మిరే అసెట్‌ నుంచి నిఫ్టీ బ్యాంక్‌ ఈటీఎఫ్‌ | Mirae Asset Mutual Fund launches New Fund Offer | Sakshi
Sakshi News home page

మిరే అసెట్‌ నుంచి నిఫ్టీ బ్యాంక్‌ ఈటీఎఫ్‌

Published Mon, Jul 17 2023 12:44 AM | Last Updated on Mon, Jul 17 2023 12:44 AM

Mirae Asset Mutual Fund launches New Fund Offer - Sakshi

హైదరాబాద్‌: మిరే అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తాజాగా నిఫ్టీ బ్యాంక్‌ ఈటీఎఫ్‌ పేరిట న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో) ప్రకటించింది. ఇది జూలై 18 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్‌ చేయాలి. ఏక్తా గాలా దీనికి ఫండ్‌ మేనేజరుగా ఉంటారు. 12 టాప్‌ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులను ఇది ట్రాక్‌ చేస్తుంది.

రాబోయే రోజుల్లో మరింతగా వృద్ధి చెందనున్న బ్యాంకింగ్‌ రంగంలో ఇన్వెస్ట్‌ చేసేందుకు, మెరుగైన రాబడులు పొందేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ హెడ్‌ (ఈటీఎఫ్‌ ప్రోడక్ట్‌) సిద్ధార్థ్‌ శ్రీవాస్తవ తెలిపారు. మొండి బాకీల సమస్యను వదుల్చుకున్న బ్యాంకింగ్‌ రంగం గత కొన్నాళ్లుగా మెరుగైన పనితీరు కనపరుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఫిన్‌టెక్‌ విప్లవంతో  ఈ రంగం మరింత వృద్ధి చెందగలదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement