆదారాలతో కేసు పెట్టి అరెస్టు చేసింది. ఆ సమయంలో తనను హింసించారన్నది రాజు ఆరోపణ. నిజంగా అలా జరిగి ఉంటే ఎవరం అంగీకరించం. కాని ఆయన అప్పుడు వీరెవ్వరిపైన ఆరోపణ చేయలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తనను కొట్టారని ఆరోపించారు. బహుశా బెయిల్ కోసం ఇలా అంటుండవచ్చులే అనుకున్నారు.న్యాయస్థానం ఆదేశాల ప్రకారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వారు ఆయనను మొత్తం పరీక్షించి గాయలేవీ లేవని నిర్దారించారు. అందుకుగాను వారిపై కూడా రాజు ఇప్పుడు కేసు పెడుతున్నారు. తెలుగుదేశంకు న్యాయ వ్యవస్థలో ఉన్నపట్టు ఈయనకు బాగా ఉపయోగపడిందని అంతా అనుకునేవారు. ఆ సమయంలో సుప్రీంకోర్టు ఈయనను మిలటరీ ఆస్పత్రిలో చేర్పించింది. వారి నివేదికలో సైతం ఆయనపై ఎవరో కొట్టిన గాయాలు ఉన్నట్లు తేల్చలేదు. పైగా ఈయన చెప్పాపెట్టకుండా ఆ ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి.సుప్రీంకోర్టు ఈ కేసును విచారించి సిబిఐ దర్యాప్తు అవసరం లేదని భావించింది. అయినా ఇప్పుడు రాజుతో చంద్రబాబో, లేక లోకేషో గుంటూరులో పోలీసు కేసు పెట్టించారు. ఇది కేవలం వైఎస్సార్‌సీపీ నేతలను భయపెట్టడానికి, అధికారులను లొంగదీసుకోవడానికే అన్న అభిప్రాయం కలుగుతోంది. గత ప్రభుత్వ టైమ్‌లో చంద్రబాబు, ఇతర టీడీపీ నేతల స్కామ్‌లకు సంబంధించి సీఐడీ విచారణ చేసింది. ఆ సమయంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఇప్పటికీ కోర్టులలో పెండింగులో ఉన్నాయి. ఆ కేసులలో ఈ అధికారులు తమకు అనుకూలంగా వ్యవహరించడానికి గాను.. బెదిరించడానికి ఇలా ఏమైనా వారిపై బనాయించారా అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. లేకుంటే సుప్రింకోర్టే తోసిపుచ్చిన కేసును ఇక్కడ తిరగతోడతారా? అన్న ప్రశ్న వస్తోంది.అదే టైమ్‌లో రఘురాజు ఎంత అరాచకంగా కుల విద్వేషం పెంచడానికి ప్రయత్నించింది అన్నదానిపై కూడా కేసు పెట్టి ఉంటే, పోనీలే రెండు విషయాలలోను ప్రభుత్వం దర్యాప్తు చేపడుతుందేమోలే అనుకునేవారు. అలా చేయకపోవడంతో ఇది ప్రతీకారేఛ్చతో రగులుతూ పెట్టిన కేసు అని అర్ధం అవుతుంది. లేదా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అయి ఉండాలి. ఒక్క వృద్దాప్య పెన్షన్‌లను మాత్రం చెప్పినట్లు చేశారు. ఇక మిగిలినవి వేటిపైన నిర్దిష్టంగా చేయడం లేదు.పెన్షన్ దారులలో అనర్హుల పేరిట ఇకపై కోతపెట్టవచ్చన్న వార్తలు వస్తున్నాయి. కాగా పలు అంశాలలో జగన్ ప్రభుత్వ విదానాలనే ఏదో రకంగా పాలో కావల్సి వస్తోంది. ఉదాహరణకు తాజాగా వచ్చిన జీపీఎస్‌ నోటిఫికేషన్. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ ఇవ్వడం ద్వారా జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు, ఇప్పుడు దానినే పాటిస్తున్నారు. బ్రేక్ వేశామని చెప్పారే తప్ప రద్దు చేయకపోవడం గమనార్హం. అంటే మోసం చేసింది జగన్ కాదు.. చంద్రబాబు, పవన్ లేనని ఉద్యోగులు అనుకునే పరిస్థితి వచ్చింది.ఇసుక ఉచితం అంటే జనం అంతా నమ్మారు. తీరా చూస్తే జగన్ ప్రభుత్వం పెట్టిన ఇసుక గుట్టలలో సగభాగం టీడీపీ, జనసేన నేతల పరం అయిపోయింది. మిగిలిన ఇసుకకు పెద్ద ఎత్తున చార్జీల పేరుతో రేట్లు పెట్టి వసూళ్లు చేస్తున్నారు. తల్లికి వందనం స్కీమ్ జిఓ ఇవ్వడం, ఆ తర్వాత అది ఏదో వేరే పనికి జిఓ ఇచ్చామని చెప్పడం.. అంటే ప్రభుత్వ పనితీరు తెలియచేస్తుంది. వలంటీర్ల గురించి ఎన్నికల ముందు ఏమి చెప్పారు? ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నారు. కొత్త ఉద్యోగాల సంగతేమో కాని వలంటీర్లకు వచ్చే గౌరవవేతనం కూడా అందేలా లేదు. ఆ రకంగా లక్షన్నర మందిని ఈ ప్రభుత్వం రోడ్డున పడవేసే సూచన కనిపిస్తోంది.ఉచిత గ్యాస్ బండలు వస్తాయో, రావోకాని మహిళలంతా గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలు కట్టాల్సివచ్చింది. జగన్ టైమ్‌లో మహిళలు మహరాణుల మాదిరి ఇళ్ల వద్ద కూర్చుని ఉంటే వలంటీర్ల ద్వారా దరఖాస్తులను తీసుకునేవారు. ఇప్పుడేమో రోడ్డుమీద క్యూలలో గంటల తరబడి వేచి ఉండవలసి వస్తోంది. చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నమ్మినందుకు ప్రజలకు ఈ ప్రతిఫలం దక్కిందన్నమాట. శ్వేతపత్రాల పేరుతో జగన్ ప్రభుత్వంపై ఎంత దుష్ప్రచారం చేస్తున్నా, జనం వాటిని పట్టించుకోవడంలేదు. టీడీపీ నేతల దాష్టికాలవల్ల కొన్ని చోట్ల వైఎస్సార్‌సీపీ అభిమానులు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘట్టాలు జరిగాయి. అలాగే బాలికలపై అఘాయిత్యాలు సాగుతున్నాయి.నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో జరిగిన బాధాకర ఘటన వీటికి నిదర్శనం. పలు ఇతర చోట్ల కూడా నేరాలు పెరిగాయి. నేరాలు ఏ ప్రభుత్వ టైమ్‌లో అయినా జరుగుతుండవచ్చు. కాని అప్పట్లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు గోరంతల్ని కొండంతలు చేసి ప్రచారం చేశారు. పవన్‌ కల్యాణ్‌‌ అయితే 2017లో టీడీపీ హయాంలో జరిగిన సుగాలి ప్రీతి కేసును జగన్ ప్రభుత్వానికి అంటగట్టి దుష్ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఏ ఒక్క ఘటన జరగదని బీరాలు పలికారు.ఇప్పుడు ఇన్ని దుర్మార్గపు ఘటనలు, దారుణమైన నేరాలు జరుగుతున్నా పవన్ నోరు విప్పడం లేదు. ఎందుకంటే ఆయన కోరుకున్న పదవి ఆయనకు వచ్చేసింది కాబట్టి అంతా బ్రహ్మాండంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన సుద్దులు చెబుతున్నారు తప్ప, ప్రభుత్వ వైఫల్యాలపై జవాబు ఇవ్వడం లేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ కారణంతో ఘర్షణలు జరిగినా, చంద్రబాబు నాయుడు నిందితులకు అనుకూలంగా మాట్లాడడానికి కొంత భయపడేవారు. జనంలో దెబ్బతింటామేమో అన్న వెరపు ఉండేది. ఘర్షణలకు టీడీపీ వారు కారణమైతే కనీసం కోప్పడినట్లు నటించేవారు. కాని ఈసారి ఏకంగా నిందితులను ఆయనే కాపాడుతున్న రీతిలో వ్యవహరిస్తున్నారన్న విమర్శలకు గురి అవుతున్నారు.ఉదాహరణకు డెక్కన్ క్రానికల్ ఆఫీస్‌పై దాడిచేసిన టీడీపీ కార్యకర్తలను ఆయన మందలించకుండా పత్రికల ఆఫీస్‌ల వద్ద నిరసనలు చెప్పొద్దులే అని సలహా ఇచ్చి ఊరుకున్నారు. వైఎస్సార్‌సీపీ వారిపై వందల కొద్ది దాడులు జరిగినా, టీడీపీ వారు విధ్వంసాలకు పాల్పడుతున్నా, వాటిని అదుపు చేయకపోగా, వైఎస్సార్‌సీపీ వారే దాడులు చేస్తున్నారన్న భావన కలిగేలా మాట్లాడడం శోచనీయం. ఇవన్ని చూశాక ఏమనిపిస్తున్నందంటే చంద్రబాబే ఇలా విద్వేషపూరితంగా తయారయ్యారా? లేక ఆయన కుమారుడు లోకేష్ తాను అనుకున్నట్లు పోలీస్ రాజ్యాన్ని నడుపుతుంటే ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా? అన్న సందేహం సహజంగానే వస్తుంది. ఏది ఏమైనా చంద్రబాబుకు అదృష్టం వచ్చి మళ్లీ సీఏం పదవిలోకి రావడం, తమ దురదృష్టమని ప్రజలు అనుకునేలా పరిస్థితి రాకూడదని కోరుకోవడం తప్పుకాదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Sakshi Guest Column On Donald Trump
అధ్యక్షుడిగా ట్రంప్‌ మళ్లీ గెలిస్తే?

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఊహించినట్టుగానే రిపబ్లికన్‌ పార్టీ తన అధికారిక అధ్యక్ష అభ్యర్థిగా డోనాల్డ్‌ ట్రంప్‌ను ఎంచుకుంది. ఇప్పటికే ట్రంప్‌కు సానుకూల పవనాలు వీస్తుండగా, ఆయన మీద జరిగిన హత్యాయత్నం ఆయన విజయావకాశాలను మరింతగా పెంచేవుంటుంది. అయితే ఇంకోసారి ట్రంప్‌కు అధికార పగ్గాలు చిక్కితే రకరకాలుగా నష్టం జరిగే అవకాశాలు మెండు! ప్రజాస్వామ్యం, వాతావరణ మార్పు అంశాల్లో ట్రంప్‌ నిర్ణయాలు అమెరికాను బలహీనపరచడమే కాకుండా... భారత దేశానికీ ఆందోళన కలిగించేవే. ట్రంప్‌ తన పాత వైఖరినే కొనసాగిస్తే చైనా ఆధిపత్యం పెరుగుతుంది. అమెరికా అంతర్గతంగా బలహీనపడితే కూడా లాభపడేది చైనా మాత్రమే అన్నది గుర్తుంచుకోవాలి.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరిగిన తొలి ముఖాముఖి చర్చ జో బైడెన్‌కు ఓ దుస్వప్నంలా మిగిలిపోయింది. తడబాటు, తత్తరపాటు, మతిమరపు లతో బైడెన్‌ పై అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగానూ వ్యతిరేకులు పెరిగిపోయారు. బైడెన్‌ వైఫల్యం కాస్తా ట్రంప్‌కు వరంగా మారిందని చెప్పాలి. అధ్యక్షుడిగా బైడెన్‌ రికార్డు బాగానే ఉంది. కానీ చర్చ కార్య క్రమం మాత్రం అతడి వయసు, మానసిక ఆరోగ్యంపై అనేక సందే హాలు లేవనెత్తింది. డెమోక్రాట్ల విశ్వసనీయతతోపాటు వైట్‌హౌస్‌పై కూడా నమ్మకం సడలించే వ్యవహారమిది. డెమోక్రాట్లకు ఓటేయాల్సిందిగా మద్దతుదారులు కూడా అడిగేందుకు సందేహించే పరిస్థితి వచ్చింది. బైడెన్‌ ఇవేవీ పట్టించుకునే పరిస్థితిలో లేరు. పోటీ నుంచి తప్పుకొమ్మని చాలామంది సలహా ఇస్తున్నా... అధికారాన్ని వదులు కునేందుకు సిద్ధంగా లేరు. పైగా తాను మాత్రమే ట్రంప్‌ను ఓడించ గలనని అంటున్నారు.వాతావరణ మార్పును పట్టించుకోరు!ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఇంకోసారి ఎన్నికైతే ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానాలు వెతుక్కోవాల్సి వస్తోంది. చాలా రకాలుగా విధ్వంసం జరుగుతుందన్నది కచ్చితం. కాకపోతే భారతదేశం అంటే మనం ఆలోచించాల్సిన అంశాలు ప్రధానంగా రెండు ఉన్నాయి. శతాబ్దాలుగా... ఇప్పుడు కూడా అమె రికా వెలువరించే కర్బన ఉద్గారాలు భారీ స్థాయిలో ఉన్నాయన్నది తెలిసిందే. ఇందుకు బాధ్యత వహించే విషయంలో మాత్రం అగ్ర రాజ్యం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. వాతావరణ మార్పుల ప్రభావాన్ని అడ్డుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు తన వంతు సాయం అందించేందుకు తిరస్కరిస్తోంది. వినియోగదారుల కేంద్రంగా నడిచే ఆర్థిక వ్యవస్థగానే మిగిలిపోయిన అమెరికా విచ్చల విడి ఖర్చులు, వనరుల వృథాకు ప్రసిద్ధి. కపటత్వం కూడా ఎక్కువే. కోట్లాదిమందిని పేదరికం కోరల నుంచి తప్పించాల్సిన బాధ్యత ఉన్న దేశాలు అభివృద్ధి విషయంలో రాజీపడాల్సిందిగా కోరడం దీనికి నిదర్శనం. చారిత్రక బాధ్యతలను విస్మరించడం, తమ జీవనశైలిని మార్చుకునే ప్రయత్నాలు అస్సలు చేయకపోవడం అమెరికాకు మాత్రమే ప్రత్యేకం. ఈ విషయమై అటు డెమోక్రాట్లనూ, ఇటు రిపబ్లికన్లనూ ఇద్దరినీ నిందించాల్సిందే. అయితే బైడెన్‌ గద్దెనెక్కిన తరువాత ప్యారిస్‌ ఒప్పందానికి ఊ కొట్టడం, వాతావరణ మార్పులకు సంబంధించి చట్టాన్ని ఆమోదించడం, స్థానికంగా కర్బన ఉద్గారాల తగ్గింపునకు లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. వాతావరణ సంక్షోభ నివారణ యత్నాలకు రుణసాయం ఇచ్చేలా బ్యాంకులను ప్రోత్సహించారు కూడా. ఈ చర్యలన్నీ నామమాత్రంగానైనా తానూ బాధ్యత తీసుకుంటున్న భావన కలిగించాయి. ఒకవేళ ట్రంప్‌ రెండోసారి పగ్గాలు చేపడితే ఇవేవీ కొనసాగించడన్నది కచ్చితం. తొలి దఫా గద్దెనెక్కి నప్పటి చందంగానే వాతావరణ మార్పులన్నవి అసలు సమస్యే కాదన్నట్టుగా నటిస్తారు.ట్రంప్‌ అధ్యక్షుడైతే పాశ్చాత్య దేశాల నుంచి భారత్‌పై వస్తున్న ఒత్తిడి తగ్గుతుందని అనుకునేందుకు బాగానే ఉంటుంది కానీ... అది స్వల్పకాలికం మాత్రమే. వాతావరణ మార్పులనేవి ప్రపంచం మొత్తం సమస్య. ఈ సమస్య ముదిరిపోవడంలో అమెరికా పాత్ర పెద్దది. పరిష్కారం కూడా అమెరికా ప్రమేయంతో మాత్రమే సాధ్యమవుతుంది. ట్రంప్‌ తన పాత వైఖరినే కొనసాగిస్తే ఈ విషయంలో చైనా ఆధిపత్యం పెరుగుతుంది. వాతావరణ పరిరక్షణకు సంబంధించి టెక్నాలజీల అభివృద్ధిలోనూ ముందుకు దూసుకెళుతుంది. ఫలితంగా ఇప్పటివరకూ వాతావరణ మార్పుల అంశంపై పని చేస్తున్న ప్రపంచ బ్యాంకు వంటి ఆర్థిక సంస్థలు నిర్వీర్యమవుతాయి. అమెరికాకు చెందిన ప్రైవేట్‌ కంపెనీలు వాతావరణ మార్పులకు సంబంధించి పెట్టుబడులు పెట్టడం నిలిచిపోతుంది. దీనివల్ల వాతావరణ మార్పు లను ఎదుర్కొనేందుకు ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్న దేశాలు నష్టపోవాల్సి వస్తుంది. వ్యవస్థలు దెబ్బతింటాయి!రెండో విషయానికి వద్దాం. అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థలో బోలెడన్ని లోటుపాట్లు ఉన్నాయి. న్యాయవ్యవస్ధను ఉదాహరణగా తీసుకుంటే అక్కడ న్యాయమూర్తులు శాశ్వత ప్రాతిపదికన నియ మితులవుతారు. ఫలితంగా వారికి బాధ్యత శూన్యం. పైగా న్యాయ మూర్తుల నియామకాలు అధికార వర్గం ద్వారా జరుగుతాయి. ఫలి తంగా వీరు పక్షపాతంగా ఉండేందుకూ, తాము నమ్మే భావజాలానికి అనుగుణంగా నడుచుకునేందుకూ అవకాశాలు ఎక్కువ. ఫలితంగా ప్రజాస్వామ్యంలో అతి కీలకమైన ఒక అంగం విపరీతమైన అధికా రాలు కలిగి ఉండటమే కాకుండా... సైద్ధాంతిక అంశాలపై విభజితమై ఉంటుంది.అంతెందుకు అమెరికా ఎన్నికల వ్యవస్థనే తీసుకుంటే... అధ్యక్ష తరహా ఎన్నికల వ్యవస్థ ఉంది. మెజారిటీ ప్రజల అభిప్రాయం, ఫలితాలతో నిమిత్తం లేదు. ఫలితంగా అవినీతిపరుడైన నేత... విరాళాలిచ్చే వారు కుమ్మక్కయ్యే అవకాశం ఉంటుంది. 2020 నాటి ఎన్నికలు ఎంతో మెరుగ్గానే జరిగాయని అనుకున్నా ఆ తరువాత అమెరికాలో సగం మంది ఎన్నికల ప్రక్రియను, అధికార మార్పిడి జరిగిన తీరును తప్పుపట్టడం గమనార్హం. ఈ సమస్యలకు అమెరికా రాజ్యాంగ నిర్మాణం ఒక కారణమని చెప్పాలి. వ్యవస్థలు అధికారంలో ఎవరున్నారు అన్న అంశం ఆధారంగా ఒడుదొడుకులకు లోను కాకూడదు. ట్రంప్‌ అమెరికా సుప్రీంకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల నియామకాలకు ప్రతిపాదించడం ఇప్పటికే మానవ, మహిళ హక్కుల విషయంలో ప్రతికూల పరిస్థి తులు తెచ్చి పెట్టాయి. అబార్షన్‌ విషయంలో అధ్యక్షుడికి తిరుగులేని అధికారాలు దక్కిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఈ పరిస్థితుల్లో ట్రంప్‌ గద్దెనెక్కితే మరింత మంది న్యాయమూర్తులను ఆయన సుప్రీంకోర్టులో నియమించవచ్చు. ఎన్నికల ఫలితాలను సవాలు చేయడం మాత్రమే కాకుండా... నేరం రుజువైనా అధికారంలో కొనసాగేందుకు ప్రయత్నించడం వంటివి ఎక్కువ అవుతాయి. జాతి వివక్ష పెరగడం, క్రిస్టియన్‌ జాతీయతా భావజాలం పెరగడం ప్రజాస్వామ్యానికి మంచి చేసే అంశాలు కాదు. ట్రంప్‌ గెలుపుతోపాటు సెనేట్‌లో కూడా రిపబ్లిక న్లకు ఆధిక్యం దక్కితే గోరుచుట్టుపై రోకటిపోటు చందం కాక తప్పదు.భారత్‌ ఆలోచించాలి!భారతదేశ అధికార వర్గాలు ట్రంప్‌ మరోసారి గెలిస్తే ఏమిటన్న అంశంపై ఆలోచన మొదలుపెట్టాల్సిన అవసరం ఉంది. ట్రంప్‌ రాకతో ప్రజాస్వామ్యంలో మన లోటుపాట్లు పక్కకు వెళ్లిపోతాయిలే అనుకుంటే అది తప్పే అవుతుంది. వాస్తవానికి సమస్య మరింత పెరుగుతుంది. అమెరికా వ్యవస్థలు, సంస్థల పనితీరుపై చర్చ ఎంత పెరిగితే ఆ దేశ రాజకీయం అంత అస్థిరమవుతుంది. సమాజం కూడా రకరకాల అంశాలపై ముక్కలు అవుతుంది. ఈ పరిణామాలన్నీ చివ రకు అంతర్గత కుమ్ములాటలకూ, సంఘర్షణలకూ తావిస్తాయి.అంతర్జాతీయ, దేశీ రాజకీయాలపై అమెరికాను ఎంత కఠినంగానైనా విమ ర్శించవచ్చు కానీ... ఆ దేశం అంతర్గతంగా బలహీనపడితే లాభ పడేది చైనా మాత్రమే అన్నది గుర్తుంచుకోవాలి. అంతేకాదు... అమె రికాకు వలస వెళ్లిన, ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయులకూ, ఇతర దేశస్థులకూ అంత మంచిది కాదు. ట్రంప్‌ తిరిగి అధ్యక్షుడు కావడం ప్రపంచ రాజకీయాలు, వాతావరణ మార్పుల సమస్యలకు నిర్ణయా త్మకం కానుందన్నది నిస్సందేహం!ప్రశాంత్‌ ఝా వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

Justice Narasimha Reddy Reacts On SC Orders Over Telangana Power Commission
అందుకే ప్రెస్‌ మీట్‌ నిర్వహించా: జస్టిస్‌ నరసింహారెడ్డి

ఢిల్లీ, సాక్షి: విచారణ కమిషన్లు వేసేదే ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని, అలాంటిది తనపై అబద్ధాలు ప్రచారం చేశారని జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే పవర్‌ కమిషన్‌ చైర్మన్‌ తప్పుకున్నట్లు చెప్పిన ఆయన.. సాక్షితో మాట్లాడారు.విచారణ కమిషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నాక కొన్ని ఊహాగానాలకు చెక్‌పెట్టేందుకే ప్రెస్‌ మీట్‌ పెట్టాను. పైగా ఆ ప్రెస్‌ మీట్‌లో ఎక్కడా నా అభిప్రాయం చెప్పలేదు. సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయినట్లు ప్రచారం జరిగింది. కనీసం ఆయనతో ఫోన్‌లో కూడా మాట్లాడలేదు. పవర్‌ కమిషన్ విచారణలో ఎవరికీ నోటీసులు ఇవ్వలేదు. కమిషన్‌ ‌ తరఫున 28 మందికి లేఖలు రాశా. కేసీఆర్‌ తప్ప అంతా తమ అభిప్రాయాలు చెప్పారు. వన్‌ ర్యాంక్‌.. వన్‌ పెన్షన్‌ కమిషన్‌లో నేను పని చేశా. అలాంటిది విచారణ కమిషన్‌ చైర్మన్‌ పదవి నుంచి తప్పుకోమని కేసీఆర్‌ లేఖ రాశారు. ఆ లేఖలోనూ సమాజం అంగీకరించని భాష వాడారు. ఎన్నో కమిషన్‌ చైర్మన్లు ప్రెస్‌ మీట్లు పెట్టినా రాని అభ్యంతరం నాపైనే ఎందుకు వచ్చిందో తెలియడం లేదు.అందరి అభిప్రాయాలు తీసుకుని నేను నివేదిక కూడా సిద్ధం చేశా. నేను ఇచ్చే రిపోర్ట్‌ నా వ్యక్తిగతం.. దానిపై ఎవరికీ హక్కులేదు. కమిషన్‌ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అంగీకరించొచ్చు.. అంగీకరించకపోవచ్చు. ఆ ఇచ్చిన రిపోర్ట్‌ను తప్పని ఎవరైనా సవాల్‌ చేయొచ్చు అని అన్నారాయన. అంతకు ముందు..కేసీఆర్‌ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారన సందర్భంగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విచారణ కమిషన్‌ చైర్మన్‌ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి ఇచ్చిన లేఖను తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీం బెంచ్‌కు సమర్పించారు.

Tihar Jail Kalvakuntla Kavitha hospitalized
ఎమ్మెల్సీ కవిత డిశ్చార్జి, మళ్లీ తీహార్‌ జైలుకు..

ఢిల్లీ, సాక్షి: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఆమెను అధికారులు తిరిగి తీహార్‌ జైలుకు తీసుకెళ్లారు. గత రెండు రోజులుగా జ్వరంతో ఆమె బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. మంగళవారం ఉదయం ఆమె హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. నీరసంతో కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో అధికారులు ఆమెను దీన్‌దయాళ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందించి.. డిశ్చార్జి చేశారు. లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ ఆమెను అరెస్ట్‌ చేయగా.. వంద రోజులకు పైగా ఆమె తీహార్‌ జైల్లో ఉన్నారు. ఆమె కస్టడీని కోర్టు పొడిగిస్తూ వెళ్తుండగా.. మరోవైపు ఆమె బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.

perni nani slams on cm chandrababu releasing white papers
చంద్రబాబూ.. మీ అనుభవం దేనికసలు?: పేర్ని నాని

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో కూటమి పాలన 30 రోజులు పూర్తయ్యిందని, తన అంత అనుభవజ్ఞుడు లేడని సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారాయన. ‘రాష్ట్రంలో కూటమి పాలన 30 రోజులు పూర్తయ్యింది. ఈ 35 రోజుల్లో చంద్రబాబు ఏం అడుగులు వేశారో చెప్పాలి. ఈ 35 రోజుల్లో పెన్షన్‌ డబ్బులు ఇవ్వడం తప్ప మరో పని చేయలేదు. జగన్‌ను దూషించటం తప్ప ఒక్క పని కూడా చేయలేదు. కాలక్షేపం కోసం శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. శ్వేతపత్రం విడుదల చేయడం తప్ ఒక్కటైనా నిరూపించారా? ఎన్నికల్లో చంద్రబాబు మాటలు కోటలు దాటాయి. ప్రజల కోసం చంద్రబాబు చేసిందేమి లేదు. పోలవరం ప్రాజెక్టు 70 శాతం మీరే కట్టారని చెప్తున్నారు. మిగతా 30 శాతం ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నిస్తే సమాధానం లేదు. అమరావతి అంతా తిరిగారు. ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పరు. విద్యుత్‌ శాఖపై కూడా శ్వేతపత్రం ఇచ్చారు. వైఎస్ జగన్‌ మీద అబద్ధాలతో శ్వేత పత్రం విడుదల చేశారు.విద్యుత్‌ ఛార్జీలు తగ్గిద్దామని పవన్‌ కల్యాణ్‌ కూడా చెప్పారు. కరెంట్‌ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు చెప్పారు. మళ్లీ విద్యుత్‌ ఛార్జీలపై చంద్రబాబు మాట మర్చేశారు. జగన్‌పై బాదుడే బాదుడే అంటూ అసత్య ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చి 35 రోజులైంది.. చెత్త పన్ను ఆపారా?. జగన్‌ అధికారంలో ఉ‍న్నప్పుడు చెత్తపన్ను విధిస్తే విమర్శించారు. చెత్త పన్ను కొనసాగిస్తున్న మిమ్మల్ని ఏమనాలి?.. మైనింగ్‌పై అబద్ధాలతో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. మైన్స్‌లో మీకంటే రెండు రెట్లు ఎక్కువ ఆదాయం వైఎస్‌ జగన్‌ సమకూర్చారు. నాలుగు అసత్యాలు.. పది అబద్ధాలతో చంద్రబాబు శ్వేత పత్రం ఉంది. బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఇదేనా మీ అనుభవం.. ఇంతకుమించి అని చేయలేరా? ఎన్నికల్లో మాత్రం జగన్‌ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామన్నారు. సంపద సృష్టించి అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పుడు ఖజానా డబ్బులు లేవని మాటట్లాడుతున్నారు. బాబు సీఎం అయ్యే 48 గంటల ముందు కేంద్రం రూ. 5,600 కోట్లు ఇచ్చింది’ అని అన్నారు.చదవండి: పరిపాలన మరీ ఇంత అధ్వానమా?

Still Probe Going Nandyal SP On Muchumarri Girl Incident
ముచ్చుమర్రి కేసు ఇంకా విచారణ జరుగుతోంది: ఎస్పీ

నంద్యాల, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన నంద్యాల ముచ్చుమర్రి మైనర్‌ బాలిక కేసులో తాజా పురోగతిని జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, ఇతర ఉన్నతాధికారులు మంగళవారం మీడియాకు వివరించారు. అయితే కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, బాలిక మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందని వాళ్లు తెలిపారు.నందికొట్కూరు సమీపంలోని పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఈ నెల 7వ తేదీన బాలిక మిస్సింగ్‌ కేసు నమోదు చేశాం. విచారణలో ముగ్గురు పిల్లలు బాలికకు చాక్లెట్‌ ఆశ చూపించి అత్యాచారం చేశారు. ఆపై గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత కేసీ కెనాల్ తీసుకుని వచ్చి తమ ఇంట్లోవాళ్లకు విషయం చెప్పారు. ఆపై తమ తండ్రుల సాయంతో సంచిలో ఉన్న బాడీని వనములపాడు గ్రామానికి బైక్‌పై తీసుకెళ్లి.. బాలిక డెడ్‌బాడీ ఉన్న సంచిలో బండరాళ్లు వేసి కృష్ణా నదిలో పడేశారు. విచారణలో ఆ పిల్లల తల్లిదండ్రులు మోహన్,సద్గురులు నేరం ఒప్పుకున్నారు. గ్యాంగ్‌ రేప్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. కేసులో ఐదుగురిని అదుపులో తీసుకున్నాం. నిందితుల నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశాం. విచారణ ఇంకా కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం అని అన్నారాయన. మరోవైపు.. ఘటన జరిగి పదిరోజులైనా బాలిక మృతదేహాన్ని కనిపెట్టలేకపోవడం, మైనర్‌ నిందితుల నుంచి పోలీసులు సరైన సమాచారం రాబట్టలేకపోతుండడం.. విమర్శలకు దారి తీస్తోంది. ఇంకోవైపు ఈ కేసులో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వంపైనా ముచ్చుమర్రి గ్రామస్తులు మండిపడుతున్నారు. వాళ్లను అలా వదిలేయొద్దు‘‘పది రోజులైనా మా పాప ఏమైందో చెప్పలేకపోతున్నారు. మా పాపను అత్యాచారం చేసి చంపేశామని ముగ్గురు చెబుతున్నా పోలీసులు వారిని ఏమీచేయలేకపోతున్నారు. వాళ్లను కాల్చేస్తేనే మా పాప ఆత్మకు శాంతి కలుగుతుంది. మరో ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకూడదంటే వాళ్లను చంపేయాలి’’:::బాలిక తల్లిదండ్రులుఇదీ చదవండి: గిరిజన బాలిక ఎక్కడ బాబూ?

Prabhas kalki 2898 AD Movie OTT Streaming On This Month
ఓటీటీకి ప్రభాస్ కల్కి.. అప్పటిదాకా ఆగాల్సిందేనా?

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ చిత్రం కల్కి 2898 ఏడీ. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ బాక్సులు బద్దలు కొట్టింది. రిలీజైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. అయితే కల్కి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్‌ ఇంటి వద్ద భారీ కేక్‌ కట్‌ చేసి సంబురాలు చేసుకున్నారు. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోన్న కల్కి 2898 ఏడీ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినా ఈ చిత్రం ఎప్పుడోస్తుందా అని ఆరా తీస్తున్నారు. అయితే కల్కి’ ఓటీటీలో చూడాలంటే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సినిమా రిలీజైన పది వారాల తర్వాతే ఓటీటీలోకి తీసుకు రానునన్నట్లు తెలుస్తోంది. అంటే దాదాపు సెప్టెంబరు రెండో వారంలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశముంది. కాగా.. ఇప్పటికే 'కల్కి' సినిమా దక్షిణాది భాషల హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా.. బాలీవుడ్‌ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కల్కి సినిమాకు సూపర్ హిట్‌ టాక్ రావడంతో ఓటీటీ స్ట్రీమింగ్‌ కూడా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

What Trump Rally Shooter Did On Last Day Of His Life
ట్రంప్‌పై దాడికి ముందు.. నిందితుడు క్రూక్స్‌ ఏం చేశాడంటే..!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై జరిగిన దాడి ఉదంతంపై ఆ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎఫ్‌ఐబీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ట్రంప్‌పై హత్యాయత్నానికి ముందు నిందితుడైన 20 ఏళ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ కదలికలపై ఎఫ్‌బీఐ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ట్రంప్‌పై కాల్పులు జరిపే కొన్ని గంటల ముందు నిందితుడికి సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగుచూశాయి.ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ట్రంప్‌పై దాడి చేసేందుకు క్రూక్స్‌ దాదాపు 48 గంటలు పనిచేసినట్లు తేలింది. దాడికి ముందు రోజు శుక్రవారం క్రూక్స్‌ తన స్వస్థలమైన పెన్సిల్వేనియాలోని బెతెల్‌ పార్క్‌లో షూటింగ్‌ రేంజ్‌ను సందర్శించాడు. అక్కడ కాల్చడం ప్రాక్టీస్‌ చేశాడు. తరువాతి రోజు శనివారం ఓ దుకాణానికి వెళ్లి అయిదు అడుగుల నిచ్చెన కొనుగోలు చేశాడు. అనంతరం స్థానిక గన్ స్టోర్‌కు వెళ్లి 50 రౌండ్ల బుల్లెట్లు కొన్నాడు. సాయంత్రం క్రూక్స్‌ తన కారులో బట్లర్‌ ప్రాంతానికి చేరుకున్నాడు. కారును బయట పార్క్‌ చేసి, అందులోనే అధునాతన పేలుడు పరికరాన్ని వదిలేశాడు. నిచ్చెనతో సమీపంలోని భవనంపైకి ఎక్కి తుపాకీతో ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. అయితే దాడికి ఉపయోగించిన గన్‌ను క్రూక్స్‌ తండ్రి 2013లో అధికారికంగా కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ విషయాలన్నీ అధికారులు వెల్లడించినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి.​​కాగా శనివారం(జూల్‌13న) పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా ట్రంప్‌పై ఆగంతకుడు కాల్పులకు తెగబడటం తెలిసిందే. ర్యాలీ ప్రాంతం నుంచి 130 మీటర్ల దూరం నుంచి ట్రంప్‌పై హత్యాయత్నం చేసింది. 20 ఏళ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌గా తేలింది. నిందితుడిని ఘటనా స్థలంలోనే భద్రతా సిబ్బంది సెక్యూరిటీ స్నైపర్స్‌ అంతమొందించారు. అయితే ఈఘటనలో ట్రంప్‌ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన కుడి చెవికి గాయమవ్వగా.. ఆసుపత్రిలో చేరి చికిత్స పొదుతున్నారు.మరోవైపు నిందితుడు ట్రంప్‌పై ఈ ఈ దుశ్చర్యకు పాల్పడటం వెనక గల ఉద్దేశాన్ని తెలుసుకునేందుకు ఎఫ్‌బీఐ అధికారులు యత్నిస్తున్నారు. క్రూక్స్‌ సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ను పరిశీలిస్తున్నారు. అతడి చర్య వెనక రాజకీయపరమైన, సైద్ధాంతికపరమైన భావజాలం ప్రభావం ఏదైనా ఉందా..? అని ఆరా తీసుకున్నారు. అదే విధంగా క్రూక్స్ కారులో లభించిన పేలుడుపదార్థం గురించి కూడా దర్యాప్తు చేస్తున్నారు.

Ruchi Kalra idea rejected 73 times her 2 companies worth Rs 52k crore
73 సార్లు తిరస్కరించారు : కట్‌ చేస్తే..రూ. వేలకోట్ల విలువైన కంపెనీలకు సారధి

స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో అత్యంత స్ఫూర్తిదాయకమైన మహిళ రుచి కల్రా. అనేక సవాళ్లను అధిగమించి, అసాధారణ విజయాన్ని సాధించిన స్వీయ-నిర్మిత వ్యవస్థాపకురాలు. స్టార్టప్‌ ప్రపంచంలో, భారతీయ స్టార్టప్‌ పరిశ్రమలో సూపర్‌వుమన్‌ రుచికల్రా. అయితే దీని వెనుక పెద్ద కథే ఉంది. తిరస్కారంలోంచి వచ్చిన ఆత్మవిశ్వాసం, ఆత్మస్థయిర్యంతో సాధించిన విజయం ఉన్నాయి. రండి, రుచికల్రా సక్సెస్‌ గురించి తెలుసుకుందాం.రుచి కల్రా ఐఐటీ ఢిల్లీ గ్రాడ్యుయేట్. బీటెక్‌,ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా కూడా సాధించింది. వ్యాపారవేత్తగా రాణించే కంటే ముందు కల్రా మెకిన్సేలో ఎనిమిది సంవత్సరాల పాటు భాగస్వామిగా పనిచేశారు.అయితే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఆమె పెట్టుబడిదారులను సంప్రదించారు. కానీ ఆమె ఐడియాను అందరూ 73 మంది తిరస్కరించారు. స్వయంగా కల్రా 2016లో ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అయినా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసింది. భర్తతో కలిసి రెండు యునికార్న్ కంపెనీలను స్థాపించి, విజయవంతంగా నడిపిస్తోంది. 2022 నాటికి ఆమె నికర విలువ రూ. 2600 కోట్లు. వాటి విలువ రూ. 52,000 కోట్లుగా అంచనా2015లో భర్త ఆశిష్ మొహపాత్, మరో ఇద్దరితో కలిసి ముడి పదార్థాలు, పారిశ్రామిక సరఫరాలను విక్రయించే B2B ప్లాట్‌ఫారమ్ ఆఫ్‌ బిజినెస్‌ను (OfBusiness) స్థాపించారు ఈ జంట. ఈ కంపెనీ విలువ రూ.44,000 కోట్లు. ఆఫ్‌బిజినెస్ రుణ విభాగమైన ఆక్సిజో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు సీఈవో కూడా కల్రా. దీని విలువ. రూ. 8200 కోట్లు.2017లో, కల్రా వారి ప్లాట్‌ఫారమ్‌లో కొనుగోలుదారులకు ఫైనాన్సింగ్ అందించడానికి ఆక్సిజోను స్థాపించారు, చిన్న ,మధ్యస్థ వ్యాపారాలకు రుణాలు అందించడంలో పాపులర్‌ అయింది. 2021లో రూ. 197.53 కోట్లుగా ఉన్న ఆక్సిజో ఆదాయం మరు సంవత్సరం నాటికి రూ. 312.97 కోట్లకు పెరిగింది. 2022లో ఆఫ్‌బిజినెస్ ఆదాయం దాదాపు రూ. 7269 కోట్లు. పన్ను తర్వాత లాభం రూ. 125.63 కోట్లుగా నమోదైంది.మహిళలకు సందేశం‘‘వ్యవస్థాపక ప్రపంచంలో మహిళలు ఎదుర్కొనే కొన్ని పక్షపాతాలు చాలా సార్లు బయటికి కనిపించవు. కొన్ని అంతర్లీనంగా ఉంటాయి. అద్దంలో చూసుకొని నేను బాగానే ఉన్నా అనే విశ్వాసాన్ని పెంచుకోండి. వక్తిగత బలహీనతలను కరియర్‌లోకి రానివ్వద్దు. ప్రతీ దాంట్లో మనం నిష్ణాతులుగా ఉండాల్సిన అవసరం లేదు. మనకు తెలియని విషయంలో సహాయం కోరడం వల్ల నష్టం లేదు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, చుట్టుపక్కల.. ఇలా ప్రతి ఒక్కరి కలహా తీసుకోండి. నా భర్త చాలా సపోర్ట్‌ చేశారు. నా ఆరేళ్ల కుమార్తె కూడా స్ట్రాంగ్‌ పిల్లర్‌గా ఉంది. నేను చాలా మందికి రుణపడి ఉంటాను’’ పెద్ద పెద్ద స్టార్టప్‌లు చేయలేని ఫీట్‌ను భర్తతో కలిసి సాధించారు రుచి కల్రా. రెండు భారీ, లాభదాయకమైన కంపెనీల బాధ్యతలను విజయవంతంగా నిర్వహించడం ఆమె వ్యాపార దక్షతకు నిదర్శనం. మెకిన్సే అండ్ కోలో పనిచేస్తున్నపుడే రుచి, ఆశిష్‌ కలుసుకున్నారు. వీరి స్నేహం ప్రేమగా మారి దంపతులయ్యారు. వీరికి ముగ్గురు పిల్లలు.

Hardik Pandya May Lose T20I Captaincy Gambhir Vote Important: Report
హార్దిక్‌ పాండ్యాకు షాక్‌!.. టీ20 కెప్టెన్‌గా అతడే!

టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో సెమీస్‌లోనే భారత్‌ నిష్క్రమించిన తర్వాత రోహిత్‌ శర్మ.. దాదాపు ఏడాది పాటు అంతర్జాతీయ టీ20లకు దూరంగానే ఉన్నాడు. అతడి గైర్హాజరీలో పాండ్యా టీ20లలో టీమిండియాను ముందుకు నడిపించాడు.పాండ్యా గాయపడిన సందర్బాల్లో భారత నంబర్‌ వన్‌ టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. వీరిద్దరు అందుబాటులో లేని సమయంలో రిషభ్‌ పంత్‌ సైతం సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు.శాశ్వత కెప్టెన్‌ కోసం కసరత్తుఇక టీ20 వరల్డ్‌కప్‌-2024 నేపథ్యంలో తిరిగి పొట్టి ఫార్మాట్‌ పగ్గాలు చేపట్టిన రోహిత్‌ శర్మ.. జట్టును చాంపియన్‌గా నిలిపాడు. అనంతరం అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌ కాకుండా సుదీర్ఘకాలం పాటు టీ20లలో టీమిండియాను ముందుకు నడిపే ఆటగాడినే ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. తరచూ గాయాలు ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్‌-2024 జట్టు వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాను పక్కనపెట్టేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. తరచూ గాయాల బారిన పడే ఆ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను కాదని సూర్యకుమార్‌ యాదవ్‌ వైపు బోర్డులోని కొందరు వ్యక్తులు మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే, మరికొందరు మాత్రం హార్దిక్‌ పాండ్యాకే తమ ఓటు అని చెప్పినట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా సున్నితమైన అంశం. టీ20 కెప్టెన్‌ నియామకం విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు.ముఖ్యంగా హార్దిక్‌ ఫిట్‌నెస్‌ విషయంలో సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయారు. టీమిండియాకు ఐసీసీ ట్రోఫీ అందించడంలో అతడు కీలక పాత్ర పోషించినప్పటికీ గాయాల బెడద సమస్యగా మారింది.సూర్య సూపర్‌ అని చెప్పారుమరోవైపు.. సూర్యకుమార్‌ యాదవ్‌ విషయంలో ఇప్పటికే మేము ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నాం. అతడి కెప్టెన్సీ పట్ల ఆటగాళ్లంతా సానుకూలంగా ఉన్నారు. సూర్య హయాంలో డ్రెసింగ్‌రూం వాతావరణం కూడా చాలా బాగా ఉందని చెప్పారు’’ అని పేర్కొన్నాయి.కాగా ఎనిమిదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో హార్దిక్‌ పాండ్యా ఇప్పటికే చాలా సార్లు గాయపడ్డాడు. గాయాల భయంతోనే అతడు టెస్టు క్రికెట్‌కు కూడా పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే.కెప్టెన్సీ భారం వల్లఫిట్‌నెస్‌ విషయంలో తరచూ సమస్యల బారిన పడుతున్న ఇలాంటి ఆటగాడిని పూర్తిస్థాయి కెప్టెన్‌ చేయడం పట్ల బోర్డు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆల్‌రౌండర్‌పై హార్దిక్‌ ప్రదర్శనపై కెప్టెన్సీ ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే టీ20లలో సూర్యకుమార్‌ యాదవ్‌కు పగ్గాలు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సూర్య చివరగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ గెలిచాడు. గంభీర్‌ ఓటు ఎవరికో?ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2024 తర్వాత భారత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోని యువ టీమిండియా టీ20 సిరీస్‌ను 4-1తో గెలిచింది. తదుపరి జూలై 27న మొదలయ్యే సిరీస్‌ కోసం శ్రీలంక పర్యటనకు భారత్‌ సిద్ధం కానుంది. ఈ టూర్‌తోనే గంభీర్‌ హెడ్‌కోచ్‌గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. టీ20 కెప్టెన్‌ ఎంపిక విషయంలో అతడి అభిప్రాయం కూడా ప్రధానం కానుంది.చదవండి: నో రెస్ట్‌: కోహ్లి, రోహిత్‌, బుమ్రా ఆడాల్సిందే.. గంభీర్‌ అల్టిమేటం?!

Advertisement
Advertisement
Advertisement
NRI View all
title
న్యూజెర్సీలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ట్రెంటన్‌: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలోని

title
విదేశీ వర్కర్ల భద్రతకు మరిన్ని కఠిన నిర్ణయాలు

కెనడా ప్రభుత్వం తమ దేశంలో పనిచేసే విదేశీ వర్కర్ల రక్షణకు చర్యలు తీసుకుంటుంది.

title
ఇటలీలో బానిసత్వం!.. 33 మంది భారతీయ కార్మికుల విముక్తి

రోమ్‌: భారతీయ వ్యవసాయ కార్మికులను బానిస వ్యవస్థ నుంచి కాపాడి

title
టాక్‌ ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా బోనాల వేడుకలు

లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర

title
Video: భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా శివాని ప్రమాణం

భారత సంతతికి చెందిన 29 ఏళ్ల శివాని రాజా యూకే పార్ల‌మెంటులో హిందువుల పవిత్ర‌గ్రంథం భ‌గ‌వ‌ద్గీత సాక్షిగా ఎంపీగా ప్ర‌మాణ స్

National View all
title
మరో మలుపు తిరిగిన పూజా ఖేద్కర్‌ వ్యవహారం

title
Union Budget 2024: హల్వా వేడుకలో నిర్మలా సీతారామన్

కేంద్ర బడ్జెట్ 2024-25 తయారీ ప్రక్రియ చివరి దశకు గుర్తుగా 'హల్వా' వేడుక సాయంత్రం ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లోని జరిగింది.

title
టీఎంసీ కార్యకర్తపై కౌన్సిలర్‌ దాడి.. వీడియో వైరల్‌

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన

title
జులై 21న అఖిలపక్ష సమావేశం.. టీఎంసీ డుమ్మా!

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలుఈ నెల 22న ప్రారంభం

title
మద్యం హోమ్ డెలివరీ!.. త్వరలో ఈ రాష్ట్రాల్లో..

ఇప్పటి వరకు ఫుడ్ డెలివరీ చేసిన స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలు త్వరలో బీర్, వైన్, లిక్కర్ వంటి వాటిని హోమ్

International View all
title
ట్రంప్‌పై దాడికి ముందు.. నిందితుడు క్రూక్స్‌ ఏం చేశాడంటే..!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై జరిగిన దాడి ఉదంతంపై ఆ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వ

title
ఉషా చిలుకూరిపై ఎలోన్‌ మస్క్‌ ట్వీట్‌ వైరల్‌

అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా ఒహాయో రిపబ్లికన్ సెనేటర్‌ జేడీ వాన్స్‌ ఎంపికయ్యారు.

title
ట్రంప్‌పై దాడి చేసినవాడు రాక్షసుడు: మెలానియా

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి జరిగిన అనంతరం అతని భార్య

title
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌ మన తెలుగింటి అల్లుడే! ఎవరీ ఉషా చిలుకూరి?

అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగమ్మాయి ఉషా చిలుకూరి అరుదైన ఘనతను సాధించనున్నారు.

title
ఒమన్‌లో కాల్పుల కలకలం

మస్కట్‌: ఒమన్‌లోని వాడీ అల్‌ కబీర్‌ ప్రాంతంలోని మసీదు సమీపంల

Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all